BCCI: దేశవాళీ క్రికెట్‌లో ప్రోత్సాహకాలు | BCCI introduces prize money for top performers in domestic cricket | Sakshi
Sakshi News home page

BCCI: దేశవాళీ క్రికెట్‌లో ప్రోత్సాహకాలు

Aug 27 2024 5:08 AM | Updated on Aug 27 2024 6:55 AM

BCCI introduces prize money for top performers in domestic cricket

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’కు ప్రైజ్‌మనీ  

ముంబై: దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్‌ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్‌ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ను ప్రకటించేవారు. 

వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్‌ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement