-
వైఎస్సార్సీపీలోకి వలసలు
పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నుంచి పలువురు నేతలు వైఎస్సార్సీపీలో బుధవారం చేరారు.తిరుపతి భూములపై కన్ను ఆరణి శ్రీనివాసులు కన్ను ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలోని అత్యంత విలువైన భూములపై పడింది. ఆయన ముందు చూపు ఎలా ఉంటుందంటే.. రెండు పర్యాయాలు తాను ఎమ్మెల్యేగా చిత్తూరులో పోటీ చేసి ఓడిపోయినందుకు కూడా బాధపడరు. తన ఓటమి, గెలుపునకు ఎంతెంత ఖర్చయ్యిందో రూపాయితో సహా లెక్కలు రాసుకుంటారు. అలా చిత్తూరులో గత ఐదేళ్లుగా భూ బకాసురుడి అవతారంలో తన జమాఖర్చులను పూర్తిగా సరిచేసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంపై కన్నేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి..? ఎలా తెలుసుకోవాలి..? అనేదానిపై దృష్టి పెట్టారు. గతంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఓ అధికారిని, ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు చిత్తూరు రెవెన్యూ విభాగంలో పనిచేసిన మరో విశ్రాంత అధికారిని వెంటబెట్టుకున్నారు. వారి ద్వారా భూ రికార్డులు, క్షేత్రస్థాయిలో తిరుపతి నియోజకవర్గంలోని భూముల స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా చిత్తూరు నుంచి ఓ బృందాన్ని తీసుకువచ్చి తిరుపతిలో ఈ వివరాలను సేకరించే పనులు అప్పగించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కుమ్మరించిన రూ.కోట్లను గెలిచిన తర్వాత రాబట్టుకునేందుకు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు సమాచారం. – 8లో -
అభివృద్ధిని ఆశీర్వదించండి
● ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశాం ● పుంగనూరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం ● ప్రజాసమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశాం ● మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రొంపిచెర్ల : పుంగనూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని, ఫ్యాను గుర్తుకు ఓటేయాలని మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రొంపిచెర్ల మండలంలోని దద్దాలవారిపల్లె, కొండారెడ్డిగారిపల్లె, బండకిందపల్లె గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం రొంపిచెర్ల గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ టీడీపీ పాలనలో అభివృద్ధిని వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధిని పరిశీలించాలని కోరారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని విమర్శించారు. మళ్లీ మోసపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్న చంద్రబాబును ఓటుతో తరిమి కొట్టాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశారని వెల్లడించారు. సీఎం జగన్ సహకారంతో పుంగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తారు రోడ్లు, సీసీ రోడ్లు, తాగునీటి ట్యాంకులు నిర్మించామని తెలిపారు. నవరత్న పథకాలతో ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందించామని వివరించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇబ్రహీంఖాన్, సింగిల్ విండో అధ్యక్షుడు దేవులపల్లె హరినాథరెడ్డి, నాయకులు చెంచురెడ్డి, కమలాపురం శ్రీదేవిరెడ్డి, కోటా వెంకటరమణ, ప్రసాద్ నాయుడు, యుగంధర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, అన్సర్బాషా, హరికృష్ణారెడ్డి, యర్రంరెడ్డి, ఎన్.విజయకుమార్ రెడ్డి, జి.రామచంద్రారెడ్డి, విజయభాస్కర్రెడ్డి, నూలు రెడ్డెప్ప, నాగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, చిన్న నాగరాజా, లక్ష్మయ్య, అలీంఖాన్, సురేంద్ర నాయుడు, బాబు, రామనారాయణ రెడ్డి, లక్ష్మన్న,ప్రకాష్ రెడ్డి, సైఫుల్లాఖాన్ పాల్గొన్నారు. -
సంక్షేమ వెలుగులు.. ప్రగతి పరుగులు
ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ‘సాక్షి’ బృందం బుధవారం చిత్తూరు నియోజకవర్గంలో పర్యటించింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానికుల మనసులో మాటను రాబట్టింది. ముందుగా చిత్తూరు నగరంలో మొదలైన రోడ్ షో గుడిపాల.. వసంతాపురం.. బసవాపల్లె.. శ్రీరంగంపల్లె.. పేయనపల్లె.. చీలాపల్లె.. తాళంబేడు.. గువ్వకల్లు.. పెరుమాళ్లకండ్రిగ మీదుగా కొనసాగింది. ఈ క్రమంలో ఒకప్పుడు పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ప్రాంతంలో ప్రగతి వెలుగులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కాంతులు లబ్ధిదారుల చిరునవ్వుల్లో కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి అలసత్వం వహించినా.. సర్కారు చొరవ కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. – చిత్తూరు అర్బన్/చిత్తూరు రూరల్/గుడిపాల/చిత్తూరు కార్పొరేషన్/చిత్తూరు అగ్రికల్చర్/ చిత్తూరు కలెక్టరేట్ ‘గుడ్’మార్నింగ్ -
డౌన్లోడ్.. ఓటర్ స్లిప్!
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల పోలింగ్కు సంబంధించి ఓటరు స్లిప్లను బీఎల్ఓలు పంపిణీ చేస్తున్నారు. అయితే ఓటర్ స్లిప్లు అందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెబ్సైట్ నుంచి నేరుగా ఓటరు స్లిప్ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది. ఈ క్రమంలో రెండు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటి విధానం ఆన్లైన్లో www.electroralsearch.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అందులో తొలుత సెర్చ్ బై డిటైల్స్ క్లిక్ చేసి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాలను నమోదు చేయాలి. అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. తర్వాత కింది భాగంలో కనిపించే క్యాప్చర్ కోడ్ను దాని పక్కనే ఉన్న గడిలో టైప్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వెంటనే ఓటర్ స్లిప్ డిస్ప్లే అవుతుంది. రెండో విధానం ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ను సంబంధిత గడిలో ఎంటర్ చేయాలి. రాష్ట్రం ఎంపిక చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ని గడిలో ఎంటర్ చేసి సెర్చ్ నొక్కాలి. తర్వాత ఓటరు వివరాలు కనిపిస్తాయి. పేరుకు ముందు వ్యూ డిటైల్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఓటరు పూర్తి వివరాలతో ఫొటో లేని ఓటరు స్లిప్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. -
జగన్ వెంటే జనం
ఐరాల: శత్రువులంతా ఏకమై ఎన్నికల బరిలో దిగినా, ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని పొలకల పంచాయతీలో ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే రాష్ట్రం మరో పదేళ్లు వెనుకబడుతుందన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీలు ప్రకటిస్తున్న అసత్య పథకాలను నమ్మవద్దని, మే 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ను గెలిపించాలని కోరారు. చంద్రబాబు అనైతిక పొత్తులతో ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని, వారిని ఓటుతో తరిమికొట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ మోహన్, నియోజకవర్గ పరిశీలకుడు మోహన్రెడ్డి, మహిళ, శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజాచరణ్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుచిత్ర, ఎంపీటీసీ సభ్యుడు సాగర్రెడ్డి, నేతలు ప్రభాస్కుమార్రెడ్డి, చలపతిరెడ్డి, గణేష్రెడ్డి, వినయ్కుమార్రెడ్డి, టెరిన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, శేషాద్రి, ప్రసాద్, ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. -
‘కూటమి’కి ఓటమి తప్పదు
నగరి : ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదని, ఫ్యాన్ ప్రభంజనం తథ్యమని మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా తెలిపారు. బుధవారం మండలంలోని తడుకుపేట, ముడిపల్లె, మేళపట్టు పంచాయతీల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ 35 ఏళ్లలో ఎవరూ చేయని అభివృద్ధిని తాను చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి గొడవలు లేకుండా నియోజకవర్గంలో ప్రశాంతవాతావరణ నెలకొల్పామని తెలిపారు. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించామన్నారు. ప్రజాసేవే పరమావధిగా అహర్నిశలు పనిచేస్తున్నామని, మరింత సేవలందించేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్ననే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. మూడో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు గాంధీ, ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీ కన్నియప్ప, పార్టీ మండల కన్వీనర్ సుదర్శననాయుడు, సచివాలయాల మండల కన్వీనర్ హరి, సర్పంచ్లు ప్రకాష్, శ్రీదేవి, కౌసల్య, నాయకులు సంజీవిరెడ్డి, శేఖర్శెట్టి, నాగరత్నం, కోదండరెడ్డి పాల్గొన్నారు. -
‘పోస్టల్’ ఓటింగ్కు నేడే ఆఖరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గురువారంతో ముగియనుంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఐదు రోజుల పాటు పాటు ఉద్యోగులు ఓటింగ్ వేసేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో బుధవారం వరకు మొత్తం 11,076 మంది పోస్టల్బ్యాలెట్ సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ 1,071 మంది ఉద్యోగులు ఓటేయాల్సి ఉందని తెలిపారు. ఏడు నియోజకవర్గాలకు గాను అత్యధికంగా చిత్తూరు అసెంబ్లీలో 2,410 మంది ఉద్యోగులు ఓటేయగా, పుంగనూరులో 1,806, నగరిలో 1,142, జీడీ నెల్లూరులో 1,540, పూతలపట్టులో 1,476, పలమనేరులో 1,776, కుప్పంలో 926 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వాడుకున్నట్లు వివరించారు. పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పర్యవేక్షించారు. సబ్రిజిస్ట్రార్, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ చిత్తూరు కార్పొరేషన్: అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన కుప్పం సబ్రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్బాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో నిబంధనల ప్రకారం వారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్శాఖ డీఐజీ గిరిబాబు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. వారి స్థానంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ప్రదీప్ను సబ్రిజిస్ట్రార్గా, పుంగనూరు జూనియర్ అసిస్టెంట్ భాస్కర్నాయుడును జూనియర్ అసిస్టెంట్గా నియమించామని వివరించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు పలమనేరు : లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆస్పత్రులు, ల్యాబ్లను సీజ్చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి హెచ్చరించారు. బుధవారం పలమనేరులోని జయభారతి స్కానింగ్ సెంటర్, కమల్ స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు రహస్యంగా టెస్ట్లు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. అందుకే ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం పట్టణంలోని అర్బన్ ఆస్పత్రిని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పాతపేట సచివాలయానికి వెళ్లి ప్రతి బుధవారం పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్యాధికారులు నిరంజన్కుమార్, ఆశ సబ్యూనిట్ అధికారి జయశంకర్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 65,146 మంది స్వామివారిని దర్శించుకోగా 25,306 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
సంక్షేమానికి పట్టం కట్టండి
కార్వేటినగరం : వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. బుధవారం ఆయన స్వగ్రామం పాదిరికుప్పంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందించారని, దళితులకు పెద్ద పీట వేశారన్నారు. దళితుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టిన ఘనత జగనన్నకే దక్కుతుందని వెల్లడించారు. విజయవాడ నడిబొడ్డున 210 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి దళిత పక్షపాతి అని నిరూపించుకున్నారని వివరించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై చంద్రబాబు కనీసం స్పందించలేదని మండిపడ్డారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నేతలు డబ్బులిచ్చి తమను తిట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చవకబారు పనులు మానుకోకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దళితుల మధ్య చిచ్చుపెట్టడమే టీడీపీ నేతల లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకొస్తున్న తన కుమార్తె కృపాలక్ష్మిని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి మాట్లాడుతూ మీ బిడ్డగా మన ఊరికి వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు. తన తండ్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఆదరించినట్టుగానే తనకు ఓట్లు వేసి అఖండ మెజారిటీ అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లత, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, మండల కన్వీనర్ శేఖర్రాజు, మాజీ కన్వీనర్ ధనంజయవర్మ, సింగిల్ విండో అధ్యక్షుడు లోకనాథరెడ్డి, కోఆప్షన్ మెంబర్ పట్నం ప్రభాకర్రెడ్డి, శ్రీనివాసులు, దేశయ్య, రాజారత్నం, వెంకటస్వామి పాల్గొన్నారు. -
పాలిసెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని పలువురు విద్యార్థులు బుధవారం విడుదల చేసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల (పాలిసెట్) ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. నగరంలోని మిట్టూరులో ఉన్న కుట్టి స్టడీ సర్కిల్లో కోచింగ్ పొందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని స్టడీ సర్కిల్ డైరెక్టర్ పవనకుమారి తెలిపారు. శిక్షణ పొందిన వినయ్ 6,302, రోషిత 12,432, గౌరిప్రియ 22,187 ర్యాంకులు సాధించారని, వీరు ఎస్వీయూ పరిధిలో వందలోపు ర్యాంకులు పొందారి వివరించారు. అలాగే మిట్టూరులోని ప్రతిభా ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీలో శిక్షణ పొందిన వేదప్రకాష్ 1,610, రితిక 2,656, జశ్వంత్ 2,875 ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాళ్లు యోగానంద్, పద్మనాభరెడ్డి వెల్లడించారు. అనంతరం సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు. -
No Headline
అభివృద్ధిని చూస్తున్నాం చిత్తూరులో 20 ఏళ్లుగా డెవలప్మెంట్ లేదు. ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు జరిగాయి. కాలనీల పక్కనే సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఏం సర్టిఫికెట్లు కావాలన్నా అక్కడకు వెళితే పని అవతా ఉండాది. లంచాలు ఇచ్చేది లేదు. ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్లో ఓ మెసేజ్ పెడితే ఆఫీసర్లు పట్టించుకుంటా ఉండారు. ఈమాత్రం ఉంటే చాలు. ఇంత చేస్తున్న నాయకులకు, ప్రభుత్వానికి కాకుండా.. ఎవరో వచ్చి ఏదో ఇస్తారని మోసపోయే పరిస్థితిలో మేము లేము. – భాస్కర్, మురకంబట్టు, చిత్తూరు -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు
పలమనేరు : నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి టీడీపీ, జనసేన నేతలు భారీగా వైఎస్సార్సీపీలోకి వలస వస్తున్నారు. బుధవారం పలమనేరు పట్టణంలోని 60 మంది టీడీపీ, జనసేకు చెందిన యువకులకు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించారు. అలాగే గడ్డూరుకు చెందిన 20 టీడీపీ కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. వి.కోటలో.. వి.కోట: మండలంలోని ఓగు పంచాయతీకి చెందిన నాయకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మహేష్, నాగరాజు, గంగప్ప, అమరనాథ్, భానుచంద్ర తదితరులు ఉన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
గంగవరం : మండల కేంద్రంలోని బాలాజీభవన్ వద్ద మంగళవారం రాత్రి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. కర్ణాటకలోని గంజికుంట గ్రామానికి చెందిన బాబాజాన్(40) పెయింటర్గా పనిచేస్తూ కొంతకాలంగా పలమనేరులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పనిమీద సంగిళి గ్రామం వెళ్లిన బాబా జాన్ తిరుగుప్రయాణంలో బాలాజీ భవన్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో బాబా జాన్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిన్నగోవింద్ తెలిపారు. -
No Headline
ఆదుకున్నవారికే అండగా ఉంటాం నేను చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడిని. గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా ఫ్యాక్టరీని మూసివేయడంతో మాలాంటి కార్మికుల బతుకులు వీధిన పడ్డాయి. కనీసం మాకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు కూడా చెల్లించక ఇబ్బందులు పెట్టారు. అయితే ఈ ప్రభుత్వం మాకు సహకారం అందించింది. రూ. 32 కోట్ల పెండింగ్ బకాయిలను ఒకేసారి చెల్లించింది. మమ్మల్ని ఆదుకున్న వారికే అండగా ఉంటాం. అదే న్యాయం. – కె.దేవేంద్రరెడ్డి, దొడ్డిపల్లె, చిత్తూరు -
చిత్తూరు నగరంలో..
నగరంలోని గంగినేని చెరువు వద్ద గల జగజ్జీవన్రామ్ మున్సిపల్ పార్కును ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేసింది. పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు ఆట వస్తువులను సమకూర్చింది. ఈ పార్కు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఆహ్లాదం పంచుతోంది. గతంలో ఇరుకుగా ఉన్న కొంగారెడ్డిపల్లె రోడ్డును విస్తరించారు. ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించేందుకు ఆక్రమణలు తొలగించారు. అందుబాటులోని బస్షెల్టర్ను ఆధునికీకరించారు. అలాగే గాంధీ విగ్రహ కూడలిని అద్భుతంగా తీర్చిదిద్దారు. చిత్తూరుకు ఐకాన్గా మార్చారు. జిల్లా కేంద్రంలో 15 న్యాయస్థానాలు ఒకే చోట ఉండేలా రూ.42 కోట్ల వ్యయంతో కోర్టు కాంప్లెక్సు నిర్మించారు. -
గుడిపాల మండలంలో...
మండలంలోని మొత్తం 27 పంచాయతీల్లో 17 గ్రామ సచివాలయాలను నిర్మించారు. అఆగే రైతుభరోసా, వెల్నెస్ కేంద్రాలు నిర్మించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తున్నారు. గతంలో ఏది కావాలన్నా మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేవి. పంటలకు సంబంధించి మందులు కావాలంటే చిత్తూరుకు, ఇటు తమిళనాడులోని వేలూరుకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ సమస్యలన్నీ తొలగిపోయయి. ఆర్బీకేల ద్వారానే అన్నీ అందుతున్నాయి. మా కష్టం తెలిసిన వారికే.. మాలాంటి వృద్ధులు ఈ ప్రభుత్వంలో క్షేమంలో ఉన్నారు. ఒకటో తేదీన ఇంటి వద్దకే పింఛన్లు కూడా అందిస్తున్నారు. ఈ రెండు నెలలుగానే కొంతమంది కారణంగా పింఛన్ల కోసం నానా ఇబ్బందులు పడుతున్నాం. ఆరోగ్య సురక్ష పథకం ద్వారా వైద్యుల ద్వారా సేవలు పొందాం. మందులూ, మాత్రలను ఉచితంగానే తీసుకుంటున్నాం. మాకష్టం తెలిసిన వారికే మద్దతుగా నిలుస్తాం. ఆదరించి ఆశీర్వదిస్తాం. – గోవిందరెడ్డి, గుడిపాల చిత్తూరుకు పోవాల్సిన పనిలేదు గతంలో ఏమి కావాలన్నా చిత్తూరుకు వెళ్లే వాళ్లం. ప్రస్తుతం మాకు అన్నీ ఆర్బీకేల ద్వారానే అందుతున్నాయి. సచివాలయం ద్వారా సర్టిఫికెట్లను కూడా వలంటీర్లు ఇంటి వద్దకే తీసుకువచ్చి అందిస్తున్నారు.ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు మాకు సక్రమంగా వస్తున్నాయి. ఇక ఏ పనికీ చిత్తూరుకు పోవాల్సిన పనిలేదు. మాలాంటి గ్రామీణులను ఇంతగా పట్టించుకున్న వారి కోసమే పనిచేస్తాం. – రామకృష్ణారెడ్డి, వసంతాపురం -
No Headline
ఇరుకు రోడ్డు పోయింది మాకు ఎన్నో ఏళ్లుగా కొంగారెడ్డిపల్లెలో చిల్లర అంగడి ఉంది. రోజు మార్కెట్ నుంచి సరుకులు తెచ్చుకుంటాం. ఇంటికి, మార్కెట్కు తిరగతా ఉంటాం. ఇంతకు ముందు ఇరుకు రోడ్డు, దానికి తోడు గుంతలు ఉండటంతో నడుములు పోయేవి. ట్రాఫిక్తో టెన్షన్ వస్తా ఉండేది. ఇపుడు రోడ్డును పెద్దదిగా చేసి విస్తరించారు. ముందున్న ఇబ్బందులు ఇప్పుడు లేవు. పాత రోడ్డు ఉన్నపుడు తరుచూ ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇంతచేసిన వాళ్లకే అండగా ఉంటాం. – రాజ్కుమార్, కొంగారెడ్డిపల్లె, చిత్తూరు -
చిత్తూరు రూరల్ మండలంలో..
మండలంలో ఈ ఐదేళ్లలోనే అభివృద్ది పనులు పరుగులు పెట్టాయి. ప్రధానంగా సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2.50కోట్లు వ్యయం చేసింది. రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణానికి రూ. 1.08కోట్లు వెచ్చించింది. హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ. 1.4 కోట్లుర, సీసీ రోడ్లకు రూ. 3 కోట్లు, డ్రైనేజీ నిర్మాణానికి రూ. 2కోట్లు ఖర్చు చేసింది. మురుగు మరుగైంది మా వీధిలో ఉన్న మురుగు నీటి కాలువ చెత్త చెదారంతో నిండిపోయేది. మురుగు నీళ్లు, చెత్త చెదారం కలిసి దుర్వాసన వెదజల్లేది. పాములు కూడా కాలువలో తిరుగుతూ ఉండేది. దోమలు విజృంభించేవి. సాయంత్రమైతే ఈ దోమల బెడదకి కాసేపు కూడా వీధిలో కూర్చునే పరిస్థితి ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక మురుగును మరుగు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. దీంతో దుర్వాసన దూరమైంది. దోమల బెడద పూర్తిగా తగ్గింది. మంచిగా చేసేవాళ్ల వైపే మేమందరం ఉంటాం. – నాగభూషణమ్మ, గువ్వకల్లు, చిత్తూరు మండలం ఊళ్లో ఆస్పత్రి వచ్చినాది.. ఇప్పుడు లేనోడికి మంచిగా ఆరోగ్య సేవలు అందుతా ఉండాయి. అంతకు ముందు రోగం వస్తే సిత్తూరికి పరుగెడుతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక..మా ఊళ్లో ఆస్పత్రి వచ్చినాది. ఈడే అన్ని పరీక్షలు చేసి బాగానే చూస్తా ఉండారు. ఏ రోగానికై నా మందులు, మాత్రలు ఇస్తుండారు. మంచిగానే చేస్తా ఉండాది ఈ గవర్నమెంట్. దీనికి మంచి యా గవర్నమెంట్ చేయదు. మాలాంటి పేదలకు ఈ ఆస్పత్రి బాగానే ఉపయోగ పడతా ఉండాది. డాక్టర్లు కూడా ఊర్లోకి వచ్చి చూస్తుండారు. – దాము, గువ్వకల్లు, చిత్తూరు మండలం -
కుప్పం దాహార్తికి శాశ్వత పరిష్కారం
కుప్పం : కుప్పం అభివృద్ధిలో భాగంగా హంద్రీ–నీవా కాలువ పూర్తిచేసి రెండు రిజర్వాయర్లు, పాలారు ప్రాజెక్టుకు పాలనా పరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం కుప్పం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గానికి సాగు, తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో హంద్రీ–నీవా కాలువ పూర్తి చేశామన్నారు. అంతేకాకుండా మాదనపల్లి, యామిగానిపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు, పాలారు ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. హంద్రీ–నీవా కాలువపైన ఎల్లో బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని, వారంతా ప్రత్యేక మేధావుల బృందంతో పనులను పరిశీలించి విమర్శించాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన సాగించారని తెలిపారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.2.7 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని, మీరే స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయాలని సూచించారు. ఐదు సంవత్సరాలు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నవరత్నాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేయగలిగామని చెప్పారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. బీసీలు అధికంగా ఉన్న కుప్పంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ వైఎస్సార్సీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, బీసీలు ఆయన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా రెడ్డెప్ప చిత్తూరు పార్లమెంటుకు రెండోసారి పోటీ చేస్తున్నారని, ఆయన్ను కూడా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే అభ్యర్థి భరత్, మున్సిపల్ చైర్మన్ డా.సుధీర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రెండు రిజర్వాయర్లకు పాలనాపరమైన అనుమతులు హంద్రీ–నీవా పూర్తి చేస్తే పనికట్టుకుని విమర్శలు రూ.2.7 లక్షల కోట్లు డీబీ ద్వారా పేదలకు పంచాం 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
సంక్షేమానికి జగనన్నే చిరునామా
గంగాధరనెల్లూరు: అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా సీఎం జగనన్న అని డెప్యూటీ సీఎం కే.నారాయణస్వామి కొనియాడారు. మంగళవారం ఆయన మండలంలోని అగరమంగళం, వెజ్జుపల్లి పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీప్రియదామోదరం ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం డెప్యూటీ సీఎం మాట్లాడుతూ పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు జగనన్న అని తెలిపారు. పేద ప్రజలకు జరుగుతున్న మంచిని ఓర్వలేక దుష్టశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసి అడ్డుంకులు సృష్టించాయని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మంచి చేసిన జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్కార్పొరేషన్న్ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, జిల్లా రైతు అధ్యక్షుడు వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరక నెల్లూరు కోదండన్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్, సీనియర్ నాయకులు నాయనిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఎంపీటీసీ ఇందిర, వెజ్జుపల్లి సర్పంచ్ హరిప్రసాద్రెడ్డి, ఎంపీటీసీ బాలసుబ్రమణ్యంరెడ్డి, మండల నాయకులు దామోదరం, గోపి, చిట్టి, వెంకటేశు, రుక్మానందరెడ్డి పాల్గొన్నారు. -
‘నేత’కు ఒక్క ఆర్డరైనా ఇప్పించారా?
నగరి : ‘మరమగ్గనేతకు ఒక్క మీటరు ఆర్డరైనా టీడీపీ ఇప్పించిందా..?’ అంటూ మరమగ్గ సామాజిక వర్గాలవారిని మంత్రి ఆర్కేరోజా ప్రశ్నించారు. మంగళవారం మున్సిపల్ పరిధిలో మరమగ్గ సామాజికవర్గం వారు ఎక్కువగా నివసించే కొత్తపేట, ఏకాంబరకుప్పం ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. స్థానిక మరమగ్గ నేత కార్మికులు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. తమ ఇంటి బిడ్డ వచ్చిందన్నంత ఆనందంతో స్థానికులు మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి ఐదేళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనులు, నిర్మించిన భవనాలు, ఏర్పరచిన వసతులను చిత్రపటాలతో సహా ప్రజలకు వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ యూనిఫామ్ ఆర్డరు ఒక్క మీటరైనా మరమగ్గకార్మికులకు ఇప్పించలేదన్నారు. తాను 23 లక్షల మీటర్ల గుడ్డకు ఆర్డరు ఇప్పించినట్టు తెలిపారు. ఒక్కరికై నా ఆధునిక మరమగ్గాలపై టీడీపీ శిక్షణ ఇవ్వలేదని మండిపడ్డారు. తాను మంత్రి అయ్యాక పట్టుచీరల నేతపైనా, ఆధునిక మరమగ్గాల నేతపైనా శిక్షణ ఇప్పించానని గుర్తుచేశారు. తమిళ మాధ్యమం చదివే విద్యార్థులకు గతంలో పుస్తకాలు ఇచ్చేవారు కారని, సీడీలు తెప్పించుకొని ముద్రించుకునే పరిస్థితి ఉండేదన్నారు. తమిళనాడు ప్రస్తుత, గత ముఖ్యమంత్రులిద్దరితోనూ చర్చించి తాను విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తెచ్చి ఇచ్చినట్టు తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీవారి ఆశీస్సులు పొందిన కొందరికే వీవర్స్ పెన్షన్ వచ్చేదని, నేడు 2,670 వీవర్ పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్నారు. రంగునీటి శుద్ధీకరణ ప్లాంటు నిరుపయోగంగా మారితే దానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.2.75 కోట్లు తాను ప్రభుత్వంతో చర్చించి చెల్లించానన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ కేటగిరి మార్చి గెజిట్ ఇచ్చేయడం, అది 2022లో అమలులోకి రావడంతో తాను ముఖ్యమంత్రితో చర్చించి విద్యుత్ బిల్లు తగ్గించానన్నారు. కరోనా సమయంలో తాను మాత్రమే వచ్చి సేవలందించానని, నాడు టీడీపీ వారు ఏమయ్యారని ప్రశ్నించారు. నాడు రాని టీడీపీ వారు నేడు బూటకపు మేనిఫెస్టోతో మభ్యపెట్టేందుకు వస్తున్నారని, ప్రజలు వారిని తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాయలసీమ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కే సెల్వమణి, మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, కౌన్సిలర్లు బీడీ భాస్కర్, భూపాలన్, బాబు, మురుగ, ఇంద్రయ్య, మాజీ కౌన్సిలర్ పుష్ప, కో–ఆప్షన్ సభ్యులు ఆనంద్కుమార్, నాయకులు అమర్, ఎంఎం రాజ, ఎంకేఎస్ మణిగండన్, ఎంబీ రాజ, గోపాల్ రెడ్డి, ఎస్బీ మూర్తి, జీపీఎం.మణి, ఎస్పీ షణ్ముగం, తనిగవాసన్ తదితరులు పాల్గొన్నారు. మంచి చేసే వారిని ఆదరించండి మభ్యపెట్టేవారిని తరిమికొట్టండి మంత్రి ఆర్కేరోజా -
కాణిపాకంలో ‘వేస్ట్ మేనేజ్మెంట్’ పరిశీలన
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిసర ప్రాంతంలోని వ్యర్థ పదార్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి, (సాలిడ్– లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్) విధానాలను మంగళవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు పరిశీలించారు. ముందుగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశ్వీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలు, బహుదా నది, తదితర ప్రాంతాలలో పర్యటించారు. అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ భాస్కర్ రావు, జాయింట్ చీఫ్ ఇంజినీర్ శ్రీరామమూర్తి, జాయింట్ చీఫ్ ఇంజినీర్ రాజశేఖర్, ఇంజినీర్ అశోక్, అసిస్టెంట్ ఇంజినీర్ హరీష్, ఆలయ ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు కృష్ణారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ధనంజయ పాల్గొన్నారు. సాహితీవేత్తలకు పురస్కారం చిత్తూరు రూరల్ (కాణిపాకం): పారిశ్రామికవేత్త రత్నారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ప్రముఖ సాహితీవేత్తలకు పురస్కారాలు ప్రదానం చేశారు. మర్రిపూడి దేవేంద్రరావుకు రాష్ట్ర సాహితీపతి బిరుదు, సి.నారాయణస్వామికి సాహితీశిల్పి అవార్డు, సి.సుబ్రమణ్యంరెడ్డికి అక్షరశిల్పి పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజానికి జ్ఞాన నిర్దేశం చేయడంలో రచయితల పాత్ర కీలకమర్నారు. తెలుగు భాషను రక్షించుకునే క్రమంలో మర్రిపూడి దేవేంద్రరావు చేపట్టిన సాహితీ సదస్సులకు భాషాభిమానులు సహకరించాలని పిలుపు నిచ్చారు. అనంతరం రత్నారెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం– 2024ను భారతీయ తెలుగు రచయితల సమాఖ్య వ్యవస్థాపకుడు దేవేంద్రరావు ప్రదానం చేశారు. పలమనేరులో స్ట్రాంగ్రూమ్ పరిశీలన పలమనేరు : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, ఈవీఎంల భద్రతపై ఆరా తీశారు. ఆయన వెంట ఆర్డీఓ మనోజ్రెడ్డి ఉన్నారు. నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : గిరిజన అభ్యర్థులు నేషనల్ ఓవర్సిస్ స్కాలర్షిప్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విదేశాల్లో పీహెచ్డీ, పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎంపికై న గిరిజన అభ్యర్థులు స్కాలర్షిప్ కోసం ఈ నెల 31వ తేదీలోపు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ www.overseas. tribal.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,748 మంది స్వామివారిని దర్శించుకోగా 30,688 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.10 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
పకడ్బందీగా మాక్ పోలింగ్
బీఎల్ఓల పాత్ర కీలకం పోలింగ్ రోజున బీఎల్ఓల పాత్ర కీలకమని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్ : నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం పకడ్బందీగా మాక్ పోలింగ్ నిర్వహించారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను మాక్ పోల్ చేసి చూపించామని తెలిపారు. ఈవీఎంలపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ ప్రక్రియ నిర్వహించిన్నట్లు చెప్పారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించామని వెల్లడించారు. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ఓ అరుణ, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. మూడోరోజు 1,398 ‘పోస్టల్’ ఓట్ల పోలింగ్ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం మూడోరోజు మొత్తం 1,398 మంది ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 10,827 ఓట్లు పోల్ అయినట్లు వివరించారు. చిత్తూరు కలెక్టరేట్లో పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పర్యవేక్షించారు. మూడురోజుల్లో జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో 1,752, నగరిలో 1,123, జీడీ నెల్లూరులో 1,498, చిత్తూరులో 2,350, పూతలపట్టులో 1,445, పలమనేరులో 1,751, కుప్పంలో 908 మొత్తం 10,827 మంది ఉద్యోగులు ఓటేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 1,113 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవాల్సి ఉందని వెల్లడించారు. – 8లో -
కళ్లుగప్పి
ఎన్నికల వేళ జిల్లాలోకి కర్ణాటక మద్యం యథేచ్ఛగా ప్రవేశిస్తోంది. ఓటర్లను మత్తులో ముంచేందుకు సరిహద్దులను దాటి చొరబడుతోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ నిఘాను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం బంగారుపాళ్యం వద్ద రూ.లక్షల విలువైన కన్నడ లిక్కర్ తీసుకువస్తున్న ఓ కంటెయినర్ పోలీసులకు పట్టుబడింది. విచారణలో ఈ లోడ్ తిరుపతికి వెళుతున్నట్లు వెల్లడైంది. మద్యం తరలింపు వెనుక కూటమి అభ్యర్థుల హస్తం ఉన్నట్లు తెలిసింది.చిత్తూరు అర్బన్ : ఎన్నికల సందర్భంగా ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇందులో కూటమి అభ్యర్థులు విచ్చలవిడిగా ఓటర్లకు ఎరవేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మద్యం బాటిళ్లను వెదజల్లి ఓట్లు రాబట్టుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడి ప్రభుత్వ వైన్షాపుల్లో క్వార్టర్ కొనాలంటే కనీసం రూ.130–రూ.150 చెల్లించాల్సిఉంటుంది. అదే కర్ణాటకలో అయితే కేవలం రూ.35కు టెట్రా ప్యాకెట్, రూ.75కు క్వార్టర్ దొరుకుతోంది. దీంతో చీప్గా కన్నడ మద్యం కొనుగోలు చేసి జిల్లాకు అక్రమంగా తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కూటమి అభ్యర్థులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.రూ.లక్షల మద్యం పట్టివేతఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో కూటమి అభ్యర్థులు మరింత బరితెగిస్తున్నారు. ఓటర్లకు తాయిలాలతో ఎరవేస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక నుంచి చీప్ లిక్కర్ తెప్పించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బంగారుపాళ్యం సమీంలోని టోల్గేటు వద్ద ఓ కంటైనర్ను పోలీసులు అడ్డుకున్నారు. అందులో పరిశీలిస్తే రూ.43 లక్షల విలువైన కర్ణాటక మద్యం కనిపించింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే విస్తుబోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మద్యం లోడ్ను తిరుపతికి తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఇందులో కూటమి పార్టీలకు చెందిన నేతలు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. కర్ణాటకలో తక్కువ ధరకే మద్యం కొనుగోలు చేసి ఇక్కడి ఓటర్లకు పంపిణీ చేయాలని ప్లాన్ వేసినట్లు వివరించారు. ఇందుకోసం కూటమి అభ్యర్థులు తమ పార్టీలకు చెందిన కొందరు నేతలతో కలిసి మొత్తం వ్యవహారం నడిపించిట్లు తెలిసింది ముందుగా బెంగళూరుకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి ద్వారా 713 బాక్సుల కర్ణాటక మద్యాన్ని ఓ కంటైనర్లోకి ఎక్కించుకుని నామాల ముని కేశవ (కిరణ్) మరో ఇద్దరు జిల్లాకు బయలుదేరారు. సోమవారం రాత్రి నంగిలి వద్ద ఈ కంటైనర్ను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తే, తప్పించుకున్నారు. చివరకు బంగారుపాళ్యం వద్ద, కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు వెంటబడి పట్టుకున్నారు. మద్యం స్మగ్లింగ్లో పూతలపట్టుకు చెందిన టీడీపీ నేత హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరికి కుప్పం నియోజకవర్గానికి పచ్చ నేత సహకరించినట్లు తెలిసింది. కంటెయినర్లోని మద్యంలో కొంత పూతలపట్టులో డంప్ చేసి మిగిలింది తిరుపతి తరలించాలని తమకు ఆదేశాలు అందినట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మద్యం స్మగ్లింగ్కు సహకరించిన కారణంగా కుప్పానికి చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెరడేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అలాగే కర్ణాటకలో మద్యం విక్రయించిన బెంగళూరుకు చెందిన డిస్టిలరీ యజమాని, వైన్షాప్ ఓనర్, క్యాషియర్పై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
గుడ్మార్నింగ్!
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో సోమవారం భారీగా చేరారు.ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టండి సంక్షేమ పథకాలు అందించిన ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.రూపురేఖలే మారిపోయాయి ఒకప్పుడు మా పిల్లలు ఐటీఐ చదువుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే రూ. 6కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఐటీఐ నిర్మించారు. ఇది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మాది మారుమూల గ్రామం. ఇక్కడ ఇంత పెద్ద కళాశాల నిర్మించారు. మా గ్రామంలో పాఠశాలను నాడు–నేడు కింద అద్భుతంగా తీర్చిదిద్దారు. మాకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. ఈ ఎన్నికల్లో హామీలు నెరవేర్చే నాయకుడికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాం. – శామువేల్, మాధవరం విజయపురం మండలంలో మండలంలోని మాధవరం పంచాయతీ ఈ ఐదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఐటీఐకు ఇన్నేళ్లుగా శాశ్వతం భవనం లేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రూ.6కోట్లతో నూతన భవనం నిర్మించింది. మండలంలో ఒకప్పుడు రాకపోకలకు నానా అవస్థలు పడేవాళ్లు. ఇప్పుడు అన్ని ఊర్లకు రహదారి సౌకర్యం వచ్చింది.మాధవరంలోని ఐటీఐ కళాశాల●– 8లో– 8లో– 8లో -
జగనన్నతోనే ఆర్టీసీ అభివృద్ధి
పుంగనూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఆర్టీసి అభివృద్ధి జరిగిందని సంస్థ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కరపత్రాలు విడుదల చేశారు. రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి , కార్మికులను ఆదుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్కు స్వాగతం చిత్తూరు కలెక్టరేట్:సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సోమవారం చిత్తూరుకు విచ్చేశారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ అబ్జర్వర్లు కై లాష్, శంకర్ప్రసాద్వర్మ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉంటే 2 గంటల్లో దర్శనమవుతోంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement