చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది

Published Wed, May 8 2024 4:40 AM

చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

పెనుగొండ: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌.. చంద్రబాబు కమిషన్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు ప్రజలకు అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఆచంట అసెంబ్లీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. మంగళవారం తూర్పుపాలెంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరిన తర్వాత ఎన్నికల కమిషన్‌ లేనిపోని నిబంధనలు పెడుతోందన్నారు. ఎక్కడా లేని నిర్ణయాలు రాష్ట్రంలో అమలు చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ చంద్రబాబుకు ఒక తొత్తులా.. వారి కనుసన్నల్లో పనిచేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రావలసిన విద్యాదీవెన సుమారు రూ.610 కోట్లు, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.847 కోట్లు వారి ఖాతాల్లో జమ కాకుండా ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఇవి కొత్తగా పెట్టిన పథకాలు కావని, రాష్ట్రంలో ఐదేళ్లుగా అమలు చేస్తున్నవేనని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్‌ పునరాలోచించుకుని విద్యార్థులకు, రైతులకు న్యాయం చేసే విధంగా నిధులను విడుదల చేయాలని, ఈమేరకు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ఆదేశాలు ఇవ్వాలని శ్రీరంగనాథరాజు కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement