లడ్డూ నాణ్యత, సైజులో తేడా రావద్దు | Sakshi
Sakshi News home page

లడ్డూ నాణ్యత, సైజులో తేడా రావద్దు

Published Tue, May 7 2024 5:20 AM

-

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన లడ్డూలు అందజేయాలని దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు అక్కడి బాధ్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆలయ సన్నిధిలో ఉన్న లడ్డూ తయారీ విభాగాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. లడ్డూ తయారీ నాణ్యత, పరిమాణం(సైజు)పై సెక్షన్‌ అధికారిని అడిగి తెలుసుకున్నారు. లడ్డూ తయారీలో పరిమాణం, నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని, తేడా రావద్దని సూచించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన లడ్డూను తిని రుచి చూశారు. అనంతరం టిక్కెట్‌ కౌంటర్‌కు వెళ్లి పరిశీలించారు.

Advertisement
 
Advertisement