వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం

Published Mon, May 6 2024 4:15 AM

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం

ఎంవీపీ కాలనీ: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలుకల సంక్షేమ సంఘం ప్రతినిధులు 60 మంది వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదివారం లాసన్స్‌బే కాలనీలోని వైఎస్సార్‌సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కార్యాలయంలో వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా రంజక పాలనకు ఆకర్షితులమై వైఎస్సార్‌సీపీలోకి చేరినట్లు సంఘం నాయకులు వెల్లడించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడమే అందరూ లక్ష్యంగా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, సంఘం నాయకులు వీరవల్లి పెదబాబు, ఎంఏఎన్‌ రాజు, గొట్టిపల్లి వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు

వైఎస్సార్‌సీపీలోకి తెలుకల సంక్షేమ

సంఘం ప్రతినిధులు

Advertisement
Advertisement