రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ | India Hammers Malaysia In Asian Champions Trophy 2024 | Sakshi
Sakshi News home page

రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌

Published Wed, Sep 11 2024 7:18 PM | Last Updated on Wed, Sep 11 2024 7:32 PM

India Hammers Malaysia In Asian Champions Trophy 2024

చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌
మలేసియాతో మ్యాచ్‌లో రాజ్‌ కుమార్‌ పాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్‌ కుమార్‌ గోల్స్‌ చేశాడు. భారత్‌ తరఫున రాజ్‌ కుమార్‌తో పాటు అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ 6, 39 నిమిషంలో, జుగ్‌రాజ్‌ సింగ్‌ 7వ నిమిషంలో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 22వ నిమిషంలో, ఉత్తమ్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్స్‌ సాధించారు.  మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్‌ 34వ నిమిషంలో సాధించాడు.

ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్‌లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 12న.. పాక్‌తో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14న జరుగనున్నాయి. 

చదవండి: స్టిమాక్‌ కాంట్రాక్ట్‌ పునరుద్ధరణపై ఏఐఎఫ్‌ఎఫ్‌ విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement