ప్రగతిపథంలో రాష్ట్రం.. | Sakshi
Sakshi News home page

ప్రగతిపథంలో రాష్ట్రం..

Published Mon, May 6 2024 3:50 AM

ప్రగతిపథంలో రాష్ట్రం..

పూసపాటిరేగ: వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. పూసపాటిరేగ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు.. కనిమెల్లకు చెందిన 30 కుటుంబాలు టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరందరికీ బడ్డుకొండ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడిన నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అని, ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు మహంతి జనార్దనరావు, కోరాడ సత్యనారాయణ, మహంతి లక్ష్మణరావు, ఎన్‌. సత్యనారాయణరాజు, అల్లాడ రమేష్‌, నడిపేన రమణ, కోరాడ కాశి, కోరాడ అరుణకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement