నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా అల్లు అర్జున్‌ హాజరు | Allu Arjun appears virtually at Nampally court | Sakshi
Sakshi News home page

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా అల్లు అర్జున్‌ హాజరు

Published Sat, Dec 28 2024 5:05 AM | Last Updated on Sat, Dec 28 2024 5:05 AM

Allu Arjun appears virtually at Nampally court

తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా 

రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు.. సోమవారానికి వాయిదాపడ్డ విచారణ  

హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ప్రమే­యంపై ఆరోపణలు ఎదు­ర్కొంటున్న హీరో అల్లు అర్జున్‌ శుక్రవారం హైదరా­బాద్‌ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కోర్టు ఎదుట వర్చువల్‌గా హాజరయ్యా రు. ఈ కేసులో ఏ–11గా ఉన్న ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించగా హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే. 

జ్యుడీషియల్‌ రిమాండ్‌ గడువు శుక్రవారం ముగియడంతో ఆయన కోర్టు కు నేరుగా హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ప్రాంగణానికి భారీగా అభిమానులు రావొచ్చని అంచనా వేసిన పోలీసులు.. ఆయన్ను వర్చువల్‌గా కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జడ్జి నిర్మల జనవరి 10కి వాయిదా వేశారు. 

మరోవైపు  రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో ఆయన తరఫు న్యా యవాదులు నిరంజన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి శుక్ర­వారం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే  విచారణ వాయిదా వేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణ కోరడంతో అంగీకరించిన జడ్జి వినోద్‌కుమార్‌ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement