తెలుగు యువత నాయకుల రాజీనామా | Sakshi
Sakshi News home page

తెలుగు యువత నాయకుల రాజీనామా

Published Wed, May 8 2024 4:20 AM

తెలుగు యువత నాయకుల రాజీనామా

మదనపల్లె : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మదనపల్లె టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్న టీడీపీ సీనియర్‌ నాయకులు రాటకొండ బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభల ఇద్దరు కుమారులు పార్టీ పదవులకు రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. రాటకొండ కుటుంబానికి చెందిన తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్‌రెడ్డి, తెలుగు యువత రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం తమ రాజీనామా లేఖలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్‌చినబాబుకు పోస్టు ద్వారా పంపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... పట్టణంలో ఇటీవల జరిగిన తెలుగు యువత సమావేశంలో ప్రోటోకాల్‌ పాటించకుండా, ఇష్టానుసారంగా సమావేశాన్ని నిర్వహించారన్నారు. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేయకపోగా, అకారణంగా తమపై నిందలు మోపుతూ, అవమానాలకు గురిచేశారన్నారు. 20 ఏళ్లుగా తమ కుటుంబాన్ని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు అవమానాలకు గురిచేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాజీనామా లేఖలను ఆమోదించి, టీడీపీ తెలుగు యువత పదవుల నుంచి రిలీవ్‌ చేసి నోట్‌ పంపాల్సిందిగా కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement