వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

Published Wed, May 8 2024 5:20 AM

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

వెంకటగిరి రూరల్‌: మండలంలోని చెలికంపాడు గ్రామానికి చెందిన 20 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు కాల్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్‌ వెంకటరణమ్మ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో 50 కుటుంబాల చేరిక

నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని సంజయ్‌గాంధీ కాలనీలో స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాకు జగదీష్‌రెడ్డి సారధ్యంలో 50 కుటుంబాలు సోమవారం రాత్రి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య సతీమణి కిలివేటి సుభాషిణి అక్కడి నాయకులు కామిరెడ్డి మోహన్‌రెడ్డితో కలిసి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆ పార్టీలో ఇమడలేం

నారాయణవనం: మండలంలోని అరణ్యంకండ్రిగ పంచాయతీకి చెందిన ఇద్దరు యువకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా రెండు వారాల క్రితం పంచాయతీ పరిధిలోని కప్పలమాదిగ ఇళ్లుకు చెందిన సురేష్‌, జీఎన్‌ కండ్రిగకు చెందిన సురేష్‌ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి వారు సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీలో ఇమడలేకే మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరినట్టు వారు పేర్కొన్నారు. అరణ్యంకండ్రిగ ఉప సర్పంచ్‌ మురళి, మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటేష్‌, నాయకులు ఆపిల్‌, కార్తవరాయన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement