-
నూకాంబిక హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు
అమ్మవారి హుండీ ఆదాయం లెక్కిస్తున్న దేవదాయ శాఖ సిబ్బంది, భక్తులు అనకాపల్లి: గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.66.69 లక్షలు లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మే 7 తేదీ వరకు హుండీ ద్వారా వచ్చిన కానుకలు, నగదును బుధవారం లెక్కించారు. నగదుతోపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన 31 గ్రాముల బంగారం, కిలో 700 గ్రాముల వెండి లభించింది. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్, జిల్లా దేవదాయశాఖ అధికారి కె.ఎల్.సుధారాణి, అనకాపల్లి దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారు ఎం.శ్రీధర్ల పర్యవేక్షణలో లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. -
ప్రాణదాత ఆ పోలీసు
వడ దెబ్బకు గురైన వ్యక్తికి సేవలు అందిస్తున్న ఎస్ఐ రమేష్బాబు కశింకోట: వడ దెబ్బకు గురైన వ్యక్తికి తక్షణం ఉపశమన చర్యలు చేపట్టి ఎస్ఐ ప్రాణాలతో కాపాడారు. ఈ సంఘటన బుధవారం స్థానిక బాలికల హైస్కూలు వద్ద జరిగింది. 40 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి వడ దెబ్బకు గురై బాలికల హైస్కూలు వద్ద రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కింద పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ కె.రమేష్బాబు అతని వద్దకు చేరుకొని నీరు ఇచ్చి ఉపశమన చర్యలు చేపట్టారు. దీంతో బాధితుడు కొంతసేపటికి తేరుకొని వడ దెబ్బ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రాణాపాయంలో ఉన్న తనను కాపాడిన ఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపి ఇంటి ముఖం పట్టాడు. -
ఈ పాపం ఎవరిది?
● పెన్షన్ కోసం తిరిగి ప్రాణం విడిచిన మహిళచోడవరం రూరల్: పెన్షన్ల పంపిణీ విషయమై ప్రతిపక్షం కుతంత్రానికి మరో ప్రాణం బలైంది. చోడవరం మండలం అంభేరుపురం గ్రామానికి చెందిన తోలాటి పద్మావతి (54)కి వితంతు పింఛన్ను ప్రతి నెల వలంటీరు ద్వారా వచ్చేది. ఈసారి సొమ్ము బ్యాంకులో వేయడంతో ఆమె మే 2న పాస్బుక్ తీసుకొని గోవాడ స్టేట్ బ్యాంక్కు వెళ్లింది. ఆ ఖాతా భర్త ఆచారితో కలిసి తీసుకున్న జా యింట్ అకౌంట్ కావడంతో అందులో జమైన పింఛన్ సొమ్ము తీసుకోవడానికి గాను భర్త డెత్ సర్టిఫికెట్ అవసరమైంది. ఆ సర్టిఫికెట్ తీసుకురావాలని బ్యాంక్ సిబ్బంది ఆమెకు సూచించారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గోవింద ఆమె భర్త మరణ ధ్రువపత్రాన్ని ఇప్పించాలని సచివాలయ ఉద్యోగులను కోరారు. ఇంతలో బుధవారం ఉదయానికి పద్మావతి నిద్దట్లోనే ప్రాణాలు విడిచారు. వారం రోజులపాటు ఎండలో తిరగడం వల్ల ఆమె బాగా వడలిపోయారని స్థానికులు చెప్పారు. ఆమెకు ఎంపీటీసీ గోవింద, తన అనుచరుడు పిల్లి రవితో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు. -
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం : వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–ఖుర్దారోడ్–సికింద్రాబాద్ మధ్య పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ● సికింద్రాబాద్–ఖుర్దారోడ్(07129) సమ్మర్ స్పెషల్ ఈ నెల 10న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.02 గంటలకు బయల్దేరి శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖుర్దారోడ్–సికింద్రాబాద్(07130) సమ్మర్ స్పెషల్ శనివారం రాత్రి 11.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 7.15 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.17 గంటలకు బయల్దేరి ఆదివారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–ఖుర్దారోడ్(07131) మరో సమ్మర్ స్పెషల్ ఈ నెల 11న సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 9.02 గంటలకు బయల్దేరి ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఖుర్దారోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఖుర్దారోడ్–సికింద్రాబాద్(07132) సమ్మర్ స్పెషల్ ఈ నెల 12వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 7.15 గంటలకు దువ్వాడ చేరుకుని, అక్కడి నుంచి 7.17 గంటలకు బయల్దేరి సోమవారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
● 3వ రోజు ప్రశాంతంగా పోలింగ్ ● పోలీస్, కేంద్ర బలగాలు, రిటైర్డ్ అధికారులకు నేడు అవకాశంతుమ్మపాల: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మూడో రోజు బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. గురువారం కూడా పలు శాఖలు, ఎంసీసీ, పోలీస్, ఎన్నికల విధుల్లో ఉన్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు జిల్లా యాంత్రాగం ఏర్పాటు చేసింది. ●జిల్లాలో తొలి రోజు 5,128 మంది, రెండో రోజు 6,506 మంది, మూడో రోజు 2,528 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 14,162 మంది ఇప్పటి వరకు ఓటు వేశారు. ●అత్యవసర సేవలకు చెందిన 2,340 మంది సిబ్బందికిగాను మంగళవారం నాటికి 1,866 మంది, బుధవారం మిగిలిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును వినియోగించుకున్నారు. ప్రశాంతంగా ముగిసిన హోమ్ ఓటింగ్... జిల్లాలో 85 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు, 40 శాతం వైకల్యం కలిగిన వారు ప్రభుత్వం కల్పించిన హోమ్ ఓటింగ్ హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో వృద్ధులు 365 మంది, దివ్యాంగులు 635 మంది మొత్తం వెయ్యి మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు ఓటింగ్ జరిగింది. మంగళవారం 353 మంది వృద్ధులు, 600 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం పూర్తిస్థాయిలో హోమ్ ఓటింగ్ జరిగింది. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లోనూ 34 బృందాలు ఇంటింటికీ వెళ్లి బ్యాలెట్ పేపర్లు అందించి ఓటు నమోదు అనంతరం బాక్సుల్లో వేయించింది. ఒక్కో బృందంలో బీఎల్వో, పోస్టల్ బ్యాలెట్ ఇన్చార్జి, గెజిటెడ్ అధికారి, మార్కెడ్ కాఫీ ఇన్చార్జి, మైక్రో అబ్జర్వర్తో హోమ్ ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రాఫర్ చిత్రీకరించారు. -
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
ఎన్నికల బందోబస్తు, భద్రత, నియమావళిపై ట్రైనీ ఐపీఎస్లకు అవగాహన కల్పిస్తున్న ఎస్పీ మురళీకృష్ణ తుమ్మపాల : నేషనల్ పోలీస్ అకాడమీ చెందిన 9 మంది ట్రైనీ ఐపీఎస్లు ఎన్నికల నియమ నిబంధనలపై అవగాహన కోసం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గోనున్నారు. ఈ మేరకు ట్రైనీ ఐపీఎస్లు అర్జున్ గుప్తా, అర్పిత్ ఆర్ పారేక్, శుభాన్సు కత్యార్, హర్షిత్ గోయల్, హుస్సేన్ లిరార్, జతిన్ జైన్, గౌతమ్ వివేకానందన్, పెమ తిన్లే, వైభవ్ రావత్లకు జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ గూర్చి ఎస్పీ కె.వి.మురళీకృష్ణ, అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం అవగాహన కల్పించారు. ఈ నెల 8 నుండి 13 వరకు జిల్లా పరిధిలో జరిగే ఎన్నికల ప్రక్రియ గురించి క్షేత్ర స్థాయిలో పర్యటించి తెలుసుకుంటారన్నారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో బందోబస్తు విధుల్లో భాగంగా నియోజకవర్గాల్లోని స్థానిక పోలీసులు, పారా మిలటరీ దళాలతో కవాతు నిర్వహించడం, సెక్టర్ మొబైల్, ఫ్లయింగ్ స్క్వాడ్, నిఘా బృందాలతో పని చేయడం, కంట్రోల్ రూమ్, చెక్ పోస్ట్లను, పోలింగ్ బూత్, కౌంటింగ్ సెంటర్, ఈవీఎం నిల్వ కేంద్రాలను సందర్శించడం, ఎన్నికల అబ్జర్వర్, వ్యయ పరిశీలక అధికారులతో సమావేశం అవుతారన్నారు. ఎలక్షన్ సెల్, పోలీస్ కంట్రోల్ రూమ్ సందర్శించడం జరిగిందన్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ రోజు జరిగే వివిధ బందోబస్తు ఏర్పాట్లను గమనించి, నేర్చుకునేలా చేయడం, బలగాల సమీకరణ, మోహరింపు, భద్రత సమస్యలను పరిష్కరించడం, సివిల్, పోలీస్ పరిపాలన సమర్ధంగా నిర్వహించడం వంటి విషయాల్లో శిక్షణలో ట్రైనీ ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని ఎస్పీ తెలిపారు. -
సింహగిరి.. భక్త ఝరి
● గంధం అమావాస్యకు పోటెత్తిన భక్తులు ● అప్పన్న ప్రతిరూపాలుగా కోలలకు పూజలు సింహాచలం: గంధం అమావాస్యను పురస్కరించుకుని బుధవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు, గ్రామీణ ప్రాంత భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రికే సింహాచలం చేరుకున్న వీరంతా బుధవాం తెల్లవారుజామున కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామివారి ప్రతిరూపాలుగా వెంట తీసుకొచ్చిన కోలలను పుష్కరిణి గట్టుపై ఉంచి పూజలు చేశారు. వంటలు వండి కోలలకు ఆరగింపు చేశారు. అమృత కలశాలు, పండ్లు సమర్పించారు. కుటుంబసమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. మెట్లమార్గం ద్వారా సింహగిరి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. గరిడీ నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహాచలం దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పుష్కరిణి వద్ద గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
మునగపాక: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ పలు పార్టీల నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. మండలంలోని మంగళవరపుపేటలో జనసేనకు షాక్ తగిలింది. పలువురు జనసేన కార్యకర్తలు బుధవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాండ్రేగుల చందు, వైఎస్సార్సీపీ నేతలు ఆడారి త్రిమూర్తులు, సరిసా శ్రీనుల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోచేరారు. పార్టీలో చేరిన వై.నవీన్, ఎ.పవన్, జె.జగదీష్, వై.కార్తీక్, ఎ.కిరణ్,ఎస్.వంశీ, ఎస్.జగన్, కె.జగదీష్,లోకేష్,నరసింహమూర్తి తదితరులకు ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కండువాలు వేసి సాదరంగా ఆ హ్వానించారు. ఈసందర్భంగా రమణమూర్తిరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలోనే మేలు జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమన్నారు. చంద్రబాబు అండ్ కో మోసాలనునమ్మకుండా ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ యు.సుకుమారవర్మ పాల్గొన్నారు. అచ్యుతాపురం: మండలంలోని ఆవసోమవరం, నడింపల్లి,జీపీ అగ్రహారం, పూడిమడక శివారు జాలారివానిపాలెంకు చెందిన పలువురు వైఎస్సార్సీపీలో చేరారు. ఆవసోమవారానికి చెందిన తుమ్మల శ్రీహరి,ముప్పెన అప్పారావు, బోధన అర్జునరావు, పలివెల రమణ తదితరులు, నడింపల్లి, జీపీ అగ్రహారానికి చెందిన యాండ్ర కనకరాజు, పోలవరుపు నాగరాజు,బండి నరసింగరావు,రెడ్డి నూకరాజు, పూడిమడక శివారు జాలారివానిపాలెంలో టీడీపీకి చెందిన నాల్గవ వార్డు మెంబర్ మడ్డు లక్ష్మణ్, పోలిశెట్టి కోదండ,మడ్డు రాజు తదితరులకు ఎమ్మెల్యే యు.వి.రమణ మూర్తి రాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సర్పంచ్ కోలా అప్పలరాజు, ఈతబాబు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి అనకాపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి వేల్పులవీధి యువకులు, మహిళలు టీడీపీ, జనసేనలను వీడి బుధవారం వైఎస్సార్సీపీలోకి చేరారు. స్థానిక వేల్పులవీధి గౌరీపరమేశ్వరుల అమ్మవారి ఆలయ సమీపంలో పార్టీ పట్టణ యువ జన విభాగం అధ్యక్షుడు–1 ఉగ్గిన అప్పారావు ఆధ్వర్యంలో పార్టీలోకి చేరిన 60మందికి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భతర్కుమార్ వైఎస్సార్సీపీ కండువాలు వేసి ఆహ్వానించారు. 83 వార్డు కార్పొరే టర్ జాజుల రమేష్, పార్టీ నాయకులు బొండా శంకరరావు, మద్దాల రమణబాబు, వేల్పుల గణేష్, మద్దాల చలపతి, జెట్టిశ్రీను పాల్గొన్నారు. 150 మంది చేరిక.. పాయకరావుపేట: పీఎల్ పురంలో టీడీపీ, జనసేనకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరా రు. పీఎల్ పురం సర్పంచ్ పడాల దివాణం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కండువాలు వేసి సాదరంగా ఆహ్వా నించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, పార్టీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు, జెడ్పీటీసీ లంక సూరిబాబు పాల్గొన్నారు. -
రాజకీయ పోరు
మాడుగుల నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి పట్టం కట్టలేదు. స్వతంత్ర అభ్యర్థులు సైతం విజయం సాధించిన చరిత్ర కలదు. తొలిసారిగా 1952 ఎన్నికల్లో బోజంకి గంగయ్యనాయుడు శాసనసభ్యుడిగా (కేఎల్పీ పార్టీ) విజయం సాధించారు. 1957లో ప్రజా సోషలిస్టు నుంచి దొండా శ్రీరాంమూర్తి, 1962 తెన్నేటి విశ్వనాథం, 1977లో కురుసా రామునాయుడు స్వతంత్ర అభ్యర్థులుగా, కాంగ్రెసు పార్టీ నుంచి 1967లో మాడుగుల మహరాణి రమాకుమారి దేవి, 1972లో బొడ్డు కళావతి విజయం సాధించారు. 1983 నుంచి 1999 వరకు టీడీపీ నుంచి రెడ్డి సత్యనారాయణ, 2004లో కాంగ్రెసు పార్టీ నుంచి కరణం ధర్మశ్రీ, 2009లో టీడీపీ నుంచి గవిరెడ్డి రామానాయుడు, 2014, 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు విజయం సాధించారు. బలంగా అధికార పార్టీ టీడీపీకి కంచుకోటగా ఉన్న మాడుగుల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పాగా వేసింది. ఇక్కడ పదేళ్లుగా తన ఉనికిని కాపాడుకుని బలంగా ఉంది. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అభివృద్ధి చేశారు. వర్గ విభేదాలు లేకుండా పార్టీని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. అదే ఉత్సాహంతో ఈ దఫా తన కుమార్తె ఈర్లె అనురాధను బరిలో నిలిపారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ టీడీపీ మూడు వర్గాలుగా చీలిపోయింది. అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వలేక ప్రజలకు జవాబుదారుగా లేక ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో వర్గపోరుతో వేగలేక పలువురు కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారు. ఈ తరుణంలో వలస వ్యక్తి బండారు సత్యనారాయణమూర్తి బరిలో దిగడంతో పార్టీ శ్రేణుల నుంచి సరైన సహకారం కొరవడిందనే చెప్పాలి. రైవాడ జలాశయం -
రేపే అప్పన్న చందనోత్సవం
సింహాచలం: వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సంవత్సరంమంతా చందనం మణుగుల్లో నిత్య రూపంలో దర్శనమిచ్చే సింహాద్రినాథుడి నిజరూప దర్శనం లభించే సమయం ఆసన్నమైంది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం జరగనుంది. ఏడాదిలో కేవలం ఒక్క రోజులోని కొన్ని గంటలు మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తూ.. వారికి దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విశాఖ కలెక్టర్ ఎ.మల్లికార్జున, సింహాచలం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు ఇవ్వడం లేదు. వెండి బొరుగులతో చందనం ఒలుపు చందనోత్సవం పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సుప్రభాతసేవ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేస్తారు. అనంతరం వెండి బొరుగులతో స్వామిపై ఉన్న చందనాన్ని తీసి నిజరూపభరితుడిని చేస్తారు. తెల్లవారుజామున 3.30 గంట ల నుంచి 4.30 గంటల వరకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులు, దాతలు, జ్యుడీషియల్కు అంతరాలయ దర్శనాలు కల్పిస్తారు. తదుపరి అంతరాలయ దర్శనాలు నిలిపివేస్తారు. అందరికీ ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద నుంచే లఘు దర్శనం కల్పిస్తారు. ఎలాంటి పూజలు, ఆశీర్వచనాలు ఉండవు. దర్శన స్లాట్లు కేటాయింపు ఉదయం 4 గంటల నుంచి ఉచిత దర్శనం, రూ.300, రూ.1000 క్యూల్లో ఉన్న భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. ఉదయం 5.30 గంటల నుంచి రూ.1,500 క్యూలో ఉన్న భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. రూ.300 టికెట్లకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రూ.1000 టికెట్లకు సంబంధించి ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రూ. 1,500 టికెట్లకు సంబంధించి ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శన టైమ్ స్లాట్లు కేటాయించారు. లక్ష మంది భక్తులు వస్తారని అంచనా ఈ సారి లక్ష మంది భక్తులు చందనోత్సవానికి వస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా రూ.300 టికెట్లు 20 వేలు, రూ.1000 టికెట్లు 15 వేలు, రూ.1500 టికెట్లు 5 వేలు కలిపి మొత్తం 40 వేలు టికెట్లు మాత్రమే విక్రయించారు. 60 వేల మందికి ఉచిత దర్శనం ఏర్పాటుచేసేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత గేట్లు మూసివేత 10వ తేదీ శుక్రవారం రాత్రి 7 గంటల్లోపు మాత్రమే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత ఖాళీ బస్సులను కొండపైకి పంపించి కొండపై ఉన్న భక్తులను కొండ దిగువకి చేరుస్తారు. 9వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా భక్తులను కొండపైకి అనుమతించరు. ఏర్పాట్లు ఇలా.. ●సింహగిరికి డ్యూటీలో ఉన్న వారికి మాత్రమే పరిమితంగా పాస్లు అందిస్తారు. ●ఈ సారి అడవివరంలోని గురుకుల పాఠశాలకు సమీపంలోని రెండవ ఘాట్ రోడ్డు నుంచే బస్సులు సింహగిరికి వెళ్లేలా, తొలి ఘాట్రోడ్డులో బస్సులు కిందకు దిగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ●10వ తేదీ తెల్లవారుజాము ఒంటి గంట నుంచి పాత గోశాల జంక్షన్, పాత అడవివరం జంక్షన్ల నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే సింహగిరిపైకి భక్తులను అనుమతిస్తారు. దేవస్థానం అద్దె చెల్లించిన 45 ఆర్టీసీ బస్సులు, మరో 40 మినీ బస్సులు, 10 ఇన్నోవాల్లో భక్తులను రెండవ ఘాట్లో నుంచి ఉచితంగా సింహగిరికి చేరుస్తారు. తొలి ఘాట్రోడ్డులో నుంచి కిందకి తీసుకొస్తారు. ఉచిత దర్శనం, 300 టికెట్లు వారికి 45 ఆర్టీసీ బస్సులు, రూ.1000, రూ.1500 టికెట్లు ఉన్న వారికి 40 మినీ బస్సులు సిద్ధం చేశారు. ●ఆయా పార్కింగ్ ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం టెంట్లు, కుర్చీలు, మరుగుదొడ్లు, కూలర్స్, మంచినీటి సౌకర్యం, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మంది భక్తులు వస్తారని అంచనా తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం సాయంత్రం 6 గంటల తర్వాత సింహగిరిపైకి భక్తులకు అనుమతి లేదు రూ.300, రూ.1000, రూ.1500 టికెట్ల వారికి దర్శన సమయాల స్లాట్లు -
ప్రత్యేకతలు
● నిత్యం భక్తులతో కళకళలాడే మోదకొండమ్మ ఆలయం ● దేశంలోనే రెండో దేవాలయంగా గుర్తింపు పొందిన పార్థసారథి ఆలయం ● ఏడు జలాశయాలున్న నియోజకవర్గంగా ఖ్యాతి.. ● ఏటా దసరా ఉత్సవాలకు ప్రత్యేకత ● మాడుగుల పసుపునకు అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు ఉంది. ● పాడేరు తర్వాత పిప్పళ్ల వ్యాపారానికి ప్రధాన కేంద్రం ఇదే ● దేవరాపల్లి మండలం తిమిరాంలో పశువుల సంత ప్రసిద్ధి చెందింది. ● దేవరాపల్లి మండలం తెనుగుబూడిలో గురుకుల పాఠశాల, మాడుగులలో డిగ్రీ కళాశాల ఉన్నాయి. ● ప్రధాన జలాశయాలు దేవరాపల్లిలో రైవాడ, చీడికాడలో కొనాం, మాడుగులలో పెద్దేరు, మినీ జలాశయాలు తారకరామ, పాలగెడ్డ, ఉరకగెడ్డ, గొర్రెగెడ్డ ఉన్నాయి. -
టీడీపీ హయాంలో అన్నీ అవకతవకలే...
● టీడీపీ హయాంలో యలమంచిలి నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడింది, ● పనులన్నీ అర్థంతరంగా నిలిచిపోయాయి. ● అచ్యుతాపురం–అనకాపల్లి మార్గ విస్తరణను నిలిపివేశారు. ● యలమంచిలిలో ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కాలేదు. ● మండలానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించి ఎంపీపీ, జెడ్పీటీసీలను డమ్మీలుగా మార్చారు. ● కొండల్ని పిండి చేసి, గ్రావెల్ దందా నిర్వహించారు. ● పూడిమడక మత్స్యకారులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయి. ● తంతడి, రాజన్నపాలెం గ్రామాలకు ఆనుకొని ఉన్న భూమిని బార్క్ కోసం కేటాయించగా, లబ్ధిదారుల జాబితాలో అవకతవకలు ఉన్నందున పరిహారం లేకుండానే కాలం గడిపారు. ● కొండకర్ల, తంతడి తీరాల పర్యాటక అభివృద్ధిని గాలికొదిలేశారు. -
No Headline
పథకం లబ్ధిదారుల నగదు సంఖ్య (రూ. కోట్లలో) రైతు భరోసా 39,937 207.48 అమ్మ ఒడి 93,947 108.18 చేయూత 15,505 78.49 వైఎస్సార్ ఆసరా 53,222 125.46 వైఎస్సార్ పెన్సన్లు 38,370 10.31 మనబడి నాడునేడు 158 37.74 కాపు నేస్తం 12,027 18.04 వాహన మిత్ర 8,984 8.98 ఆరోగ్యశ్రీ 19,094 41.01 జగనన్న హౌసింగ్ 6,901 69.70 సున్నా వడ్డీ 53,207 16.08 జగనన్న చేదోడు 5,516 5.51 విద్యా దీవెన 19,375 45.56 ఇవి కాకుండా... పాస్టర్లు, ఇమామ్ 59 రూ.11,58,000 ఈబీసీ నేస్తం 411 రూ.65,39,763 మత్స్యకార భరోసా 423 రూ.42,30,000 -
Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
అనకాపల్లి: మూడు పార్టీలు కలిసినా అనకాపల్లిలో ఎదురీత తప్పలేదు. 15 సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణను చాలామంది గుర్తు పట్టడం లేదు. దీనికితోడు ఆనాటి ఆయన సోదరుల ఆగడాలు గుర్తుకు తెచ్చుకొని.. ఆ తలనొప్పి మాకొద్దు బాబోయ్ అంటున్నారు. 2004లో కొణతాలను గెలిపించి మూడు శాఖల మంత్రిని చేసిన వైఎస్సార్ అభిమానులను పక్కన పెట్టి తన సోదరుల సంపద సృష్టికే పరితపించిన కొణతాల.. 2009 ఎన్నికల్లో పరాజయం పాలై అనకాపల్లిని వదిలి విశాఖకు మకాం మార్చేశారు. తనను నమ్ముకున్న క్యాడర్ను గాల్లో వదిలేశారు. ఆనాటి కొణతాల వర్గమంతా వైఎస్సార్సీపీలో చేరి ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తదితర పదవుల్లో ఉన్నారు. 2019లో గుడివాడ అమర్నాథ్ వెంట నడిచిన వీరంతా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ గెలుపునకు కృషి చేస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రజల్లోకొచ్చిన కొణతాల జనసేన పార్టీలో చేరి, టీడీపీ, బీజేపీ పొత్తుతో అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. కానీ క్యాడర్ కరువై విలవిల్లాడుతున్నారు. తమ పాత వర్గమంతా కొణతాల గెలుపు కోసం పనిచేయాలని ఆయన సోదరుడు పెదబాబు కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో కనీసం కొణతాలకు వ్యతిరేకంగా చురుగ్గా పనిచేయకుండా గమ్మున కూర్చోవాలని ఆయన తెరవెనుక బెదిరింపులకు దిగుతున్నారట. కొందరు నాయకులకు ఫోన్లు చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ.. మీ సంగతి చూస్తానంటూ దురుసుగా మాట్లాడుతున్నారట. మీ బెదిరింపులకు ఎవరు భయపడతారని, మా మీద మీ పెత్తనమేమిటని వారంతా ఎదురుతిరగడంతో చేసేది లేక పెదబాబు మిన్నకుండిపోయారట. కొణతాల రామకృష్ణ మంత్రిగా ఉన్న కాలంలో అనకాపల్లికి చేసిందేమీలేదు. ప్రజలు ఆయన్ను కలిసి సమస్యలు చెప్పుకునే పరిస్ధితి ఏనాడూ లేదు. నియోజకవర్గంలో పాలన, అధికారం మొత్తం ఆయన సోదరులు పెదబాబు, రఘుబాబులదే. వ్యాపారులను బెదిరించి నెలవారీ మామూళ్లతో దోచుకున్నారు. సమస్యలపై వస్తే గంటలపాటు నిల్చోబెట్టేవారు. వారి ఆగడాలతోనే కొణతాల పరాజయం పాలయ్యారని అనకాపల్లిలో అందరూ చెప్పేమాట. తాను గెలిస్తే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తానని, రాజకీయాల్లో వారి పాత్ర లేకుండా చేస్తానని మద్దతిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు కొణతాల ఇచ్చిన హామీ పెదబాబు బెదిరింపులతో మూలకు చేరింది. -
మోదీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి
● సీఎం జగన్ అవినీతిరహిత పాలన దేశానికే ఆదర్శం ● స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఊసెత్తని ప్రధాని: ఎంపీ సత్యవతి తుమ్మపాల: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో అందించిన అవినీతి రహిత పాలన దేశానికే ఆదర్శమని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుపొంది అధికారం చేపడుతుందని ఎంపీ బి.వి.సత్యవతి అన్నారు. పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇవ్వవలసిన రూ.48 వేల కోట్లు మంజూరు చేస్తే రెండు మూడేళ్లలో పూర్తిచేసి ప్రజలకు అందిస్తామనిచెప్పారు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.15 వేల కోట్లను గత టీడీపీ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ మంత్రులు అనేకసార్లు మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్ ప్రభుత్వానికి అవినీతిని అంటగడుతూప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య లను వెనక్కు తీసుకోవాలన్నారు. రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదంటూ అవాస్తవాలు చెప్ప డం నరేంద్ర మోదీకి తగదన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్న చంద్రబాబు మాటలకు బీజేపీ వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ప్రత్యేక హోదాపై మోదీని టార్గెట్ చేస్తూ చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలు చేశారని,అదే చంద్రబాబుకు మద్దతుగా ఇప్పుడు నరేంద్ర మోదీ మాట్లాడడంతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారన్నారన్నారు. స్టీల్ప్లాంట్ ఊసేత్తని మోదీకి ఈ ప్రాంతంలో మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్సార్సీపీ..మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించే ప్రయత్నం చేసిందని,కార్మికులకు బకాయిలను పూర్తిగా చెల్లించిందని చెప్పారు. పాచిపోయిన ల డ్డూలు, చెంబుడు నీళ్లు, మట్టిని అమరావతికి తెచ్చా రని విమర్శించిన మరో నాయకుడు పవన్ కల్యాణ్తో ఇప్పుడు మోదీ ఎలా జత కట్టారో అర్థం కావడం లేదన్నారుడిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం వెళ్లి కుటుంబ వ్యవహారాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి సి.ఎం.రమేష్ తల దూర్చి రాజకీయాలు చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. -
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
● కలెక్టర్ రవి పట్టన్శెట్టి తుమ్మపాల: జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ రవి పట్టన్శెట్టి తెలిపారు. పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లతో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గంలో (పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంతో కలిపి) 15,96,916 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో 4,449 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారని తెలిపారు. 1,828 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 1,859 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,927 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 7,480 మంది ఇతర పోలింగ్ అధికారులు, 380 మంది సూక్ష్మపరిశీలకులను నియమించినట్టు చెప్పారు. 85 సంవత్సరాలు నిండిన, దివ్యాంగులైన వెయ్యి మంది హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేయగా, వారిలో 880 మంది ఆ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలిపారు. అత్యవసర సేవలకు చెందిన 1,340 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్కు అనుమతివ్వగా ఇప్పటి వరకు 341 మంది వినియోగించుకున్నట్టు చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 11,518 మంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేయగా ఈ నెల 6వ తేదీ నాటికి వారిలో 5,126 మంది ఓటు వేశారన్నారు. పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ బూత్ ఏజెంట్లను నియమించాలని తెలిపారు. ఇతర నియమ నింబంధనలను గురించి వివరించారు. ఈ సమావేశంలో డీఆర్వో బి.దయానిధి, నోడల్ అధికార్లు ఏపీఎంఐపీ ఏడీ జి.వి.లక్ష్మి, మత్స్యశాఖ డీడీ పి.ప్రసాదు, పశుసంవర్ధక శాఖ జేడీ బి.ప్రసాదు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు డి.రామ్మూర్తి, వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు పి.ఉమాదేవి (బీఎస్పీ), వి.అభిషేక్ (కాంగ్రెస్), పి.ప్రకాశరావు (పిరమిడ్ పార్టీ), ఎం.సంగీత్ (బీజేపీ), ఎ.అనిల్ కుమార్ (వైఎస్సార్సీపీ), ఎస్కే భాషా (ఇండిపెండెంట్) పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, విద్యుత్, తాగునీరు, దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్, మరుగుదొడ్డి, దివ్యాంగ ఓటర్లకు సహాయకుడు విధిగా ఉండాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు జనరేటర్, నీడ కోసం టెంటు ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏర్పాట్లకు ఎన్నికల నిధుల నుంచి ఖర్చు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తగిన భద్రతతో పాటు అగ్నిమాపక పరికరాలు కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో 340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పట్టిష్టమైన బందోబస్తు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి, నోడల్ అధికారులు ఎస్డీసీలు సుబ్బలక్ష్మి, కె.రమామణి, జీఎస్డబ్ల్యూఎస్ అధికారి మంజులవాణి, డీఎంహెచ్వో డాక్టర్ ఎ.హేమంత్, సీపీవో జి.రామారావు, డీఆర్డీఏ పీడీ శచీదేవి, డీఎస్వో కె.వి.ఎల్.ఎన్. మూర్తి పాల్గొన్నారు. -
దేవరాపల్లిలో టీడీపీకి మరో బిగ్ షాక్
● 25 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక దేవరాపల్లి : మండల కేంద్రంలో టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలకమైన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి విదితమే. తాజాగా టీడీపీకి చెందిన మరో 25 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. తారువలో సోమవారం రాత్రి మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లె అనురాధ వీరందరికీ పార్టీ కండువాలను వేసి సాదరంగా ఆహ్వానించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపద సమయంలో అండగా నిలవడంతో పాటు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నాయకత్వంపై ఆకర్షితులమై వైఎస్సార్సీపీలో చేరామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎంపీగా బూడి ముత్యాలనాయుడును, ఎమ్మెల్యేగా ఈర్లె అనురాధను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తామంతా కష్టపడి పని చేస్తామని వారంతా ముక్త కంఠంతో స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో సబ్బవరపు కొండలరావు, వెలుసూరి అప్పారావు, కంకడాల సన్నిబాబు, గంగవంశం సంతోష్, కాటపల్లి దేముడు, మూనూరి సన్నిబాబు, కాటపల్లి వంశీ, కాటపల్లి త్రిమూర్తులు, మలుగు అప్పారావు, కణితి విశాల్ కుమార్, రంధి సన్ని, వెలుసూరి ప్రేమ్, కంకడాల రాజు, కండేపల్లి దాసు, రంధి గౌరీష్, కండేపల్లి భరత్కుమార్, ఆతవ భరత్కుమార్, వెలుసూరి అర్జున, సబ్బవరపు శివ ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బాబురావు, కొప్పల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డా. సింహాచలంనాయుడు, సీనియర్ నాయకులు లలితనాయుడు, అప్పలరాజు, జేసీఎస్ మండల కన్వీనర్ రమణ, రాంబాబు, త్రినాథ్, కొరుపోలు శ్రీను, వరదపురెడ్డి రమేష్ పాల్గొన్నారు. -
రూ.10 లక్షల విలువైన మద్యం పట్టివేత
చోడవరం రూరల్: ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి భారీ ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం మంగళవారం పట్టుకుంది. వీటి విలువ పది లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం నంబర్ –4 ఇన్చార్జి సత్యంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నర్సాపురం–దుడ్డుపాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఇటుకల బట్టీల దరి పెద్ద ఎత్తున మద్యం నిల్వలను కనుగొన్నారు. పొదల్లో 120 కేసుల మద్యం సీసాలతోపాటు మరొక గోనె సంచిలో 73 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5,833 మద్యం క్వార్టర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యాన్ని గోవాలో తయారు చేసినట్టుగా గుర్తించారు. వీటిపై రాయల్ గ్రీన్ విస్కీగా లేబిల్ ఉంది. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చోడవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ –4 ఏఎస్ఐ, సీసీ పాల్గొన్నారు. ● 5,833 మద్యం క్వార్టర్ సీసాలు స్వాధీనం -
సింహాద్రి ఎన్టీపీసీకి ఎక్స్లెన్స్ అవార్డు
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ 2023 సంవత్సరానికి అపెక్స్ ఇండియా ఫౌండేషన్ ద్వారా సీఎస్సార్ ఎక్స్లెన్స్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ప్లాటినం అవార్డును పొందడం చాలా సంతోషంగా ఉందని సంస్థ హెచ్ఆర్ డీజీఎం శ్రీమంత మహాపాత్ర అన్నారు. ఈ నెల 4న ఢిల్లీలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని అపెక్స్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధుల నుంచి ఎక్స్లెన్స్ అవార్డును ఆయన స్వీకరించారు. సమాజ అభివృద్ధి, స్థిరమైన పద్ధతులను పాటించినందుకు ఎన్టీపీసీ సింహాద్రికి ఈ అవార్డు దక్కిందని చెప్పారు. సామాజిక బాధ్యతలో అత్యుత్తమ విజయాలు సాధించిన వివిధ కార్పొరేట్ పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా అఫెక్స్ ఇండియా ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విద్య, పర్యావరణం, ఆరోగ్యం, సంరక్షణ కార్యక్రమాలపై చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవన ప్రమాణాలపై సింహాద్రి ఎన్టీపీసీ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రొత్సహించడమే ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం. -
మోదీ సభతో ఒరిగిందేమిటి?
● ప్రత్యేక హోదా, విభజన హామీల ప్రస్తావన లేదు ● రైల్వే జోన్పై కేంద్రం దొంగ నాటకాలు ● ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం రమేష్ గాలి మాటలు ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ధ్వజందేవరాపల్లి : ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ పసలేని ప్రసంగాలతో మరోమారు మోసగించారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న విమర్శించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సీపీఎం మండల కార్యదర్శి బి.టి.దొరతో కలిసి మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని కనీసం నోరు మెదపకపోవడం దుర్మార్గమని వెంకన్న అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై తమ వైఖరిని వెల్లడించకుండా ప్లాంట్ను ప్రైవేటీకరించే మోదీని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ప్రశంసలతో ముంచెత్తడం అత్యంత దారుణమన్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనను గెలిపిస్తే స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తానని, ప్రధానమంత్రితో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని ఊదరగొట్టిన రమేష్ ఆ విషయం మోదీతో ఎందుకు చెప్పించలేక పోయారని ఎద్దేవా చేశారు. సీఎం రమేష్వి గాలి మాటలేనని తేలిపోయిందన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, సొంత గనుల కేటాయింపు తదితర ప్రాధాన్యత అంశాలను మోదీ ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజల మనోభావాలను పట్టించుకోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైల్వే జోన్పై సైతం కేంద్రం దొంగ నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ను, అతనికి మద్దతిస్తున్న టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులను చిత్తుగా ఓడించి దేశ ఐక్యతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రజలకు సీపీఎం నేత డి. వెంకన్న పిలుపునిచ్చారు. -
పేదల పొట్ట కొడుతున్న చంద్రబాబు
● రైతులు, విద్యార్థులు, మహిళలపై కక్షసాధింపు ● విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలకు మోకాలడ్డు ● బీజేపీతో పొత్తు.. ఈసీపై ఒత్తిళ్లు ● బూడి ముత్యాలనాయుడు ధ్వజం అనకాపల్లి: పేదలపై చంద్రబాబు కక్షసాధిస్తున్నారని, అమలులో ఉన్న పథకాలను కూడా వారికి అందకుండా కుట్రలుపన్నారని ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీతో పొత్తు తరువాత మారిన పరిస్థితులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు దారుణాలకు ఒడిగడుతున్నారని, ఆయన ఫిర్యాదులతోనే డీబీటీ పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ నిరాకరిస్తోందని తెలిపారు. ఎన్నికల కమిషనా లేక ఎన్టీయే కమిషనా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. చంద్రబాబు ఫిర్యాదు ఇవ్వడం, వెంటనే నిజానిజాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన ఎత్తులను, జిత్తులను ప్రయోగించి ఈసీపై ఒత్తిడి తెచ్చి పథకాలను అడ్డుకుంటున్నారని, దీని వల్ల లక్షలమంది లబ్ధిదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. విద్యాదీవెన కింద 9,44,665 మంది విద్యార్థులకు రూ.708.7 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉందన్నారు. 4,19,583 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.1,294 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని కూడా అడ్డుకున్నట్టు డిప్యూటీ సీఎం బూడి తెలిపారు. చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా పథకాల లబ్ధిని అందించే విషయంపై ఈసీ ఇంకా తేల్చకపోవడం దారుణమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మందికి ఇవ్వాల్సిన రూ.5,065 కోట్ల చేయూత, 4,19,583 మందికి రూ.629 కోట్ల ఈబీసీ నేస్తం, రూ.1839 కోట్ల ఆసరా నిధుల విడుదలను చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎంగా ప్రయాణస్వీకారం చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ పద్ధతి ద్వారా నగదు జమచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకా రవి, అనకాపల్లి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు బి.కాశీవిశ్వనాథం, పార్టీ పార్లమెంట్ ఉప పరిశీలకుడు కొండా రాజీవ్, జిల్లా గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు కాండ్రేగుల విష్ణుమూర్తి పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు -
అతి పురాతన డివిజన్.. గత చరిత్రకు సాక్ష్యం!
దేశ స్వాతంత్య్రోద్యమ స్మృతి చిహ్నాలకు నెలవు.. కళాకారులకు పుట్టినిల్లు.. ధారమట్టం, సరుగుడు జలపాతాల సోయగం.. తాండవ జలాశయం పరవళ్లు.. కమ్మని రుచి పంచే కాఫీ క్యూరింగ్ కేంద్రం.. యువ ఐఏఎస్, ఐపీఎస్లు తొలి పోస్టింగ్ కోరుకునే ప్రాంతం.. ఇదీ నర్సీపట్నం ముఖచిత్రం. అతిపురాతన డివిజన్గా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో గత చరిత్రకు సాక్ష్యాలెన్నో అడుగడుగునా సాక్షాత్కరిస్తాయి. నర్సీపట్నం: దేశ స్వాతంత్య్రోద్యమ స్మృతి చిహ్నాలతో అలరారే నర్సీపట్నం అలనాటి బ్రిటిష్ పాలన వైభోగాన్ని గుర్తుకు తెస్తోంది. ఇక్కడ పెద్ద చెరువు వద్ద రజక మహిళ నర్సమ్మ నివాసం ఉండేది. అప్పట్లో బ్రిటిష్ వారికి చేసిన సేవకు ప్రతీకగా ఆమె పేరు నర్సీపట్నానికి నామకరణం చేసినట్టు ప్రతీతి. ఈ పట్టణంలో 1923లో నిర్మించిన ఏఎస్పీ, సబ్ కలెక్టర్, తహసీల్దారు కార్యాలయాలు, అప్పటి వారి గృహాలు దర్శనమిస్తాయి. 1922– 24 మధ్య కాలంలో ఏజెన్సీలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కొనసాగించిన మన్యం పితూరీ పోరాటాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు నర్సీపట్నం కేంద్రంగా పోలీస్, సైనిక చర్యలు చేపట్టారు. ఆయన్ను కొద్దిరోజుల పాటు గృహ నిర్బంధం చేశారు. ఆనాటి నుంచి అల్లూరి సాయుధ పోరాటానికి ప్రతీకగా నర్సీపట్నం నిలుస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి ఎందరో ప్రముఖులు సబ్ కలెక్టర్లుగా, ఏఎస్పీలుగా ఇక్కడ పనిచేయడంతో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. యువ ఐఏఎస్, ఐపీఎస్లు శిక్షణ అనంతరం తమ తొలి పోస్టింగ్కు నర్సీపట్నం కోరుకుంటూ ఉంటారు. 120 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీగానే కొనసాగి, 2012లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. రాష్ట్రంలో అతి పురాతన రెవెన్యూ డివిజన్లలో ఒక్కటిగా గుర్తింపు పొందింది. నియోజకవర్గం స్వరూపం: జిల్లాలో రాజకీయంగా, చారిత్రాత్మకంగా ప్రాధాన్యం సంపాదించుకున్న నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం తొలుత గొలుగొండ నియోజకవర్గంలో విలీనమై ఉండేది. 1955 ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారు. 1962లో ఏకసభ్య నియోజకవర్గంగా నర్సీపట్నం అవతరించింది. రాజకీయ పోరు : టీడీపీ ఆవిర్భావానికి ముందు తంగేడు రాజులే ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఎమ్మెల్సీగా పని చేసిన రుత్తల లత్సాపాత్రుడు మనవుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 1962 నుంచి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, 6 దఫాలు టీడీపీ విజయం సాధించింది. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్పై మంత్రి అయ్యన్నపాత్రుడు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్సీపీ అభ్యర్థి గణేష్ చేతిలో అయ్యన్నపాత్రుడు 24 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పొందారు.నియోజకవర్గ ప్రత్యేకతలుబలంగా అధికార పార్టీ... నియోజకవర్గంలో అధికార పార్టీ గతంలో కంటే మరింత బలపడింది. అందరితో సౌమ్యంగా ఉండే ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎనలేని అభివృద్ధి చేసి ప్రజల్లో ఆదరణ చూరగొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడుతో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నాయకుడు రుత్తల యర్రాపాత్రుడుతోపాటు పలువురు చేరికలతో పార్టీకి బలం చేకూరింది. మరోవైపు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని ఏలిన ఆయన నోటి దురుసుతనంతోపాటు అవినీతికి కేరాఫ్గా మారడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా నియోజకవర్గంలో కాపు, ఎస్సీ, ఎస్టీ కులాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండగా, గతంలో టీడీపీకి వైపు ఉన్న బీసీలు ఈ దఫా అధికార పార్టీ పంచన చేరారు. చెక్కు చెదరని స్వాతంత్య్రోద్యమ స్మృతి చిహ్నాలు సస్యశ్యామలం చేస్తున్న తాండవ ఉభయ రాష్ట్రాల్లో ఏకై క కాఫీ క్యూరింగ్ కేంద్రం ధారమట్టం, సరుగుడు జలపాతాల సోయగం సినీ రంగ కళాకారులకు పుట్టినిల్లు ఆధ్యాత్మిక కేంద్రాలకు నెలవు నర్సీపట్నానికి ఎనలేని ఖ్యాతి సొంతంనర్సీపట్నం నియోజకవర్గం ఓటర్లు మొత్తం ఓటర్లు : 2,12,046 పురుషులు : 1,02,747 మహిళలు : 1,09,295 థర్డ్ జెండర్ : 4 బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం, పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. నర్సీపట్నం ప్రజల ఆరాధ్య దైవం మరిడిమహాలక్ష్మి జాతర మూడేళ్లకోసారి నిర్వహిస్తుంటారు. నర్సీపట్నం నడిబొడ్డున హైవర్టు, కవర్టు బ్రిటిష్ సైనికాధికారుల సమాధులు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటు కానున్న మెడికల్ కళాశాల, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉండడంతో విద్యా కేంద్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ధారమట్టం, సరుగుడు జలపాతాలు పర్యాటక ప్రదేశాలుగా విరాజిల్లుతున్నాయి. ఉభయ రాష్ట్రాలకు సంబంధించి కాఫీ క్యూరింగ్ కేంద్రం నర్సీపట్నంలో ఉంది. ఇక్కడ శుద్ధి చేసిన మన్యం కాఫీకి విదేశాల్లో మంచి ఆదరణ లభిస్తోంది. విశాఖ, తూర్పుగోదావరి జల్లాల్లో 52 వేల ఎకరాలకు సాగు నీరందించే తాండవ రిజర్వాయరు ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి నీటిని సరఫరా చేస్తున్న ఏలేరు కాలువ ప్రాజెక్టుకు చెందిన డీప్ కట్ టన్నల్ సైతం ఇక్కడే ఉంది. సినీ దర్శకులు గుణశేఖర్, పూరీ జగన్నాథ్, పరశురామ్, టీవీ యాంకర్లు జోగినాయుడు, సైరాభానుతోపాటు ఇతర సినీ విభాగాల్లో పనిచేస్తున్న పలువురు వర్థమాన నటీనటులు, సహాయ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, చిత్ర నిర్మాతలు ఈ నియోజకవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. -
నిబంధనలు ఉల్లంఘిస్తే..ఓటు వేయకుండా చర్యలు
యలమంచిలి రూరల్ : పోలింగ్ రోజు బూత్కు వచ్చిన ఓటరు గోప్యతను పాటించకుండా ఓటును బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టుగా అధికారులు భావిస్తారు. అలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిని ఓటు వేయడానికి అనుమతించరు. అలాగే గుడ్డివారై ఉండి, గుర్తులను తెలుసుకోలేని పరిస్థితి ఉంటే, సదరు ఓటు వేసే అంధత్వ వ్యక్తితో పాటు ఓ వ్యక్తిని పోలింగ్ బూత్లోకి అధికారులు అనుమతిస్తారు. అంధత్వ వ్యక్తికి సహాయంగా వెళ్లే వ్యక్తికి 18 ఏళ్లు నిండి, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకువస్తేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. అలాగే ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినపుడు అతడి ఓటును అప్పటికే ఎవరైనా వేస్తే, టెండర్ ఓటుగా పరిగణించి, పోలింగ్ అధికారుల వద్ద ఉండే బ్యాలెట్ పేపర్లో ఒక పేపర్ ఇస్తారు. దానిపై పాత పద్ధతిలో ఓటు వేయవచ్చు. ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినపుడు బోగస్ ఓటు అని, తక్కువ వయసు అని పోలింగ్ ఏజెంట్లు ఛాలెంజ్ చేస్తే, పోలింగ్ అధికారి ఏజెంట్ నుంచి వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే సదరు ఓటర్ను పోలీస్ సిబ్బందికి అప్పగిస్తారు. ఒక ఓటర్ తాను నచ్చిన వ్యక్తికి ఓటు వేస్తే, అది వేరే పార్టీకి పడినట్లు ఆరోపణలు చేస్తే, అధికారులు టెస్ట్ ఓటుకు అనుమతిస్తారు. అయితే ఆరోపణ రుజువు కాకుంటే చర్యలు తీసుకుంటామని కూడా సదరు ఓటర్ను ముందే హెచ్చరిస్తారు. -
చంద్రబాబు కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి
అనకాపల్లి: పేద ప్రజలకు రాష్ట్రంలో అనే సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అడ్డుకోవడం అన్యాయమని జిల్లా పార్లమెంట్ ఉప పరిశీలకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండా రాజీవ్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పసుపు, కుంకుమ కింద నగదు జమచేస్తుంటే అప్పటి ఈసీ ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తుంటే అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వలంటీర్ వ్యవస్థను నాశనం చేసిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. పై నిర్ణయాన్ని ఈసీ పునః పరిశీలించాలని ఆయన కోరారు. పొత్తు పెట్టుకున్న పార్టీలకు అనకాపల్లి జిల్లాలో ఎంపీ అభ్యర్థి లేక, కడప నుంచి దిగుమతి చేసుకున్నారని అన్నారు. పదవులు ఇతర జిల్లా వ్యక్తులకు కట్టబెడితే, స్థానికులు పార్టీల జెండాలు మోసే బానిసలుగా బతకాలా..? స్థానిక బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకా రవి పాల్గొన్నారు. -
మోదీ వచ్చారు.. వెళ్లారు..
● కేవలం 25 నిమిషాలు గడిపిన ప్రధాని ● ముందుగా తాను ప్రసంగించాలన్న చంద్రబాబు ఆశలు ఆవిరి ● పీఎం వెళ్లిన వెంటనే కదిలిన జనం ● ఖాళీ కుర్చీలకే బాబు ప్రసంగం సాక్షి, అనకాపల్లి, కశింకోట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లాలో కేవలం 25 నిమిషాలు గడిపారు. త్వరగా ప్రసంగం ముగించి, చకచకా వెళ్లిపోయారు. ఆయన ముందు తన వాగ్ధాటి ప్రదర్శించాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కశింకోట మండలం ఉగ్గినపాలెంలో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ప్రధాని రిజర్వుడుగా కనిపించారు. ఆయన కంటే ముందు ప్రసంగించాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు గానీ నాయకులను పరిచయం చేసుకొని, 20 నిమిషాలు మాట్లాడి ప్రధాని సభ నుంచి నిష్క్రమించారు. దీంతో చంద్రబాబు కంగుతిన్నారు. ప్రధాని వెళ్లిన వెంటనే సభ ఖాళీ అయిపోయింది. ఖాళీగా ఉన్న కుర్చీలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించాల్సివచ్చింది. చంద్రబాబు మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించినా సభప్రాంగణంలో కనీసం ఒక్కరు కూడా ఈలలు వేసిన సందర్భాలు లేవు. ప్రధానమంత్రి రాక సందర్భంగా భారీ పోలీసు భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. డీఐజీ విశాల్ గున్ని, ఎస్పీ మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై సుమారు 3 గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిపి వేయడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మొన్న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కూడా బీజేపీ ప్రతినిధి అంటీముంటనట్టు వ్యవహరించారు. ఈరోజు ప్రధాని తన ప్రసంగానికే పరిమితమై 25 నిమిషాల్లో వెనుదిరిగారు. దీంతో టీడీపీ, జనసేన క్యాడర్లో ఉత్సాహం చల్లారిపోయింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement