మదనపల్లె : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మదనపల్లె టీడీపీకి గట్టి షాక్ తగిలింది. నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్న టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే శోభల ఇద్దరు కుమారులు పార్టీ పదవులకు రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. రాటకొండ కుటుంబానికి చెందిన తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్రెడ్డి, తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాటకొండ విష్ణువర్ధన్రెడ్డి మంగళవారం తమ రాజీనామా లేఖలను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్చినబాబుకు పోస్టు ద్వారా పంపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... పట్టణంలో ఇటీవల జరిగిన తెలుగు యువత సమావేశంలో ప్రోటోకాల్ పాటించకుండా, ఇష్టానుసారంగా సమావేశాన్ని నిర్వహించారన్నారు. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేయకపోగా, అకారణంగా తమపై నిందలు మోపుతూ, అవమానాలకు గురిచేశారన్నారు. 20 ఏళ్లుగా తమ కుటుంబాన్ని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు అవమానాలకు గురిచేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాజీనామా లేఖలను ఆమోదించి, టీడీపీ తెలుగు యువత పదవుల నుంచి రిలీవ్ చేసి నోట్ పంపాల్సిందిగా కోరారు.
తెలుగు యువత నాయకుల రాజీనామా
Published Wed, May 8 2024 4:20 AM
Advertisement
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రిజిస్ట్రేషన్ల జోరు
ముంపు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాలి
కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
యూనిఫాం స్టిచింగ్ వేగవంతం చేయాలి
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
జీపీని తనిఖీ చేసిన డీపీఓ
పెట్టుబడి తగ్గి.. దిగుబడి పెరిగి
మార్పుతో మంచి ఫలితాలు..
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ కాన్వాయ్ బీభత్సం.. ఇద్దరు మృతి
తప్పక చదవండి
- టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
- Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
- ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
- సీఈవో మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
- భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
- నీతా అంబానీ తాగే వాటర్ అంత ఖరీదా? మరి రూ.49 లక్షల బాటిల్ సంగతేంటి?
- 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ట్యాపింగ్ ఆపింది అప్పుడే!
- ఏపీ ప్రజా తీర్పు.. ఇంకో 6 రోజులే!
Advertisement