Board of Control for Cricket in India
-
రంజీల్లో ‘స్టార్స్’ వార్!
ఆహా... ఎన్నాళ్లకెన్నాళ్లకు... మనస్టార్లు దేశవాళీ బాటపట్టారు. కింగ్ కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే... హైదరాబాద్కు సిరాజ్ పేస్ తోడైతే... కేఎల్ రాహుల్ కర్ణాటకకు జై కొడితే... జడేజా ఆల్రౌండ్ ఆటతో సౌరాష్టకు ఆడితే అవి రంజీ మ్యాచ్లేనా? రసవత్తర మ్యాచ్లు కావా? కచ్చితంగా అవుతాయి. తదుపరి రంజీ దశ పోటీలు తారలతో కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. అభిమానులకు నాలుగు రోజులూ ఇక క్రికెట్ పండగే! చూస్తుంటే గంభీర్ సిఫార్సులతో రూపొందించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త మార్గదర్శకాలు ఎంతటి స్టార్లయినా దేశవాళీ కోసం తగ్గాల్సిందేనని నిరూపించబోతున్నాయి. న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ ట్రోఫీలోని చివరి రౌండ్ మ్యాచ్లూ పసందుగా సాగనున్నాయి. అభిమాన క్రికెటర్లు నాలుగు రోజుల ఆటకు అందుబాటులోకి రావడమే దేశవాళీ క్రికెట్కు సరికొత్త పండగ తెస్తోంది. ఇదివరకు చెప్పినట్టుగానే విరాట్ కోహ్లి ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ డి్రస్టిక్ట్స్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) సోమవారం ఈ విషయాన్ని వెల్లడించడమే కాదు... రైల్వేస్ జట్టుతో ఈ నెల 30 నుంచి జరిగే పోరుకోసం ఢిల్లీ జట్టును ప్రకటించింది. అందులో కింగ్ కోహ్లి ఉండటమే విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు అతను తన అభిమానులను దేశవాళీ మ్యాచ్ ద్వారా అలరించేందుకు సిద్ధమయ్యాడు. కేవలం మ్యాచ్ రోజుల్లోనే కాదు... ఢిల్లీ సహచరులతో పాటు కలిసి కసరత్తు చేసేందుకు అతను మంగళవారం జట్టుతో చేరతాడని ఢిల్లీ కోచ్ శరణ్దీప్ సింగ్ ధ్రువీకరించారు. కొన్నిరోజులుగా టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ (ప్రస్తుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోచ్)తో కలిసి బ్యాటింగ్లో శ్రమిస్తున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడు రంజీతో అతను రియల్గా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇదే జరిగితే 2012 తర్వాత కోహ్లి రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో డీడీసీఏ తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. సెక్యూరిటీ సిబ్బందిని పెంచింది. ఢిల్లీ పోలీసులకు సమాచారమిచ్చింది. సౌరాష్ట్రతో ఢిల్లీ ఆడిన గత మ్యాచ్లో బరిలోకి దిగిన రిషభ్ పంత్ ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం కాస్త వెలతే! కానీ ‘రన్ మెషిన్’ కోహ్లి శతక్కొట్టే ఇన్నింగ్స్ ఆడితే మాత్రం ఆ వెలతి తీరుతుంది. హైదరాబాద్ పేస్కా బాస్... సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా, షమీలాంటి అనుభవజ్ఞులతో పాటు భారత జట్టు పేస్ దళానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సిరాజ్ ఇప్పుడు హైదరాబాద్ బలం అయ్యాడు. గురువారం నుంచి నాగ్పూర్లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాడు. నాగ్పూర్ ట్రాక్ పేస్కు అవకాశమిచ్చే వికెట్. ఈ నేపథ్యంలో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగే అవకాశముంది. అతను నిప్పులు చెరిగితే సొంతగడ్డపై విదర్భకు కష్టాలు తప్పవు! సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు. జడేజా వరుసగా రెండో మ్యాచ్ ఎలైట్ గ్రూప్ ‘డి’లో ఉన్న సౌరాష్ట్ర తరఫున ఈ నెల 23 నుంచి ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఆడిన స్టార్, సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్ ఆడేందుకు సై అంటున్నాడు. గత మ్యాచ్లో అతని ఆల్రౌండ్ ‘షో’ వల్లే నాలుగు రోజుల మ్యాచ్ కాస్త రెండే రోజుల్లో ముగిసింది. రెండు ఇన్నింగ్స్ (5/66, 7/38)ల్లో కలిపి 12 వికెట్లు తీసిన జడేజా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో 38 పరుగులు కూడా చేశాడు. సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. గురువారం నుంచి అస్సామ్తో జరిగే పోరులో మళ్లీ జోరు కనబరచాలనే లక్ష్యంతో రంజీ బరిలోకి దిగుతున్నాడు. అస్సామ్ను హిట్టర్ రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. భుజం గాయం నుంచి కోలుకున్న పరాగ్ ఐపీఎల్ ద్వారానే అందరికంటా పడ్డాడు. ఫిట్నెస్తో రాహుల్ రెడీ కర్ణాటక తరఫున ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్తో జరిగిన గత మ్యాచ్లోనే కేఎల్ రాహుల్ ఆడాలనుకున్నాడు. కానీ మోచేతి గాయం కారణంగా ఆ రంజీ పోరు ఆడలేకపోయిన స్టార్ ఓపెనర్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో హరియాణా జట్టుతో ఢీకొనేందుకు రెడీ అయ్యాడు. రాహుల్ చివరి సారిగా 2020లో బెంగాల్తో జరిగిన రంజీ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత సొంతరాష్ట్రం తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడనున్నాడు. అతని చేరికతో కర్ణాటక బ్యాటింగ్ విభాగం మరింత పటిష్టం అయ్యింది. అంతేకాదు. దేవదత్ పడిక్కల్, సీమర్ ప్రసిధ్ కృష్ణలు కూడా ఆడుతుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ముగ్గురు ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రోహిత్, జైస్వాల్, అయ్యర్ గైర్హాజరు ఈ రంజీ ట్రోఫీలో ముంబై ఆడాల్సిన చివరి లీగ్ మ్యాచ్లోనూ భారత కెపె్టన్ రోహిత్ శర్మ సహా యువ సంచలనం యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్లు ఆసక్తి కనబరిచారు. ఈ త్రయం జమ్మూకశ్మీర్తో జరిగిన గత మ్యాచ్లో బరిలోకి దిగింది. అయితే ఇంగ్లండ్తో వచ్చే నెల 6, 9, 12 తేదీల్లో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం వీరంతా భారత జట్టులో చేరాల్సివుండటంతో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే పోరుకు అందుబాటులో ఉండటం లేదని ముంబై వర్గాలు వెల్లడించాయి. -
‘పాకిస్తాన్లో ఆడేదే లేదు’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భారత్ పాల్గొనే విషయంపై స్పష్టత వచ్చింది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్కు భారత జట్టు వెళ్లడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. పాక్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చిలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్ అక్కడికి వెళ్లే విషయంపై చాలా రోజులుగా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ బీసీసీఐ తమ నిర్ణయాన్ని ఖరాఖండీగా చెప్పేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ గడ్డపై తాము క్రికెట్ ఆడలేమని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా లేఖ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి తెలియజేసింది. తాము పాకిస్తాన్కు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా భారత బోర్డు సమాచారం అందించింది. తాజా పరిణామంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యామ్నాయ వేదికలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్తో పాటు భారత్కు ప్రత్యరి్థగా ఉండే జట్లు కూడా పాక్ వెలుపల ఉండే వేదికలో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుది. పాక్తో పాటు దేశం బయట మరో వేదికను ఎంచుకొని ‘హైబ్రిడ్ మోడల్’లో టోర్నీని నిర్వహించే ఆలోచనే లేదని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ శుక్రవారం కూడా చెప్పారు. అయితే ఒక్కరోజులో పరిస్థితి అంతా మారిపోయింది. భారత మ్యాచ్లకు యూఏఈ వేదికగా మారే అవకాశాలు ఉన్నాయి. తాము సిద్ధమంటూ శ్రీలంక బోర్డు చెబుతున్నా... పాక్ కోణంలో వారికి అనుకూల, సౌకర్యవంతమైన వేదిక కాబట్టి యూఏఈకే మొగ్గు చూపవచ్చు. 2023లో భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు వచ్చి ఆడినా... భారత్ మాత్రం అలాంటిదేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకే కట్టుబడింది. నేటి నుంచి సరిగ్గా 100 రోజుల్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. -
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
IPL 2024- BCCI: అభిమానులకు బ్యాడ్న్యూస్!
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ నిర్వహణ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2024 ద్వితీయ అర్ధభాగ మ్యాచ్ల వేదికను మార్చనున్నట్లు సమాచారం. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ గతంలోనే నిర్ధారించారు. ఫలితంగా... లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట మ్యాచ్లు జరిపే అవకాశాలపై జరిగిన చర్చకు తెర పడినట్లయింది. తొలుత 15 రోజుల మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేసి... ఆ తర్వాత మిగతా మ్యాచ్ల తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు.. అన్ని మ్యాచ్లు భారత్లోనే నిర్వహించడం ఖాయమని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఫిబ్రవరి 22న తొలి 17 రోజుల మ్యాచ్ల(21)కు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. మార్చి 22 నుంచి లీగ్ ఆరంభం కానున్నట్లు తెలిపారు నిర్వాహకులు. అయితే, సెకండాఫ్ నిర్వహణ విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచ్లు దుబాయ్లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. ‘‘భారత ఎన్నికల సంఘం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించనుంది. ఆ తర్వాతే ఐపీఎల్ సెకండాఫ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. వేదికగా దుబాయ్ను ఎంచుకోవాలా లేదంటే ఇక్కడే అన్ని మ్యాచ్లను నిర్వహించాలా అన్న విషయం తేలుతుంది. అయితే, బీసీసీఐలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికే దుబాయ్ వైపు మొగ్గుచూపుతున్నారు’’ అని తెలిపింది. ఒకవేళ ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్లను దుబాయ్లో నిర్వహించడం ఖాయమైతే.. దేశంలోనే మ్యాచ్లు(ఖర్చుల దృష్ట్యా) వీక్షించాలనుకున్న అభిమానులకు షాక్ తగిలినట్లే మరి!! చదవండి: ICC- T20WC: ఎడాపెడా దంచేసినా పర్లేదు కానీ.. ఇకపై అలా కుదరదు! -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేలకోట్లు! ప్రభుత్వానికి చెల్లించేది ఎంతంటే!
BCCI's Income Tax: ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రసిద్ది పొందింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న జాబితాలోనూ అగ్రస్థానంలో ఉంది. క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతూ మీడియా హక్కులు, స్పాన్సర్లతో భారీ ఒప్పందాలు తదితర కార్యకలాపాలతో దండిగా సంపాదిస్తోంది బీసీసీఐ. ఐసీసీ నుంచి అత్యధికంగా ఇక 2024-27 కాలానికి గానూ ఐసీసీ నుంచి.. బీసీసీఐ తమ వాటాగా ఏడాదికి 230 మిలియన్ యూఎస్ డాలర్లు(సుమారు రెండు వేల కోట్లు) పొందనున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ఇటీవలే వెల్లడించారు. మరి వేల కోట్ల సంపాదనతో రిచెస్ట్ బోర్డుగా ఘనతకెక్కిన బీసీసీఐ ప్రభుత్వానికి ఎంత మేర పన్ను చెల్లిస్తుందో తెలుసా?! వేలకోట్ల ఆదాయం అక్షరాలా పదకొండు వందల నూట యాభై తొమ్మిది కోట్లు! 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ ఈ మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. అదే విధంగా.. గత ఐదేళ్లలో బీసీసీఐ చెల్లించిన టాక్స్ వివరాలను సభలో వినిపించారు. ఇక 2017-18లో 596.63 కోట్లు, 2019-20లో 882.29 కోట్లు, 2020-21లో 844.92 కోట్లు పన్ను చెల్లించినట్లు తెలిపారు. 2021-22లో బీసీసీఐ ఆదాయం 7,606 కోట్ల రూపాయలుగా ఉందన్న మంత్రి.. ఖర్చుల రూపంలో 3064 కరిగిపోయినట్లు వెల్లడించారు. ప్రధాన వనరు అదే! అదే విధంగా.. 2020-21 ఏడాదికి గానూ రికార్డు స్థాయిలో 4735 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగా.. 3080 వ్యయమైనట్లు బీసీసీఐ తెలిపిందని పేర్కొన్నారు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: మరీ ఇంత స్వార్ధమా.. ధోనిని చూసి నేర్చుకో! ఏంటి హార్దిక్ ఇది? మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. -
67 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి! టీమిండియాతో ‘బంధం’: భావోద్వేగ ట్వీట్
Team India sponsorship Who Is Harsh Jain: టీమిండియా కొత్త స్పాన్సర్గా డ్రీమ్11ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ఫామ్ను తమ భాగస్వామిగా చేసుకున్నట్లు శనివారం వెల్లడించింది. మూడేళ్ల పాటు భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై డ్రీమ్11 లోగోతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. నిజానికి క్రికెట్ ప్రేమికులకు డ్రీమ్11 గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నగా మొదలై.. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు భారత జట్టు ప్రధాన స్పాన్సర్గా ఎదిగింది ఈ గేమింగ్ ప్లామ్ఫామ్. ఇందులో ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్ది కీలక పాత్ర. 150 సార్లు తిరస్కరణ ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాడు. తన కాలేజీ స్నేహితుడు భవిత్ సేత్తో కలిసి డ్రీమ్11ను ఏర్పాటు చేయాలని భావించాడు. అయితే వీరికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. నిధుల సమీకరణ కోసం ప్రయత్నించగా ఏకంగా 150 సార్లు ‘నో’ అనే సమాధానమే వచ్చింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా హర్ష్, భవిత్ సవాళ్లను అధిగమించి 2008లో డ్రీమ్11ను ఏర్పాటు చేశారు. క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ వంటి ఫాంటసీ గేమ్లు ఆడుకునేందుకు వీలుగా ఉన్న గేమింగ్ ప్లాట్ఫామ్కు దాదాపు 150 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం డ్రీమ్11 విలువ దాదాపు 67 వేల కోట్లు ఉంటుందని అంచనా. భావోద్వేగ ట్వీట్తో ఇదిలా ఉంటే.. బీసీసీఐతో మరోసారి జట్టుకట్టడం పట్ల హర్ష్ జైన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘డ్రీమ్11 ఇండియా. గత 15 ఏళ్ల కాలంలో మేము ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అయితే, ఈసారి భారత క్రికెట్ జట్టు జెర్సీపై మా లోగో చూడబోతున్నాం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గర్వకారణమైన విషయం ఇది. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని హర్ష్ జైన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. క్రికెట్ ప్రేమికుడైన తన కల ఇలా నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని సంపన్న బోర్డుతో ఐపీఎల్-2020 సందర్భంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది డ్రీమ్11. ఆ సీజన్లో టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. ఈసారి ఏకంగా జెర్సీ స్పాన్సర్గా లీగ్ స్పాన్సర్ అవతారమెత్తింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జూలై 12 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్లో డ్రీమ్11 లోగోలతో కూడిన జెర్సీలను భారత ఆటగాళ్లు ధరించనున్నారు. చదవండి: రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి.. సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! DREAM11 INDIA. In the last 15 years of running @Dream11 we've had many highs and lows, but seeing THIS on our Indian Cricket team jersey will be the PROUDEST moment for me personally! 🇮🇳🇮🇳🇮🇳 Thank you everyone for all your ❤️ and support always! 🙏🏼https://t.co/Ft8Qh9mA0d — Harsh Jain (@harshjain85) July 1, 2023 -
భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా అడిడాస్
చెన్నై: జర్మనీకి చెందిన ప్రముఖ క్రీడా ఉత్పాదనల సంస్థ అడిడాస్ భారత క్రికెట్ జట్టు కిట్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ప్రస్తుత స్పాన్సర్ ‘కిల్లర్ జీన్స్’తో కాంట్రాక్టు గడువు ఈ నెలాఖరుతో ముగియనుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త స్పాన్సర్షిప్ ఇచ్చింది. దీనిపై బోర్డు కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘దేశంలో క్రికెట్ అభివృద్ధి అంచనాలను మించుతుంది. కాబట్టి ప్రపంచశ్రేణి సంస్థ మాతో జట్టు కట్టడంపై పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు’ అని అన్నారు. జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అయిన అడిడాస్తో ఒప్పందం ఎన్నేళ్లు, ఎంత మొత్తానికి స్పాన్సర్షిప్ పొందిందనే వివరాలేవీ ఆయన వెల్లడించలేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం రూ. 350 కోట్లతో అడిడాస్ కిట్ స్పాన్సర్షిప్ దక్కించుకున్నట్లు తెలిసింది. టీమిండియా వచ్చే నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో తలపడుతుంది. ఆ జెర్సీలపై అడిడాస్ లోగో కనిపించనుంది. టీమ్ స్పానర్ బైజుస్ కూడా మారుతున్నట్లు తెలిసింది. ఈ నవంబర్ వరకు గడువున్నప్పటికీ సదరు సంస్థ ముందుగానే వైదొలగనుండటంతో త్వరలోనే బిడ్లను ఆహ్వానిస్తారు. -
WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం
ముంబై: ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెటర్ల ఫిట్నెస్కు ప్రాధాన్యమివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది. ఆదివారం బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆటగాళ్లకు కఠిన పరీక్ష పెట్టే యో–యో ఫిట్నెస్ టెస్టును తిరిగి ప్రవేశ పెట్టనున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది వరల్డ్కప్తో పాటు, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉండటంతో భారత ప్రపంచకప్ సైన్యంపై అదనపు ఒత్తిడి, క్రికెట్ భారం లేకుండా పక్కా ప్రణాళికతో సిరీస్లకు ఎంపిక చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ► బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి జై షా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ పాల్గొన్నారు. బిన్నీ మాత్రం వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. ► కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్ ఇలా గత కొంతకాలంగా భారత కెప్టెన్లను మార్చినప్పటికీ పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మనే కొనసాగించాలని తీర్మానించారు. తద్వారా సారథ్య మార్పు ఉండదని స్పష్టం చేశారు. ► మెగా టోర్నీ, మేటి జట్లతో సిరీస్ల నేపథ్యంలో జట్టు సెలక్షన్ కోసం యో–యో టెస్టు, డెక్సా (ఎముకల పరిపుష్టి పరీక్ష) టెస్టుల్ని నిర్వహిస్తారు. ఎంపికవ్వాలంటే ఈ టెస్టులు పాసవ్వాలి. ► ఎమర్జింగ్ ప్లేయర్లు ఐపీఎల్తో పాటు ప్రాధాన్యత గల దేశవాళీ టోర్నీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకున్న వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారు. ► ప్రపంచకప్కు ఎంపికయ్యే క్రికెటర్లంతా పూర్తి ఫిట్నెస్తో మెగా ఈవెంట్కు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రాధాన్య అంశంగా భేటీ జరిగింది. ఆటగాళ్లపై బిజీ షెడ్యూల్ భారం, ఒత్తిడి, మెంటల్ కండిషనింగ్, ఫిట్నెస్ అంశాల్ని ఇందులో చర్చించారు. ► మంచి ఆల్రౌండర్ అవుతాడనుకున్న దీపక్ చహర్, భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల పాలవడంపై చర్చించిన మీదట ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ► అవసరమైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలతో కూడా బోర్డు పెద్దలు మాట్లాడతారు. ఈ ఏడాది భారత క్రికెట్కు అత్యంత కీలకం కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ టోర్నీ సమయంలో తమ స్టార్ ఆటగాళ్లపై పెనుభారం మోపకుండా చూస్తారు. ► గతంలో కోహ్లి కెప్టెన్సీ హయాంలో యో–యో టెస్టు వార్తల్లో నిలిచింది. అయితే ఇది స్టార్, ఎలైట్ ఆటగాళ్లను కష్టపెట్టడంతో తాత్కాలికంగా యో–యో టెస్టును పక్కన పెట్టారు. ► ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీఫైనల్ వైఫల్యం దరిమిలా తొలగించిన సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ఈ కీలక మీటింగ్లో పాల్గొనడం గమనార్హం. 20 మందితో ప్రపంచకప్ సైన్యం... సొంతగడ్డపై ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో జరిగే ప్రపంచకప్ కోసం 20 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. మెగా టోర్నీ జరిగేదాకా వీరందరూ కూడా ఒకే టోర్నీలో బరిలోకి దిగరు. రొటేషన్ పద్ధతిలో ఆడతారు. కొందరికి విశ్రాంతి... ఇంకొందరు బరిలోకి అన్నట్లుగా ఈ పద్ధతి సాగుతుంది. గాయాల పాలవకుండా, మితిమీరిన క్రికెట్ భారం పడకుండా ఉండేందుకు బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
Roger Binny: గంగూలీకి బైబై! బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ
BCCI New President: భారత క్రికెట్ నియంత్రణ మండలి 36వ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ రోజర్ బిన్నీ ఎంపికయ్యారు. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ బాస్గా పగ్గాలు చేపట్టారు. ముంబైలోని తాజ్ హోటల్లో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం తర్వాత బోర్డు ఈ మేరకు ప్రకటన వెలువరించింది. కాగా ఈ సమావేశంలో సౌరవ్ గంగూలీ సహా బీసీసీఐ కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్ తదితరులు పాల్గొన్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీ భావించినప్పటికీ విముఖత వ్యక్తం కావడంతో నామినేషన్ వేయలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పదవి కోసం నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తిగా ఉన్న 67 ఏళ్ల రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఘనత బిన్నీకే దక్కింది! భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆంగ్లో ఇండియన్ రోజర్ బిన్నీ. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులో రోజర్ బిన్నీ సభ్యుడిగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో మొట్టమొదటిసారి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో ఈ రైట్ ఆర్మ్ మీడియం పేసర్ది కీలక పాత్ర. ఆ ఎడిషన్లో 18 వికెట్లు తీసి వెలుగులోకి వచ్చారు. కాగా భారత్ తరఫున 27 టెస్టులాడి 47 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ.. 72 వన్డేల్లో 77 వికెట్లు కూల్చారు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటకు ప్రాతినిథ్యం వహించిన రోజర్ బిన్నీ.. ఆ రాష్ట్ర బోర్డు ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. చదవండి: అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? -
బీసీసీఐ ఎన్నికలు: ముహూర్తం ఖరారు
ముంబై: ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక బోర్డులో ఎన్నికలకు నగారా మోగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లోని పదవుల కోసం అక్టోబర్ 18న ఎన్నికలు జరపనున్నట్లు బోర్డు ఎన్నికల అధికారి ప్రకటించారు. అదే రోజు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా నిర్వహిస్తారు. భారత ఎలక్షన్ కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ ఏకే జోటి దీనికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన ఆయన ఈ వివరాలను ఇప్పటికే బీసీసీఐ పరిధిలోని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు అందించారు. వీరంతా తమ సంఘం తరఫు నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను బోర్డుకు పంపించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నికల ప్రక్రియలో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారే బరిలోకి దిగాలని కూడా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా సూచించారు. బోర్డు నియమావళి ప్రకారం ఐదు కీలకమైన ఆఫీస్ బేరర్ పదవులకు (అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి) ఎన్నికలు జరుగుతాయి. దీంతో పాటు ఒక అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిని, ఇద్దరు గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకుంటారు. అక్టోబర్ 11, 12 తేదీల్లో దరఖాస్తులు స్వీకరించనుండగా... 18న ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే బీసీసీఐ ఎన్నికల ప్రక్రియ ముగియాల్సి ఉన్నా... వివిధ అంశాలపై సుప్రీం కోర్టు నుంచి స్పష్టత కోరుతూ బోర్డు ఇప్పటి వరకు ఆగింది. ఇటీవల సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి కీలక ఆదేశాలు రావడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న సౌరవ్ గంగూలీ, జై షా అదే పదవుల కోసం బరిలో ఉంటారా... లేక వీరిలో ఒకరు ఐసీసీ వైపు వెళ్లి కొత్తవారు ఆ పదవిలో వస్తారా వేచి చూడాలి. -
బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 18న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. అక్టోబర్ 4వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, సెక్రటరీగా జైషా కొనసాగుతున్నారు. -
టి20లకు కొత్త ‘మెరుపు’
ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20 క్రికెట్ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్ సబ్స్టిట్యూట్’ను ప్రవేశ పెట్టనుంది. ముందుగా దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 11 నుంచి జరిగే ముస్తాక్ అలీ టోర్నీలో ‘టాక్టికల్ సబ్స్టిట్యూట్’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఏంటీ ఇంపాక్ట్ ప్లేయర్ కథ సబ్స్టిట్యూట్ ప్లేయర్ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్స్టిట్యూట్ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్కషన్ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్ చేసే వెసులుబాటు సబ్స్టిట్యూట్ ప్లేయర్కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ భిన్నమైంది. టాస్కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్స్టిట్యూట్ ప్లేయర్గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్ చేంజర్ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్బాష్ లీగ్లో కొన్ని షరతులతో ఉంది. అప్పట్లో... వన్డేల్లో! క్రికెట్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్స్టిట్యూట్ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్స్టిట్యూట్ ప్లేయర్ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు. -
IND VS ZIM: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో టీమిండియా!
India Tour Of Zimbabwe- హరారే: ఈ మధ్య విదేశానికెళ్లిన చోటల్లా విభిన్న కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఫలితాల్లో మాత్రం నిలకడగా సిరీస్ విజయాలను సాధిస్తోంది. ఇప్పుడు కూడా మరో ప్రయత్నం మరో సారథితో చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత్ నేడు తొలి వన్డే ఆడనుంది. ఈ పర్యటన జింబాబ్వేకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’. కేవలం ఈ మూడు వన్డేల సిరీస్తో వచ్చే రాబడితోనే జింబాబ్వే బోర్డు సగం ఏడాదికి సరిపడా ఖర్చుల్ని వెళ్లదీసుకుంటుందంట! ఈ నేపథ్యంలో ఇక్కడ సిరీస్ ఆసక్తికరమనే కంటే కూడా... ఆతిథ్య బోర్డుకు ఆర్థిక పుష్టికరమని చెప్పాలి. అందరి కళ్లు రాహుల్, చహర్లపైనే... ఇక సిరీస్ విషయానికొస్తే జట్టు కంటే కూడా... కొత్త కెప్టెన్ రాహుల్కు అగ్ని పరీక్షలాంటిది. ఎందుకంటే టీమిండియా ఇటీవల ఏ దేశమేగినా... ఎందుకాలిడినా గెలుస్తూనే వస్తోంది. ఎటొచ్చి ‘స్పోర్ట్స్ హెర్నియా’ సర్జరీతో రెండు నెలలుగా ఆటకు దూరమైన రాహుల్ ఫిట్నెస్కే ఇది టెస్ట్! ఇక్కడ ఈ టాపార్డర్ బ్యాటర్ త్రిపాత్రాభినయం చేయాల్సి వస్తుంది. 100 ఓవర్ల పాటు మైదానంలో ఫిట్నెస్ నిరూపించుకోవాలి. సారథిగా జట్టును నడిపించాలి. టాపార్డర్లో బ్యాట్తో సత్తా చాటాలి. అలాగే మరో ఆటగాడు కూడా సవాలుకు సిద్ధమయ్యాడు. గాయంతో ఫిబ్రవరి నుంచి అసలు మైదానంలోకే దిగని దీపక్ చహర్ సుమారు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ల కోసం అతన్ని పరిశీలించాలంటే అందుబాటులో ఉన్న ఈ కొద్ది మ్యాచ్ల్లోనే ఆల్రౌండర్గా నిరూపించుకోవాలి. ధావన్, గిల్, సామ్సన్ అంతా ఫామ్లోనే ఉన్నారు. బౌలింగ్లోనూ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్లతో భారత జట్టే బలంగా ఉంది. ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తన వన్డే కెరీర్ను... అక్షర్ పటేల్, సంజూ సామ్సన్ తమ టి20 కెరీర్ను జింబాబ్వేలోనే ప్రారంభించారు. జోరు మీదుంది కానీ... ఈ నెలలోనే తమ దేశానికి వచ్చిన బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన జింబాబ్వే జోరుమీదుంది కానీ... భారత్లాంటి అసాధారణ ప్రత్యర్థితో ఎలా ఆడుతుందనేదే అసక్తికరం. ఏ రకంగా చూసినా కూడా టీమిండియాకు దీటైన ప్రత్యర్థి కాదు. కానీ సొంతగడ్డపై ఉన్న అనుకూలతలతో, ఇటీవలి విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో గట్టి పోటీ ఇచ్చేందుకు జింబాబ్వే తహతహలాడుతోంది. కెప్టెన్, వికెట్ కీపర్ రెగిస్ చకాబ్వా, సికందర్ రజా, ఇన్నోసెంట్ కయా చక్కని ఫామ్లో ఉన్నారు. అయితే బౌలింగ్ మాత్రం పేలవమనే చెప్పాలి. టీమిండియాలాంటి టాప్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే బౌలింగ్ విభాగం కూడా మెరగవ్వాలి. చదవండి: Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! WI VS NZ 1st ODI: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం -
భారత్ మాటే శాసనం.. వాళ్లేం చెబితే అదే జరుగుతుంది: ఆఫ్రిది
BCCI- IPL- ICC’s Future Tours Programme (FTP): క్రికెట్ ప్రపంచంలో సంపన్న బోర్డుగా పేరుగాంచింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఇటీవల ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం విషయంలో 2023-27 కాలానికి గానూ 48 వేల కోట్ల రూపాయలు ఆర్జించి మరోసారి తన విలువను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన స్పోర్ట్స్ ప్రాపర్టీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఒక్క విషయం చాలు.. క్యాష్ రిచ్ లీగ్కు ఉన్న క్రేజ్, దీనిని నిర్వహిస్తున్న బీసీసీఐ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో భాగస్వామ్యమైన క్రికెటర్లు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా దూరమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఉన్న ఆదరణ దృష్ట్యా.. దీని కోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ) క్యాలెండర్లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ దేశాల ఆటగాళ్లు ఇందులో భాగమైన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్పై ప్రభావం చూపుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెటేతర కారణాల వల్ల ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే. ఇక ఇప్పుడు ఐసీసీ ఎఫ్టీపీ క్యాలెండర్(మ్యాచ్ షెడ్యూల్స్) విషయంలోనూ ఐపీఎల్ ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఏం చెబితే క్రికెట్ ప్రపంచంలో అదే జరగుతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సామా టీవీ షోలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘‘మార్కెట్ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా ఒక భాగం. క్రికెట్ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఇండియా. కాబట్టి వాళ్లేం చెబితే అదే ఇక్కడ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక గతంలో ఐపీఎల్ను అతి పెద్ద బ్రాండ్ లీగ్గా అభివర్ణించిన ఆఫ్రిది.. ఇలాంటి మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం పెద్ద లోటు అని వ్యాఖ్యానించాడు. చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ ODI WC 1975: మొట్టమొదటి విజేత విండీస్.. సరిగ్గా ఇదే రోజు.. జట్టును గెలిపించింది ఎవరో తెలుసా? ఇతర విశేషాలు! -
IPL: అమెజాన్ అవుట్
న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్ తప్పుకుంది. దీంతో రిలయన్స్కు చెందిన ‘వయాకామ్ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్ సహా డిస్నీ స్టార్, వయాకామ్–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయి. అయితే శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది. నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్కాస్టింగ్ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్ ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది. బిడ్ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్కు చెందిన యుట్యూబ్ వాళ్లు కూడా డాక్యుమెంట్ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నిజమా... రూ. 45 వేల కోట్లా? అమెజాన్ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ! ఇ–వేలం సంగతేంటి? బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్ (ఎలక్ట్రానిక్ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్లో పోటీదారులంతా ఆన్లైన్ పోర్టల్లో బిడ్లు వేస్తారు. స్క్రీన్లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి. నాలుగు ‘ప్యాకేజీ’లు నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’ టీవీ హక్కులు, ‘బి’ డిజిటల్ రైట్స్. ‘సి’ ప్లే–ఆఫ్స్ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్లకు సంబంధించిన డిజిటల్ రైట్స్. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్ రైట్స్. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్లో ఒక్కోసారి మ్యాచ్లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు. ఇవీ ప్రారంభ ధరలు... ‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్ ధర కాగా... ‘బి’ డిజిటల్ కోసం మ్యాచ్కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్ చేసిన స్టార్ నెట్వర్క్ డిజిటల్కు తక్కువ కోట్ చేసింది. ఫేస్బుక్ డిజిటల్ కోసం రూ.3,900 కోట్లు కోట్ చేసినా... ఓవరాల్గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్ విభాగంలో టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ఆసియా, డ్రీమ్11, ఫ్యాన్కోడ్... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్ (ఇంగ్లండ్), సూపర్స్పోర్ట్ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి. -
త్వరలోనే ‘మహిళల ఐపీఎల్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు. ‘మహిళల క్రికెట్కు సంబంధించి కూడా త్వరలోనే పరిస్థితులు మారతాయి. ఐపీఎల్ తరహాలో మహిళల టోర్నీ కూడా నిర్వహించాలనే ఆలోచనకు బీసీసీఐ కట్టుబడి ఉంది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి అభిమానులు, ఆటగాళ్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ సాధ్యమమవుతుందని అనిపిస్తోంది’ అని జై షా అన్నారు. 2022లో ఐపీఎల్ను పూర్తిగా భారత్లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఒక అంచనాకు వస్తామని ఆయన చెప్పారు. మరోవైపు నాలుగు పెద్ద జట్లతో టి20 టోర్నీ నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనపై కూడా జై షా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టే అలాంటి వాణిజ్యపరమైన ఆలోచనకంటే క్రికెట్ను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఐపీఎల్ విస్తృతమవడంతో పాటు ప్రతీ ఏడాది ఐసీసీ టోర్నీలు ఉంటున్నాయి. పైగా టెస్టులపై దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సిరీస్లు కూడా ముఖ్యం. ఇలాంటి సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకంటే ఆటకు ప్రాచుర్యం కల్పించడమే కీలకం’ అని షా అభిప్రాయపడ్డారు. -
రేసులో అదానీ, గోయెంకా
దుబాయ్: మళ్లీ పది జట్ల ఐపీఎల్కు నేడు అడుగు పడనుంది. రూ.వేల కోట్ల అంచనాలతో దాఖలైన టెండర్లను నేడు తెరువనున్నారు. సుమారు 22 కంపెనీలు రూ. 10 లక్షలు వెచ్చించి మరీ టెండర్ దరఖాస్తులు దాఖలు చేసినప్పటికీ పోటీలో ప్రధానంగా ఐదారు కంపెనీలే ఉన్నట్లు తెలిసింది. ఇందులోనూ ఎలాగైనా దక్కించుకోవాలనే సంస్థలు మూడే! దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థలైన అదానీ గ్రూప్, గోయెంకా, అరబిందో సంస్థలు ఐపీఎల్లో తమ ‘జెర్సీ’లను చూడాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ అదాయంపై గంపెడాశలు పెట్టుకుంది. ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా రూ. 7,000 కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఆశిస్తోంది. అందుకే కనీస బిడ్ ధర రూ. 2,000 కోట్లు పెట్టింది. అయినాసరే 22 కంపెనీలు టెండర్ల ప్రక్రియపై ఆసక్తి చూపాయంటే ఐపీఎల్ బ్రాండ్విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా బ్రాడ్కాస్టింగ్ హక్కుల మార్కెట్ ఏకంగా రూ.36 వేల కోట్లకు చేరింది. లీగ్కు సమకూరే ఈ ఆదాయాన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. ఈ రకంగా చూసినా బోర్డు ఆశించినట్లు ఒక్కో జట్టుకు రూ. 7,000 కోట్లు కాకపోయినా రెండు కలిపి (రూ. 3,500 కోట్లు చొప్పున) ఆ మొత్తం గ్యారంటీగా వచ్చే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. రేసులో అరబిందో గ్రూప్ ఉన్నప్పటికీ అదానీ, గోయెంకా కంపెనీలు ఫ్రాంచైజీలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అహ్మదాబాద్ లక్ష్యంగా అదానీ ఐపీఎల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాజస్తాన్, పంజాబ్ ఫ్రాంచైజీలున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో చేరే ఇంకో రెండు నగరాలేవో నేడు తేల్చేస్తారు. బరిలో అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ ఉన్నప్పటికీ ప్రధానంగా అహ్మదాబాద్, లక్నోలే ఖరారు అవుతాయని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే అహ్మదాబాద్, లక్నోలే ఫేవరెట్ నగరాలు. ముఖ్యంగా గుజరాత్కు చెందిన అదానీ గ్రూప్ అహ్మదాబాద్ లక్ష్యంగా టెండరు దాఖలు చేసింది. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీ అనుభవమున్న ఆర్పీఎస్జీ (రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా) గ్రూపు లక్నోను చేజిక్కించుకునే అవకాశముంది. ఐపీఎల్లో చెన్నై, రాజస్తాన్లు రెండేళ్ల నిషేధానికి గురైనపుడు పుణే (రైజింగ్ పుణే సూపర్జెయింట్స్)తో ఐపీఎల్లోకి ప్రవేశించింది. -
ద్రవిడ్ మాత్రమే దరఖాస్తు చేయడంతో...
న్యూఢిల్లీ: బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ‘హెడ్ ఆఫ్ క్రికెట్’ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఒక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇంకెవరు పోటీలో లేరు. దీంతో అతనే మరో సారి ఎన్సీఏ చీఫ్గా ఖాయమైనప్పటికీ విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తు గడువును పొడిగించింది. రెండేళ్ల క్రితం ఎన్సీఏ చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ద్రవిడ్ తనదైన ముద్ర వేశాడు. కుర్రాళ్లకు, పునరావాస శిబిరానికి వచ్చిన ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారాడు. భారత్ ‘ఎ’, జూనియర్ జట్ల కోచ్గా రిజర్వ్ బెంచ్ సత్తా పెంచాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్కే అన్నివైపులా అనుకూలతలు, అర్హతలు ఉన్నాయని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరో వైపు గాయాలతో బాధపడుతున్న యువ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, కమలేశ్ నాగర్కోటి ఎన్సీఏ పునరావాస శిబిరానికి చేరగా, శుబ్మన్ గిల్ ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. ఈ ముగ్గురు ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్లంతా పూర్తిస్థాయి ఫిట్నెస్ సంతరించుకుంటే యూఏఈలో జరిగే ఐపీఎల్లో పాల్గొనే అవకాశముంది. -
నవంబర్ 16 నుంచి రంజీ ట్రోఫీ
ముంబై: కరోనా కారణంగా గత ఏడాది రంజీ ట్రోఫీతోపాటు పలు వయో పరిమితి విభాగం టోర్నీలను నిర్వహించలేకపోయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో దేశవాళీ క్రికెట్ సీజన్ను నిర్వహించడానికి సిద్ధమైంది. 2021–2022 దేశవాళీ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం విడుదల చేశారు. ‘దేశవాళీ క్రికెట్ సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 21న సీనియర్ మహిళల వన్డే లీగ్తో మొదలవుతుంది. 2022 ఏప్రిల్ 11న సీనియర్ మహిళల టి20 లీగ్తో ముగుస్తుంది’ అని జై షా తెలిపారు. ఇక ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ టోర్నీ నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు జరుగుతుంది. ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు... విజయ్ హజారే ట్రోఫీ వన్టే టోర్నీని 2022 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు నిర్వహిస్తారు. వీటితోపాటు అండర్–23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీని , అండర్–19 వినూ మన్కడ్ ట్రోఫీ, అండర్–16 కూచ్ బిహార్ ట్రోఫీ, విజయ్ మర్చంట్ ట్రోఫీ టోర్నీలు కూడా జరుగుతాయి. సీనియర్, జూనియర్ పురుషుల, మహిళల విభాగాల టోర్నీలన్నింటిలో కలిపి మొత్తం 2,127 మ్యాచ్లు జరుగుతాయి. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ (ఇంటర్ జోనల్), దేవధర్ ట్రోఫీ మ్యాచ్లను నిర్వహించడం లేదు. మరోవైపు దేశవాళీ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు పెంచే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఫస్ట్క్లాస్ (మూడు లేదా నాలుగు రోజులు) మ్యాచ్ల్లో ఆడేవారికి మ్యాచ్కు రూ. లక్షా 40 వేలు.. లిస్ట్–ఎ, టి20 మ్యాచ్ల్లో ఆడేవారికి మ్యాచ్కు రూ. 35 వేలు లభిస్తున్నాయి. ఈ ఏడాది దేశవాళీ క్రికెట్ సీజన్ షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ -
2021- 22 సీజన్ ఇండియా డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ఇదే!
న్యూఢిల్లీ: కరోనా అదుపులోకి వస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 2021-22 సీజన్కు గానూ దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు 21న సీనియర్ వుమెన్ వన్డే లీగ్తో డొమెస్టిక్ క్రికెట్ ఈవెంట్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. అక్టోబరు 20న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మొదలుకానుందని, నవంబరు 12 ఇందుకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఉంటుందని పేర్కొంది. వీటితో పాటు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఈవెంట్లకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసిన తన ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో మొత్తంగా మహిళా, పురుషుల క్రికెట్.. అన్ని ఫార్మాట్లలో 2127 దేశవాళీ మ్యాచ్లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2021-2022 డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్: ►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న ప్రారంభం ►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021 ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021 ►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022 ►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022 -
రూ. 4800 కోట్లు: బీసీసీఐకి బాంబే హైకోర్టులో భారీ ఊరట
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి బాంబే హైకోర్టులో బుధవారం భారీ ఊరట దక్కింది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీగా వ్యవహరించిన దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ యాజమాన్యానికి 4800 కోట్ల రూపాయలు చెల్లించాలన్న ఆదేశాలను తోసివేస్తూ ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కాగా 2008లో ప్రారంభమైన క్యాష్రిచ్ లీగ్లో భాగంగా బీసీసీఐ, వివిధ ఫ్రాంఛైజీలతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీసీహెచ్ఎల్ (దెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్) దెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ పేరిట జట్టును బరిలోకి దింపింది. ఈ సందర్భంగా... బీసీసీఐ, డీసీహెచ్ఎల్ మధ్య పదేళ్ల పాటు ఒప్పందం కుదిరింది. అయితే, బోర్డు నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలతో బీసీసీఐ 2012 సెప్టెంబరులో దెక్కన్ చార్జర్స్ను లీగ్ నుంచి తొలగించింది. అంతేగాక ఈ జట్టులోని ఆటగాళ్ల కాంట్రాక్టులు రద్దు చేసి వారిని వేలంలో నిలిపింది. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందంటూ డీసీహెచ్ఎల్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ సీకే థక్కర్ సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ థక్కర్.. గతేడాది డీసీహెచ్ఎల్కు సానుకూలంగా తీర్పునిస్తూ... రూ. 4800 కోట్లు చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించారు. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జీఎస్ పటేల్ ధర్మాసనం.. బీసీసీఐకి ఊరట కల్పిస్తూ ఆర్బిట్రేటర్ ఆదేశాలను తోసివేస్తూ తీర్పునిచ్చింది. ఇక 2009లో ఆడం గిల్క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్రైజర్స్ జట్టు హైదరాబాద్ నుంచి ఐపీఎల్కు ప్రాతినిథ్యం వహిస్తోంది. చదవండి: WTC Final: భారత జట్టు ఇదే.. వారికి నిరాశే! -
BCCI: 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల విరాళం
ముంబై: మహమ్మారి కరోనాపై పోరులో అండగా ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ముందుకు వచ్చింది. ప్రాణవాయువు కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ 10 లీటర్ల సామర్థ్యం గల 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... ‘‘వైరస్పై పోరాటంలో వైద్య సిబ్బంది పోషిస్తున్న పాత్ర మరువలేనిది. మనల్ని కాపాడటం కోసం ముందుండి పోరాడుతున్న వాళ్లు నిజమైన ఫ్రంట్లైన్ వారియర్లు. వైద్యారోగ్యం అంశానికి బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వాళ్లు త్వరగా కోలుకునేలా తన వంతు తక్షణ సాయం ప్రకటించింది’’అని పేర్కొన్నారు. ఇక బీసీసీఐ కార్యదర్శి జై షా.. ‘‘కోవిడ్పై జాతి సమిష్టి యుద్ధంలో చేయి కలిపి నిలబడతాం. కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న బాధితుల గురించి, వైద్య పరికరాల కొరత గురించి బీసీసీఐకి అవగాహన ఉంది. బోర్డు తన వంతు సహాయం చేస్తుంది. వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మనం ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఏడాది దాటిపోయింది.. ఇంతవరకు ప్రైజ్మనీ చెల్లించలేదు -
సెప్టెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్నాక భారత మహిళల క్రికెట్ జట్టు మరో విదేశీ పర్యటనకు సిద్ధం కానుంది. సెప్టెంబర్లో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడేందుకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించకపోయినా... ఆస్ట్రేలియా మహిళల జట్టు పేస్ బౌలర్ మేగన్ షూట్ ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో వెల్లడించింది. ‘సెప్టెంబర్ రెండో వారంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కు ముందు ఆసీస్ జట్టుకు డార్విన్లో శిక్షణ శిబిరం ఉంది. భారత్తో సిరీస్ తర్వాత బిగ్బాస్ లీగ్, మహిళల నేషనల్ క్రికెట్ లీగ్, యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్కప్, కామన్వెల్త్ గేమ్స్లతో ఆస్ట్రేలియా క్రికెటర్లు బిజీబిజీగా ఉండనున్నారు’ అని మేగన్ షూట్ తెలిపింది. 28 ఏళ్ల మేగన్ ఆస్ట్రేలియా తరఫున 65 వన్డేలు ఆడి 99 వికెట్లు... 73 టి20 మ్యాచ్లు ఆడి 96 వికెట్లు తీసింది. వాస్తవానికి భారత మహిళల జట్టు వన్డే వరల్డ్కప్ టోర్నీకి సన్నాహకంగా ఈ ఏడాది జనవరిలోనే ఆస్ట్రేలియాలో పర్యటించాల్సింది. అయితే కరోనా కారణంగా భారత పర్యటన వాయిదా పడింది. -
విహారి, షమీ, జడేజా పునరాగమనం
-
విహారి, షమీ, జడేజా పునరాగమనం
ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత విజయం సాధించి, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆటగాళ్లపైనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్టర్లు నమ్మకం ఉంచారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో తలపడేందుకు 20 మందితో కూడిన జట్టును ప్రకటించారు. భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేయకపోవడం మినహా ఎలాంటి అనూహ్యత లేకుండా అంచనాల ప్రకారమే జట్టు ఎంపిక సాగింది. కరోనా నేపథ్యంలో అదనంగా మరో నలుగురు రిజర్వ్ ఆటగాళ్లు ప్రధాన జట్టుతో పాటు ఇంగ్లండ్కు వెళతారు. ముంబై: సుమారు మూడు నెలల పాటు సాగే ఆరు టెస్టు మ్యాచ్ల ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్కు అజింక్య రహానే వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. మొత్తం 20 మందిని ఎంపిక చేసిన కమిటీ మరో నలుగురు ఆటగాళ్లను స్టాండ్బైలుగా ప్రకటించింది. ఈ టూర్లో జూన్ 18 నుంచి సౌతాంప్టన్లో న్యూజిలాండ్తో తొలి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడే టీమిండియా... ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో పోటీపడుతుంది. క్వారంటైన్ తదితర నిబంధనలు దృష్టిలో ఉంచుకొని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ బయలుదేరే అవకాశం ఉంది. ముగ్గురు వచ్చేశారు... ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ గాయపడగా... సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవీంద్ర జడేజా గాయపడ్డారు. ఈ ముగ్గురు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్కు దూరమయ్యారు. ఇప్పుడు వీరు తాజా పర్యటనతో టెస్టు టీమ్లోకి పునరాగమనం చేస్తున్నారు. విహారి ఇప్పటికే ఇంగ్లండ్లో ఉన్నాడు. వార్విక్షైర్ క్లబ్ జట్టు తరఫున అతను కౌంటీల్లో ఆడుతున్నాడు. ఉమేశ్కు మరో చాన్స్... పేస్ బౌలింగ్ విభాగంలో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, షమీలతో పాటు తాజా ఫామ్ను బట్టి మొహమ్మద్ సిరాజ్కు సహజంగానే చోటు లభించింది. మరో ఇద్దరు పేసర్లు కూడా టీమ్లో ఉన్నారు. మెల్బోర్న్ టెస్టు తర్వాత అవకాశం దక్కని ఉమేశ్ యాదవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. అతనితో పాటు బ్రిస్బేన్ టెస్టులో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన శార్దుల్ ఠాకూర్కు కూడా చోటు లభించింది. వీరిద్దరు కూడా స్వదేశంలో ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడలేదు. అయితే గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ కుమార్ను మాత్రం సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఐపీఎల్కు ముందు అతను ఇంగ్లండ్తో టి20, వన్డేలు ఆడాడు. ఇంగ్లండ్లోని వాతావరణ పరిస్థితుల్లో భువీ తన స్వింగ్ బౌలింగ్తో మంచి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతనికి స్థానం ఖాయమనిపించింది. అయితే సెలక్టర్లు మరోలా ఆలోచించారు. పదే పదే ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న భువీపై సెలక్టర్లు నమ్మకం ఉంచలేకపోయారు. ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు ఆడిన నవదీప్ సైనీని కూడా ఎంపిక చేయలేదు. కుల్దీప్ యాదవ్పై వేటు... ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం ఫిట్గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లి పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్లో ఒక్క బంతి కూడా వేయలేదు. అయితే చివరకు అతనికీ టెస్టు అవకాశం దక్కలేదు. తాజా ఫిట్నెస్తో హార్దిక్ బౌలింగ్ చేయడం కష్టమని సెలక్టర్లు భావించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్పై కూడా వేటు పడింది. గత రెండేళ్లలో ఒకే ఒక టెస్టులో ఆడే అవకాశం లభించిన కుల్దీప్ (ఇంగ్లండ్తో రెండో టెస్టు) మొత్తం కలిపి 12.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఉండగా అవసరమైతే ఇంగ్లండ్తో సిరీస్లో తనను తాను నిరూపించుకున్న అక్షర్ పటేల్ (27 వికెట్లు) కూడా ఎంపికయ్యాడు. కాబట్టి కుల్దీప్కు తుది జట్టులో స్థానం కష్టం కాబట్టి పరిగణనలోకి తీసుకోలేదు. దేశవాళీలో పరిమిత ఓవర్ల టోర్నీలతో పాటు ఐపీఎల్లో కూడా చెలరేగినా... పృథ్వీ షాను టెస్టుల కోసం సెలక్టర్లు పరిశీలనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ఫిట్నెస్ నిరూపించుకుంటేనే... బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా 20 మంది సభ్యుల బృందంలోకి ఎంపికయ్యారు. అయితే వీరిద్దరు బయలుదేరేలోపు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రాహుల్కు ఇటీవలే అపెండిసైటిస్ ఆపరేషన్ జరగ్గా... సాహా కరోనా వైరస్ బారిన పడ్డాడు. సాహాకు ప్రస్తుతం కరోనా చికిత్స కొనసాగుతోంది. అతను ఇంకా కోలుకోలేదు. ఆ నలుగురు... ప్రసిధ్ కృష్ణ: ఐపీఎల్లో కోల్కతా జట్టు తరఫున ఆడినప్పుడు ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కర్ణాటక బౌలర్ ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో అరంగేట్రం చేశాడు. 3 వన్డేల్లో కలిపి 6 వికెట్లు తీసిన అతను 9 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 20.26 సగటుతో 34 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్: మధ్యప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల అవేశ్కు ఆరేళ్ల ఫస్ట్క్లాస్ కెరీర్ ఉంది. 26 మ్యాచ్లలో అతను 23.01 సగటుతో 100 వికెట్లు తీశాడు. ముఖ్యంగా గత రెండు సీజన్లలో అతని ఆట ఎంతో మెరుగుపడింది. తాజా ఐపీఎల్లోనూ అది కనిపించింది. అభిమన్యు ఈశ్వరన్: రంజీల్లో ప్రతీ సీజన్లో నిలకడగా రాణిస్తున్నా దురదృష్టవశాత్తూ ఈ బెంగాల్ ఓపెనర్కు ఇప్పటి వరకు టీమిండియా పిలుపు రాలేదు. 64 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో అతను 43.57 సగటుతో 4,401 పరుగులు సాధించాడు. ఇందులో 13 సెంచరీలు ఉన్నాయి. అర్జాన్ నాగ్వాస్వాలా: గుజరాత్కు చెందిన లెఫ్టార్మ్ పేస్ బౌలర్. 16 మ్యాచ్లలో 22.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. 2019–20 రంజీ సీజన్లో 41 వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ప్రస్తుతం భారత దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న ఏకైక ‘పార్సీ’ ఆటగాడు అతనే కావడం విశేషం. భారత జట్టు కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), రోహిత్, గిల్, మయాంక్, పుజారా, విహారి, పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్, సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, శార్దుల్, ఉమేశ్, రాహుల్, సాహా. స్టాండ్బై ఆటగాళ్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాలా -
మహిళల టి20 చాలెంజ్ వాయిదా!
ముంబై: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో జరగాల్సిన మహిళల టి20 చాలెంజ్ టోర్నీ ఈసారి నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్గత సమాచారం ప్రకారం ఈ టోర్నీని వాయిదా వేయనున్నారు. భారత్లో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లతో ఈ టోర్నమెంట్ను నిర్వహించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి భారత్కు ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఎవరూ ఈ టోర్నీకి వచ్చే అవకాశాలు లేవు. ఆస్ట్రేలియా ఇప్పటికే విమానాలు రద్దు చేయగా, ఇంగ్లండ్ కూడా తమ రెడ్లిస్ట్లో భారత్ను పెట్టింది. మహిళల చాలెంజ్ టోర్నీ వేదికగా నిర్ణయించిన న్యూఢిల్లీలో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మెరుగుపడితే తగిన అవకాశాన్ని బట్టి టోర్నీ జరగవచ్చని బోర్డు కీలక సభ్యుడొకరు వెల్లడించారు. 2019, 2020లలో మూడు జట్లు వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ పేరుతో నిర్వహించిన ఈ టోర్నీలో గత ఏడాది 12 మంది విదేశీ క్రికెటర్లు పాల్గొన్నారు. దుబాయ్ వేదికగా గత ఏడాది జరిగిన ఈ టోర్నీలో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు విజేతగా నిలిచింది. -
అహ్మదాబాద్లో ఫైనల్
న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ నెలల్లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొమ్మిది వేదికలను ఎంపిక చేసింది. ఇందులో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఎంపికైన వేదికల్లో హైదరాబాద్తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో నగరాలు ఉన్నాయి. భారత్ ఆతిథ్యమిచ్చిన 2016 టి20 ప్రపంచకప్కు వేదికలుగా ఉన్న మొహాలీ, నాగ్పూర్లు మాత్రం ఈసారి చోటు దక్కించుకోలేదు. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో ఫైనల్ జరగనుంది. తొలుత ఆరు వేదికల్లోనే టి20 ప్రపంచకప్ను నిర్వహించాలని బీసీసీఐ భావించినా... రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో మరో మూడు వేదికలను అదనంగా చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి అనుమతి లభించాల్సి ఉంది. ప్లాన్ ‘బి’ కూడా ఉంది... ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉంది. ఒకవేళ టి20 ప్రపంచకప్ నాటికి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనకపోతే... 9 వేదికల మధ్య టోర్నీలో పాల్గొనే 16 జట్లు ప్రయాణించడానికి అంత సౌకర్యంగా ఉండదు. దాంతో ఇటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి బీసీసీఐ ప్లాన్ ‘బి’ని సిద్ధం చేసింది. అక్టోబర్ నాటికి కరోనా తీవ్రత తగ్గకపోతే ప్రపంచకప్ను నాలుగు వేదికల్లోనే నిర్వహించేలా బీసీసీఐ రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రణాళికను త్వరలోనే ఐసీసీకి నివేదించనుంది. పాక్ వీసాలకు ఢోకా ఉండదు... టి20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు భారత్కు వచ్చే పాకిస్తాన్ క్రికెటర్లకు వీసాలను మంజూరు చేసేందుకు భారత ప్రభుత్వం సమ్మతించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. -
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జై షా
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షాను అంతర్జాతీయ క్రికెట్కు సంబంధించిన మరో పదవి వరించింది. ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా జై షా ఎంపికయ్యారు. నజ్ముల్ హసన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన 32 ఏళ్ల జై షా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడు కావడం విశేషం. తాజా బాధ్యతల పట్ల సంతోషం వ్యక్తం చేసిన జై షా... ఆసియాలో మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా జై షాకు బోర్డు సహచరులు అభినందనలు తెలియజేశారు. -
ఐపీఎల్ జట్లు... టి20 ప్రపంచకప్... ఒలింపిక్స్!
అహ్మదాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుదీర్ఘ విరామం తర్వాత పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఇందుకోసం గురువారం జరిగే వార్షిక (89వ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బోర్డు సభ్యులందరూ పాల్గొనబోతున్నారు. కరోనా పరిస్థితుల తర్వాత తొలిసారి బోర్డు పూర్తి స్థాయిలో ప్రత్యక్ష సమావేశం నిర్వహిస్తుండటం విశేషం. ఇందులో వేర్వేరు అంశాలు చర్చకు రానున్నాయి. బోర్డులో ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న పలు అంశాలపై కూడా ఏజీఎంలో అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. ఐపీఎల్లో అదనపు జట్లు 2022 ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు తోడు అదనంగా మరో 2 జట్లకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదనపై చర్చించనున్నారు. వచ్చే ఐపీఎల్తోనే ఇలా చేయాలని భావించినా... పలు కారణాలతో 10 జట్ల ఆలోచన సాధ్యం కాదనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమైంది. ఈ సమావేశంలో రెండు కొత్త జట్లు చేర్చే అంశానికి మాత్రమే ఆమోదం తెలిపి 2022 ఐపీఎల్ నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చు. పన్ను రాయితీలపై ఎలా? 2021లో భారత్లో టి20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ విషయంలో పూర్తిగా పన్ను రాయితీ కల్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోరుతోంది. అందుకు ఐసీసీ విధించిన గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. రాయితీ ఇవ్వలేకపోతే టోర్నీని యూఏఈకి తరలిస్తామని కూడా ఇప్పటికే ఐసీసీ చెప్పేసింది. గతంలో పలు మెగా ఈవెంట్లకు పన్నుల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇచ్చినా... కొత్త పన్ను చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి. మరోవైపు ప్రపంచ కప్ నిర్వహణ కోసం బోర్డు ఎనిమిది వేదికలను ప్రస్తుతానికి ఎంపిక చేసింది. అహ్మదాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతా, మొహాలి, ధర్మశాల ఈ జాబితాలో ఉన్నాయి. అయితే పలు రాష్ట్ర సంఘాలు తమ వద్దా అత్యుత్తమ సౌకర్యాలు ఉన్నాయని, తమకూ వరల్డ్కప్ మ్యాచ్ నిర్వహణ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒలింపిక్స్కు నో 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చేందుకు బోర్డు మద్దతునిచ్చే విషయంపై చర్చ జరగవచ్చు. అయితే ఎక్కువ మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఒలింపిక్స్లో పాల్గొంటే జాతీయ క్రీడా సమాఖ్యగా ప్రభుత్వం గుర్తింపు కిందకు వచ్చి బీసీసీఐ తమ పట్టు కో ల్పోయే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్... ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన సభ్యుల మధ్య బుధవారం మొతేరా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో బీసీసీఐ కార్యదర్శి జై షా సెక్రటరీ ఎలెవన్ 28 పరుగుల తేడాతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ప్రెసిడెంట్స్ ఎలెవన్పై గెలుపొందడం విశేషం. 12 ఓవర్లపాటు జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా జై షా జట్టు 3 వికెట్లకు 128 పరుగులు చేసింది. భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్ ఓపెనర్గా వచ్చి 22 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అనంతరం గంగూలీ జట్టు 100 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గంగూలీ 53 పరుగులతో అజేయంగా నిలిచాడు. కార్యదర్శి జై షా రెండు వికెట్లు తీశాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సహా పలు ప్రధాన సబ్ కమిటీలను ఏజీఎంలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా ఎంపికకు... ముగ్గురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు కూడా ఆమోద ముద్ర వేస్తారు. ఇందులో బ్రిజేశ్ పటేల్, ఖైరుల్ మజుందార్ మరో ఏడాది కొనసాగనుండగా... భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) తరఫున హైదరాబాద్కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కింది. సురీందర్ ఖన్నా స్థానంలో ఓజా పేరును ఐసీఏ ప్రతిపాదించింది. భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడిన ఓజా... ఏడేళ్ల క్రితం చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
దేశవాళీ సీజన్కు ముహూర్తం
న్యూఢిల్లీ : కరోనా కారణంగా చాలా ఆలస్యమైన దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై కదలిక వచ్చింది. కొత్త సంవత్సరం ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. బయో సెక్యూర్ హబ్లను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్ అలీ టోర్నీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ అనుబంధ సంఘాలకు జై షా మెయిల్ ద్వారా తెలిపారు. ‘టోర్నీలో పాల్గొనాలనుకునే రాష్ట్ర జట్లు జనవరి 2వ తేదీన సంబంధిత వేదికల వద్దకు రావాల్సి ఉంటుంది. 10 నుంచి పోటీలు జరుగుతాయి. 31న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ టోర్నీ గ్రూప్ దశ పోటీలు ముగిశాకే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ముస్తాక్ అలీతో పాటు మరో టోర్నీ నిర్వహణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంఘాలు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని జై షా సూచనప్రాయంగా తెలిపారు. -
ఐపీఎల్లో మరో రెండు జట్లు!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ దశావతారం ఎత్తనుంది. పది జట్లతో లీగ్ను విస్తరించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 24న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్) ఏర్పాటు చేసింది. మొత్తం 23 అంశాలపై చర్చించేందుకు బోర్డు సమావేశమవుతున్నప్పటికీ ఏజీఎమ్ ప్రధాన ఎజెండా మాత్రం లీగ్లో తలపడే జట్లను పెంచడమేనని బోర్డు వర్గాలు తెలిపాయి. నిజానికి పది జట్లతో ఐపీఎల్ నిర్వహణ బోర్డుకు కొత్తేం కాదు. తొమ్మిదేళ్ల క్రితమే పది జట్లు (పుణే సహారా వారియర్స్, కొచ్చి టస్క ర్స్) ఐపీఎల్లో తలపడ్డాయి. అయితే ఈ పది జట్ల ముచ్చట 2013లోనే ముగిసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత విస్తరణ తెర మీదికొచ్చింది. దీనికి ప్రధాన కారణం అదానీ గ్రూప్. గుజరాత్కు చెందిన ఈ కార్పొరేట్ సంస్థ అహ్మదాబాద్ వేదికగా ఫ్రాంచైజీ కోసం ఆసక్తి కనబరుస్తోంది. ఇదివరకే రెండేళ్లు రైజింగ్ పుణే సూపర్స్టార్స్ ఫ్రాంచైజీ ఉన్న సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్పీజీ సంస్థ కూడా తిరిగి వచ్చేందుకు తహతహలాడుతోంది. దీనికి లక్నో వేదిక కావచ్చు. -
అక్షరాలా రూ. 4,000 కోట్ల ఆదాయం!
ముంబై: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ఆగిపోయాయి. కనీసం చిన్న స్థాయి టోర్నీ కూడా నిర్వహించలేని పరిస్థితి. మన దేశంలోనైతే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020లో కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణ గురించి ఆలోచించింది. ► సాధారణంగా ప్రతీ ఏటా నిర్వహించే ఏప్రిల్–మే షెడ్యూల్ సమయం గడిచిపోయినా ఆశలు కోల్పోలేదు. కోవిడ్–19 కాలంలో ఎన్నో కష్టాలకోర్చి క్రికెట్ నిర్వహించడం అవసరమా అని ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ► అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ ఆలోచించి చివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విజయవంతంగా ఐపీఎల్ను నిర్వహించింది. బీసీసీఐ ఎందుకు ఇంతగా శ్రమించిందో తాజా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ► ఐపీఎల్–13 సీజన్ ద్వారా భారత బోర్డుకు ఏకంగా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. లీగ్ జరపకుండా ఉండే ఇంత భారీ మొత్తాన్ని బోర్డు కోల్పోయేదేమో! తాజా సీజన్ ఐపీఎల్ను టీవీలో వీక్షించినవారి సంఖ్య గత ఏడాదికంటే 25 శాతం ఎక్కువగా ఉండటం విశేషం. –మరోవైపు ఐపీఎల్ సాగిన కాలంలో బోర్డు మొత్తంగా 1800 మందికి 30 వేల (ఆర్టీ–పీసీఆర్) కరోనా పరీక్షలు నిర్వహించడం మరో విశేషం. ఖర్చులు తగ్గించుకొని... సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు ఎలాంటి అంతరాయం లేకుండా జరిగిన 60 మ్యాచ్ల ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ► ఐపీఎల్ తొలి మ్యాచ్కు దాదాపు రెండు నెలల ముందు ఎగ్జిబిషన్ టోర్నీ సమయంలో వరల్డ్ నంబర్వన్ టెన్నిస్ ప్లేయర్ జొకోవిచ్కు కరోనా రావడంతో మా లీగ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపించాయి. చాలా మంది మమ్మల్ని ముందుకు వెళ్లవద్దని వారించారు. ఎవరైనా క్రికెటర్కు కరోనా వస్తే ఎలా అని వారు అడిగారు. అయితే మేం వాటిని పట్టించుకోలేదు. ∙గత ఐపీఎల్తో పోలిస్తే బీసీసీఐ 35 శాతం నిర్వహణా ఖర్చులు తగ్గించుకుంది. నిర్వహణకు శ్రీలంక నుంచి కూడా ప్రతిపాదన వచ్చినా యూఏఐ వైపు మొగ్గు చూపాం. మూడు నగరాల మధ్యలో బస్సులో ప్రయాణించే అవకాశం ఉండటంతో అలా కూడా ఖర్చు తగ్గించాం. ► సుమారు 40 సార్లు కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా గంటలకొద్దీ చర్చలు సాగాయి. బయో సెక్యూర్ బబుల్ కోసం రెస్ట్రాటా అనే కంపెనీ సహకారం తీసుకున్నాం. బీసీసీఐ అధికారులు ముందుగా వెళ్లి ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. క్వారంటైన్ విషయంలో దుబాయ్ ప్రభుత్వం ఆటగాళ్లకు సడలింపులు ఇచ్చినా... యూఏఈ ప్రభుత్వం ససేమిరా అంది. చివరకు ఎంతో శ్రమించి వారిని కూడా ఒప్పించగలిగాం. ఇంత చేసినా ఆరంభంలోనే చెన్నై బృందంలో చాలా మందికి కరోనా వచ్చినట్లు తేలడంలో ఆందోళన కలిగింది. అయితే ఆ తర్వాత అంతా కోలుకున్నారు. మొత్తంగా యూఏఈ ప్రభుత్వ సహకారంతో లీగ్ సూపర్ హిట్ కావడం సంతోషకరం. చివరకు మాకు రూ. 4 వేల కోట్ల ఆదాయం కూడా వచ్చింది. -
టీమిండియా ప్రాక్టీస్ షురూ
సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సుదీర్ఘ సిరీస్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఐపీఎల్ ముగిశాక దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్గా రావడంతో ఆటగాళ్లు అవుట్డోర్ ప్రాక్టీస్ను ప్రారంభించారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్లో, జిమ్లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్ ద్వారా పంచుకుంది. సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్, పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వార్మప్ చేస్తూ జాలీగా కనిపించారు. టీమిండియా కొత్త ఆటగాళ్లు నటరాజన్, దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మూడు ఫార్మాట్లకు (టెస్టు, వన్డే, టి20) చెందిన భారత ఆటగాళ్లందరూ ఒకేసారి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆదివారం నెట్ ప్రాక్టీస్ సెషన్ కూడా జరిగింది. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడంచేతి వాటం పేసర్ నటరాజన్ తెల్లబంతులతో టాపార్డర్ బ్యాట్స్మెన్కు బౌలింగ్ చేశాడు. పుజారా, కోహ్లి క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్తో భారత్ 3 వన్డేలు, 3 టి20లు, 4 టెస్టులు ఆడనుంది. -
రోహిత్ ఫిట్నెస్ 70%
ముంబై: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఐదో టైటిల్ అందించిన కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పరంగా ఇంకా వెనుకబడే ఉన్నాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు. ఓ ఆంగ్ల మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ ‘రోహిత్ ఇంకా 70 శాతమే ఫిట్గా ఉన్నాడు. అందుకనే ఈ స్టార్ ఓపెనర్ని వన్డే, టి20 జట్లకు ఎంపిక చేయలేదు. టెస్టు సిరీస్కు ఇంకా సమయం ఉండటంతో ఆలోపు పూర్తి ఫిట్నెస్ సంతరించుకుంటాడనే సంప్రదాయ ఫార్మాట్కు ఎంపిక చేశాం. అయినా తన ఫిట్నెస్ గురించి అతడినే ఎందుకు అడగరు’ అని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ మధ్యలోనే ‘హిట్మ్యాన్’ గాయపడ్డాడు. గత నెల 18న పంజాబ్తో జరిగిన పోరులో రోహిత్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతను తర్వాతి నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. తర్వాత కీలకమైన ప్లే ఆఫ్ దశకు ముందు మ్యాచ్ నుంచే జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఫైనల్లో అర్ధసెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. అయితే ఈ సమయంలోనే గంగూలీ అతన్ని జాగ్రత్త పడమన్నాడు. ఈ ఐపీఎలే తన కెరీర్కు ఆఖరు కాదని, ఫిట్నెస్కు ప్రాధాన్యమివ్వాలని సూచించాడు. రోహిత్లాంటి స్టార్ బ్యాట్స్మన్ను తొలగించలేదని, వైస్ కెప్టెన్ (పరిమిత ఓవర్ల ఫార్మాట్)కు విశ్రాంతి ఇచ్చామని అప్పట్లో దాదా చెప్పాడు. బోర్డు చీఫ్ సూచనల్ని ఏమా త్రం లెక్కచేయని రోహిత్ ఫైనల్ సహా వరుసగా మూడు మ్యాచ్లు ఆడాడు. అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో తన ఫిట్నెస్ మెరుగుపర్చుకున్నాక టెస్టుల కోసం ఆసీస్కు బయల్దేరతాడు. రోహిత్ను పక్కనబెట్టిన సెలక్టర్లు గాయపడిన వృద్ధిమాన్ సాహా ను ఆస్ట్రేలియాకు పంపడంపై వస్తున్న విమర్శలపై గంగూలీ సమాధానమిచ్చాడు. ‘సాహా టెస్టు సిరీస్కల్లా కోలుకుంటాడనే అతన్ని అక్కడికి పంపాం. ఐపీఎల్ ఆద్యం తం బోర్డు ట్రెయినర్లు, భారత జట్టు ఫిజియో డాక్టర్ నితిన్ పటేల్ దుబాయ్లోనే ఉన్నారు. ఆటగాళ్ల గాయాలు, తీరుతెన్నుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారు. ఇవన్నీ జనాలకు తెలీదు. కాబట్టే ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తుంటారు. కానీ బోర్డు పనేంటో బోర్డు చక్కబెడుతుంది. గాయాలు ఆటగాళ్లకు తెలుసు, ఈ సమస్యల్ని ఎలా అధిగమించాలో ఫిజియోకు, ఎన్సీఏకు తెలుసు. సాధారణ ప్రజలకేం తెలుసు’ అని గంగూలీ విమర్శకుల్ని తూర్పారబట్టాడు. -
ప్రపంచకప్ నిర్వహణకు మేం సిద్ధం!
దుబాయ్: ఎలాంటి అవాంతరం లేకుండా వచ్చే ఏడాది భారత్లో ఐసీసీ టి20 ప్రపంచకప్–2021ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అన్ని దేశాల్లాగే భారత్ కూడా కోవిడ్ కోరల్లో ఉన్నప్పటికీ టోర్నీ సమయానికల్లా పరిస్థితుల్లో మార్పు ఉండవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఆతిథ్యమిచ్చే మెగా ఈవెంట్ వచ్చే అక్టోబర్–నవంబర్ నెలల్లో జరగనుంది. ఏడాది కాలానికి కౌంట్డౌన్ను మొదలు పెడుతూ దుబాయ్లో ఐసీసీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో బోర్డు చీఫ్ దాదాతో పాటు కార్యదర్శి జై షా, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ఐసీసీ ఈవెంట్ ఆతిథ్యం గొప్ప గౌరవమని అన్నారు. ‘నేను ఆటగాడిగా ఐసీసీ టోర్నమెంట్లను ఆస్వాదించాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రేక్షకులు ఎగబడి చూసే వినోదం, సందడి వాతావరణం నాకు తెలుసు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని అలాంటి సందడి తీసుకొస్తాం’ అని అన్నారు. ప్రేక్షకులు రావాలి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని మాట్లాడుతూ మెగా ఈవెంట్ ప్రేక్షకుల సమక్షంలో జరగాలని ఆశించారు. ‘ఇటీవల కొన్ని క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టోర్నీలు, ఐపీఎల్ విజయవంతమైన అనుభవాలతో మెగా ఈవెంట్ కూడా జరుగుతుంది. 2016 తర్వాత భారత్లో జరిగే ఐసీసీ టోర్నీ కావడంతో ఈ ఈవెంట్పై ఎంతో ఆసక్తి నెలకొంది. అలాగే టోర్నీ సజావుగా జరిగేందుకు మేం కూడా భారత బోర్డుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, సమాలోచనలు చేస్తూనే ఉన్నాం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో టోర్నీని ఆరోగ్య, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటాం’ అని సాహ్ని అన్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన పొట్టి మెగా ఈవెంట్ కరోనా వల్లే వాయిదా పడింది. దీంతో 2021 ఆసీస్లో, తదుపరి ఏడాది భారత్లో నిర్వహించే పరస్పర మార్పు కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ... పట్టుదలతో 2021 ఈవెంట్ను భారత్లోనే నిర్వహించేందుకు కార్యచరణతో ఉంది. ముందుగా భారత్లో జరగబోయే ముఖాముఖీ సిరీస్లపై దృష్టి సారించి అనంతరం బహుళ జట్లు పాల్గొనే ఈవెంట్లకు బాట వేయాలని బీసీసీఐ యోచిస్తోంది. మరో వైపు వరల్డ్ కప్ సమయానికి కూడా పరిస్థితులు మెరుగుపడకుండా కరోనా ప్రభావం కొనసాగితే టోర్నీ కోసం యూఏఈ, శ్రీలంకలను ప్రత్యామ్నాయం వేదికలుగా ఐసీసీ ఎంపిక చేసింది. -
సెలక్టర్లు కావలెను..అర్హతలివే..!
న్యూఢిల్లీ: సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈ నెల 15 ఆఖరి తేదీ అని అందులో పేర్కొంది. కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్జోన్), శరణ్దీప్ సింగ్ (నార్త్జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్జోన్)ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా... ఆసీస్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీల్ జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్లను నియమించింది. (చదవండి: తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి) అర్హతలివే... అంతర్జాతీయ అనుభవం లేకపోయినా... కనీసం 30 దేశవాళీ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయస్సు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవమైనా ఉండాలి. అయితే ఈసారి అంతర్జాతీయ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అని ఎక్కడా పేర్కొనలేదు. 30 దేశవాళీ మ్యాచ్లాడినా పరిగణమిస్తామని తెలిపింది. సెలక్షన్ కమిటీ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న మాజీ సీమర్ అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్ల ఎంపికను కూడా పరిశీలిస్తారు. దరఖాస్తుల స్క్రూటినీ అయిన వెంటనే మదన్లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలక్షన్ కమిటీ భారత్తో పాటు భారత్ ‘ఎ’, దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీ, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది. (చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) -
టెస్టు జట్టులో సిరాజ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు. బయో బబుల్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరాజ్ శ్రమకు ఫలితం... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు. వన్డే, టి20 జట్ల నుంచి పంత్ అవుట్... ఏడాది తర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్లో 11 మ్యాచ్లు ఆడిన 29 ఏళ్ల వరుణ్ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్ సొంతం. ఈ ఐపీఎల్లో వరుణ్ స్పిన్కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు. భారత జట్ల వివరాలు టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, విహారి, శుబ్మన్ గిల్, సాహా (వికెట్ కీపర్), పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్. వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, శుబ్మన్ గిల్, అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకూర్. టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్ పాండ్యా, సామ్సన్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి. అదనపు పేస్ బౌలర్లు: కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్. -
బీసీసీఐకి తలనొప్పిగా ఆసీస్ పర్యటన
ముంబై: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచనలో పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం భారత్ నవంబర్లో ఆసీస్కు పయనం కావాల్సి ఉంటుంది. ఆటగాళ్ల ఆసీస్ ప్రయాణానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ స్వల్ప సమయంలో చార్టెర్డ్ విమానాల ఏర్పాటు, క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వసతి, జట్ల ఎంపిక, ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహణ, పర్యటనకు తీసుకెళ్లాల్సిన ఆటగాళ్ల సంఖ్య ఇలా ప్రతీ విషయంలోనూ బీసీసీఐ ముందు అనేక సవాళ్లు నిలిచాయి. మరోవైపు ఆస్ట్రేలియాలోని క్వారంటైన్ నిబంధనలు ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా తలపట్టుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉంటే... మరో చోట ఈ నిబంధన ఏడు రోజులుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం 4 టెస్టులకు వేర్వేరు వేదికలు ఉండటంతో పాటు... వన్డే, టి20 ఫార్మాట్లు కూడా ఆడాల్సి రావడంతో ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ విధించాలనే అంశంపై సీఏ ఇంకా అస్పష్టతతోనే ఉంది. దీంతో కేవలం ఒక ఫార్మాట్తోనే సిరీస్ను ముగించాలా? లేక రెండే వేదికల్లో మ్యాచ్లన్నీ ముగించాలా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టతనిచ్చే వరకు బీసీసీఐ వేచి చూడాల్సిందే. -
తెర పడినట్లేనా!
ప్రపంచంలో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై నిర్ణయం ప్రకటించే విషయంలో సాగతీత వైఖరిని అవలంబించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు వాస్తవంలోకి వచ్చింది. దేశంలో లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది ‘వేసవి వినోదానికి’ చెల్లుచీటీ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించిన బోర్డు... ఈ ఏడాది ముగిసేలోగా టోర్నీని నిర్వహించే విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. రాబోయే రోజుల్లో అంతా చక్కబడినా కూడా... బిజీ షెడ్యూల్లో లీగ్కు చోటు కల్పించడం కష్టంగా మారుతుండటమే కారణం. ముంబై: కోవిడ్–19 నేపథ్యంలో ఒలింపిక్స్ నుంచి టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక ఈవెంట్స్ రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగాయి. కానీ బీసీసీఐ మాత్రం ఐపీఎల్ విషయంలో చాలా వరకు ఆశతోనే ఉంది. షెడ్యూల్ ప్రకారం టోర్నీ మార్చి 29 నుంచి జరగాల్సి ఉంది. అయితే లాక్డౌన్ ప్రకటించకముందే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆగిపోవడంతో ఏప్రిల్ 15 తర్వాత అంతా కుదురుకోవచ్చని, ఆ తర్వాత లీగ్ నిర్వహించుకోవచ్చని ఆశించింది. అయితే ఆపై దేశం మొత్తం స్తంభించిపోయింది. టోర్నీని నెల రోజులకు కుదించి జూన్ మొదటి వారంలో ఫైనల్ జరిగేలా చూడవచ్చని కూడా కొందరు పెద్దలు వ్యాఖ్యానించారు. ఒకదశలో ప్రేక్షకులు లేకుండా ఒకటి, రెండు నగరాలకే పరిమితం చేసి టీవీ రేటింగ్స్ కోసమైనా ఆడించవచ్చని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇప్పుడు కథంతా మారిపోయింది. మే 3 వరకు లాక్డౌన్ పొడిగించగా... ఆ తర్వాత వెంటనే ఏం జరుగుతుందో తెలీని అనిశ్చిత స్థితిలో ఐపీఎల్ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించాల్సి వచ్చింది. బుధవారం ఉదయం అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలకు ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంగ్ అమీన్ సమాచారం అందించారు. ఇతర బోర్డులు అంగీకరిస్తాయా? ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్కు ముందు ఐపీఎల్ను సరైన సన్నాహకంగా చాలామంది భావించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇక ఈ సంవత్సరం లీగ్ నిర్వహించడం చాలా కష్టంగానే అనిపిస్తోంది. ఐపీఎల్ వాయిదా గురించి వెల్లడిస్తూ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘పరిస్థితి మెరుగైతే సెప్టెంబర్–అక్టోబర్ మధ్య లీగ్ నిర్వహించేందుకు ఆలోచిస్తున్నాం’ అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్య కూడా కాస్త అతిశయంగానే కనిపిస్తోంది. నిజానికి బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకే లీగ్ జరుగుతుందన్న ఆశ లేదు. ప్రపంచ క్రికెట్కు సంబంధించి అన్ని జట్ల భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ఎప్పుడో ఖరారైపోయింది కాబట్టి వాటిని మార్చడం కష్టమంటూ అతను ఇటీవల చేసిన వ్యాఖ్యనే వాస్తవానికి దగ్గరగా ఉంది. షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు శ్రీలంక, జింబాబ్వేలతో సిరీస్లు, ఆసియా కప్లతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. తొలి రెండింటిని ఎలాగోలా సర్దుబాటు చేయగలిగినా... ఆసియా కప్ విషయంలో వెనక్కి తగ్గమని ఆతిథ్య పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ఈ టోర్నీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసియాలోని చిన్న జట్లకు పంచాల్సి ఉంటుంది కాబట్టి అంతా బాగుంటే షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్లోనే టోర్నీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక టెస్టు క్రికెట్కు అమిత ప్రాధాన్యతనిచ్చే ఇంగ్లండ్ బోర్డు కూడా ఇప్పటికే భారత్కు సిరీస్కు సంబంధించి వాణిజ్యపరమైన ఒప్పందాలు పూర్తి చేసుకొని ఉంటుంది కాబట్టి అదీ అంగీకరించకపోవచ్చు. లీగ్ కోసం ప్రపంచకప్ను వాయిదా వేయించడం భారత్ చేతుల్లో లేని పని. కాబట్టి ఎలా చూసినా ఐపీఎల్ కథ ఈ ఏడాదికి ముగిసినట్లే అనిపిస్తోంది. బుధవారం ఒక బోర్డు ఉన్నతాధికారి చెప్పినదాని ప్రకారం... ఇప్పుడు లీగ్ గురించి అసలు మాట్లాడటమే అనవసరం. ప్రపంచంలో పరిస్థితి అంతా మెరుగుపడ్డాకే అసలు ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన వెల్లడించారు. ‘స్టార్’ ఏం చేస్తుందో... ఒకవేళ ఐపీఎల్ జరగకపోతే ఆటగాళ్లతో సహా అనేక మంది నష్టపోతారు. వేలంలో రూ. 15 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయిన ప్యాట్ కమిన్స్ వేదన చెప్పలేనిది. లీగ్ నిబంధనల ప్రకారం టోర్నమెంట్ ప్రారంభమయితే తప్ప ఆటగాళ్లకు ఫ్రాంచైజీ డబ్బులు చెల్లించదు. మూడు వాయిదాల్లో వారు సొమ్ము చెల్లిస్తారు. కాబట్టి టోర్నీ జరగకపోతే ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇక సత్తా చాటాలనుకున్న కుర్రాళ్ల సంగతి సరేసరి. ఫ్రాంచైజీలకు కూడా నష్టం తప్పదు. 2017లో స్టార్ స్పోర్ట్స్ భారీ మొత్తానికి ప్రసార హక్కులు కొనుగోలు చేసిన తర్వాత బోర్డు ఒక్కో ఫ్రాంచైజీకి కనీసం రూ.150 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఆ డబ్బులు రానట్లే. అయితే ఓవరాల్గా లీగ్ ద్వారా రూ. 3,800 కోట్ల నష్టం జరుగుతుందని భావిస్తుండగా ఇందులో సింహభాగం ‘స్టార్’దే. బోర్డుతో ఒప్పందంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో బయటకు తెలీదు కానీ లీగ్ అసలు జరగకపోతే ముందే అంగీకరించిన ఒప్పందం ప్రకారం ‘స్టార్’ ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వకపోవచ్చు. నాకు తెలిసి ప్రతీ క్రికెట్ బోర్డు దృష్టిలో ఐపీఎల్ ఒక పెద్ద టోర్నమెంట్. దీనిని అందరూ గుర్తించారు. సరిగ్గా ప్రపంచకప్కు ముందు ఇలాంటి టోర్నీ ఉంటే మంచి ఊపు వస్తుంది. అయితే అంతా బాగుండి, ఎవరూ ప్రమాదంలో పడే అవకాశం లేదనుకుంటే లీగ్ను నిర్వహించుకోవచ్చు. –వీవీఎస్ లక్ష్మణ్, భారత మాజీ క్రికెటర్ -
ఐపీఎల్పై ఇప్పుడే ఏమీ చెప్పలేం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తామా లేదా అన్న విషయంపై తమకే స్పష్టత లేనందున... ఈ సీజన్ టోర్నీ భవితవ్యంపై ఏమీ చెప్పలేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ తెలిపారు. ‘లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అందువల్ల ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఐపీఎల్పై చర్చిస్తాం. ఒకవేళ ఇప్పుడు వాయిదా వేసి అక్టోబర్–నవంబర్లలో లీగ్ను నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు కూడా మా వద్ద సమాధానం లేదు. చర్చించడానికి ఏమీ లేనందున సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య ఎలాంటి కాన్ఫరెన్స్ కాల్ జరగలేదు’ అని అరుణ్ ధుమాల్ వివరించారు. -
వచ్చే ఏడాదైనా.. మహిళల ఐపీఎల్ మొదలు పెట్టండి!
న్యూఢిల్లీ: మహిళల ఐపీఎల్ గురించి పదే పదే చర్చ జరుగుతున్నా...దానిని పూర్తి స్థాయిలో నిర్వహించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. ఐపీఎల్ 2020 సందర్భంగా నాలుగు జట్లతో మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించాలని మాత్రం నిర్ణయించింది. అయితే పూర్తి స్థాయి ఐపీఎల్ గురించి బోర్డు ఇంకా ఎంత కాలం ఎదురు చూస్తుందని భారత వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశ్నించింది. వచ్చే ఏడాదినుంచైనా దీనిని మొదలు పెడితే బాగుంటుందని ఆమె సూచించింది. ‘కనీసం 2021లోనైనా మహిళల ఐపీఎల్ నిర్వహించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మరీ భారీ స్థాయిలో కాకపోయినా పురుషుల లీగ్తో పోలిస్తే స్వల్ప మార్పులతోనైనా ఇది మొదలు కావాలి. ఉదాహరణకు నలుగురు విదేశీ ఆటగాళ్లకు బదులుగా ఐదు లేదా ఆరుగురు ఆడవచ్చనే నిబంధన పెట్టవచ్చు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ...‘కనీసం ఏడు జట్ల మహిళల ఐపీఎల్ నిర్వహించాలంటే వాస్తవికంగా ఆలోచించాలి. మన దగ్గర అంత మంది నాణ్యమైన క్రికెటర్లు అందుబాటులో లేరు. అందుకు కనీసం నాలుగేళ్లు పడుతుంది’ అని వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్లో భారత జట్టు రన్నరప్గా నిలిచిన నేపథ్యంలో మహిళల ఐపీఎల్పై డిమాండ్ పెరిగింది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కూడా దీనికి మద్దతునిచ్చారు. మహిళల ఐపీఎల్ వస్తే అప్పుడు ఆటగాళ్ల సంఖ్య ఎలాగూ పెరుగుతుందని, ఇప్పుడు ఉన్న ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు మహిళల టీమ్లను నిర్వహించగలవని మిథాలీ చెప్పింది. ‘దేశవాళీలో ఎక్కువ మంది ప్రతిభావంతులైన అమ్మాయిలు లేరనే విషయాన్ని నేనూ అంగీకరిస్తా. అయితే ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను తీసుకుంటే పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బోర్డు ఎప్పటికీ వేచి చూస్తామంటే ఎలా. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. ఒక్కో ఏడాది మెల్లగా స్థాయి పెంచుకుంటూ పోవచ్చు. అప్పుడు నలుగురు విదేశీ ఆటగాళ్లకే పరిమితం చేయవచ్చు’ అని మిథాలీ అభిప్రాయ పడింది. -
భారత క్రికెట్లో మళ్లీ ‘దాదా’గిరి!
దాదాపు 20 ఏళ్ల క్రితం... భారత క్రికెట్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం బీసీసీఐ పరువు తీసింది. కెప్టెన్సీ నా వల్ల కాదంటూ సచిన్ స్వచ్ఛందంగా తప్పుకుంటూ కీలక సమయంలో కాడి పడేశాడు. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దగలడంటూ గంగూలీని నమ్మి బోర్డు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్గా తన తొలి వన్డే సిరీస్ను గెలిపించడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన సౌరవ్... తదనంతర కాలంలో భారత క్రికెట్ రాత మార్చిన అత్యుత్తమ కెప్టెన్గా నిలిచాడు. ఇప్పుడు కూడా... భారత క్రికెట్ పరిపాలన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు... ఎన్నికైన ఆఫీస్ బేరర్లతో కాకుండా 33 నెలలుగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేతృత్వంలోనే పాలన నడుస్తోంది. అవగాహనలేమి, అనుభవలేమివంటి సమస్యలతో సీఓఏ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు క్రికెట్ను దెబ్బ తీశాయి. అర్థంపర్థం లేని నిబంధనలు సరైన నిర్ణయాధికార వ్యవస్థ లేకుండా గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సమయంలో గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా వస్తున్నాడు. అభిమానులు ఆత్మీయంగా ‘దాదా’ అని పిలుచుకునే బెంగాలీ బాబు ఇక్కడా తన ముద్ర చూపించగలడా! వేచి చూడాలి. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని బాగు చేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు కాబోయే కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. అందు కోసమే ఇక్కడ అడుగు పెట్టినట్లు అతను చెప్పాడు. సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై తన ఆలోచనలు, ప్రణాళికల గురించి సౌరవ్ వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే... పూర్వ వైభవం తెస్తా... దేశం తరఫున ఆడి కెప్టెన్గా కూడా వ్యవహరించిన నాకు ఈ పెద్ద పదవి దక్కడం కూడా గొప్పగా అనిపిస్తోంది. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇప్పటికే బోర్డు పేరు ప్రఖ్యాతులు బాగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో నేను బాధ్యతలు చేపడుతున్నాను. కాబట్టి దీనిని చక్కబెట్టేందుకు నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా. వచ్చే కొన్ని నెలల్లో అన్నీ సరిదిద్ది సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. అపెక్స్ కౌన్సిల్లోని నా సహచరులందరితో కలిసి పని చేసి బీసీసీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం. వారి మ్యాచ్ ఫీజు పెంచాలి... ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరం కలిసి చర్చిస్తాం. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల బాగోగులు చూడటం గురించే. అప్పట్లో దీని గురించి నేను సీఓఏకు కూడా సూచనలు చేసినా వారు పట్టించుకోలేదు. మన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంపై ముందుగా దృష్టి పెడతా. వారికి లభిస్తున్న మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇదో సవాల్.... ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా లేక ఏకగ్రీవంగా ఎంపికైనా బాధ్యతలో మాత్రం తేడా ఉండదు. అందులోనూ ప్రపంచ క్రికెట్లో పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ కాబట్టి నాకు ఇది సవాల్లాంటిది ఊహించలేదు... నేను బోర్డు అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. మీరు అడిగినప్పుడు నేను కూడా బ్రిజేష్ పటేల్ పేరే చెప్పాను కానీ నేను పైకి వెళ్లేసరికి అంతా మారిపోయింది. నేను బోర్డు ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా కూడా అవకాశం దక్కుతుందని అనుకోలేదు. 10 నెలలకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనుండటం పట్ల ఎలాంటి బాధ లేదు. అది నిబంధన కాబట్టి పాటించాల్సిందే. నాకు తండ్రిలాంటి జగ్మోహన్ దాల్మియా నిర్వహించిన బాధ్యతలను నేను కూడా చేపట్టగలనని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో శ్రీనివాసన్లాంటి అనేక మంది వ్యక్తులు సమర్థంగా బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాలు మాట్లాడలేదు... కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాతో ఏ రాజకీయ నాయకుడు కూడా సంప్రదింపులు జరపలేదు. నాకు అభినందన సందేశం పంపిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు. సమర్థుడు కావాలని.... భారత జట్టు కెప్టెన్గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్ అయినప్పుడు కూడా ఫిక్సింగ్లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం. ఐసీసీకి 75–80 శాతం ఆదాయం భారత క్రికెట్ నుంచే వస్తున్నా... గత మూడు నాలుగేళ్లుగా మనకు న్యాయంగా వారి నుంచి ఆశించిన రీతిలో నిధులు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటాం. అదో పెద్ద సమస్య.... పరస్పర ప్రయోజనం (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్) అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా అయితే క్రికెట్ వ్యవస్థలో అత్యుత్తమ వ్యక్తులను తీసుకొచ్చి పని చేయించుకోవడం కష్టమైపోతుంది. వారు వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే నిబంధన పాటిస్తే మాజీ ఆటగాళ్లెవరూ ముందుకు రారు. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోతే మనసు పెట్టి ఎలా పని చేస్తారు. -
శ్రీశాంత్పై నిషేధం కుదింపు
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్ శంతకుమరన్ శ్రీశాంత్కు ఊరట. ఈ కేరళ క్రికెటర్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గతంలో విధించిన జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ ఆదేశాలిచ్చారు. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బోర్డు క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే, ఈ ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టు దానిని పక్కన పెట్టింది. ఈ కేసు గత ఏప్రిల్లో సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వెళ్లింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్లతో కూడిన బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది. తాజాగా ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. వచ్చే ఏడాది ఆగస్టుతో ఆ వ్యవధి ముగియనుంది. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో తన రెండో ఓవర్లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు. శ్రీశాంత్ భారత్కు 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్లు గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. -
సీఓఏదే నియంత్రణాధికారం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తమదే నిర్ణయాధికారమని నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) మరోసారి స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఐసీసీ సమావేశాల్లో పాల్గొనే బీసీసీఐ ప్రతినిధిని ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. ఈ నెల 9న ప్రత్యేక బోర్డు సమావేశం నేపథ్యంలో రాష్ట్ర సంఘాలకు ఈ మేరకు సమాచారమిచ్చింది. శ్రీనివాసన్ను బోర్డు ప్రతినిధిగా పంపాలనే ప్రతిపాదన నేపథ్యంలో ఈ వాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆటగాళ్ల ఖర్చులకు డబ్బులివ్వని బోర్డు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోనే ధనవంతమైన క్రికెట్ బోర్డు... కానీ ప్రస్తుతం ఆటగాళ్ల రోజు ఖర్చులకు కూడా డబ్బులివ్వలేకపోతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీంకోర్టు తప్పించడంతో చెక్లపై సంతకాలు చేసేవారు లేకపోవడం... నోట్ల రద్దు వల్ల పెద్ద మొత్తాన్ని విత్డ్రా చేయలేకపోవడం. దీంతో కుర్రాళ్లు తమ సొంత ఖర్చులతో మ్యాచ్లాడారు. ఈ జూనియర్ జట్టుకు కోచ్ అయిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సహా సహాయక సిబ్బంది అంతా వారివారి ఖర్చులతో సిరీస్ను నెట్టుకొచ్చారు. చివరకు నెగ్గుకొచ్చారు. నగదు, చెక్ చెల్లింపుల సమస్య నిజమేనని బీసీసీఐ అధికారులు అంగీకరించారు. అయితే సిరీస్ ముగిసిన తర్వాత ఒకేసారి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
కొత్త పాలకవర్గం తొలి సమావేశం
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఎంపికైన కొత్త పాలకవర్గం కమిటీ సభ్యులు రెండో రోజే కార్యరంగంలోకి దిగారు. మంగళవారం తొలిసారిగా వినోద్ రాయ్ నేతృత్వంలో ప్యానెల్కు చెందిన ముగ్గురు సభ్యులు సమావేశమయ్యారు. అయితే బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కాకుండా ఐడీఎఫ్సీ బ్యాంకు ఆఫీస్లో జరిగిన ఈ భేటీకి చరిత్రకారుడు రామచంద్ర గుహ హాజరుకాలేదు. ‘ఈ సమావేశంలో విశేషమేమీ లేదు. మా పరిచయ కార్యక్రమంతో పాటు బీసీసీఐ నిర్వహణ గురించి మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం’ అని మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ తెలిపారు. -
‘నలుగురి’తో నడిపిస్తారు
బీసీసీఐకి కొత్త పాలకవర్గం మాజీ ‘కాగ్’ వినోద్ రాయ్ నేతృత్వం నలుగురు సభ్యుల కమిటీలో ఏకైక క్రికెటర్గా డయానా ఎడుల్జీ సుప్రీం కోర్టు నిర్ణయం న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని సోమవారం సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మిగతా ముగ్గురిలో క్రికెట్ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్సీ) మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయే, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ ఉన్నారు. వీరిలో డయానాకు తప్ప క్రికెట్ ఆటతో ఎవరికీ సంబంధం లేకపోవడం గమనార్హం. ప్రస్తుత బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి బోర్డుకు చెందిన రోజువారీ కార్యకలాపాల ఇన్చార్జిగా ఉంటారని జడ్జిలు దీపక్ మిశ్రా, ఏఎమ్ ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్లతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ‘మార్పును చక్కగా కొనసాగించేందుకు బీసీసీఐలో నా పాత్ర నైట్ వాచ్మన్గా ఉంటుందని భావిస్తున్నాను. బోర్డు గురించి నాకు అవగాహన లేకపోయినా క్రికెట్ అంటే నాకు ఎంతో ఇష్టం’ అని వినోద్ రాయ్ అన్నారు. వేతనం ఇవ్వాల్సిందే... మరోవైపు కమిటీ సభ్యులుగా ఎంపికైనవారికి ఎటువంటి వేతనం ఇవ్వలేమని బీసీసీఐ తెలిపింది. తమ ఆఫీస్ బేరర్లు, పరిపాలకులు ఉచితంగానే పనిచేస్తారని గుర్తుచేసింది. అయితే వీరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. కచ్చితంగా వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంటుందని, ఎంత ఇవ్వాలనే ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలో కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శిని కూడా చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. లోధా ప్యానెల్ సూచనల అమల్లో నిర్లక్ష్యం వహించినందుకు బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డు పాలన సజావుగా నడిచేందుకు కొందరి పేర్లను సూచించాల్సిందిగా కోర్టు కోరింది. ఈనెల 24న అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్, అనిల్ దివాన్ సూచించిన తొమ్మిది మంది సభ్యుల జాబితా కోర్టుకు అందించగా వీటిని తిరస్కరించింది. మరోసారి పేర్లను సూచించాల్సిందిగా ఆదేశించి ఈనెల 30కి విచారణను వాయిదా వేసింది. ఐసీసీ సమావేశానికి అమితాబ్, విక్రమ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బోర్డు తరఫున ప్రాతినిధ్యం వహించే వారి పేర్లను కూడా కోర్టు ప్రకటించింది. ఫిబ్రవరి 2న దుబాయ్లో జరిగే ఈ మీటింగ్కు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి, విక్రమ్ లిమాయే హాజరవనున్నారు. -
కొత్త పాలకుల పేర్లు సూచించండి
కేంద్రం, బీసీసీఐకి సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యకలాపాల నిర్వహణ కోసం కొత్త పరిపాలకుల పేర్లను సూచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈనెల 27న సీల్డ్ కవర్లో వీటిని తమకు అందించాలని కోరింది. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. బోర్డు ఎన్నికలు జరిగి నూతన పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ఈ తాత్కాలిక కమిటీ రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుందని కోర్టు పేర్కొంది. అలాగే వచ్చేనెల మొదటి వారంలో జరిగే ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు ముగ్గురు ప్రతినిధుల పేర్లను సూచించాల్సిందిగా జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ బీసీసీఐని కోరింది. అంతకుముందు అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం తొమ్మిది మందితో కూడిన పరిపాలకుల జాబితాను సీల్డ్ కవర్లో అందించారు. అయితే 70 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు కమిటీలో చోటు కల్పించకూడదని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తాము కూడా వ్యక్తుల పేర్లను సూచిస్తామని బీసీసీఐ కోరడంతో కోర్టు అంగీకరించింది. అంతేకాకుండా కేంద్రానికి కూడా ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఏం చేస్తున్నారు? జూలై 18న కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రపంచ క్రికెట్లో అత్యంత శక్తివంతంగా ఉన్న బీసీసీఐ ప్రతిష్ట దెబ్బతిందని రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అందుకే ఈ తీర్పును నిలుపుదల చేయాలని రోహత్గీ కోరడంపై సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. తాము జూలైలో తీర్పు ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారంటూ రోహత్గీని ప్రశ్నించింది. లోధా ప్యానెల్ సంస్కరణలతో ఈ మూడు సంఘాలు తమ ఓటు హక్కును కోల్పోయాయి. -
ఆగ్రహమా?... ‘అనురాగ’మా!
నేడు తేలనున్న అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ భవిష్యత్ లోధా ప్యానెల్ సంస్కరణల అమలుపై తుది తీర్పు న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), లోధా ప్యానెల్ మధ్య జరుగుతున్న కేసు విచారణలో నేడు (సోమవారం) సుప్రీం కోర్టు తుది తీర్పునివ్వనుంది. అలాగే కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బోర్డు చీఫ్ అనురాగ్ ఠాకూర్ విషయంలోనూ కోర్టు ఏం చెబుతుందనేది వేచిచూడాల్సిందే. బీసీసీఐలో ‘కాగ్’ నియామకంపై అయిష్టంగా ఉన్న ఠాకూర్.. దీన్ని ప్రభుత్వ జోక్యంగా భావిస్తూ లేఖ రాయాలని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్కు గతంలో లేఖ రాశారు. అయితే కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో ఠాకూర్ ఈ విషయాన్ని పేర్కొనలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసత్య ప్రమాణం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే కేసు విచారణకు ఆదేశిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని ఘాటుగా బదులిచ్చింది. అంతేకాకుండా వారం రోజుల్లో మరో అఫిడవిట్ను దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ప్రస్తుతమున్న పాలక వర్గం లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయడం లేదు కాబట్టి వీరి స్థానంలో సమర్థులైన ముగ్గురి పేర్లను సూచించాల్సిందిగా బీసీసీఐని కోరింది. మరోవైపు లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈ విషయంలో రాష్ట్ర క్రికెట్ సంఘాలను ఒత్తిడి చేయలేమని బీసీసీఐ తమ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది. అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ మంగళవారమే పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తుది తీర్పు ఇస్తారా? మరోసారి వాయిదాకు మొగ్గు చూపుతారా? అనేది తేలాల్సి ఉంది. -
మార్పులు అనివార్యం!
సుప్రీం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నాం ప్రపంచ క్రికెట్ అభివృద్ధిలో బీసీసీఐది ప్రధాన పాత్ర ఐసీసీ టెస్టు జట్టులో కోహ్లిని ఎలా విస్మరిస్తారు? బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు ఆటగాళ్లకు ఏమాత్రం మంచిది కాదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. వచ్చే నెల 2 లేదా 3 తర్వాత బోర్డులో చాలా మార్పులు జరగవచ్చని ఆయన సూత్రపాయంగా వెల్లడించారు. లోధా ప్యానెల్ సూచించిన ప్రతిపాదనల అమలు విషయంలో సుప్రీం కోర్టు జనవరి మొదటి వారంలో తుది తీర్పునివ్వనుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మీడియాతో పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ⇒ ప్రస్తుతం భారత క్రికెట్లో నెలకొన్న పరిస్థితి ఆటకే కాకుండా ఆటగాళ్లకు కూడా ఏమంత మంచిది కాదని మాకు తెలుసు. మేం ఇప్పుడు సమస్యల్లో ఉన్నాం. జనవరి 3 వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత చాలా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. వాటిని దీటుగా ఎదుర్కోవాల్సిందే. అయితే అన్నింటికీ సానుకూల పరిష్కారం లభిస్తుందనుకుంటున్నాను. ⇒ ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా స్వీకరించకుండా బీసీసీఐ సొంతంగా సౌకర్యాలను సమకూర్చుకుంది. అయినా కొంత మంది మాజీ ఆటగాళ్లు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా దగ్గర భారీగా నిధులున్నా కూడా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు కోర్టు అనుమతి కావాలి. ⇒ బోర్డు సభ్యులకు గరిష్ట వయస్సు, ఒక రాష్ట్రం ఒక ఓటు, పదవులను అధిష్టించేందుకు కూలింగ్ పీరియడ్ వంటి లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయడం అంత సులువుకాదు. ⇒ భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ ఏడాది ఐసీసీ తమ ఉత్తమ టెస్టు జట్టులో చోటివ్వాల్సింది. ప్రస్తుతం అతడి ఫామ్ను లెక్కలోకి తీసుకుంటే కచ్చితంగా అతను ఆ జట్టులో ఉండాలి. భారత జట్టు టెస్టుల్లో నంబర్వన్గా ఉన్నప్పుడు ఆ కెప్టెన్ను ఎందుకు ఎంపికచేయరు? ఐసీసీ ఓసారి ఈ విషయంలో దృష్టి సారిం చాలి. అయితే అశ్విన్ ప్రతిభను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది ⇒ ఐసీసీ వర్కింగ్ గ్రూపులో బీసీసీఐని చేర్చకపోవడాన్ని తప్పుబడుతున్నాను. ఆ సమావేశంలో నేనూ పాల్గొన్నాను. బీసీసీఐ ఉంటేనే విశ్వవ్యాప్తంగా క్రికెట్ను పటిష్ట పరిచే అవకాశముంటుందని ఆ సమావేశంలో ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఒకవేళ ఎవరైనా బీసీసీఐ లేకున్నా తాము ముందుకెళతామని భావిస్తే... ప్రపంచ క్రికెట్కు భారత్ అవసరమన్న సంగతి గుర్తుంచుకోవాలి. -
బీసీసీఐ ‘పెద్ద’లను వెంటనే తప్పించండి!
సుప్రీం ముంగిట లోధా కమిటీ కొత్త ప్రతిపాదన బోర్డుకు పరిశీలకుడిని నియమించాలని సూచన న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు అమలు చేయలేక ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మరో పిడుగు పడింది. తాము నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పదవుల్లో కొనసాగుతున్న బోర్డు ఆఫీస్ బేరర్లు అందరినీ వెంటనే తొలగించాలంటూ కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర సంఘాల్లోనూ కూడా దీనిని అమలు చేస్తూ అక్కడివారిని కూడా అనర్హులుగా ప్రకటించాలని కమిటీ సూచించింది. సిఫారసుల అమలుపై తాజా పరిస్థితిని వివరిస్తూ లోధా కమిటీ సుప్రీం కోర్టుకు అందించిన నివేదికలో ఈ ప్రతిపాదనలు చేసింది. ఇది కమిటీ సమర్పించిన మూడో నివేదిక కావడం విశేషం. లోధా ప్రతిపాదనల ప్రకారం ఆఫీస్ బేరర్ల వయసు 70 ఏళ్లకు మించరాదు, మంత్రిగానీ, ప్రభుత్వ అధికారిగానీ అరుు ఉండరాదు. ఇతర సంఘాల్లో అధికారిగా పని చేయకూడదు. దీంతో పాటు మొత్తంగా కలిపి 9 ఏళ్లకు మించి ఏదైనా పదవిలో కొనసాగరాదనేది నిబంధన. వీటిని వర్తింపజేస్తే ప్రస్తుత అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే సహా బోర్డులోని ఆఫీస్ బేరర్లంతా అనర్హులవుతారు. తాము లోధా సిఫారసులు అమలు చేస్తామంటూ ఇప్పటికి నాలుగు రాష్ట్ర సంఘాలు (విదర్భ, త్రిపుర, రాజస్థాన్, హైదరాబాద్) మాత్రమే అంగీకారం తెలిపారుు. అరుుతే అక్టోబర్ 1న జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనలను తిరస్కరించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. పరిశీలకుడిగా జీకే పిళ్లై... బీసీసీఐ ఇప్పటికీ తమ సూచనలను పట్టించుకోవడం లేదని తాజా నివేదికలో కూడా వెల్లడించిన లోధా కమిటీ... బోర్డుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఒక కంట కనిపెట్టేందుకు కొత్తగా పరిశీలకుడిని నియమించాలని కోరింది. ఇందు కోసం హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై పేరును కూడా ప్రతిపాదించింది. బోర్డుకు తగిన విధంగా మార్గనిర్దేశనం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్లు, టోర్నీలకు వివిధ కాంట్రాక్ట్లు ఇచ్చే విషయంలో పారదర్శకత కోసం పరిశీలకుడి అవసరం ఉందని కమిటీ పేర్కొంది. బీసీసీఐ రోజువారీ వ్యవహారాలను ఇప్పటికే సీఈఓ రాహుల్ జోహ్రి చూస్తున్నారు. అరుుతే ఆయన అధికారాలు పరిమితంగా ఉండటంతో పాటు బోర్డు కార్యదర్శి పర్యవేక్షణలో పని చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే కొత్తగా స్వతంత్ర పరిశీలకుడి అవసరం ఉన్నట్లు లోధా కమిటీ గుర్తించింది. -
పైసా కూడా ఇవ్వొద్దు
రాష్ట్ర సంఘాలకు బీసీసీఐ నిధుల నిలిపివేత మ్యాచ్ల నిర్వహణకూ ఇవ్వరాదు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు ‘లోధా’ సిఫారసులు అమలు చేసే వరకు ఇదే పరిస్థితి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆర్థిక స్వేచ్ఛకు దేశ అత్యున్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది. గతంలో రెండు పెద్ద అకౌంట్ల కార్యకలాపాలను మాత్రమే నిలిపివేయాలన్న సుప్రీం కోర్టు... ఇప్పుడు నేరుగా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇచ్చే నిధులకే బ్రేక్ వేసింది. లోధా కమిటీ సిఫారసులు అమలు చేసే వరకు బీసీసీఐ ముందుకు వెళ్లలేని పరిస్థితి సృష్టించింది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత కఠినమైన ఆదేశాలు జారీ చేస్తున్న అత్యున్నత న్యాయ స్థానం ముందు ‘బలమైన’ బోర్డు ఇంకా ఎంత కాలం నిలవగలదో! న్యూఢిల్లీ: కొన్నాళ్ల క్రితం లోధా కమిటీ తమ రెండు అకౌంట్లను నిలిపివేసిన సమయంలో బీసీసీఐ తీవ్రంగా గగ్గోలు పెట్టింది. డబ్బులు లేకపోతే క్రికెట్ ఎలా, కివీస్తో సిరీస్ రద్దు చేస్తాం అంటూ బోర్డు బెదిరింపు ధోరణిలో మాట్లాడింది. అరుుతే తాము రాష్ట్ర సంఘాల నిధులను ఆపలేదని చివరకు లోధా కమిటీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు దానిని నిజం చేసింది. లోధా కమిటీ సిఫారసుల అమలు అంగీకరించే వరకు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా బీసీసీఐ నిధులు ఇవ్వరాదని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. బోర్డు అకౌంట్ల నుంచి రాష్ట్ర సంఘాలకు డబ్బులు బదిలీ కాకుండా నిలిపివేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావులతో కూడిన బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 17న వాదోపవాదనల అనంతరం తమ తీర్పును రిజర్వ్లో ఉంచిన కోర్టు శుక్రవారం దానిని ప్రకటించింది. మ్యాచ్లు నిర్వహించడం కోసం కూడా నిధులు అందించరాదని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. తాము లోధా కమిటీ సిఫారసలు అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు రెండు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. అప్పటి వరకు నిధుల బదిలీకి అవకాశం ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను నవంబర్ 3లోగా లోధా కమిటీ ముందు హాజరై సిఫారసులు అమలు చేసేందుకు తమకు ఎంత సమయం కావాలో చెబుతూ హామీ పత్రం దాఖలు చేయాలని కూడా సుప్రీం ఆదేశించింది. ఈ అంశంలో డిసెంబర్ 5న తదుపరి విచారణ జరుగుతుంది. ఆ నిధులు వాడరాదు... లోధా సిఫారసుల చర్చలో భాగంగా రాష్ట్ర సంఘాలను తాము నియంత్రించలేమని, వారు ముందుకు రాకపోవడం వల్లే తామూ నిర్ణయం తీసుకోలేకపోతున్నామంటూ బీసీసీఐ వాదనలు వినిపించింది. ఇప్పుడు అదే వాదనపై సుప్రీం దెబ్బ కొట్టింది. బోర్డు నుంచి నిధులు ఆపేయడం ద్వారా నేరుగా ఆయా సంఘాల ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. లోధా ప్రతిపాదనలు అమలు చేస్తేనే డబ్బులు వస్తారుు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర క్రికెట్ సంఘాలు కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో నిలిచారుు. ఆయా సంఘాలు తాము సిఫారసులు అమలు చేస్తున్నామంటూ తీర్మానం చేయాల్సి ఉంటుంది. మరోవైపు త్వరలో మ్యాచ్లు నిర్వహించాల్సి ఉన్న 13 సంఘాలకు ఇప్పటికే బోర్డు నిధులు చేరారుు. అరుుతే దీనిపై కూడా సుప్రీం ఆంక్షలు విధించింది. సంస్కరణల అమలుపై హామీ ఇచ్చే వరకు ఆ డబ్బును ఖర్చు చేయరాదని కూడా ఆదేశించింది. ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ తర్వాత ఇంగ్లండ్ జట్టుతో మన జట్టు మ్యాచ్లు ఆడనుంది. మరోవైపు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ కూడా కొనసాగుతోంది. స్వతంత్ర ఆడిటర్ నియామకం... మరోవైపు బీసీసీఐ వివిధ సంస్థలతో చేసుకునే ఒప్పందాలు, కాంట్రాక్ట్ల విషయంలో లోధా కమిటీకి సుప్రీం తగు సూచనలిచ్చింది. బోర్డు చేసుకునే కాంట్రాక్ట్ మొత్తాల విషయంలో ఏదైనా ఒక పరిమితి విధించాలని కోరింది. అంతకుమించి చేసే ఏ ఒప్పందమైనా కమిటీ ద్వారా మాత్రమే ఖరారు కావాలని చెప్పింది. ఈ నెల 25న ఐపీఎల్ ప్రసార హక్కులను బీసీసీఐ కేటారుుంచనుంది. ఈ నేపథ్యంలో ఆ భారీ ఒప్పందం విషయంలో బోర్డు ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం. బోర్డు అకౌంట్లను పర్యవేక్షించేందుకు కమిటీ స్వతంత్ర ఆడిటర్ను నియమించాలని కూడా సుప్రీం ఆదేశించింది. ‘జులై 18నాటి తమ ఉత్తర్వులను అమలు చేసేందుకు ఏమేం చేయాలో సుప్రీం కోర్టు అదంతా చేస్తోంది. దీనిని బీసీసీఐ ఎంత వరకు పాటిస్తుందో చూడాలి. అనురాగ్ ఠాకూర్ వచ్చి చర్చిస్తానంటే మేం అందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలోనూ ఆయనను ఆహ్వానించాం’ అని తాజా పరిణామాలపై జస్టిస్ లోధా వ్యాఖ్యానించారు. నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. సుప్రీం ఉత్తర్వుల వల్ల క్రికెట్పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడే చెప్పలేను. తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనిపై స్పందిస్తాం. రాష్ట్ర సంఘాలతో ఈ అంశంపై చర్చించడం అన్నింటికంటే ముఖ్యం. సిఫారసుల అమలులో కొన్ని సమస్యలు ఉన్నారుు. వాటిని గతంలోనే కోర్టు ముందు ఉంచాం. -అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ అధ్యక్షుడు -
మనోహర్కే ‘స్పాట్’
ఐసీసీ చైర్మన్ పదవినుంచి తప్పించేందుకు బీసీసీఐ విఫల ప్రయత్నం కలిసి రాని ఇతర బోర్డులు దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిననాటినుంచి శశాంక్ మనోహర్కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య ఏదో ఒక వివాదం తరచుగా వస్తూనే ఉంది. బోర్డుకు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసినా, తమకు ఏ దశలోనూ అండగా నిలవడం లేదని బీసీసీఐ గుర్రుగా ఉండగా... తాను తటస్థ అధ్యక్షుడినని, అన్ని బోర్డులూ సమానమేనని మనోహర్ చెప్పుకున్నారు. తాజాగా లోధా సిఫారసుల అమలు విషయంలో తమకు అనుకూలంగా లేఖ రాయమంటూ బీసీసీఐ కోరడం, ఐసీసీ దానిని పట్టించుకోకపోవడం జరిగారుు. ఈ నేపథ్యంలో పాత సాహచర్యాన్ని పక్కన పడేసి ఏకంగా మనోహర్ను ఐసీసీ చైర్మన్ పదవినుంచే తప్పించేందుకు భారత బోర్డు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ వ్యూహం పన్నినా చివరకు అది విఫలమైంది. శ్రీనివాసన్ సూచనలతో... ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు కేప్టౌన్ వెళ్లిన ఠాకూర్ అక్కడినుంచి బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేతో పాటు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్తో కూడా మాట్లాడారు. శశాంక్ మనోహర్ను తప్పించే విషయంలో వారి మధ్య చర్చ జరిగినట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు నిర్ధారించారు. ఐసీసీలో సాధ్యమైనన్ని ఎక్కువ పదవులు పొందడం ద్వారా క్రికెట్ను నడిపించాలనేది బీసీసీఐ ఆలోచన. అరుుతే శశాంక్ ఉండగా ఇది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఆయననే అక్కడినుంచి తొలగించాలని ప్రయత్నం జరిగినట్లు ఆయన వెల్లడించారు. శశాంక్కు ప్రత్యామ్నాయంగా తనకు మంచి మిత్రుడైన ఇంగ్లండ్ బోర్డు చైర్మన్ గైల్స్ క్లార్క్ పేరును శ్రీనివాసన్ సూచించారు కూడా. అరుుతే ఐసీసీలో ఓటింగ్కు వెళ్లక ముందే బీసీసీఐకి భంగపాటు ఎదురైంది. నిబంధనల ప్రకారం ఠాకూర్ ప్రతిపాదనకు కనీసం మరో టెస్టు దేశం మద్దతు పలకాల్సి ఉంది. అరుుతే తాము శశాంక్ పనితీరుతో సంతృప్తిగా ఉన్నామని చెప్పి వారంతా ఆయనకు మద్దతు పలికారు. తన ప్రతిపాదనకు పూర్తిగా వ్యతిరేకత ఎదురవడంతో ఠాకూర్ నివ్వెరపోయారు. ఒక వేళ మరో దేశం మద్దతిచ్చి ఓటింగ్కు వెళ్లినా పది టెస్టుల్లో కనీసం ఎనిమిది దేశాలు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా సాధ్యం కాకపోయేదేమో! ఇప్పటికే సొంత ఇంట్లో అనేక సమస్యలతో సతమతమవుతున్న బీసీసీఐ, ఐసీసీ వ్యవహారాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేసి విఫలం కావడం బోర్డుకు మరో పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. -
చీఫ్ జస్టిస్ను తప్పించండి!
‘లోధా’ కేసులో బీసీసీఐ రివ్యూ పిటిషన్ ముంబై: లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సుప్రీం కోర్టుతోనే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. లోధా ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ జులై 18న ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ‘సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 19 (ఎ) (సి) ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోంది. తీర్పు ఇచ్చే ముందు ఇద్దరు సభ్యులు వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదు’ అని ఈ పిటిషన్లో పేర్కొంది. అన్నింటికి మించి తదుపరి విచారణనుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ను తప్పించాలని కూడా కోరింది. బోర్డుకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నారని, నిష్పాక్షిక విచారణ జరగడం లేదని తాము భావిస్తున్నామన్న బీసీసీఐ... ఐదుగురు సభ్యుల బెంచ్ ముందు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరింది. బీసీసీఐకి ఈ కేసులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ కట్జూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. -
లెఫ్టినెంట్ అనురాగ్ ఠాకూర్!
ఆర్మీలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ కొత్త పాత్రలోకి ప్రవేశించారు. 42 ఏళ్ల ఠాకూర్ భారత సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో చేరారు. కేంద్ర రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన కమిషనింగ్ సెరిమొనీలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, ఠాకూర్ను లెఫ్ట్నెంట్ హోదాలో నియమించారు. 124 ఇన్ఫాంట్రీ బెటాలియన్ (సిఖ్)లో అనురాగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ తండ్రి, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్కుమార్ ధుమాల్ కూడా పాల్గొన్నారు. ఆర్మీలో చేరేందుకు కావాల్సిన సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులవడంతోపాటు ఠాకూర్, తగిన శారీరక ప్రమాణాలను కూడా అందుకున్నారు. ‘ఆర్మీలో చేరడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. యూనిఫాంలో దేశానికి సేవలు అందించాలన్న నా చిన్ననాటి కోరిక తీరింది. దేశం తరఫున ఎప్పుడైనా పని చేసేందుకు సిద్ధం’ అని ఠాకూర్ వ్యాఖ్యానించారు. -
ఐసీసీ చైర్మన్గా మనోహర్
శ్రీనివాసన్ తొలగింపు బీసీసీఐ కీలక నిర్ణయం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిపాలనలో సుదీర్ఘ కాలంగా తనదైన ముద్ర వేసిన నారాయణస్వామి శ్రీనివాసన్ శకం ముగిసింది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్గా వ్యవహరిస్తారు. భారత ప్రతినిధిగా ఇప్పటివరకు చైర్మన్గా ఉన్న శ్రీనివాసన్ను తప్పిస్తూ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ చైర్మన్ పదవిలో మనోహర్ జూన్ 2016 వరకు కొనసాగుతారు. ఏదైనా కారణంతో ఆయన గైర్హాజరైతే ఆ స్థానంలో ప్రత్యామ్నాయ డెరైక్టర్ హోదాలో బీసీసీఐ తరఫున శరద్ పవార్ ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. పలు కారణాలతో అనేక సార్లు వాయిదా పడిన బోర్డు ఏజీఎం ఎట్టకేలకు సోమవారం జరిగింది. ఈ సమావేశంలో భారత క్రికెట్కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసన్ను తొలగిస్తూ ప్రకటన చేసిన తర్వాత ఐసీసీ చైర్మన్గా ఆయన చేసిన సేవలను బోర్డు సభ్యులు ప్రస్తుతించారు. ఐపీఎల్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రి అవుట్ ఈ సమావేశంలో బోర్డు వేర్వేరు సబ్ కమిటీలను ప్రకటించింది. కొన్నింటిలో సభ్యులను మార్చగా, మరికొన్ని కమిటీల్లో సభ్యుల సంఖ్యను బాగా తగ్గించారు. ఐదుగురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా రాజీవ్శుక్లా కొనసాగనున్నారు. అయితే భారత జట్టు డెరైక్టర్గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రిని ఈ కౌన్సిల్నుంచి తప్పించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరవ్ గంగూలీని ఎంపిక చేశారు. బోర్డు సభ్యుల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ (పరస్పవర విరుద్ధ ప్రయోజనాల సంఘర్షణ)కు సంబంధించి తీవ్రంగా చర్చ జరిగినా చెప్పుకోదగిన నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అయితే ఈ తరహా కార్యకలాపాలను బోర్డు తరఫున పర్యవేక్షించేందుకు తొలిసారి మాజీ న్యాయమూర్తి ఏపీ షా ను ‘అంబుడ్స్మన్’గా నియమించారు. -
'బీసీసీఐ మీటింగ్లకు ఆయన హాజరుకావచ్చా?'
ముంబయి : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఐసీసీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ విషయమై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) శనివారం నాడు సుప్రీంకోర్టును సంప్రదించాల్సి వచ్చింది. బీసీసీఐ అధికారిక సమావేశాలకు శ్రీని హాజరు కావచ్చా.. లేదా అనే విషయంపై స్పష్టత కోసం బోర్డు సభ్యులు సుప్రీంకోర్టు సలహాను కోరారు. నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ వాటాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో నిషేధానికి రెండు జట్లపై ఐపీఎల్ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయించడానికి గత నెలలో సమావేశం ఏర్పాటు చేయగా.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున శ్రీని హాజరుకావడంతో సమావేశం రద్దయింది. ఎందుకంటే చెన్నై ఫ్రాంచైజీకి శ్రీని కంపెనీ ఇండియా సిమెంట్స్ వాటాలను ఎలా అమ్మిందన్న దానిపై స్పష్టతలేని కారణంగా కొంత సందిగ్ధత నెలకొందన్నది వాస్తవం. ఫిక్సింగ్ ఆరోపణలు రుజువైనందున జస్టిస్ లోథా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లపాటు నిషేధం విదించిన విషయం విదితమే. -
ఇన్షా అల్లా
తన మీద వచ్చిన అపవాదులకు అజహరుద్దీన్ నిజ జీవితంలో ఎప్పుడూ జవాబు చెప్పలేదు. వెండితెర మీద సమాధానాలు వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇన్షా అల్లా (వారి కొరిక నెరవేరుగాక). గత ఆదివారం సాయంత్రం... కోల్కతాలో ఐపీఎల్ ఫైనల్ జరుగుతోంది. ముంబైలోని సోనీ స్టూడియోలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి అజహరుద్దీన్ కూర్చున్నాడు. ఈ మాజీ కెప్టెన్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా గురించిన ప్రమోషన్ కోసం ఈ ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. సరిగ్గా పదంటే పదే నిమిషాల్లో ముంబైలో మీడియా ఒళ్లు విరిచింది. టాట్... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న వ్యక్తి ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా స్టూడియోలో ఎలా కూర్చుంటాడు? అంటూ ప్రశ్నల బాణాలను వదిలింది. ఎక్కడో కోల్కతాలో మ్యాచ్ జరుగుతుంటే... ఇక్కడ ఓ ప్రైవేట్ చానెల్ స్ట్టూడియోలో అజహర్ కూర్చోవడం తప్పా..? ఈ సంఘటన చెప్పడానికి కారణం ఉంది. అజహరుద్దీన్ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) విషయంలో చాలా వీక్. నలుగురితో మాట్లాడటం, మీడియాతో సన్నిహితంగా మెలగడం తెలియదు. ఇప్పుడే కాదు... తాను క్రికెటర్గా, కెప్టెన్గా ఉన్న రోజుల్లో కూడా అంతే. మాజీ క్రికెటర్లంతా కామెంటేటర్లుగా, కోచ్లుగా రకరకాలుగా క్రికెట్తో సంపాదించుకుంటుంటే అజహర్ వెనకబడిపోవడానికి కారణం కూడా ఇదే. తనని తాను మార్కెటింగ్ చేసుకోవడం అజహర్కు చేతకాలేదు. నిజంగా చేతనై ఉండుంటే ఇంకా బీసీసీఐ నిషేధం అతనిపై ఉండేది కాదు. భారత క్రికెట్కు అత్యుత్తమ కెప్టెన్ అజహరుద్దీన్. ఇవ్వాళ ధోని సూపర్ స్టార్ కావచ్చు. కానీ నేడు ధోని కెప్టెన్గా సాధించిన విజయాలను అజహర్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే సాధించాడు. యువతలో స్ఫూర్తి నింపడానికి విజయాలు అవసరమైతే... అజహర్ను మించి స్ఫూర్తి నింపే క్రికెటర్ లేడు. అందుకే హైదరాబాద్లో అతనంటే ఆరాధన. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎదిగి, ఎవరి మద్దతు లేకుండా భారత కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అందుకే తనంటే అప్పట్లో యువతలో పిచ్చి క్రేజ్. మణికట్టు మాయాజాలంతో పరుగులు చేయొచ్చని క్రికెట్ ప్రపంచానికి చూపించిన మొదటి ఆటగాడు అజహర్. క్రికెటర్గా అజహర్ ప్రస్థానం ఓ సాధారణ ఆటగాడి కలలా సాగింది. 1984లో ఇంగ్లండ్తో సిరీస్కు జట్టులోకి వచ్చిన అజహర్... వరుసగా ఆడిన మూడు టెస్టుల్లోనూ సెంచరీలు చేశాడు. కెరీర్లో తొలి మూడు మ్యాచ్ల్లో సెంచరీలు చేసిన ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 2000లో బెంగళూరులో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచే అజహర్ ఆఖరి టెస్టు. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్కు దూరమయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసు కారణంగా అజహర్ చాలా నష్టపోయాడు. 99 టెస్టు మ్యాచ్లు ఆడిన భారత క్రికెట్ దిగ్గజం వంద మ్యాచ్ల మార్కును చేరుకోలేకపోయాడు. ఘనంగా ఆటకు వీడ్కోలు పలకాల్సిన క్రికెటర్ మౌనంగా తెరచాటుకు వెళ్లిపోయాడు. బీసీసీఐ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో 2012లో హైకోర్టు నుంచి అజహర్కు క్లీన్చిట్ వచ్చింది. కానీ బీసీసీఐ నిషేధం మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఈ క్రమంలో అజహర్ కొత్త కెరీర్ చూసుకున్నాడు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి గెలిచాడు. ఎక్కడ హైదరాబాద్... ఎక్కడ మొరాదాబాద్. అజహర్కు దేశం మొత్తం క్రేజ్ ఉందనడానికి లోక్సభ ఎన్నిక నిదర్శనం. బాధ్యత గల కుటుంబ పెద్ద ఒక్కసారి భారత క్రికెట్ జట్టులోకి వస్తే రకరకాల బిజినెస్లు ప్రారంభించి సంపాదించుకునే అవకాశం ఉంది. దాదాపుగా ప్రతి భారత క్రికెటర్ దీనిని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. కానీ అజహర్ మాత్రం కమర్షియల్ కోణాన్ని పట్టించుకోలేదు. ఆట, కుటుంబం తప్ప మరో ధ్యాస లేకుండా గడిపాడు. అందుకే వ్యాపారాలేమీ చేయలేదు. అయితే స్నేహితుల సలహాలతో పుణే సమీపంలో భారీగా పొలాలు కొన్నాడు. ఇప్పుడు అవే అజహర్ను స్థితిమంతుడిగా నిలబెట్టాయి. నిజానికి అజహర్ చాలా సాధారణ జీవితం గడిపాడు. ఓ మధ్యతరగతి కుటుంబంలో పెద్దవాడు తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ తీసుకున్నాడు. తన ఇద్దరు తమ్ముళ్లకు డబ్బులు ఇచ్చి వ్యాపారాల్లో స్థిరపడేలా చూశాడు. 1996 వరకు అజహర్ సాధారణ మనిషి. కానీ ఒక్కసారి సినీ నటి, మోడల్ సంగీతా బిజ్లానీ ప్రేమలో పడ్డాక మొత్తం పరిస్థితి మారింది. హై ప్రొఫైల్ జీవితం అలవాటయింది. పార్టీలు, పరిచయాలు పెరిగాయి. తన క్రేజ్ తగ్గడం మొదలయ్యింది కూడా అప్పటి నుంచే. ఇప్పటికీ అజహర్ సూపర్ స్టార్. కానీ మొదటి భార్య నౌరీన్కు విడాకులు ఇవ్వకుండా ఉంటే ఆకాశాన్నంటిన క్రేజ్ అలాగే ఉండేది. దీనివల్ల కొంతమంది అభిమానాన్ని పోగొట్టుకున్నాడు. అయితే బాధ్యత మాత్రం ఇప్పటికీ మరచిపోలేదు. 2011లో 19 ఏళ్ల వయసున్న చిన్న కుమారుడు అయాజుద్దీన్ మోటార్ బైక్ ప్రమాదంలో మరణించడాన్ని అజహర్ చాలాకాలం జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు అసదుద్దీన్ను క్రికెటర్ను చేసే ప్రయత్నంలో ఉన్నాడు. - జయప్రకాష్ బత్తినేని అజహర్పై సినిమా అజహర్ కథతో సినిమా వస్తోంది. ఇమ్రాన్ హష్మీ ఇప్పటికే అజహర్ను తలపిస్తూ బయట కూడా నడుస్తున్నాడు. ఇమ్రాన్ క్రికెట్ దుస్తులతో నడుస్తుంటే అజహర్ గుర్తొస్తున్నాడు. కచ్చితంగా ఈ సినిమా మొత్తం అజహర్కు అనుకూలంగానే ఉంటుంది. (మరి వ్యతిరేకంగా సినిమా తీస్తానంటే ఎవరూ ఒప్పుకోరు కదా). ఈ సినిమా కోసం క్రికెట్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అజహర్ను ఫిక్సింగ్లో ఇరికించారనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట. అదే నిజమైతే అసలేం జరిగింది. భారత క్రికెట్లో అతి పెద్ద మ్యాచ్ ఫిక్సర్ అనే నింద అజహర్ మీద ఎలా పడింది? అతనేం అనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సినిమాలో దొరుకుతుందేమో చూడాలి.! -
భారత క్రికెట్కు గంగ‘రాజు’
విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చెన్నైలో సోమవారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో 2017 వరకు బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సౌత్జోన్ నుంచి గంగరాజు ఒక్కరే పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.అంచెలంచెలుగా ఎదుగుతూ.. విద్యార్థి దశలోనే యూనివర్సిటీ స్థాయి క్రికెటర్గా రాణించిన గంగరాజు పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2007 వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. 2007-08లో ఏసీఏ ఉపాధ్యక్షునిగా, 2008 జూన్లో అధ్యక్షునిగా, 2009 జూన్లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో జరిగిన ఏసీఏ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి తిరుగులేని క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా నిలిచారు. 2014లో బీజేపీ తరఫున పోటీచేసి నర్సాపురం ఎంపీగా గెలిచారు. 2011లో ఏసీఏ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక మాజీ టెస్ట్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్తో కలిసి ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. దాదాపు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఆంధ్రను సౌత్జోన్లో చాంపియన్గా నిలిపారు. మహిళా క్రికెట్ను ప్రోత్సహించారు. క్రీడాకారులకు ప్రోత్సాహం.. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి వర్ధమాన క్రికెటర్లకు విద్య, వసతి, ఉపకార వేతనాలందేలా చూశారు గంగరాజు. క్రికెటేతర క్రీడలను ప్రోత్సహించారు. -
ధోనీపై సినిమా ఖాయం!
క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు తీయడమనేది బాలీవుడ్లో లేటెస్ట్ ట్రెండ్. గత ఏడాది మిల్కా సింగ్ జీవితంతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’, ఈ ఏడాది మేరీ కోమ్ జీవితంతో వచ్చిన ‘మేరీ కోమ్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తాజాగా, టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోని’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పోస్టర్ని ధోని భార్య సాక్షీ సింగ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అయితే, కొన్ని రోజుల క్రితం ధోనీ జీవితంతో సినిమా రూపొందనుందనే వార్త రాగానే, ‘బీసీసీఐ’ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్త వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో దోనీ ఇంకా ఆడుతున్నందున ఇప్పుడు సినిమా తీయడం సరికాదని, ఆయన రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఈ సినిమా తీయాలని బీసీసీఐ చెప్పినట్లు ఓ వార్త హల్చల్ చేసింది. దాంతో ధోనీపై చిత్రం ఉండదని ఎవరికి వారు అనుకుంటున్న తరుణంలో, హఠాత్తుగా సాక్షీ సింగ్ ఈ చిత్రం పోస్టర్ను బయటపెట్టడంతోపాటు, ‘గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. మీ కోసమే ఈ పోస్టర్’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నందుకుగాను హక్కుల నిమిత్తం ధోని 40 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. దాదాపు 100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించనున్నారు. -
గురునాథ్ పై ధోని ఎప్పుడు మాట్లాడలేదు: బీసీసీఐ
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్పై ధోని ఎలాంటి ప్రకటనలు చేయలేదని బీసీసీఐ శుక్రవారం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ధోనిపై అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఆయన్నితప్పుగా చిత్రీకరిస్తోందని బీసీసీఐ ఈ సందర్బంగా మీడియాను విమర్శించింది. గురువారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణాంశాలను కూడా మీడియా వక్రీకరించిందని బీసీసీఐ విమర్శించింది. గురునాథ్ మేయప్పన్ కేవలం క్రికెట్ ఔత్సాహికడేనని ధోని ఎప్పుడూ ఎక్కడ అనలేదని బీసీసీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. -
పదవి నుంచి తప్పుకోనున్న శ్రీనివాసన్!
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తన పట్టు వీడనున్నట్లు కనబడుతుంది. సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్కు సూచించడంతో ఆయన గురువారం పలువురు న్యాయవాదులను కలసి సలహా సంప్రదింపులు చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే త్వరలో ఐసీసీ పీఠం అధిష్టించవచ్చా లేక ఏమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నయా అంటూ ఆయన తన తరపు న్యాయవాదులతో శ్రీనివాసన్ చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు విధించిన గడువు రెండు రోజులు నేటితో ముగియనున్న నేపథ్యంలో శ్రీనివాసన్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. ఐపీఎల్కు సంబంధించి అవినీతి వ్యవహారాల్లో పారదర్శక విచారణ కోసం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ రెండు రోజుల్లో తన పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం తన అభిప్రాయాలు వెల్లడించింది. ఐపీఎల్ జట్టు అవినీతి వ్యవహారాలలో శ్రీనివాసన్ అల్లుడు ప్రమేయం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో శ్రీనివాస్ అధ్యక్ష పదవిలో ఉంటే విచారణ నిష్పక్షపాతం జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రెండు రోజులలో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని శ్రీనివాసన్కు సూచించింది. లేకుంటే తామే జోక్యం చేసుకుని అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని శ్రీనివాసన్ను సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
త్వరలో భారత్- పాక్ క్రికెట్ సిరీస్
ఎన్నాళ్లుగానో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండో-పాక్ క్రికెట్ సిరీస్ త్వరలో సాకారం కాబోతోంది. సాధారణంగా ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు వెల్లువెత్తుతారు. చాలా కాలంగా మ్యాచ్ ఏదీ జరగకపోవడంతో పాక్, భారత్ క్రికెట్ బోర్డులు తటస్థ వేదికపై సిరీస్ నిర్వహించాలని తలపెట్టాయి. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు జకా అష్రఫ్ తెలిపారు. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కూడా ఇందుకు అంగీకరించారని ఆయన అన్నారు. శ్రీనివాసన్తో అష్రఫ్ ఇటీవల భేటీ అయ్యారు. భారత్, పాకిస్థాన్ జట్టుల మధ్య క్రికెట్ సిరిస్ ఏర్పాటుకు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుముఖత వ్యక్తం చేశారని సోమవారం లాహోర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అష్రఫ్ వెల్లడించారు. అయితే ఇరు దేశాల క్రికెట్ జట్లు మరో తటస్థ వేదికపై క్రికెట్ అడనున్నాయని తెలిపారు. అందుకు ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ను ఎంచుకునే అవకాశం ఉందని అష్రఫ్ తెలిపారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ టెస్ట్ అంటే ఇరుదేశాలలోని క్రికెట్ అభిమానులకు టెన్షనే టెన్షన్. ఇరుదేశాల పోటీలలో ఏ దేశం విజయపతాకం ఎగురవేస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే 2008లో ముంబై దాడుల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య క్రికెట్ టెస్ట్ సిరీస్లకు మంగళం పాడారు. దాంతో ఇరుగు పొరుగు దేశాల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన ఇరు దేశాల క్రికెట్ బోర్డులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. -
బీసీసీఐలో ఏసీఏ హవా
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్లైన్ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాతినిధ్యం రానురాను మరింత కీలకం అవుతోంది. చెన్నయ్లో ఆదివారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ప్రతిష్టాత్మక అధ్యక్ష పదవి ఎన్నికలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సముచిత స్థానమే లభించింది. ఏసీఏ ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజుకు కీలకమైన ఫైనాన్స్ కమిటీ చైర్మన్, ఐపీఎల్ ఎక్స్ అఫీషియోగా పదవుల్లో నియమితులయ్యారు. గంగరాజుకు బీసీసీఏ కోశాధికారి పదవి వచ్చే అవకాశం ఉన్నా ఆ పదవికి పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించే వీలులేకపోవడంతో వదులుకున్నారు. గత ఏడాది బీసీసీఐ సబ్కమిటీల్లో 7 పదవులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు దక్కగా, ఈ ఏడాది 11 కీలక పదవుల్లో నియమితులయ్యారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలా బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరు జేకేసీ కళాశాలలోని ఉమెన్స్ క్రికెట్ అకాడమీని నిర్వహించేందుకు నిర్ణయించడం విశేషం. బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా గోకరాజు గంగరాజు (ఏసీఏ కార్యదర్శి), కానిస్టిట్యూషన్ కమిటీ సభ్యునిగా డీవీ సుబ్బారావు(అధ్యక్షుడు), లీగల్ కమిటీ సభ్యునిగా డీవీఎస్ఎస్ సోమయాజులు(ఉపాధ్యక్షుడు), బీసీసీఐ ఉమెన్ క్రికెట్ అకాడమీ సభ్యులుగా జె.నరేంద్రనాథ్(ఉమెన్ క్రికెట్ అకాడమీ చైర్మన్), వి.ఉమామహేశ్వరరావు(సౌత్జోన్ కార్యదర్శి), మార్కెటింగ్ కమిటీ సభ్యుడిగా జీవీకే (రంగరాజు), యాంటీ డోపింగ్కమిటీ సభ్యుడిగా ఎంవీఎస్ శివారెడి ్డ(ఉపాధ్యక్షుడు), మ్యూజియం కమిటీ సభ్యులుగా వీవీఎస్ర్జీకే యాచేంద్ర (ఉపాధ్యక్షుడు), ఎన్. మోహన్దాస్ (ఉపాధ్యక్షుడు), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా సీహెచ్.అరుణ్కుమార్ (సంయుక్త కార్యదర్శి), టెక్నికల్ కమిటీ సభ్యుడిగా ఎంఎస్కే ప్రసాద్ (క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్) నియమితులయ్యారు. బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా నియమితులైన తరువాత సోమవారం నగరానికి చేరుకున్న గోకరాజు గంగరాజు ఏసీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏసీఏ చేస్తున్న క్రికెట్ యాక్టివిటీస్కి బీసీసీఐ పూర్తి సంతృప్తిగా ఉందన్నారు. బీసీసీఐ నుంచి వస్తున్న ప్రతి పైసాకు లెక్క చెబుతూ, క్రికెటర్లకు ఖర్చుపెడుతున్న తీరుతో బీసీసీఐ కీలకమైన పదవులు ఇవ్వడానికి ముందుకొచ్చిందన్నారు. ప్రతిభగల వర్ధమాన క్రికెటర్లకు రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసిన ఘనత దేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్దేన్నారు. ఉచిత విద్య, వసతి, కోచింగ్ ఇచ్చే అకాడమీలు స్థాపించి క్రికెట్ క్రీడను అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలో టీమిండియా జట్టులో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు ప్రాతినిధ్యం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో ఇందిరగాంధీ మునిసిపల్ స్టేడియం అప్పగిస్తే అంతర్జాతీయ మ్యాచ్లు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్ ఎంఎస్కే ప్రసాద్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి సిహెచ్.అరుణ్కుమార్, కేడీసీఏ కార్యదర్శి ఎ.ఎల్లారావు సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీఏ ప్రతినిధులు గోకరాజు గంగరాజును సన్మానించారు.