godavari floods
-
బాధితులకు బాబు మొండిచెయ్యి
-
కోనసీమలో ముంపులోనే లంక గ్రామాలు
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
భయం గుప్పెట్లో నెల్లిపాక
-
సాయంలో కొత్త ఒరవడి
వరద కష్టాల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందాలి. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భోజనం, నీరు, వైద్యం అందించాలి. తొలుత ఆ పని చేయండి. ఆ తర్వాతే ఆయా గ్రామాల్లో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే స్వయంగా వచ్చి అడుగుతాను. ఏ ఒక్కరి నుంచి కూడా నాకు అందాల్సింది అందలేదు.. కలెక్టర్ సరిగా స్పందించ లేదు.. వ్యవస్థలు సరిగా పని చేయలేదన్న మాట ఎక్కడా వినపడకూడదని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఇందులో భాగంగానే ఇప్పుడు పరిశీలించడానికి వచ్చాను. దీన్నొక సరికొత్త విధానంగా అమలు చేస్తూ కొత్త ఒరవడి సృష్టించాం. తక్షణ సాయం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. – లంక వాసులతో సీఎం జగన్ సాక్షి అమలాపురం: ‘గతంలో చాలాసార్లు వరదలు వచ్చాయి. నాయకులు అప్పటికప్పుడు రావడం, అధికారులంతా వారి చుట్టూ తిరగటం జరిగేది. పేపర్లలో.. టీవీల్లో ఫొటోల కోసం పోజులిచ్చి వెళ్లిపోయేవారు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి. కానీ వారు మంచి జరిగిందా లేదా అని చూడలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని మార్చాం. ప్రతి బాధితునికి సాయం అందుతోంది. నాలుగేళ్లుగా ఈ మార్పు కనిపిస్తోంది. సాయం చేయడం, ఆదుకోవడం అంటే ఇదీ..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గోదావరి వరదల బారిన పడిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని గురజాపులంక, లంకాఫ్ ఠానేల్లంక, కొండుకుదురులంకల్లో బాధితులతో మమేకమయ్యారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతి సందర్భంలో కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రజలకు తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు కావాల్సిన డబ్బులు వారి చేతుల్లో పెట్టామని చెప్పారు. వరద నష్టం ఎక్కువా, తక్కువా అని చూడకుండా బాధితులను ఉదారంగా ఆదుకోండని చెప్పామని తెలిపారు. ‘ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు వారం రోజుల సమయం ఇచ్చాం. ప్రతి గ్రామంలోకి వెళ్లాలని, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవస్థను చైతన్యం చేయాలని చెప్పాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి బాధితులకు సాయం అందిందీ లేనిదీ చూస్తానని చెప్పాను. నేను వచ్చినప్పుడు నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరి నోటి నుంచి రాకూడదు’ అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. వరదలు వచ్చినప్పుడే మిమ్మల్ని పలకరించేందుకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని భావించే ఇలా చేశానని వివరించారు. కష్టాలలో ఉన్నప్పుడు మీ బిడ్డ వేగంగా ఆదుకుంటాడని పునరుద్ఘాటించారు. తొత్తరమూడివారిపేటలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఉండాలన్నాను.. పేదలకు సాయం అందించడంలో ఉదారంగా ఉండాలన్న తన సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాంగం పనిచేసిందని సీఎం కొనియాడారు. ఈ రోజు ప్రతి వ్యక్తికి పరిహారం అందించామంటే అందుకు మీ బిడ్డ జగన్ గ్రామీణ స్థాయిలో గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడమేనన్నారు. సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలు, వలంటీర్ల వ్యవస్థ వల్ల వరదల సమయంలో వేగంగా సాయం అందించడానికి మార్గం సుగమం అయిందన్నారు. ఈ వ్యవస్థ వల్లే ప్రతి పనిలోను పారదర్శకత చూపిస్తున్నామని తెలిపారు. నెలాఖరుకు పంట నష్ట పరిహారం పంట నష్టపోయిన రైతులకు నెలాఖరుకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ‘రైతులకు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే’ అని అన్నారు. మూడు నాలుగు రోజుల్లో జాబితా సిద్ధమవుతుందని, రైతుల పేరు, విస్తీర్ణం, పంట నష్టం వివరాలు ఆర్బీకేలలో ఉంటాయన్నారు. ఎవరి పేరు అయినా కనిపించకపోతే ఆర్బీకేలో ఫిర్యాదు చేస్తే, తిరిగి పరిశీలిస్తారని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామన్నారు. అనంతరం గురజాపులంక, కూనలంకల్లో నష్టపోయిన వంగ, మునగ, బెండ, ఇతర కూరగాయ పంటలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. విలేజ్ క్లినిక్ల ద్వారా గ్రామీణుల ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. పశువులకు కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, టీఎంఆర్ (టోటల్ మిక్స్డ్ రేషన్–సమగ్ర పశు దాణా) దాణా అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని సచివాలయం, వలంటీర్ వ్యవస్థలు, విలేజ్ క్లినిక్లు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని వివరించారు. ‘ఓఎన్జీసీ పరిహారం గురించి మీ అందరికీ తెలుసు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక అది మీకు అందింది. అన్ని విధాలా మీకు మంచి చేసే విషయంలో దేవుడు మరింత అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ను చూసేందుకు మహిళలు, యువత ఆసక్తి చూపించారు. సీఎం.. సీఎం.. అంటూ నినా దాలు చేశారు. గురజాపులంకలో పలువురు యువ కులు జగన్ను చూసి ‘వైనాట్ 175 జగనన్నా..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. గురజాపులంకలో ఓ కుటుంబంతో మాట్లాడుతున్న సీఎం జగన్ సీఎంకు ఘన స్వాగతం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్కు ప్రజలు, నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జోగి రమేష్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాద్, పెండెం దొరబాబు, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ నపూర్ అజయ్లు పాల్గొన్నారు. నేరుగా జనం మధ్యకే.. మంగళవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ నేరుగా గురజాపులంకకు హెలికాప్టర్లో చేరుకున్నారు. సాధారణంగా వరదల సమయంలో బాధితులను పరామర్శించేందుకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జిల్లాకు వచ్చారు. అప్పట్లో డివిజన్ కేంద్రమైన అమలాపురం, వరద ప్రభావిత ప్రాంతాల మండల కేంద్రాలలో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి, ఎంపిక చేసిన బాధితులను పరామర్శించి వెనుదిరిగేవారు. సీఎం జగన్ ఇందుకు భిన్నంగా నేరుగా లంక గ్రామాలలోకే రావడం బాధి తులను, పంట నష్టపోయిన రైతులను పరా మర్శించడంతోపాటు జరిగిన నష్టాన్ని స్వయంగా వీక్షించడం గమనార్హం. ఐదారు గంటలపాటు లంకవాసులతో సీఎం మమేకమ య్యారు. ఇదే విషయాన్ని లంకవాసులు, వరద బాధితులు గొప్పగా చెప్పుకున్నారు. తమ బాధలను తెలుసుకునేందుకు వచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని వారు సంబర పడ్డారు. 1996లో పెను తుపానుకు తమ గ్రామాలు ధ్వంసమైనప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు తమ గ్రామాలకు రానేలేదని వారు గుర్తు చేశారు. తమనే ఠానేలంకకు పిలిపించి మాట్లాడారని చెప్పారు. గత ఏడాది గోదావరికి రికార్డు స్థాయిలో వరద వచ్చిన సమయంలో కూడా సీఎం జగన్ జిల్లాలోని పి.గన్నవరం మండలంలోని జి.పెదపూడిలంక, ఉడుముడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పర్యటించారని గుర్తు చేశారు. -
రాజమహేంద్రవరానికి సీఎం జగన్
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తొలి రోజు సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం 6.24 గంటలకు హెలికాప్టర్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ సీఎం వైఎస్ జగన్కు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు చేరుకొన్నారు. రాత్రి అక్కడే బస చేశారు. బాధితులకు అండగా.. హెలిపాడ్ నుంచి గెస్ట్ హౌస్కు వచ్చే మార్గంలో సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. రోడ్లకు ఇరువైపులా నిలుచొని ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం జగన్ వారికి అభివాదం చేశారు. దారిలో ఇద్దరు అనారోగ్య బాధితులను పలకరించారు. వారి సమస్య విని తక్షణం సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ మాధవిలతను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆ కుటుంబాలకు వైద్య సేవల నిమిత్తం ఒక్కొక్కరికీ రూ. లక్ష సాయం అందజేశారు. కోనసీమ జిల్లాలో పర్యటన ఇలా.. సీఎం జగన్ మంగళవారం ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి అర్ట్స్ కళాశాలకు చేరుకుంటారు. 9.10కి ఆర్ట్స్ కళాశాల వద్ద హెలికాప్టర్లో బయలుదేరి 9.40కి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా గురజపులంక చేరుకుంటారు. 10.25 వరకు గ్రామంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 10.35కు రామాలయపేటకు రోడ్డు మార్గానికి చేరుకుని, 11.10 వరకు రామాలయపేటలో వరద బాధితులతో మాట్లాడతారు. 11.10 గంటలకు అక్కడి నుంచి అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.50 గంటల వరకు అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. 11.50 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో గురజపు లంక గ్రామానికి 12.15 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో తాడేపల్లికి వెళతారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో.. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. అయితే సహజంగా అలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల్లో పర్యటించడం పరిపాటి. గత ప్రభుత్వాల్లో అలానే చేసేవారు. అలా చేస్తే అధికార యంత్రాంగం అంతా సీఎం వెంట ఉంటుందని, అప్పుడు బాధితులకు సహాయ కార్యక్రమాలు అందించడానికి ఇబ్బంది ఎదురవుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. హడావుడి, ఫొటో సెషన్ వల్ల ఒరిగేదేమీ ఉండదని భావించారు. బాధితులందరికీ సాయం అందాలంటే తను చేయాల్సింది అలా కాదని, తొలుత సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన నిధులు విడుదల చేశారు. బాధితుల తరలింపు, పునరావాసశిబిరాల ఏర్పాటు, ఆహారం, మంచినీరు, మందులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. తద్వారా ఉన్నతాధికారులు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల సహకారంతో సాయం అందలేదన్న మాటకు తావు లేకుండా చేశారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడింది. శిబిరాల నుంచి ప్రజలు ఇళ్లకు వెళ్లిపోయారు. అన్ని ప్రాంతాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సాయం అందిన తీరు గురించి ప్రజలతో స్వయంగా మాట్లాడటానికి రెండు రోజుల పర్యటన తలపెట్టారు. ఇలా తను సీఎం అయినప్పటి నుంచి సరికొత్త సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలతో నేడు మాటామంతి సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్ సెంటర్లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
లంక గ్రామాల ప్రజలకు అండగా సీఎం జగన్
-
డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చే పరీక్షలకు శ్రీకారం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదావరి వరదలకు దెబ్బతిన్న పునాది డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలకు నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) నిపుణుల బృందం శ్రీకారం చుట్టింది. పోలవరం ప్రాజెక్టు వద్ద బుధవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్నందకుమార్, సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తిలతో ఎన్హెచ్పీసీ ఈడీ ఎస్.ఎల్.కపిల్, సీనియర్ మేనేజర్లు ఎ.విపుల్ నాగర్, ఎన్.కె.పాండే, ఎం.పి.సింగ్ సమావేశమయ్యారు. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సెస్మిక్ టోమోగ్రఫీ విధానాల్లో పరీక్షలు నిర్వహించడంపై చర్చించారు. తర్వాత గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్పై ప్రతి మీటరుకు ఒకచోట 20 మిల్లీమీటర్ల (ఎంఎం) వ్యాసంతో 1.5 అడుగుల లోతువరకు జలవనరుల శాఖ అధికారులు వేసిన రంధ్రాల్లోకి ఎలక్ట్రోడ్లను అమర్చి హైరెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్ విధానంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ పనులకు సమాంతరంగా డయాఫ్రమ్ వాల్కు ఒక మీటరు ఎగువన, ఒక మీటరు దిగువన 60 ఎంఎం వ్యాసంతో 30 నుంచి 40 అడుగుల లోతువరకు ప్రతి 40 మీటర్లకు ఒకటి చొప్పున తవ్విన బోరు బావుల్లోకి ఎలక్ట్రోడ్లను పంపి సెస్మిక్ టోమోగ్రఫీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రారంభించే ఈ పరీక్షలు పూర్తవడానికి కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఈ రెండు పరీక్షల ఫలితాలను విశ్లేషించడానికి కనీసం 30 రోజుల సమయం పడుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. మొత్తంమీద 45 రోజుల్లోగా డయాఫ్రమ్ వాల్ భవితవ్యం వెల్లడికానుందని తెలిపాయి. -
ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. 28న అకౌంట్లలో నగదు జమ
సాక్షి, అమరావతి: 2022 ఖరీఫ్ సీజన్లో వివిధ వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఆ సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలతో పాటు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కురిసిన ఆకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్టుగా గుర్తించింది. ఇందులో 20 జిల్లాల పరిధిలో 21,799 మంది రైతుల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. అత్యధికంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 42.5 ఎకరాల్లో రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటల్లో 11,742 ఎకరాల్లో వరి, 5,205 ఎకరాల్లో పత్తి, 4,887 ఎకరాల్లో వేరుశనగ, 3,915 ఎకరాల్లో పెసర.. ఉద్యాన పంటల్లో 7 వేల ఎకరాల్లో ఉల్లి, 1,525 ఎకరాల్లో మిరప, 439 ఎకరాల్లో కూరగాయలు, 399 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ పంటలకు 18.95 కోట్లు, ఉద్యాన పంటలకు 20.44 కోట్లు చొప్పున మొత్తంగా రూ.39.39 కోట్లు పంట నష్ట పరిహారం చెల్లించాలని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు రైతుల జాబితాలను ఇప్పటికే జిల్లాల వారీగా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. గత మూడేళ్లలో రూ.1,795.4 కోట్లు వరదలు, ఆకాల వర్షాలు వంటి వివిధ వైపరీత్యాల వల్ల 2019–20 సీజన్లో 1.47 లక్షల మందికి రూ.116.63 కోట్లు, 2020–21 సీజన్లో 12.15 లక్షల మందికి రూ.932.07కోట్లు, 2021–22 సీజన్లో 6.32 లక్షల మందికి రూ.564 కోట్లు చొప్పున గత మూడేళ్లలో 20.85 లక్షల మందికి రూ.1,795.4 కోట్ల పంట నష్టపరిహారం అందించారు. ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 45,998 మంది రైతులకు ఈ నెల 28న రూ.39.39 కోట్లు ఇవ్వనున్నారు. అదే రోజు 2020–21 రబీ సీజన్కు సంబంధించి 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5.68 లక్షల మందికి రూ.115.33 కోట్లు చొప్పున మొత్తంగా 8.22 లక్షల మందికి రూ.160.55 కోట్లు సున్నా వడ్డీ జమ చేయనున్నారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ కలిసి మొత్తం రూ.199.94 కోట్లను సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. -
కృష్ణాలో పెరుగుతున్న వరద..
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరగ్గా.. బేసిన్లో వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,54,343 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ.. స్పిల్ వే పదిగేట్లను 12 అడుగులు ఎత్తి 3,19,350, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,348.. కలిపి 3,81,698 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 3,40,387 క్యూసెక్కులు చేరుతున్నాయి. జలాశయంలో 589 అడగుల్లో 309.05 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్వే 18 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 3,00,774 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2,56,309 క్యూసెక్కులు చేరుతోంది. 169.72 అడగుల్లో 37.95 టీఎంసీల నీటిని నిల్వచేస్తూ స్పిల్వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 2,62,583 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి 2,86,684 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం కూడా కృష్ణాలో ఇదేరీతిలో వరద కొనసాగనుంది. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక గోదావరిలో పోలవరం ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్లోకి 13,20,635 క్యూసెక్కుల వరద చేరుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 13.90 అడుగులకు చేరింది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 13,11,835 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 42.50 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33.510 మీటర్లకు చేరింది. -
AP: వరద గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం మరింత పెరిగింది. బుధవారం ఉదయం 10 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్లోకి 13,74,840 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం 14.40 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 8,800 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 13,66,040 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పరివాహక ప్రాంతం (బేసిన్)లో ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. వరదను పోలవరం వద్ద ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు.. 48 గేట్ల ద్వారా 11,62,898 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం 33.930 మీటర్లకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ఉపనదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల్లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 3,51,446 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టు స్పిల్ వే పదిగేట్లను పదడుగులు ఎత్తి 2,79,830, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,374.. కలిపి 3,42,204 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్లోకి 2,80,397 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం 16 గేట్లను పదడుగులు ఎత్తి 2,36,400, క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,480.. కలిపి 2,68,880 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి 2,85,181 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 11,031 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి ( ఫొటోలు)
-
గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ
సాక్షి, రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇక, ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. కనకాయలంక, టేకిశేట్టిపాలెం, ఎదురుబిడియం, అప్పనపల్లి కాజేవేలు నీట ముగిగాయి. ఇక ఏజెన్సీ ప్రాంతంలో కొండ వాగులు, శబరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ కారణంగా కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో విపత్తుల శాఖ ముంపు ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. నిరంతరం స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి వరద ఉధృతిపై పర్యవేక్షణ జరుగుతోంది. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు.. గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం జలాశయానికి సైతం వరద కొనసాగుతోంది. దీంతో, అధికారులు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక, శ్రీశైలానికి ఇన్ఫ్లో 3.23 లక్షలుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం/కూనవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటలకు 11,58,927 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటిమట్టం 13 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 3,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 11,55,027 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 11.75 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ నుంచి భద్రాచలం వద్దకు మంగళవారం రాత్రి 7 గంటలకు 13,55,586 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 51.7 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటిమట్టం 53 అడుగులను దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మంగళవారం వర్షాలు కొనసాగడంతో గోదావరి బేసిన్లో ఎగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 9,89,625 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండగా దుమ్ముగూడెం సమీపంలోని సీతమ్మసాగర్ వద్దకు 13,11,731 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. సీతమ్మసాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. వాటికి వాగులు, వంకల వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్దకు బుధవారం 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్ద 33.380 మీటర్లకు నీటిమట్టం పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 33.380 మీటర్లకు చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రోడ్డుమార్గంలోని కడెమ్మ వంతెనకు ఇరువైపులా వరదనీరు చేరింది. కాగా, గోదావరి ఉద్ధృతికి శబరి నది తోడవడంతో విలీన మండలాలు ముంపునకు గురయ్యాయి. కూనవరంలో ఉదయ్భాస్కర్ కాలనీ, గిన్నెలబజారు మంగళవారం ముంపునకు గురయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం సోమవారం అర్ధరాత్రే ఇళ్లను ఖాళీ చేయించి బాధితులను కోతులగుట్ట పునరావాస కాలనీకి తరలించింది. కూనవరం వద్ద గోదావరి మట్టం 48 అడుగులకు చేరింది. చరిత్రలో ఏడో అతి పెద్ద వరద ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 4,734 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. బంగాళాఖాతంలో ఈ ఏడాది ఇప్పటివరకు కలిసిన గోదావరి జలాలను పరిగణలోకి తీసుకుంటే.. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గోదావరికి ఈ ఏడాది వచ్చిన ప్రవాహం ఏడో అతిపెద్ద వరద ప్రవాహం. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గరిష్టంగా 1990లో 7,092.285 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవగా.. ఆ తర్వాత 1994లో 5,959.228 టీఎంసీలు, 2013లో 5,921.9 టీఎంసీలు, 1984లో 4,879.693 టీఎంసీలు, 2006లో 4,841.84 టీఎంసీలు, 1988లో 4,800.839 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఏడాదిలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,213.371 టీఎంసీలే సముద్రంలో కలవడం గమనార్హం. -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గోదావరి ప్రధానపాయపై జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తేయడం, వాటికి మంజీర వరద తోడవుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటం.. వాటికి కడెం వాగు, ఇతర వాగుల వరద తోడవుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎల్లంపల్లి నుంచి దిగువకు విడుదల చేసిన వరదకు ప్రాణహిత, ఇంద్రావతి జలాలు తోడవుతుండటంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ, దానికి దిగువన తుపాకులగూడెం బ్యారేజీలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. తుపాకులగూడెం, సీతమ్మసాగర్లలోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. రాత్రి 7 గంటలకు 10.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో నీటిమట్టం 45.6 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలం నుంచి పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటిమట్టం సోమవారం 32.1 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 7,08,251 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి డెల్టాకు 2,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 175 గేట్లను పూర్తిగా ఎత్తేసి 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజ్లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గోదావరి బేసిన్లో మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడురోజులు గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగనుంది. -
కృష్ణా, గోదావరిలో మరింత తగ్గిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) వర్షపాత విరామంతో నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. జూరాల, సుంకేశుల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న కృష్ణాజలాల ప్రవాహం 1,76,232 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి, హంద్రీ–నీవా ద్వారా 21,288 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ, స్పిల్ వే మూడు గేట్లను పదడుగులు ఎత్తి మొత్తం 1,46,469 దిగువకు వదులుతున్నారు. సాగర్లోకి 97,724 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 20,039 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రధాన విద్యుత్కేంద్రం, స్పిల్ వే గేట్ల ద్వారా 76,305 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక్కడ 171.14 అడుగుల్లో 38.55 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 58,562 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి 1,10,527 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,037 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 95,490 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సాధారణ స్థాయికి గోదావరి వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉపనదుల్లో వరద తగ్గి గోదావరిలో ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 4,89,531 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,467 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 4,80,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థిరంగా వంశ‘ధార’ వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్లోకి 24,399 క్యూసెక్కులు చేరుతుండగా, వంశధార ఆయకట్టుకు 2,231 క్యూసెక్కులను, 19,636 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్లోకి 8,649 క్యూసెక్కులు చేరుతుండగా, ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 1,851 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. -
గోదావరి, కృష్ణాలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో వర్షాలు తగ్గడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.8 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంలో ధవళేశ్వరం బ్యారేజ్లోకి 13,05,222 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,94,222 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు కృష్ణాలో వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్, భీమాపై ఉన్న ఉజ్జయిని డ్యామ్లు నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలంలో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్లోకి 2,25,787 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువ ద్వారా 9,104, ఎడమ కాలువ ద్వారా 8,108, ఏఎమ్మార్పీ ద్వారా 2,400, వరద కాలువ ద్వారా 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,195 క్యూసెక్కులు, స్పిల్ వే 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,73,580 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 586 అడుగుల్లో 301.1 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న జలాల్లో పులిచింతలలోకి 2,01,752 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,31,213 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 8 వేలు వెరసి 1,39,213 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 169.71 అడుగుల్లో 37.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లోకి 1,36,531 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,901 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 1,23,630 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీ: వంశధార, నాగావళి నదులు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్లోకి 48,583 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆయకట్టుకు 1,665 క్యూసెక్కులు, కడలిలోకి 38,307 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్లోకి 23,330 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 21,256 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
‘పులస’ ప్రియులకు ఈ ఏడాది నిరాశేనా?
ఏదీ ఆ రుచి? ఆ అమోఘమైన రుచి ఏమైనట్టు? అద్భుతమైన ఆ రుచి ఎటు పోయినట్టు? పుస్తెలు అమ్మైనా పులస తినాలంటారే.. అసలు ఈ ఏడాది పులసల జాడేది? అవి లేకుంటే జిహ్వ చాపల్యం తీరేదెలా? మైమరపించే ఆ రుచిపై మోజు తీరేదెలా? పులసమ్మా.. పులసమ్మా.. ఏమైతివే? ఎటు పోతివే? కాసింత కానరావే..! సాక్షిప్రతినిధి, కాకినాడ: గోదావరి వరద ఉధృతి పులసను ఓడించింది. లక్షలాది క్యూసెక్కుల ప్రవాహానికి ఎదురీదలేక పులస తలవంచింది. సముద్రంలో ఇలసలు గోదావరికి ఎదురీదుతూ పులసలుగా మారతాయి. జూలై – ఆగస్టు నెలల మధ్య పులసల సీజన్. ఆగస్టు వచ్చి మూడు వారాలు గడచినా గోదావరి తీరంలో పులసల జాడ లేదు. మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. దీంతో పులసలంటే పడిచచ్చే మాంసాహార ప్రియులు ఉసూరుమంటున్నారు. పులసల సీజన్లో మూడొంతులు గోదావరికి వరదలతోనే గడిచిపోయింది. మునుపెన్నడూ లేని స్థాయిలో జూలైలో వరదలు గోదావరిని ముంచెత్తాయి. అదే వరద ఒరవడి ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో సముద్రంలోని ఇలసలు గోదావరికి ఎదురీదలేక వెనక్కి పోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో ఆగస్టు 10 నుంచి మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే పులసలు రాకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సముద్రంలో ఉండే ఇలస(హిల్స)చేప పునరుత్పత్తి కోసం ఎదురీదుతూ గోదావరికి వచ్చే సరికి పులస అవుతుంది. గోదావరి నుంచి సముద్రానికి వచ్చే నీటి ప్రవాహాన్ని తట్టుకుని ఈదుకుంటూ రావాలి. లక్షన్నర నుంచి మూడు లక్షల క్యుసెక్కులు స్థాయిలో గోదావరి నుంచి సముద్రానికి నీటి విడుదల ఉంటే.. సముద్రం వైపు నుంచి విలసలు గోదావరికి రాగలుగుతాయి. ఆగస్టులో వరదలు మొదటి పది రోజులు మూడు లక్షలు, అప్పటి నుంచి 20–8–2022 వరకు ఏ రోజూ 10 లక్షల క్యుసెక్కులకు తక్కువ కాకుండా మిగులు జలాల (వరద నీరు)ను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలా రోజూ లక్షల క్యుసెక్కుల నీరు సముద్రానికి చేరుతుంటే.. ఆ నీటి ఉధృతిని తట్టుకుని విలసలు సముద్రం నుంచి గోదావరికి ఎదురీదలేకపోతున్నాయి. అలాగే గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్(నదీ ముఖద్వారం వద్ద)లు మొగలు పూడుకుపోవడం కూడా పులస రాకకు అడ్డుగా మారి ఉండొచ్చని మత్స్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విలసలు గోదావరి వైపు రాకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు తరలిపోతున్నాయి. ఆ రుచికి.. ఈ రుచికి అసలు పొంతనే లేదు గోదావరిలో పులసలు లభించకపోవడంతో ఒడిశా సముద్ర జలాల్లో లభిస్తున్న విలసలను గోదావరి జిల్లాలకు తెచ్చి జోరుగా విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి ఎదుర్లంక, యానాం, కోటిపల్లి తదితర ప్రాంతాలకు వ్యాన్లలో తీసుకొచ్చి మరీ అమ్ముతున్నారు. అరకిలో విలస రూ.1,000 నుంచి రూ.1,500 పలుకుతోంది. అంతగా రుచి లేకున్నా పులస ప్రియులు అలా సర్దుకుపోతున్నారు. గోదావరిలో లభించే పులస రుచికి, ఈ విలస రుచికి అసలు పొంతనే లేదంటున్నారు. గత సీజన్లో పులసలు ఒక్కోటి కిలో నుంచి నాలుగైదు కిలోల పరిమాణంలో లభించేవి. ధర రూ.10 వేలకు పైనే పలికేది. ఎదురీదలేక.. గోదావరికి ఉధృతంగా వరదలు రావడంతో పులసలు ఎదురీదలేకపోతున్నాయి. దీంతో గోదావరిలో పులసలు కానరావడం లేదు. ప్రస్తుతానికి ఒడిశాలో దొరికిన విలసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ, యానాం. విచక్షణ రహిత వేటతో పులసలకు ప్రమాదం విచక్షణ రహితంగా సాగుతున్న వేట కారణంగానే గోదావరిలో పులసల సంఖ్య నానాటికీ తగ్గిపోతుంది. గతంలో దాదాపు ఆరు కిలో మీటర్ల మేర మాత్రమే సముద్రంలో వేట సాగేది. ప్రస్తుతం ఆధునిక బోట్లు, వలల కారణంగా వంద కిలో మీటర్లు కూడా వేట సాగుతోంది. ఫలితంగా పలు రకాల చేపలు అంతరించిపోతున్నాయి. అందులో పులస జాతి కూడా ఉంది. – పీవీ కృష్ణారావు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్, రాజమహేంద్రవరం -
భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి
-
నదుల్లో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్ల నుంచి సోమవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,16,834 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,222 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పది గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,674, ఎడమ కేంద్రం ద్వారా 31,874 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు. ► నాగార్జునసాగర్లోకి 3,41,072 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,604, ఎడమ కాలువకు 8,541, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టులో 585.4 అడుగుల్లో 298.58 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,485, 26 గేట్ల ద్వారా 2,88,382 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ► పులిచింతల ప్రాజెక్టులోకి 2,83,921 క్యూసెక్కులు చేరుతుండగా గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 2,58,838 క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ప్రసుత్తం పులిచింతలలో 45.77 టీఎంసీలకు గాను 35.90 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ► ప్రకాశం బ్యారేజ్లోకి 2,85,055 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,955 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,70,100 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ► పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్లలోకి చేరుతున్న వరద తగ్గుతోంది. దాంతో మంగళవారం నుంచి శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గనుంది. గోదావరిలో కొద్దిగా తగ్గిన వరద గోదావరిలో వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొంతమేర తగ్గింది. సోమవారం రాత్రి 8 గంటలకు కాటన్ బ్యారేజ్ వద్ద 14.20 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 13,54,329క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కులు వదిలారు. భద్రాచలం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గింది. వంశధార, నాగావళి పోటాపోటీ ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. గొట్టా బ్యారేజ్లోకి 82,575 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు ఆయకట్టుకు 2,500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 80,075 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి బ్యారేజ్ నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 28 వేల క్యూసెక్కుల నాగావళి ప్రవాహం చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
తృటిలో తప్పిన పెద్ద పడవ ప్రమాదం
పి.గన్నవరం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో పెద్ద పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ సీజన్లో గోదావరికి రెండోసారి వరదలు వచ్చిన నేపథ్యంలో.. మానేపల్లి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాయలంకలోని వరద బాధితులకు సర్పంచ్ పితాని చంద్రకళ భర్త నరసింహారావు రోజూ పడవపై వాటర్ టిన్నులు తీసుకువెళ్లి అందిస్తున్నారు. ఇదేవిధంగా నరసింహారావు, వలంటీర్లు కౌరు నందు, షేక్ రెహ్మాన్, చిన్నం రవీంద్ర 40 వాటర్ టిన్నులు తీసుకుని ఆదివారం శివాయలంకకు బయల్దేరారు. ఆ పడవలో కౌరు శ్రీను, పుచ్చకాయల సత్యనారాయణ, పడవ నడిపే వ్యక్తులు మల్లాడి ఏడుకొండలు, రామకృష్ణ ఉన్నారు. ఏటిగట్టు నుంచి 300 మీటర్ల దూరం వెళ్లేసరికి కేబుల్ టీవీ మెయిన్ లైన్ వైరు పడవకు అడ్డం పడింది. దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన పడవ వైనతేయ గోదావరి నదిలో బోల్తా పడింది. ఆ ప్రాంతంలో నది సుమారు 10 అడుగుల లోతు ఉంది. అందులో ఉన్న 8 మంది అతికష్టం మీద సమీపంలోని మెరక ప్రాంతంలోని రోడ్డు పైకి చేరుకుని వరద నీటిలో నిలుచున్నారు. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది హుటాహుటిన మరో పడవను పంపించి, నదిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు తరలించారు. వలంటీర్ రవీంద్ర నదిలో మునిగి నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆ ప్రాంతంలో వరద ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. -
‘కృష్ణా’లో స్థిరంగా వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/విజయపురిసౌత్ (మాచర్ల)/అచ్చంపేట/పోలవరం రూరల్: పరీవాహక ప్రాంతంలో ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతుండగా గోదావరిలో క్రమంగా తగ్గుతోంది. జూరాల నుంచి కృష్ణా, సుంకేశుల నుంచి తుంగభద్ర ద్వారా శనివారం సా.6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,25,563 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం ద్వారా 30,252, ఎడమ కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 884.3 అడుగుల్లో 211.47 టీఎంసీలను నిల్వచేస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్లోకి 4.09 లక్షల క్యూసెక్కులు అలాగే, నాగార్జునసాగర్లోకి 4,09,963 క్యూసెక్కులు చేరుతుండగా.. 586.3 అడుగుల్లో 301.87 టీఎంసీలను నిల్వచేస్తూ.. 3,58,120 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల్లోకి 3,77,117 క్యూసెక్కులు చేరుతుండగా.. 168.01 అడుగుల్లో 35.59 టీఎంసీలను నిల్వచేస్తూ.. 17 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 3,40,827 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండడంతో ప్రకాశం బ్యారేజ్లోకి 4,15,036 క్యూసెక్కులు చేరుతోంది. మిగులుగా ఉన్న 4,02,944 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంలో ఆల్మట్టి, నారాయణపూర్లలోకి వచ్చిన నీటిని వచ్చిట్లుగా 2.30 లక్షల క్యూసెక్కులను, తుంగభద్ర డ్యామ్ నుంచి 1.05 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లలోకి ఇదే రీతిలో వరద కొనసాగనుంది. గోదావరిలో క్రమంగా తగ్గుముఖం మరోవైపు.. గోదావరిలోనూ వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 52 అడుగుల్లో కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శనివారం రాత్రి 9 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద నీటి మట్టం 14.90 అడుగులకు చేరింది. మిగులుగా ఉన్న 14,74,377 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కడలి ఒడిలోకి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. పోటెత్తుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి గేట్లు ఎత్తి వేయడంతో కడలి వైపు నదులు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4,28,120 (36.99 టీఎంసీలు) క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,76,919 (127.62 టీఎంసీలు) క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 14 వేల క్యూసెక్కుల (1.20 టీఎంసీలు) వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగార్జునసాగర్, భద్రాచలం దిగువన కృష్ణమ్మ, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణాలో స్థిరంగా వరద.. ► జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,55,614 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కల్వకుర్తి ద్వారా 400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి గట్టు కేంద్రం ద్వారా 26,825, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్లోకి 4,11,932 క్యూసెక్కులు చేరుతుండగా కుడి కాలువకు 6,766, ఎడమ కాలువకు 7,937, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్లో 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,61,602 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,927 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్లో 587 అడుగుల్లో 305.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భారీ వరద నేపథ్యంలో సాగర్ టెయిల్పాండ్లో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. ► నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,93,029 క్యూసెక్కులు చేరుతున్నాయి. 14 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 3,52,352 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి చేస్తూ 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలో 165.94 అడుగుల్లో 32.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్లోకి 4,42,083 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 13,963 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 4,28,120 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీకి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద సమయంలో గతంలో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి వచ్చేదని, కనకదుర్గ వారధి నుంచి దిగువకు కాంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల ముంపు నుంచి రక్షణ కలిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ► ఎగువన కృష్ణా, తుంగభద్రలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 2.25 లక్షలు, నారాయణపూర్ నుంచి 2.33 లక్షలు, తుంగభద్ర డ్యామ్ నుంచి 88,896 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శనివారమూ శ్రీశైలంలోకి వరద ఇదే రీతిలో కొనసాగనుంది. వంశధార, నాగావళి పరవళ్లు.. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళిలో వరద కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్లోకి 16,814 క్యూసెక్కుల వంశధార జలాలు చేరుతుండగా 2,814 క్యూసెక్కులను ఆయకట్టుకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,600 క్యూసెక్కుల నాగావళి జలాలు చేరుతుండగా ఆయకట్టుకు 600 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద గోదారి.. కాళేశ్వరంలో అంతర్భాగమైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్లు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 52.1 అడుగుల్లో ఉండగా రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 12,17,365 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వేకు ఎగువన 34.13 మీటర్లు, దిగువన 25.72 మీటర్ల మేర వరద మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి 14,85,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 14,76,919 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
ఉదారంగా సాయం అందించండి.. కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారుల వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో వచ్చిన గోదావరి వరదలు మునుపెన్నడూ లేని రీతిలో ప్రభావం చూపాయని, సాయం అందించే విషయంలో ఉదారంగా స్పందించాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కేంద్ర బృందాన్ని కోరారు. హోంమంత్రిత్వ శాఖ ఆరి్థక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజులపాటు గోదావరి వరదలకు ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, ఏలూరు జిల్లా, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. రవినేష్ కుమార్తోపాటు బృందం సభ్యులు డాక్టర్.కె.మనోహరన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాధన్, అరవింద్ కుమార్ సోని ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో వరదల ప్రభావం, క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని సాయిప్రసాద్, విపత్తుల సంస్థ ఎండీ బి.ఆర్.అంబేడ్కర్ కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్లకు సూచనలిచి్చనట్లు తెలిపారు. ముందుస్తుగానే జిల్లాల్లోకి సహాయక బృందాలను పంపించా మని వివరించారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలతో ముంపులో చిక్కుకున్న 183 మందిని రక్షించి, మరో 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సహాయక బృందాలు కూడా చేరుకోలేని ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజుల పాటు ఆహారం, నిత్యావసరాలను అందించినట్లు తెలిపారు. గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు. ప్రభుత్వ స్పందన భేష్ రవినేష్కుమార్ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించామన్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఎక్కువగా నష్టం వాటిల్లిందని చెప్పారు. వరద సమయంలో ప్రభుత్వ చర్యలు, యంత్రాంగం సత్వర స్పందనను అభినందించారు. ముఖ్యం గా వలంటీర్ వ్యవస్థ సేవలు బాధితులకు అండగా నిలిచాయని ప్రశంసించారు. అత్యవసర సరీ్వసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు సమయస్ఫూర్తితో పనిచేశారని కొని యాడారు. కలెక్టర్లకు వెంటనే నిధులు మంజూ రు చేయడంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్టు గుర్తించామన్నారు. తమ నివేదికను త్వ రగా కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని, వీలైనంత మేర సహాయం అందించడానికి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ నయిమ్ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ సీఈ హరేరాము, ఫిషరీస్ జేడీ హీరానాయక్, విపత్తుల సంస్థ ఈడీ సి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన సాక్షి అమలాపురం: గోదావరి వరదల వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) గురువారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించింది. రావులపాలెం మండలం గోపాలపురం, పి.గన్నవరం మండలం నాగుల్లంక, రాజోలు మండలం నున్నవారిబాడవలో నష్టాన్ని పరిశీలించింది. పంట నష్టం, రైతులు, మత్స్యకారుల అభిప్రాయాలు, సాంకేతిక అంచనాలను సేకరించింది. వివిధ వర్గాలవారికి, రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలకు కలిగిన నష్టాన్ని పరిశీలించింది. ఫొటో ఎగ్జిబిషన్ తిలకించింది. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి వరదల వల్ల జరిగిన నష్టాన్ని, బాధితులకు అందించిన సాయాన్ని, దెబ్బతిన్న పంటల వివరాలను, రోడ్లు, విద్యుత్ లైన్లకు జరిగిన నష్టాన్ని ఛాయాచిత్రాలు చూపిస్తూ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంది ఆపదలో ఉన్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద బాధిత రైతులు, మత్స్యకారులు, ప్రజలు కేంద్ర బృందానికి తెలిపారు. పునరావాసం కలి్పంచిందని, ఆహారం, తాగు నీరు అందించిందని వివరించారు. నిత్యావసర వస్తువులు, నగదు సాయం అందజేసిందన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు ఇచ్చే నష్ట పరిహారాన్ని పెంచేలా చూడాలని రైతులు ఈ బృందాన్ని కోరడం విశేషం. కేంద్ర బృందంలో రవినేష్ కుమార్తోపాటు వ్యవసాయ సహకార రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె.మనోహరం, రోడ్డు రవాణా జాతీయ రహదారుల విభాగం ఎస్ఈ శరవన్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి, జల వనరుల శాఖ సంచాలకులు పి.దేవేందర్ రావు, కేంద్ర ఆరి్థక శాఖ సహాయ కార్యదర్శి మురుగన్ నాదమ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవింద్ ఉన్నారు. -
లక్ష్మీ పంపుహౌస్లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత
కాళేశ్వరం: భారీ వర్షాలు, గోదావరి వరదతో నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీ పంపుహౌస్లో మోటార్లు పైకి తేలాయి. నిజానికి పంపుహౌస్ నీట మునిగినప్పటి నుంచీ మీడియాను, బయటి వ్యక్తులెవరినీ అనుమతించ డం లేదు. పరి స్థితి ఏమిటన్న ది గోప్యంగా ఉంచారు. అయి తే మోటార్లు, పంపులు నీటి లోంచి బయటికి తేలిన, దెబ్బతిన్న వీడి యోలు గురువారం బయటికి వచ్చాయి. అధికారులు ఈ నెల 6వ తేదీ నాటికి నీటిని తోడేసే పని పూర్తయిందని, బురద తొలగింపు, క్లీనింగ్ పనులు చేస్తున్నారని తెలిసింది. అతి భారీ వరదతో.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత నెల 14న గోదావరి, ప్రాణ హిత నదులు ఉగ్రరూపం దాల్చి.. కాళేశ్వరం వద్ద 16.90 మీటర్ల ఎత్తులో, 28.90 లక్షల క్యూసెక్కుల భారీ ప్రవాహం నమోదైన విషయం తెలిసిందే. దీనితో అప్రోచ్ కెనాల్ నుంచి వచ్చిన వరద హెడ్ రెగ్యులేటరీ గేట్ల లీకేజీ కారణంగా ఒక్కసారిగా ఫోర్బేకు చేరింది. ఈ ఒత్తిడికి ఫోర్బే రిజర్వాయర్కు, పంపుహౌస్కు మధ్య ఉన్న బ్రెస్ట్ వాల్ (రక్షణ గోడ) కూలిపోయి మోటార్లు, పంపులపై పడింది. అదే సమయంలో పైన బరువులు ఎత్తేందుకు అమర్చిన 220 టన్నుల బరువైన రెండు ఈఓటీ క్రేన్లు, రెండు లిఫ్ట్లు, రెండు ఫుట్పాత్ ఐరన్ నిచ్చెనలు విరిగిపడ్డాయి. దీంతో ఆరు మోటార్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలిసింది. ఈ మోటార్లను విదేశాల నుంచి ఆయా సంస్థల ఇంజనీర్లు వచ్చి పరిశీలించాల్సి ఉంది. అయితే పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్ల స్థానంలో కొత్తవి అమర్చాలని.. మిగతా వాటికి మరమ్మతులు అవసరమని రాష్ట్ర ఇంజనీర్లు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక వరదలు తగ్గుముఖం పడితే రక్షణ గోడ నిర్మాణానికి అనువుగా ఉంటుందని ఇంజనీర్లు భావిస్తున్నారని.. రక్షణ గోడను పంపుహౌస్ పొడవునా నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేస్తున్నారని తెలిసింది. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పరిశీలన
చింతూరు/పోలవరం రూరల్: ఇటీవల గోదావరి వరదలతో ప్రభావితమైన ప్రాంతాల్లో బుధవారం కేంద్రబృందాలు పర్యటించాయి. నష్టాలను పరిశీలించాయి. రవినేష్కుమార్, మురుగానందం సభ్యులుగా ఉన్న బృందం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లోను, కె.మనోహరన్, పి.దేవేందర్, అరవింద్కుమార్ సోని సభ్యులుగా ఉన్న బృందం ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోను పర్యటించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు సుమిత్కుమార్, ప్రసన్నవెంకటేష్ వరద నష్టాలను ఆయా బృందాల సభ్యులకు వివరించారు. బృందం సభ్యులు వరదలకు కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అలాగే ఏలూరు జిల్లా పోలవరం గ్రామంలోని నెక్లెస్బండ్ కోతకు గురైన ప్రాంతాన్ని, యడ్లగూడెం ప్రాంతంలో నెక్లెస్బండ్ను వారు పరిశీలించారు. -
వరదొచ్చి నెల.. బతికేదెలా? రూ.10 వేల తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు
తాండ్ర కృష్ణగోవింద్ ఉవ్వెత్తున ఎగిసిన గోదావరి వరద తీరప్రాంతాలను ముంచెత్తింది. ఉగ్ర గోదావరి ధాటికి వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సహాయక శిబిరాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ బాధితుల్లో సగం మంది సొంతింటికి దూరంగానే ఉన్నారు. ఓ వైపు ఆస్తులు కోల్పోయి, మరోవైపు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు, దాతలు అందించే సాయంతోనే ఇంకా బతుకు బండి నెట్టుకొస్తున్నారు. జూలైలోనే వచ్చింది.. సాధారణంగా గోదావరికి ఆగస్టులో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలై ఆరంభంలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగాయి. గత నెల 11న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో పాత రికార్డులు చెరిపేస్తూ జూలైలోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించడం మొదలెట్టారు. ఆ తర్వాత జూలై 16 వరకు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ 71.35 అడుగులకు చేరింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 25 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించారు. జూలై 17 నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. కానీ వరద విలయంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. పక్కా ఇళ్లు సైతం ముగినిపోవడంతో అందులో ఉన్న మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెíషీన్, టీవీలు, పరుపులు, బట్టలు ఇలా సమస్తం పనికి రాకుండా పోయాయి. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో 17 వేలకు పైగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతోనే మిగిలాయి. డబ్బులకు కటకట వరదలు ముగిసినా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో కూలీలకు పనులు దొరకడం లేదు. పాడైన ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకూ డబ్బుల్లేక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వరద సాయంగా ప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, పప్పు, నూనెలతోపాటు దాతలు ఇస్తున్న సరుకులతోనే కుటుంబాలను నెట్టుకొçÜ్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ముంపు ప్రాంత ప్రజలకు ఆకలి బాధలు తప్పేలా లేవు. 1986, 1991లో గోదావరికి భీకరంగా వరదలు వచ్చినా.. ఆ రోజుల్లో అభివృద్ధి, ప్రజల జీవనశైలి సాధారణమే కాబట్టి కట్టుబట్టలతో ప్రాణాలు నిలుపుకున్నా ఆస్తినష్టం పెద్దగా లేదు. కానీ తాజా వరదలు ఇళ్లను, అందులోని సామగ్రిని నాశనం చేయడంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఎప్పుడూ మోకాళ్లలోతు మించని వరద ఈసారి ఇంటి పైకప్పులను సైతం ముంచే స్థాయిలో రావడం, స్థానికులకు పీడకలగా మారింది. అందని సాయం వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయంగా సీఎం కేసీఆర్ రూ.10 వేల చొప్పున ప్రకటించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి 17వేలకుపైగా కుటుంబాలను గుర్తించారు. వీరి ఖాతాల్లో ఇటీవల రూ.10 వేలు జమ అవుతున్నాయి. అయితే బా«ధితుల గుర్తింపు సందర్భంగా చేపట్టిన సర్వేలో జరిగిన తప్పులతో ఇప్పటికీ వేలాది మందికి సాయం అందలేదు. దీంతో బా«దితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్ ఎస్సీ కోడ్ మారడంతో చాలామందికి ఆర్థిక సాయం అందలేదు. సత్వరమే చర్యలు తీసు కుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈయన కొక్కిరేణి సాంబశివరావు. బూర్గంపాడు నివాసి. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను నిల్చున్న చోట ఓ ఇల్లు ఉండేది. అందులో భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. జూలైలో వచ్చిన వరదలకు ఇల్లు నామరూపాల్లేకుండా పోవడంతో కుటుంబానికి గూడు కరువైంది. బంధువుల ఇళ్లలో భార్యాపిల్లలను ఉంచాడు. కూలిపోయిన ఇంటిని ఎలా నిర్మించుకో వాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఈమె పేరు ముదిగొండ చంద్రమ్మ. గోదావరి వరదలు ఊరిని చుట్టేసిన సమయంలో ఆమె ఇల్లు నాలుగు రోజులపాటు వరద నీటిలో నానింది. ఇప్పుడు పనికిరాకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇంట్లో ఉండలేక కూతురు వద్ద తలదాచుకుంటోంది. 1986, 1991లో వచ్చిన వాటి కన్నా మొన్న వచ్చిన వరదలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అంటోంది. డబ్బులు రాలేదు వరదల సమయంలో మా ఇల్లు పూర్తిగా మునిగి పాడైపోయింది. రిపేరు చేయించుకుందామంటే డబ్బుల్లేవు. సర్వేలో అ«ధికారులు మా పేరు రాసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. నాలుగు రోజుల నుంచి తహసీల్దార్ ఆఫీసుకు వస్తున్నా. ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదు. – రమణయ్య, భాస్కర్నగర్, బూర్గంపాడు మండలం పని మానుకుని వచ్చా.. వరదలకు ఇల్లు కొట్టుకుపోయింది. వర్షాలతో అసలు పనులే దొరకడం లేదు. రెండు రోజుల నుంచే కూలికి పోతున్నా. సీఎం ఇస్తానన్న రూ.ç³ది వేలు మాకు రాలేదు. ఆ డబ్బు వస్తే కష్టకాలంలో కొంత ఆసరా ఉంటది. దాని కోసమే పని వదిలి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాను. –పేట్ల కుమారి, బూర్గంపాడు -
కృష్ణా, గోదావరి పోటాపోటీ
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం/విజయపురిసౌత్/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్)/: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికను ఎగురవేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే.. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశాలలో కురుస్తున్న వర్షాలకు పెన్ గంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉరకలెత్తుతుండటంతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. ఇక్కడ మంగళవారం సా.6 గంటలకు 9,74,666 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 44 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మరోవైపు..కృష్ణా, గోదావరి నదుల్లో బుధవారం వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత.. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరదకు తోడు వాగులు, వంకల వరద తోడవవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సా.6 గంటలకు 2,72,943 క్యూసెక్కులు చేరుతుండటంతో.. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,95,559 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.7 అడుగుల్లో 213.88 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్లోకి 1,91,646 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 577.6 అడుగుల్లో 276.09 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు వస్తే రెండ్రోజుల్లో సాగర్ నిండిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రకాశం బ్యారేజ్లోకి భారీ వరద సాగర్లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ, వైరా జలాలు తోవడవుతండటంతో పులిచింతలలోకి 30,197 క్యూసెక్కులు చేరుతున్నాయి. ముప్పు నివారణ కోసం ప్రాజెక్టులో కొంతభాగాన్ని ఖాళీచేస్తూ.. స్పిల్వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 51,831 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 40.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి.. పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుంటంతో ప్రకాశం బ్యారేజ్లోకి 1,07,985 క్యూసెక్కులు చేరుతోంది ఇక్కడ నుంచి 70 గేట్లు ఎత్తి 1,00,590 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరదెత్తిన వంశధార.. ఇక ఒడిశా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంశధారలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్లోకి 21,004 క్యూసెక్కులు చేరుతుండగా.. ముంపు ముప్పును నివారణకు 22,040 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నది నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 10,200 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్ద అప్రమత్తం ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకూ వరద ప్రవాహాన్ని అంచనావేస్తూ.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. మంగళవారం సా.6 గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 6,92,948 క్యూసెక్కులు చేరుతుండటం.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 33.06, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.14 మీటర్లకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7,81,627 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
9 నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందాలు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు ఈ నెల 9 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి నష్టాలను అంచనా వేయనున్నారు. 9 మధ్యాహ్నం సభ్యులు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకోనున్నారు. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై వరద పరిస్థితులు, జరిగిన నష్టాలకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేసి 10, 11 తేదీల్లో అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత రెండు బృందాలు కలిసి విజయవాడ చేరుకుంటాయి. అనంతరం సీఎం వైఎస్ జగన్తో కేంద్ర బృందాలు సమావేశమవుతాయి. 11 రాత్రి విజయవాడలోనే బస చేసి 12న తిరిగి ఢిల్లీకి వెళ్తాయి. కేంద్ర బృందంలో డాక్టర్ కె.మనోహరన్, శ్రావణ్కుమార్ సింగ్, పి.దేవేందర్ రావు, ఎం.మురుగునాథన్, అరవింద్ కుమార్ సోని సభ్యులుగా ఉన్నారని విపత్తుల సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. -
పెరుగుతున్న సాగర్ నీటిమట్టం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 575 అడుగుల్లో 269.12 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న జలాల్లో సాగర్లోకి 70,359 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 42.88 టీఎంసీలు అవసరం. కృష్ణా, తుంగభద్ర నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త తగ్గింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,436 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండు గేట్లను మూసివేశారు. ఒక గేటు ద్వారా 27,846 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 63,332 క్యూసెక్కులు.. వెరసి 91,178 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద గోదావరిలో మళ్లీ వరద పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్కి వచ్చే ప్రవాహం పెరిగింది. ఇక్కడి నుంచి డెల్టాకు 6,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,68,278 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 6,46,715 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 36.6 అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో వంశధారలోనూ వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్లోకి 10,465 క్యూసెక్కులు చేరుతోంది. ఆయకట్టుకు 1,897 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8,568 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతలలో 40.632 టీఎంసీలు కృష్ణా డెల్టాలో నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే సాగర్లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 30,640 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. సాగర్లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీకి 4,844 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నుంచి తెలంగాణ విడుదల చేస్తున్న నీటికి మూసీ, హాలియా జలాలు తోడవడంతో 42,705 క్యూసెక్కులు పులిచింతలలోకి చేరుతున్నాయి. పులిచింతలలో 40.632 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో పులిచింతల గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 42,705 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, పాలేరు, వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్లోకి 77,603 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,513 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 69,990 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
పశురక్షణకు ఏపీ సర్కారు దీక్ష.. 94 బృందాలు 20 రోజులుగా సేవలు
సాక్షి, అమరావతి: ‘ఏమ్మా.. మిమ్మల్నే కాదు.. మీ పశువులను కూడా బాగా చూసుకున్నారు కదా..’ అంటూ ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరాతీస్తే అక్కడున్న ప్రతి పాడి రైతు ఆనందంతో అవునంటూ బదులివ్వడం గోదావరి వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుకు అద్దంపట్టింది. సాధారణంగా వైపరీత్యాల వేళ పెద్దసంఖ్యలో మృత్యువాతకు గురయ్యేవి మూగజీవాలే. ప్రభుత్వం ఈసారి ఆ పరిస్థితి రానివ్వలేదు. దాదాపు 26 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినప్పటికీ ఈసారి వేళ్లమీద లెక్కపెట్టదగినన్ని పశువులే ప్రాణాలు కోల్పోయాయంటే.. వాటి రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణం. 509 మంది సిబ్బందితో ఏర్పాటు చేసిన 94 బృందాలు 20 రోజులుగా సేవలందిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు సహాయ, పునరావాస చర్యలు కొనసాగించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో యంత్రాంగం అహరహం శ్రమిస్తోంది. పాడి రైతులకు అండగా.. వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న 32 వేల పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీటికోసం 102 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. మృత్యువుతో పోరాడుతున్న 7,574 పశువులకు సకాలంలో వైద్యసేవలందించి వాటి ప్రాణాలను రక్షించారు. 243 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 7,945 పశువులకు అత్యవసర చికిత్స చేశారు. రూ.11.82 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశుపోషకులకు రూ.3.84 కోట్ల విలువైన 2,430 మెట్రిక్ టన్నుల సంపూర్ణ మిశ్రమ దాణా (టీఎంఆర్)తో పాటు రూ.1.96 లక్షల విలువైన మినరల్ మిక్చర్, ఇతర పోషకాలను ఉచితంగా పంపిణీ చేశారు. 30,770 పశువులకు వ్యాక్సిన్ వేశారు. ఈ ఐదు జిల్లాల పరిధిలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన వైఎస్సార్ సంచార పశువైద్య సేవారథాలు వరద సహాయక చర్యల్లో విశేష సేవలందించాయి. మారుమూల వల్లెల్లో సైతం వీటిద్వారా వ్యాక్సినేషన్, అత్యవసర వైద్యసేవలు అందించగలిగారు. 700 పశువుల ప్రాణాలను కాపాడాం వరదల సందర్భంగా మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం çస్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయం. రాజమహేంద్రవరం–కొవ్వూరు మధ్య గోదావరి నదీగర్భంలోని లంకభూముల్లో 700కు పైగా పశువులు చిక్కుకున్నాయని సమాచారం ఇవ్వగానే పశుసంవర్ధకశాఖ తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. లేగదూడలు, పాలిచ్చే గేదెలు, ఆవులను ప్రత్యేక బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చి అక్కడినుంచి బొబ్బర్లంక గోశాలకు తరలించింది. మిగిలిన వాటికి పశుగ్రాసం, తాగునీరు, వైద్యసహాయం అందించింది. ఈసారి లంకల్లో చిక్కుకున్న ఏ ఒక్క పశువు మృత్యువాతపడలేదు. – తేజోవంత్, రాష్ట్ర జంతుసంక్షేమ బోర్డు సభ్యుడు నిజంగా అభినందనీయం లంకభూముల్లో దూడలు మేపుకొంటాం. 1986లో గోదావరి వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. చాలా పశువులు చనిపోయాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వరదలకు ముందుగానే ప్రభుత్వం మమ్మల్ని అప్రమత్తం చేయడంతో మా పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పదిరోజుల ముందుగానే పశువులకు వ్యాక్సిన్ వేశారు. సంపూర్ణ మిశ్రమ దాణా అందిస్తున్నారు. మనుషులతో సమానంగా మూగజీవాల పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేసిన విధానం నిజంగా అభినందనీయం. – పుచ్చకాయల నరసింహమూర్తి, పి.గన్నవరం సీఎం ఆదేశాల మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయ, పునరావాస కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తున్నాం. వరద ప్రభావిత గ్రామాల్లోని పశువులకు నూరుశాతం వ్యాక్సిన్ వేశాం. అవసరమైన దాణా, పశుగ్రాసం ఉచితంగా అందిస్తున్నాం. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్ పశుసంవర్ధకశాఖ -
36 సంవత్సరాల అనంతరం గోదావరికి భారీగా వరదలు: మంత్రి అమర్నాథ్
-
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: వరద బాధితులకు అధికార యంత్రాంగం అండగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి వసతులు కల్పించామని పేర్కొన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.2 వేలు అందించామన్నారు. నగదుతో పాటు నిత్యావసరాలు ఉచితంగా ఇచ్చామన్నారు. చదవండి: డాన్ చీకోటి వ్యవహారంపై స్పందించిన కొడాలి నాని చంద్రబాబులా మాది మాటల ప్రభుత్వం కాదన్నారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో కరువు తప్ప వరదలు వచ్చాయా?. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమవడానికి కారణం ఎవరు?. మూడేళ్లలో చంద్రబాబు పిడికెడు మట్టైనా వేశారా?. ప్రాజెక్టుల కంటే కాంట్రాక్టులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి బొత్స మండిపడ్డారు. -
27 రోజులు.. 2,192 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ఈ నెలలో కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 1861 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో గోదావరి జలాలు కడలి పాలవడం గమనార్హం. ఈ నెల ముగియడానికి మరో నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 75 చొప్పున నాలుగు రోజుల్లో మరో 300 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. అంటే.. జూలై ముగిసే నాటికి కనీసం 2,492.93 టీఎంసీలు సముద్రంలో కలవనున్నాయి. సాధారణంగా జూలైలో గోదావరికి భారీ వరదలు రావు. ఈ నెలలో సాధారణంగా 100 నుంచి 500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయి. ఇంతకంటే అధికంగా గోదావరి జలాలు కడలి పాలయ్యే అవకాశాలు తక్కువ. 2013 జూలైలో తొలి సారిగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అది కూడా జూలై ద్వితీయార్థంలో రావడంతో 2,033.86 టీఎంసీలు కడలి పాలయ్యాయి. ఇప్పటివరకూ అదే అత్యధిక రికార్డు. కానీ.. ఈ ఏడాది చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ద్వితీయార్థంలోనూ కొనసాగుతున్నాయి. కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీలు సముద్రంలో కలవడం ద్వారా 2013 జూలైలో సృష్టించిన రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత గోదావరి ఈ ఏడాది బద్దలు కొట్టడం గమనార్హం. మూడుసార్లు గరిష్ట ప్రవాహం వచ్చినా.. సాధారణంగా గోదావరి నదికి ఆగస్ట్ నెలలో మాత్రమే గరిష్ట ప్రవాహం వస్తుంటుంది. అందుకు భిన్నంగా.. గోదావరి చరిత్రలో 1861, 1988, 1989 సంవత్సరాల్లో జూలై నెలలో గరిష్టంగా 15 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద ప్రవాహాలు వచ్చాయి. కానీ.. ఈ ఏడాది జూలై 16న ధవళేశ్వరం బ్యారేజీలో 26.9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజీ చరిత్రలో జూలైలో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. 1861 నుంచి ఇప్పటివరకూ గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేశారు. ఆ తర్వాత 2006 ఆగస్టు 6న అత్యధికంగా 28,05,773 క్యూసెక్కుల ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి రాగా.. గోదావరి చరిత్రలో ఇది రెండో అత్యధిక వరద ప్రవాహంగా నమోదైంది. వరద జలాల మళ్లింపునకు సర్కారు యత్నం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రం పాలవుతున్న ఈ నీటిని గరిష్ట స్థాయిలో వినియోగించుకుని.. రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించి వాటిని సుభిక్షం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్లోకి.. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్లోకి పోసి.. సోమశిల (పెన్నా)కు తరలించేందుకు ప్రణాళిక రచించింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) అనుసంధానం ద్వారా 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి ఎన్డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రణాళిక రచించింది. -
గోదావరి వరదలకు శాశ్వత పరిష్కారం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా గోదావరికి వచ్చే వరదలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మంగళవారం రాత్రి సీఎం రాజమహేంద్రవరంలో సమీక్షించారు. 1986 వరదల తర్వాత ఆ స్థాయిలో గోదావరికి దాదాపుగా 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఈ ఏడాది వచ్చిందని.. భవిష్యత్తులో ఇందుకు అనుగుణంగా నియంత్రణ చర్యలు ఉండాలని సీఎం ఆదేశించారు. ఏటిగట్లు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించాలని, శాశ్వత చర్యలపై దృషిŠ?ట్పట్టి నవంబరుకల్లా టెండర్లు పూర్తిచేస్తే పనులు మొదలుపెడదామన్నారు. కరకట్టల ఆధునీకరణపై కూడా వెంటనే ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. డెల్టా ఆధునీకరణ, గోదావరి వరదల నుంచి శాశ్వత పరిష్కారం కోసం అందజేసిన డీపీఆర్పై టెక్నికల్ ఎస్టిమేట్స్ తయారుచేసి వెంటనే నివేదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, అన్ని లంక గ్రామాలలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేస్తే విపత్తు సమయంలో వాటిని పునరావాస కేంద్రాలుగా వినియోగించుకోవచ్చునని సూచించారు. పారదర్శకంగా నష్టాల నమోదు ఇక నష్టాల నమోదు వెంటనే ప్రారంభించాలని.. ఈ విషయంలో అంతా పారదర్శకంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక సామాజిక తనిఖీ నిర్వహించాలని, దీనివల్ల అర్హత ఉండి సాయాన్ని అందుకోలేని వారికి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెండు వారాల్లో నష్టాల నమోదును పూర్తిచేద్దామన్నారు. పారదర్శకంగా ఉండడంలో దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నామన్నారు. ఏ సీజన్లో జరిగిన నష్టం ఆ సీజన్ ముగిసేలోగా ఇవ్వగలిగితే ప్రజలు మరింత సంతోషిస్తారని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ముంపు ప్రమాదం ఉన్నవారిని అప్రమత్తం చేశారంటూ సీఎం ప్రశంసించారు. వలంటీర్, సచివాలయం వ్యవస్థ ఫలితాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయన్నారు. అధికారులకు సీఎం అభినందనలు లంక గ్రామాల్లో నష్టతీవ్రత వివరాలను సీఎం అధికారులను అడిగి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలప్పుడు కొంతమంది అధికారులను బాధ్యులుగా చేసి సస్పెండ్చేసి హడావిడి చేసేవారని ఆయన గుర్తుచేశారు. విపత్తుల సమయంలో అధికారులు నాయకుల చుట్టూ తిరుగుతుండడంవల్ల పునరావాస పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. కానీ, అన్నీ జరిగాక తాను రావడంవల్ల అవి సవ్యంగా జరిగాయా? లేదా? అని తెలుసుకుంటున్నానని.. తాను కూడా వరదల సమయంలో వచ్చి, మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుని నలుగురిని సస్పెండ్ చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా ప్రజలకు మంచి జరగాలి, వారికి సాయం అందాలి కదా అని ముఖ్యమంత్రి అన్నారు. అధికారులంతా బ్రహ్మండంగా పనిచేశారు కాబట్టే ‘చాలా బాగా చూసుకున్నార’న్న మాట ఈరోజు ప్రజల నుంచి వినిపిస్తోందంటూ సీఎం జగన్ వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ మంచి పేరు నిలబెట్టుకునేలా ముందుకెళ్దామన్నారు. ఇందులో ప్రజాప్రతినిధులను కూడా మమేకం చేసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్నారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్, ప్రజారోగ్యంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. విద్యుత్పై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ విషయంలో ఎక్కడైనా జాప్యం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ తప్పులు జరిగితే సరిదిద్దుకోవాలని.. లేదంటే ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం యుద్ధం చేస్తున్నది టీడీపీ, చంద్రబాబుతో కాదని.. నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్ జగన్ వారికి గుర్తుచేశారు. ఆ మీడియా సంస్థలు కూడా చొక్కాలిప్పుకుని ఒక పార్టీ అధికారం కోసం పనిచేస్తున్నాయని, వాస్తవాలను ప్రజలకు వివరించి వాటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. రాజమహేంద్రవరంలోకి వరదనీరు రాకుండా.. ఇక రాజమహేంద్రవరం అవ డ్రెయిన్ ఏర్పాటుచేయడంపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని అంచనాలు సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పట్టణంలోకి ఎలాంటి వరదనీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రమైన నివేదిక రాగానే చర్యలు ప్రారంభిస్తామన్నారు. నిపుణులతో కూడిన టెక్నికల్ కమిటీని నియమించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మీ తోడ్పాటుతోనే నాణ్యమైన సేవలు.. సహాయక కార్యక్రమాల కోసం నిధులను వెంటనే సమకూర్చడంతో నాణ్యమైన సేవలందించగలిగామని అధికారులు సీఎంకు వివరించారు. పశువులకు కూడా వెంటనే గ్రాసం అందజేశామన్నారు. వైద్య శిబిరాలు ముందుగా ఏర్పాటుచేయడంతో జ్వరాలు వంటి వాటిని నివారించగలిగామని, బాధితులకు సహాయం చేయడంలో ఉదారంగా ఉండాలన్న సీఎం సూచనలవల్లే ఎక్కువ సాయం చేయగలిగామన్నారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ లేకుండా ఉంటే ఈ రకమైన సేవలు అందించలేకపోయే వాళ్లమన్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన భోజనం అందజేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు మీలా ముందస్తుగా పునరావాసాల కోసం సాయం అందించలేదన్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాత్రి బసచేశారు. -
ఇంటింటికీ కాలి నడకన
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి: కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా బాధితులను కలుసుకుని భరోసా కల్పించారు. వారి ఇబ్బందులను సావధానంగా ఆలకించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాన్ని చూపారు. షెడ్యూల్ ప్రకారం సీఎం మంగళవారం ఉ.10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి వశిష్ట నదిపై పంటు దాటి జి.పెదపూడి లంక వెళ్లారు. ప్రతి బాధితుడికి తన గోడు చెప్పుకునే అవకాశాన్నిచ్చారు. మీకు సాయం అందిందా? లేదా? అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులను చూడగానే ట్రాక్టర్ దిగి.. సీఎం పర్యటన సందర్భంగా జి.పెదపూడిలంకకు ట్రాక్టర్పై వెళుతుండగా దారిలో ఉద్యానవన రైతులు పొలాల్లో కుళ్లిపోయిన అరటి, వంగ, మిరప, దొండ, మునగ పంటలతో కనిపించారు. రైతులను చూడగానే ట్రాక్టర్ ఆపాలని ఆదేశించి సీఎం జగన్ కిందకు దిగారు. భద్రతా సిబ్బంది వారిస్తున్నా రైతుల మధ్యకు వెళ్లి వారు చెప్పింది విన్నారు. అధైర్యపడొద్దు.. ‘గోదావరికి ఆగస్టు 15 తరువాత వరదలు వస్తాయి. ఈసారి నెల రోజులు ముందే రావడంతో చేతికి వచ్చిన పంట కోల్పోయాం’ అని జి.పెదపూడి లంకకు చెందిన రైతులు వారా వెంకట్రావు, చీకురమల్లి సంతోషరావు, పల్లి సత్యనారాయణ, అడ్డాల నరసన్న, దొడ్డా శ్రీనివాస్, కటికిరెడ్డి నాగరాజు సీఎం ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడు ఎకరాల్లో మిర్చి సాగుకు రూ.రెండు లక్షలు పెట్టుబడి పెట్టా. కేవలం రూ.36 వేలు మాత్రమే వచ్చింది. మిగిలిందంతా వరదలో కొట్టుకుపోయింది’ అని కంటతడి పెట్టిన రైతు పల్లి సత్యనారాయణను సీఎం జగన్ ఓదార్చారు. అక్కడే ఉన్న ఉద్యానశాఖ, వ్యవసాయ అధికారులను పంట నష్టంపై ఆరా తీశారు. ‘రైతులు పంట నష్టపోతే ఆదుకోవడంలో మన ప్రభుత్వ స్పందన వేరు. ఏ సీజన్లో నష్టపోతున్నారో అదే సీజన్ ముగిసేలోగా పెట్టుబడి రాయితీఅందజేస్తున్నాం. అధైర్యపడొద్దు. అధికారులు నష్టం అంచనాలు రూపొందిస్తారు. నివేదిక అందాక పెట్టుబడి రాయితీ మీ ఖాతాలకు జమ అవుతుంది’ అని రైతులకు ధైర్యం చెప్పారు. పంటుపై ప్రయాణిస్తూ గోదావరి ఉధృతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వీధుల్లో కాలి నడకన.. జి.పెదపూడిలంకలో ట్రాక్టర్ దిగి రెండు వీధులు నడుచుకుంటూ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం జగన్ పరామర్శించారు. ప్రతి ఒక్కరితోనూ కలసిపోయారు. వరదల్లో వారు పడిన ఇబ్బందులను తెలుసుకున్నారు. ‘వరద వచ్చినప్పుడు మీ కలెక్టర్ వచ్చారా? అధికారులు వచ్చారా? సాయం అందించారా? పాలు ఇచ్చారా? బియ్యం పంపిణీ చేశారా? పప్పులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆయిల్ ప్యాకెట్లు అందించారా? లేదా’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.రెండు వేల సాయం అందిందా? లేదా? అని ఇంటింటికీ వెళ్లి అడిగారు. ట్రాక్టర్పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పటికప్పుడే ఆదేశాలు... సీఎం జగన్ కాలి నడకన పర్యటిస్తున్న సమయంలో అనారోగ్యంతో ఉన్న తన భర్త మాతా సత్యనారాయణను ఆదుకోవాలని ఓ మహిళ కోరడంతో నేరుగా ఆ ఇంటికి వెళ్లి పలకరించారు. వైద్యానికి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. జీవనోపాధి కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మాతా జ్యోతి వేడుకోవడంతో ఆమెను వలంటీర్గా నియమించాలని సూచించారు. సీఎం పర్యటన పూర్తయ్యే లోపు ఆమెకు నియామక ఉత్తర్వులు అందడంతో కృతజ్ఞతలు తెలిపింది. పూరిల్లు వరద నీట మునిగిన బాధితుడు కాకర కృష్ణకు పక్కా ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సరెళ్ల సూర్యారావు అనే వృద్ధుడిని వరద సాయంపై సీఎం ఆరా తీయగా.. అన్నీ అందాయి, అందరూ బాగా పని చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ.. ‘వరద కష్టాల్లో కూడా ఏ పూటా పస్తులు ఉండలేదు. ఏ లోటు రానివ్వకుండా మీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంది. మనస్ఫూర్తిగా తిన్నాం. మాకు అన్నీ అందాయి. అధికారులు మావద్దకు వచ్చారు’ అని బాధితులు సీఎం జగన్కు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఆగుతూ ప్రతి ఒక్కరి పేరు కనుక్కుని పలుకరిస్తూ సీఎం కదిలారు. -
అల్లూరి, ఏలూరు జిల్లాల పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, ఏలూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 27న (బుధవారం) అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండోరోజు కూడా ఆయన గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడతారు. ఉ.8.30కు రాజమహేంద్రవరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ నుంచి ముఖ్యమంత్రి బయల్దేరి ఏఎస్ఆర్ జిల్లా చింతూరు చేరుకుంటారు. 9.30కు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశమవుతారు. ఆక్కడి నుంచి మ.12 గంటలకు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయగుట్ట గ్రామం చేరుకుని వరద బాధిత గ్రామాలకు సంబంధించిన ఫొటోగ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం.. తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. మ.1 గంటకు తాడేపల్లికి బయల్దేరుతారు. వరద బాధితులకు అండగా.. మరోవైపు.. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిస్థాయిలో సాయమందించింది. వారి యోగక్షేమాల్ని తెలుసుకుని ఇంకా సాయమందించాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకుని వారిని ఓదార్చేందుకు సీఎం వైఎస్ జగన్ బుధవారం ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. -
‘బురద జల్లుదాం ఛలో ఛలో’
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భావన చూడండి. ఆంధ్రప్రదేశ్ అప్పుడే శ్రీలంకలా మారిందట. అయినా ప్రజలు ఇంకా తిరుగుబాటు చేయడం లేదట. శ్రీలంక ప్రజలకన్నా ఏపీ ప్రజలకే ఎక్కువ ఓర్పు ఉందట. ఎప్పుడు ఏపీ శ్రీలంకలా మారి ప్రజలలో తిరుగుబాటు వస్తే అప్పుడు తాను గద్దె ఎక్కవచ్చన్న అత్యాశతో ఆయన ఉండవచ్చు. కానీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున అవేవీ తమకు వద్దని ప్రజలు జగన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలా? అమ్మ ఒడి, చేయూత, విద్యాకానుక వంటి వాటి కింద ఆర్థిక సాయం చేస్తున్నందుకు తిరగబడాలా? అది సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తనను తాను మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. గోదావరి వరద బాధితులను పరామర్శించ డానికి ఆయన పశ్చిమ గోదావరి, కోనసీమ లకు వెళ్లారు. తన పర్యటనను రాజకీయ దండయాత్ర మాదిరి, ఎన్నికల ప్రచారం మాదిరి చేశారే తప్ప పరామర్శించడానికి చేసినట్లు కనిపించదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించవచ్చా? ఆయన పాత తరహా ఫ్యూడల్ రాజకీయాలకు అలవాటు పడి పోయారు. ఏపీ, శ్రీలంకలా కావాలని ఎవరైనా కోరుకుంటారా? కొన్ని విషయాలలో శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని అను కుంటాం. అలాంటిది ఒక రాష్ట్రం మొత్తానికి ఆ పరిస్థితి రావాలని అభి లషిస్తున్నారంటే, తన ఓటమిని ఇంకా ఎలా జీర్ణించుకోలేకపోతు న్నారో స్పష్టం అవుతోంది. తన హయాంలో లక్షా పదకొండు వేల కోట్లకు సంబంధించి లెక్కలు ఎందుకు ఇవ్వలేదన్నదానికి చంద్ర బాబు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత శ్రీలంక గురించి మాట్లాడాలి. కరోనా సమయంలో అప్పో సప్పో చేసి ఆదుకున్నందుకు నిరసనగా ప్రజలు ఉద్యమించాలా? రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నందుకు రైతులు తిరగబడాలా? గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలన అందిస్తున్నందుకు నిరసన చెప్పాలా? తమ ఇళ్ల వద్దకే పెన్షన్ ఎందుకు తెస్తున్నారని ప్రజలు నిలదీయాలా? ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తున్నారని లబ్ధిదారులు పోరాడాలా? పోనీ ఆ స్కీములకు తాను వ్యతిరేకిననీ, వాటివల్ల నష్టం జరుగు తున్నదనీ చంద్రబాబు చెప్పరు. పైగా ముఖ్యమంత్రి జగన్ కంటే తాను ఇంకా ఎక్కువగా సంక్షేమం అమలు చేస్తానంటారు. అప్పుడు ఏపీ శ్రీలంక కాదా? ఇది సింపుల్ లాజిక్ కదా! అసలు వరద బాధితు లకూ, శ్రీలంకకూ సంబంధం ఏమిటి? అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడడం, అదేదో భగవద్గీత మాదిరి టీడీపీ అనుబంధ మీడియా ప్రచారం చేయడం... ఆ మాటకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఆంధ్రుల పరువు తీసినందుకూ, పదేళ్ల రాజధాని హైదరాబాద్ను వదలుకున్నందుకూ, గోదావరి పుష్కరాలలో తన ప్రచార యావకు 29 మంది బలయి నందుకూ... ఇలా ఆయన హయాంలో అనేక విషయాలలో జనం తిరగబడి ఉండాలి కదా? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనకు సన్నిహితులుగా ఉన్న కొందరు ప్రముఖులు బ్యాంకులకు ఎగవేసిన డబ్బును చెల్లించేలా చూడవచ్చు కదా! ఆ డబ్బును ఏపీలో వ్యయం చేయమని బ్యాంకు లను కోరవచ్చు కదా. అది జరిగితే ఆయనకు మంచి పేరు వస్తుంది కదా. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నలభై ఐదువేల కోట్లు, సుజనా చౌదరి ఏడు వేల కోట్లు, రాయపాటి సాంబశివరావు ఎనిమిది వేల కోట్లు, రఘురాజు వెయ్యి కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడిన సంగతి తెలియదా? ఇలా పలువురు ఆయనతో రాజకీయ సంబం ధాలు ఉన్నవారే కదా? ఏపీలో పేదలకు ఇస్తున్న పథకాల వల్ల పేద లకు వేల కోట్ల వ్యయం అవుతోందని బాధపడేవారికి ఇది ఒక జవాబే. నిజంగానే వరద బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందకపోతే ఆ విషయాన్ని ప్రస్తావించి తగు న్యాయం చేయాలని కోరవచ్చు. అలాకాకుండా ఉన్నవి లేనివి మాట్లాడడం టీడీపీకే చెల్లింది. ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆశించిన విధంగా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో నిరాశతో ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వాలకూ, ఈ ప్రభుత్వానికీ తేడా ఏమిటంటే, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్ ప్రభుత్వం సమర్థంగా ఏర్పాటు చేసుకోగలిగింది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న సహాయ సిబ్బంది ఇప్పుడు వందల సంఖ్యకు పెరిగారు. తన హయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు బాగా స్పందించేవాడినని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. తిత్లి తుపాను సమయంలో వరద బాధితులను ఎలా గదిమింది సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర జల సంఘం ముందస్తుగా హెచ్చరిం చినా వరదలను నియంత్రించలేకపోయారని విమర్శించారు. ఇంకా నయం... తనకు మాదిరి తుపానును ఆపలేకపోయారనీ, అమరావ తిలో ఎండలు తగ్గించాలని తన మాదిరి అధికారులను ఆదేశించ లేకపోయారనీ అనలేదు. గోదావరి వరద ఆరంభం కాగానే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే 36 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎక్కడా పెద్దగా ఇబ్బంది రాలేదు. ఈ స్థాయిలో వరద వచ్చినప్పుడు లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణం. 1986లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే స్థాయిలో వరద వస్తే గోదావరి గట్లకు గండ్లు పడి రెండు జిల్లాల్లో పెద్ద నగరాలు, పట్టణాలతో సహా వందలాది గ్రామాలు నీట మునిగాయి. రోజుల తరబడి ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారు. 1996, 98లలో వచ్చిన తుపానుల కారణంగా పలువురు మరణించారు. ఆ విషయాలు మర్చిపోతే ఎలా! ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదనీ, మరో రెండు రోజుల్లో ఇవ్వకపోతే టీడీపీ అందిస్తుందనీ ఆయన అన్నారట. నిజంగానే ప్రభుత్వం నీరు అందిం చకపోతే వెంటనే తన పార్టీ ద్వారా సాయం చేస్తానని అనాలి కానీ, మరో రెండు రోజులు గోదావరి బురద నీరు తాగండి, ఆ తర్వాత నీరు తెస్తాం అన్నట్లు మాట్లాడడాన్ని ఏమనుకోవాలి? రాజంపేట ప్రాంతంలో పర్యటించినప్పుడు చంద్రబాబు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు తిరుగుబాటు చేయరా? మీరు సంతృప్తి చెంది జగన్కు జేజేలు పలుకుతారా అని కుళ్లుకున్నారు. వరద బాధితులకు రెండువేల రూపాయల సాయం కాదు, తెలంగా ణలో మాదిరి పదివేలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో ప్రకటన వచ్చింది కానీ ఇంకా మొదలు కాలేదు. జగన్ తాను చెప్పిన మేరకు సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి రెండువేల రూపాయలు అందించి పంపుతున్నారు. పోనీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు, కరువులు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారో చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు డిమాండ్లు పెట్టవచ్చు. ఆ పని చేయరు. ఎందుకంటే ఆయన ఏమీ ఇవ్వలేదు కదా! లంకల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ఏభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయరాదు. అదే సమయంలో అందరికీ వేలకు వేల సాయం చేయాలి. ఇలాంటి వింత వాదనలతో చంద్రబాబు తన పరువు తానే తీసుకుంటున్నారు. చివరికి చంద్రబాబు టీమ్ పడవ లలో పర్యటించినప్పుడు అధికారులు వారించినా వినకుండా, అధిక సంఖ్యలో వాటిలో ఎక్కడం, ఆ తర్వాత ప్రమాదం సంభవించడం, అదృష్టవశాత్తూ ముప్పు తప్పడం జరిగింది. కానీ దీనిపై కూడా టీడీపీ నేత వర్ల రామయ్య యధాప్రకారం భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఇంకా నయం. జగన్ ప్రభుత్వ కుట్ర వల్లే పడవ నుంచి టీడీపీ నేతలు పడిపోయారని చెప్పలేదు. చివరిగా ఒక మాట. పార్టీ తరపున చంద్రబాబు సాయం చేసినా, చేయకపోయినా ఫర్వాలేదు. కానీ శక్తివంచన లేకుండా సహాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వంపై బురద చల్లకుండా ఉండగలిగితే మంచిది. సొంత ఖర్చులతో బాధితులకు సాయం చేస్తున్న రంగనాథ రాజు వంటి ఎమ్మెల్యేలపై దూషణలకు దిగకుంటే అదే పదివేలు. అధికారం పోయిందన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు విచక్షణ, విజ్ఞత కోల్పోయి వ్యవహరించడమే దురదృష్టకరం. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సీఎం సహాయనిధికి విరాళం అందించిన APDMC
-
కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం, 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి 11 గంటలకు పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. చదవండి: చంద్రబాబు ఏం చేశాడో తెలుసా?.. వాస్తవాలు చెప్పిన మంత్రి అంబటి ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు, అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు. -
వరద బాధితుల సహాయార్థం ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) రూ.5 కోట్ల విరాళం అందజేసింది. విరాళానికి సంబంధించిన చెక్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డైరెక్టర్ వీజీ.వెంకటరెడ్డి అందజేశారు. చదవండి: మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం గోదారమ్మ శాంతించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్లోకి వస్తున్న వరద 6,68,560 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్లోకి వస్తున్న ప్రవాహం 8,82,330 క్యూసెక్కులకు, సీతమ్మసాగర్లోకి చేరుతున్న వరద 8,94,998 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో భద్రాచలం వద్ద రాత్రి 7 గంటలకు 8,28,701 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి మట్టం 40.60 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడం.. శబరి కూడా శాంతించడంతో పోలవరం ప్రాజెక్టులోకి 6,63,660 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 34.39 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.62 మీటర్లకు తగ్గింది. పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద పెరుగుతూ.. తగ్గుతూ ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల కొండవాగుల నీరు నదిలోకి వెళ్లే పరిస్థితి లేదు. ప్రాజెక్టు దిగువన వరద నీటి ప్రవాహంతో కడెమ్మ స్లూయిజ్ నుంచి కొండవాగు నీరు నదిలోకి చేరే పరిస్థితి లేదు. కాగా, ధవళేశ్వరం బ్యారేజ్లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రవాహం 9,70,218 క్యూసెక్కులకు, వరద మట్టం 11.70 అడుగులకు తగ్గింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సముద్రంలోకి 9,65,018 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. -
మరోసారి అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు.. అసలు రహస్యం బట్టబయలు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నిజాన్ని అబద్ధంగా చెప్పించే ప్రయత్నం చేసి మరోసారి టీడీపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. అసలు రహస్యం వీరమ్మ కుమారుడు బయటపెట్టాడు.దీంతో మీడియా సాక్షిగా పచ్చనేతలు దొరికిపోయారు. చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు అయోధ్య లంక మర్రిమూలలో వరద నీరు బాటిల్లో పట్టించి ఇప్పటికే నవ్వుల పాలైన టీడీపీ నేతలు.. వీరమ్మ కుమారుడు వీరాంజనేయులతో మీడియా సమావేశం పెట్టించి.. వైఎస్సార్సీపీ నేతలు బెదిరించి చెప్పమన్నారంటూ టీడీపీ నేతలు చెప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించలేదని వీరాంజనేయులు మీడియా సమావేశంలో చెప్పడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాలని చూసి మరోసారి టీడీపీ నేతలు అభాసు పాలయ్యారు. -
మళ్లీ గోదా‘వడి’!
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన పాయతోపాటు.. ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవాహిస్తుండటంతో గోదావరిలో శనివారం వరద ఉధృతి పెరిగింది. తాలిపేరు ఉప్పొంగడంతో రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. దాంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 44.50 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు 43 అడుగుల కంటే దిగువకు వరద మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఎగువన బేసిన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్లోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్లోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆ మూడు బ్యారేజ్లలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. మరో 48 గంటలు బేసిన్లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది. పోటెత్తిన శబరి భద్రాచలం నుంచి దిగువకు వస్తున్న గోదావరి వరదకు శబరి ప్రవాహం తోడవడంతో పోలవరం వద్ద వరద ప్రవాహం 7,79,341 క్యూసెక్కులకు పెరిగింది. నీటి మట్టం 32.910 మీటర్లకు చేరుకుంది. దాంతో జల వనరుల శాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తూ, వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రాత్రి 9 గంటలకు నీటి మట్టం 12.30 అడుగులకు చేరింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టాకు 5,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 10,48,887 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
ఒక్క ప్రాణమూ పోవద్దు.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది తన జన్మస్థానమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు ఉధృతంగా ప్రవహిస్తోందని, ఉప నదులు సైతం భారీ వరదతో పోటెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తెలిపారు. ప్రకృతి విపత్తుల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం.. ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా కాలమని స్పష్టం చేశారు. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎక్కడా వరద నీటిని ఆపొద్దు ‘ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే ప్రాజెక్టుల గేట్లను ఎత్తి కిందికి విడుదల చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నీటిని ఆపకూడదు. గేట్లు లేకుండా మత్తడి దూకి ప్రవహించే డిండి, పాకాల, వైరా, పాలేరు రిజర్వాయర్ల విషయంలో మరింత అప్రమ త్తంగా ఉండాలి. అత్యవసర సేవలందించే శాఖలతో పాటు, వానలు వరదల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్ని శాఖల అధికారులు వారి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. ఈ మేరకు సీఎస్ తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలి..’ అని సీఎం సూచించారు. ప్రజా ప్రతినిధులూ అప్రమత్తంగా ఉండాలి ‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు కురిసే వానలతో గోదావరి నది ఆదివారం మధ్యాహ్నం నాటికి ఉధృతంగా మారే ప్రమాదముంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలి. అన్నిశాఖల సిబ్బంది, అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అప్రమత్తమై ఉండాలి. ఇప్పటికే నేను అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగు సూచనలు ఇచ్చా. ఆగస్టు తొలివారం వరకు భారీ వర్షాలు కొనసాగే సూచనలున్నాయి..’ అని కేసీఆర్ తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి ‘మిషన్ భగీరథ తాగునీరు ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి. వైద్య, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. ఎస్ఐ, సీఐలతో పాటు, పోలీసు సిబ్బంది హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా డీజీపీ ఆదేశాలు జారీ చేయాలి..’ అని సీఎం చెప్పారు. వరదల అంచనాకు సరికొత్త సాఫ్ట్వేర్ వరదల ముందస్తు అంచనాకు, నిర్వహణకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ‘ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. వర్షాలకు అనుగుణంగా గోదావరి నదీ ప్రవాహాన్ని, గంట గంటకూ మారే వరద పరిస్థితిని శాటిలైట్ ఆధారంగా రికార్డు చేసి విశ్లేషించే విధానాన్ని ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి రూపకల్పన చేయడం దేశంలోనే తొలిసారి అని వివరించగా, సీఎం అభినందించారు. జీహెచ్ఎంసీలో పరిస్థితిపై ఆరా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద కాల్వల పరిస్థితిని, నగరంతో పాటు జల్పల్లి, పీర్జాదిగూడ వంటి ప్రాంతాల్లో వరదలకు ఉప్పొంగే చెరువుల పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు తలెత్తే అసౌకర్యాలను వీలైనంతగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడంలోనే ప్రభుత్వ యంత్రాంగం ప్రతిభ ఇమిడి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తతపై, అధికారులు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. భద్రాచలంలో బాగా పనిచేశారు భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఆరోగ్యశాఖ డైరెక్టర్ సహా అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. డెంగ్యూ ప్రతి ఐదేండ్లకోసారి సైకిల్గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించి, తగు చర్యలు తీసుకోవడం ద్వారా అరికట్టాలని మంత్రిని, వైద్యాధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీఓలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, ఈ రెండు రోజులు సెలవులు అని అలసత్వంగా వ్యవహరించవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానలు వరదల కారణంగా కొట్టుకుపోతున్న రోడ్లను, రవాణా వ్యవస్థను ఎప్పటికప్పుడు పునరుద్ధరించాలని ఆదేశించారు. హైదరాబాద్ సహా రాష్ట్రం వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
మళ్లీ గోదావరి పోటు!
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాల కారణంగా గోదావరితో పాటు దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద 9,96,976 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం 45.10 అడుగులకు చేరడంతో మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎగువన బేసిన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శనివారం సాయంత్రం 6 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి 5,15,460 క్యూసెక్కులు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి 7,20,120 క్యూసెక్కులు చేరుతుండగా.. సీతమ్మసాగర్లోకి 10,97,072 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఆ మూడు బ్యారేజీలలోకి వస్తున్న నీటిని వస్తున్నట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. స్లూయిజ్లు లీక్ కావడంతో శనివారం భద్రాచలం కొత్తకాలనీలోని ఇళ్లను ముంచెత్తిన వరద నీరు పెరగనున్న వరద ఉధృతి: మరో 48 గంటల పాటు గోదావరి బేసిన్లో ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం గోదావరిలో వరద ఉధృతి మరింతగా పెరగనుంది. దీంతో ఏజెన్సీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలం కరకట్టకు దిగువన ఉన్న అశోక్ నగర్, కొత్త కాలనీ వాసుల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఇటీవలి వరద నీటిని రెండురోజుల క్రితం మోటార్లతో గోదావరిలోకి ఎత్తిపోశారు. అయితే శుక్రవారం భారీ వర్షం రాగా స్లూయిజ్ల లాక్లను దించకపోవడంతో పెరిగిన గోదావరి నీటి ప్రవాహం మళ్లీ కొత్తకాలనీలోని ఇళ్లను చుట్టుముట్టింది. శుక్రవారమే తాము ఇళ్లను శుభ్రం చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ వరద రావడానికి అధికారుల వైఖరే కారణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘గోదారమ్మ శాంతించింది కాబట్టే.. టీడీపీ నేతలు బతికి బయటపడ్డారు’
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు చీప్ పాలిట్రిక్స్ చేద్దామని చూశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోదారమ్మకు చంద్రబాబు అంటే ఎందుకో ఆగ్రహం అంటూ ఎద్దేవా చేశారు. చదవండి: వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? ‘‘పుష్కరాల్లో బాబు లెగ్ పెట్టాడు. 29 మందిని పొట్టన పెట్టుకొన్నాడు. నిన్న కూడా గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టాడు. పడవ ప్రమాదం జరిగింది. గోదారమ్మ దయతో శాంతించింది కాబట్టి టీడీపీ నేతలు బతికి బయట పడ్డారు. సీఎం జగన్ పాలనలో గోదావరి ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా ఉన్నారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వరదలు సంభవించినప్పటి నుంచి సీఎం జగన్, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంతా ప్రజలతోనే ఉన్నాం. ప్రజలు మంచి కోసం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి అన్నారు. -
దూరదృష్టితో గట్టెక్కించారు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు... వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు. ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు. ముందుచూపు ఫలితమే.. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి. గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు. ఆ నిర్ణయమే కాపాడింది.. ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది. – విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి -
అప్రమత్తతతో తప్పిన గోదావరి ముప్పు
సాక్షి, అమరావతి: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా కురిసిన వానలతో కొండ వాగులు, వంకలు, ఉప నదులు ఉప్పొంగడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో వరద ప్రభావం చూపింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 2006లో 28.50 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ ఏడాది 25.80 లక్షల క్యూసెక్కులు రికార్డైంది. ఈ వరద విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించడంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలను అమలు చేస్తూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలకపాత్ర పోషించింది. గోదావరి వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించేందుకు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. వివిధ విభాగాలకు చెందిన 40 వేల మంది సిబ్బంది వరద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు అండగా నిలిచారు. వారిని రక్షించడం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు విశేష సేవలందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఒక ప్రకటన ద్వారా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముందుగానే అంచనా.. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతుండటంతో వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందుగానే అంచనా వేసింది. వరద ప్రారంభానికి ముందుగానే సంస్థలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా స్టేట్ కంట్రోల్ రూమ్ను జూలై 9న ప్రారంభించింది. జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా టోల్ ఫ్రీ నంబర్లతో ప్రజలకు అందుబాటులో ఉండి.. వెంటనే స్పందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ తర్వాత వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలోని అధికారులకు గంట గంటకు సమాచారం చేరవేస్తూ వచ్చింది. తద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా గట్టెక్కించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దాదాపు వంద మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తూ సేవలు అందించారు. ప్రజలకు అండగా వేలమంది సిబ్బంది.. ఓ వైపు వరద ఉ«ధృతిని అంచనా వేసి మొదటి ప్రమాద హెచ్చరిక నుంచి మూడో ప్రమాద హెచ్చరిక వరకు ప్రతిక్షణం గమనిస్తూ ఆరు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేశారు. కీలక సమయంలో గోదావరి పరివాహక ప్రాంతంలోని 23 లక్షల మంది ప్రజలకు వరద ఉధృతిని తెలుపుతూ అలెర్ట్ మెసేజ్లు పంపించారు. ఎన్ని లక్షల క్యూసెక్కులకు ఎన్ని మండలాలు ప్రభావితమవుతాయి? ఎన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయి?.. వంటివాటిపై అంచనా వేసి జిల్లాల అధికారులకు సమాచారం అందించారు. తద్వారా వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించి పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు. ఓవైపు అధికారులు, ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. మరోవైపు వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక బృందాలను రంగంలో దింపారు. 10 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్, 3 ఇండియన్ నేవీ బృందాలు శ్రమించి ప్రాణాపాయంలో ఉన్న 183 మందిని రక్షించారు. సహాయక బృందాలు చేరలేని విపత్కర స్థితిలోనూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు హెలికాప్టర్ల ద్వారా ఆరు రోజులపాటు ఆహారం, నిత్యావసర సరుకులను అందించారు. గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారిని సురక్షితంగా తరలించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 40 వేల రెవెన్యూ, జలవనరులు, వైద్య, గ్రామ సచివాలయాలు, పారిశుధ్యం, ఇతర విభాగాల సిబ్బంది బాధితులకు సేవలు అందించారు. క్రమంగా తగ్గుతున్న గోదా‘వర్రీ’ పోలవరం రూరల్ / నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టం గురువారం మరింత తగ్గింది. దీంతో గోదావరి పొడవునా ఏటిగట్టు వెంట ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరద కారణంగా నీట మునిగిన పొన్నపల్లి, లాకుపేట, నందమూరి కాలనీ, స్టేషన్పేట, చినమామిడిపల్లి ప్రాంతాల్లో ఇంకా పూర్తిగా నీరు లాగలేదు. ముంపు ప్రాంతాల్లో నీటిని అధికారులు ఇంజన్లతో తోడిస్తున్నారు. పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ జేవీ మురళి పరిశీలించి అక్కడ జరుగుతున్న చర్యలను పర్యవేక్షించారు. ముంపు తొలగిన ప్రాంతాల్లో సిబ్బంది పారిశుధ్య పనులు చేపట్టారు. వరదలకు నీట మునిగిన ఆలయాల్లో శుద్ధి కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గోదావరి వరద ఉధృతి సమయంలో నీట మునిగిన ఆలయాలన్నింటిలోనూ యుద్ధప్రాతిపదికన శుద్ధి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా క్లీనింగ్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్, ధూపం తదితర కార్యక్రమాలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్లాల్ గురువారం ఉత్తర్వులిచ్చారు. -
శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం రూరల్: గోదావరి శాంతించింది. పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గురువారం గోదావరిలో వరద మరింత తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజ్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 13,46,852 క్యూసెక్కులు వస్తుండటంతో నీటిమట్టం 14.20 అడుగులకు తగ్గింది. నీటిమట్టం 13.75 అడుగు లకంటే దిగువకు చేరుకునే వరకు బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగనుంది. బ్యారేజ్ లోకి చేరుతున్న నీటిలో 7,700 క్యూసెక్కులను గోదావరి డెల్టాకు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 13,39,152 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం బ్యారేజ్లోకి వచ్చే వర ద మరింత తగ్గనుంది. వర్షాలు తెరిపి ఇవ్వడంతో ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు తదితర ఉప నదుల నుంచి గోదావరికి వచ్చే వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ ్డ(లక్ష్మీ) బ్యారేజ్లోకి వస్తున్న వరద 7,83,460 క్యూసెక్కులకు, తుపాకులగూడెం (సమ్మక్క) బ్యా రేజ్లోకి చేరుతున్న ప్రవాహం 8,92,340 క్యూసె క్కులకు తగ్గింది. దాంతో వాటి దిగువనున్న సీత మ్మసాగర్లోకి వస్తున్న వరద 10,67,705 క్యూసె క్కులకు తగ్గింది. గురువారం సాయంత్రం 6 గంట లకు భద్రాచలం వద్ద వరద నీటి మట్టం 46.30 అడుగులకు తగ్గింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. పోలవరం వద్దకు గురువారం 6 గంటలకు 11,37,103 క్యూసెక్కులు చేరుతోంది. స్పిల్ వే వద్ద నీటిమట్టం 33.47 మీటర్లకు చేరింది. స్పిల్ వేకు దిగువన నీటిమట్టం 25.15 మీటర్లు ఉంది. -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్లు నీటమునిగాయని రజత్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
ధవళేశ్వరం, పోలవరం వద్ద తగ్గిన వరద
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం(బుధవారం ఉదయం నాటికి) 16.50 అడుగులకు చేరుకుంది వరద నీటిమట్టం. సుమారు 17 లక్షల 15 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి బాగా తగ్గింది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 34.6 మీటర్లకు చేరుకుంది వరద నీరు. 48 గేట్ల ద్వారా దిగువకు 15.58 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదులుతున్నారు. నంద్యాల: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో : 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 19,070 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.00 అడుగుల వద్ద ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 168.2670 టీఎంసీలుగా ఉంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
TS: భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం.. మిగతా చోట్ల వరద ఉధృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఎగువ నుంచి గోదావరిలోకి వస్తున్న 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇప్పుడిప్పుడే ముంపునకు గురైన కాలనీలలో సాధారణ పరిస్థితిలు కనిపిస్తున్నాయి. దీంతో శానిటేషన్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. వరదలతో సర్వం కోల్పోయిన భద్రాచలం స్థానికులు.. భరించలేని దుర్వాసనతో ఇళ్లలో ఉండలేకపోతున్నారు. ఒక పక్క సిబ్బంది.. మరోవైపు ప్రజలూ మాస్కులు ధరించి రంగంలోకి దిగారు. ఇంకోపక్క గోదావరి వరద లతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. భద్రాచలం, పినపాక నియోజక వర్గాల్లోని ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయింది పర్ణశాల సబ్స్టేషన్. సమారు 16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా వేస్తున్నారు. అలాగే 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు.. భద్రాచలం వరదలు తగ్గుముఖం పట్టాక వేగంగా వ్యర్థాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర జిల్లాలో నుంచి వచ్చి విధుల్లో చేరిన 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేస్తున్నారు. శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తున్న భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా నీరు లీకవుతోంది. దీంతో.. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా మరో 15 మోటర్లు తెప్పించించింది సింగరేణి. మొత్తం 20 మోటార్ల ద్వారా వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నడుస్తోంది. ఉన్నతాధికారిపై వేటు భద్రాచలం డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డా. కె. రాజ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. గోదావరి వరదల సమయంలో హెడ్ క్వార్టర్లో లేకుండా, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోవడం సర్కార్ దృష్టికి వెళ్లింది. దీంతో రాజ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి వరదనీరు పొటెత్తింది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం 402.40 అడుగులు చేరింది. ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు కాగా 4 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లోస్ 59 వేల క్యూసెక్కులుగా ఉంది. పద్దెనిమిది గేట్లెత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. మొత్తం 90 టీఎంసీలకుగాను ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 77 టీఎంసీలు.. 1091 అడుగులకుగాను.. నీటిమట్టం 1088 అడుగులుగా ఉంది. భూపాలపల్లి జిల్లా: కాళేశ్వరం వద్ద 12.600 మీటర్ల ఎత్తులో క్రమంగా పెరుగుతూ ప్రవహిస్తోంది గోదావరి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి 10,71,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 10,71,720 క్యూసెక్కులుగా ఉంది. లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 16.17 టీఎంసిలు. అన్నారం సరస్వతీ బ్యారేజ్ సరస్వతీ బ్యారేజ్ మొత్తం 66 గేట్లు ఎత్తి 1,46,,353 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ప్లో, ఔట్ ఫ్లో 1,46,353 క్యూసెక్కులు గా ఉంది. సరస్వతీ బ్యారేజ్ పూర్తి నీటి సామర్ధ్యం 10.87 టీఎంసిలు.. ప్రస్తుత నీటి సామర్ధ్యం 0.33 టిఎంసిలుగా ఉంది. నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 29,365 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో: 4,138 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 312.0450 టిఎంసీ లు, ప్రస్తుత నీటి నిలువ: 173.6640 టిఎంసి లు. పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం: 532.80 అడుగులు, -
శాంతించిన గోదావరి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: ఎగువన వర్షాలు తెరిపివ్వడం.. ఉప నదుల్లో ప్రవాహం తగ్గుతుండటంతో గోదావరి వరద ప్రవాహం మంగళవారం మరింతగా తగ్గింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,59,913 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. నీటి మట్టం 17.40 అడుగులకు తగ్గింది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 13.75 అడుగుల దిగువకు వచ్చే వరకు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు 5,400 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 18,54,413 క్యూసెక్కులను 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలోనూ తగ్గుముఖం ఎగువ భద్రాచలం వద్దకు వచ్చే వరద కూడా క్రమేణ తగ్గుతోంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 12,51,999 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం 49.6 అడుగులకు తగ్గింది. దాంతో అక్కడ కూడా మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 48 అడుగుల కంటే దిగువకు తగ్గే వరకూ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీలోకి వచ్చే వరద 8,62,200 క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి చేరుతున్న వరద 9,10,400 క్యూసెక్కులకు, సీతమ్మ సాగర్లోకి వస్తున్న వరద 11,65,362 క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం నాటికి భద్రాచలం వద్ద 43 అడుగుల కంటే దిగువకు గోదావరి ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరించుకుంటారు. వరద ప్రవాహం తగ్గినా పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చూస్తూ.. వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. -
సహాయం.. శరవేగం
సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద తీవ్రత తగ్గినా ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకెళుతోంది. బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. 6 జిల్లాల్లో పరిధిలోని 62 మండలాలు, 727 గ్రామాల్లో అధికార యంత్రాంగం విరామం లేకుండా.. విశ్రమించకుండా పని చేస్తూనే ఉంది. 324 గ్రామాలు పూర్తిగా ముంపు బారినపడగా.. 403 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 143 గ్రామాలు ముంపులో ఉండగా, 165 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో 76 గ్రామాలు ముంపులో ఉండగా, 93 గ్రామాల్లోకి నీరు చేరింది. కోనసీమ జిల్లాలో 61 గ్రామాలు మునిగిపోగా, 74 గ్రామాల్లో వరద ప్రభావానికి గురయ్యాయి. వీటితోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు 1.42 లక్షల మంది 324 ముంపు గ్రామాల నుంచి మొత్తం 1,42,655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో 1,22,920 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన 217 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అల్లూరి జిల్లాలోనే 103 సహాయక శిబిరాల్లో 69,112 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 24,152 మంది, ఏలూరు జిల్లాలో 18,707 మంది, కోనసీమ జిల్లాలో 9,236 మంది, కాకినాడ జిల్లాలో 1,243 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 470 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సహాయక శిబిరాలు, వరద నీరు చేరిన గ్రామాల్లో 297 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకు 5 లక్షల ఆహార పొట్లాలు, 25 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 321 మంది గర్భిణుల తరలింపు ముంపు ప్రాంతాల్లోని గర్భిణులు ఇబ్బందులు పడకుండా వైద్య శాఖ చర్యలు చేపట్టింది. వీరిని ముందే గుర్తించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటివరకూ నాలుగు జిల్లాల్లో 321 మంది గర్భిణులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి వైద్య సేవలు అందించడం కోసం గైనకాలజిస్ట్, అనస్తీషియా, ఇతర స్పెషాలిటీ వైద్యులను ఇతర జిల్లాల నుంచి తరలించారు. రూ.41.50 కోట్లు విడుదల ముంపు ప్రాంతాల్లో తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం రూ.41.50 కోట్లు విడుదల చేసింది. అల్లూరి జిల్లాకు రూ.10.50 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.12 కోట్లు, తూర్పు గోదావరికి రూ.4 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.9 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.6 కోట్లు విడుదల చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిని సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ముంపు బారిన పడిన కుటుంబాలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల సహాయాన్ని అందిస్తున్నారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఇందుకోసం ఇప్పటివరకు 944 టన్నుల బియ్యం, 89.89 టన్నుల కందిపప్పు, 60,051 లీటర్ల పామాయిల్, 80,685 లీటర్ల పాలు, 97,701 కేజీల ఉల్లిపాయలు, 97,701 కేజీల బంగాళా దుంపలు వినియోగించారు. మూగజీవాలకు రక్షణగా.. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తినప్పటికీ ఆరు జిల్లాల పరిధిలో మృత్యు వాత పడిన పశువులు కేవలం ఆరు మాత్రమే. పైగా 24 గంటల్లోనే పరిహారం కూడా అందించి పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 6 జిల్లాల పరిధిలో 84,592 పశువులుండగా, వరద ప్రభావానికి గురైన 226 గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 30 వేల పశువులను పశు సంవర్థక శాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస చర్యల కోసం 124 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 594.95 టన్నుల దాణాను ఉచితంగా పంపిణీ వేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం 111 ప్రత్యేక పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాధులు సోకకుండా 27,297 పశువులకు హెచ్ఎస్, బీక్యూ, బీటీ, ఈటీ వ్యాక్సినేషన్స్ చేశారు. వరదల వల్ల గాయపడిన 2,254 పశువులకు ప్రత్యేక వైద్య సహాయం అందించారు. రూ.14 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశువుల దాణా కోసం కోసం పశు సంవర్థక శాఖ రూ.2.41 కోట్లు విడుదల చేసింది. వరద ఉధృతి తగ్గినప్పటికీ ప్రభావిత లంక గ్రామాల్లో వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు. కనీసం వారం రోజులకు సరిపడా దాణా, పశుగ్రాసం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో 40 వేల మంది గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వరద సహాయక చర్యల్లో 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. ఇంతకుముందు వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో సహాయక చర్యలకు యంత్రాంగాన్ని వినియోగించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా హుటాహుటిన అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో వరద విపత్తును ఎదుర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది విధుల్లో పాలు పంచుకుంటున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోట్ల డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది సహాయక చర్యల్లో అలుపు లేకుండా పనిచేస్తున్నారు. వీరుకాకుండా పోలీసులు, ఫైర్ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయం సేవలు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నడిచే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, ఎండీ అంబేడ్కర్తో కలిసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇలా సీఎం నుంచి గ్రామ వలంటీర్ వరకు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. -
కడుపు మంటతోనే చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారం
సాక్షి, తాడేపల్లి: చరిత్రలో గోదావరి వరదలు ఇంతలా రావడం ఎప్పుడూ చూడలేదన్నారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తీసుకున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారికి కావాల్సినవన్నీ సమకూర్చామని చెప్పారు. కానీ చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కడుపుమంటతో చంద్రబాబు, ఆ పత్రికలు బాధపడుతున్నాయని విమర్శించారు. అధికారం కోసం వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారని విరుచుకుపడ్డారు. 'చంద్రబాబు కోనసీమ వెళ్లే క్రమంలో.. మాకు ఏమీ అందలేదని వరద బాధితులతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కోసం ఎల్లో మీడియా రోడ్ మ్యాప్నీ తయారు చేస్తోంది. ఇటువంటి పకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సీఎం జగన్ చేపట్టిన వ్యవస్థల్లో మార్పులు ఎలా ఉపయోగపడ్డాయి అనేది స్పష్టం అవుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్, సచివాలయం, 26 జిల్లాల కలెక్టర్ల వ్యవస్థ ఉంది. వాహనాలు వెళ్లలేని ప్రాంతాల్లో హెలికాప్టర్లు, బోట్ల ద్వారా అన్ని నిత్యావసరాలు అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి రూ.2000 ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. చేయాల్సింది చేస్తారు తప్ప మా నాయకుడికి ప్రచారం ఇష్టం లేదు' అని అమర్నాథ్ అన్నారు. 'హుద్హుద్ తుఫాను సమయంలో చంద్రబాబు ఎంత పబ్లిసిటీ చేసుకున్నాడో చూశాం. చివరికి ఆ తుఫాన్ ఈయన్ని చూసి పారిపోయింది. మొన్నటికి మొన్న నేను ముఖ్యమంత్రిగా ఉంటే కోవిడ్ వచ్చేదా? అంటారు. చంద్రబాబుని పైకి లేపాలి అని ఆ పత్రికలు తెగ తాపత్రయ పడుతున్నాయి. నేరుగా ప్రతి ఒక్కటి ఇంటివద్దకు తీసుకెళ్ళి ఇస్తున్నాం. మనం ఏ అబద్దం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం పొరపాటు. ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే నమ్ముతారు అనే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. అధికారం లేక డొక్కలు ఎండుతుంది చంద్రబాబుకి, లోకేష్కి, ఆ పత్రికలకి. పశువులకు కాదు. వీరికి అధికారం లేదనే ఆవేదనను ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడా వీళ్ళకి శవం దొరకలేదు. దొరికితే వేరేలా ఉండేది. ఈ రకంగా ప్రజల్ని నమ్మించాలనే మీ ఆలోచన సక్సెస్ కాదు. ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యతను మీరు సీఎం జగన్కు చెప్పాల్సిన అవసరం లేదు. చూసి ఓర్వలేక, భవిష్యత్తు ఉండదని భయపడి ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు' అని మంత్రి పేర్కొన్నారు. 'ఇటువంటి సందర్భాల్లో అయినా రాజకీయాలు మానుకోవాలి. చట్టంలో ఏదైతే ఉందో దాని ప్రకారమే చేస్తాం. బ్యాక్ వాటర్స్ వల్ల వరద వస్తే... వాళ్ళు కట్టే ప్రాజెక్టులు కూడా తీసేయండి. పోలవరం ఎత్తు పెంచడానికి వీల్లేదనడం సరైంది కాదు. విలీన గ్రామాలను పట్టించుకోలేదని ఆయన చెప్తే ఎలా..? ముందు ఖమ్మం జిల్లాను పట్టించుకోమనండి. అలా అయితే ఏపీని తెలంగాణాలో కలపమనండి. హోదాపై వాళ్ళు ఏది చెప్పినా సరే మా పోరాటం కొనసాగుతుంది. మా డిమాండ్ కొనసాగిస్తాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చామో స్పష్టంగా చెప్పాం. ఒక గిరిజన మహిళను ఎంపిక చేయడం వల్లే మద్దతు పలికాం. అలా అని మా డిమాండ్ వెనక్కి పోయిందని కాదు' అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చదవండి: అధికారం అంటే అజమాయీషీ కాదు.. అందరికీ సంక్షేమం: సీఎం జగన్ -
క్లౌడ్ బరస్ట్పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
యానాం: క్లౌడ్ బరస్ట్పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. యానాంలో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అలా.. గవర్నర్ ఇలా.. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్ వల్లే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు సంభవించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. విదేశాలే ఈ కుట్ర చేసి ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలకు పూర్తి విరుద్ధంగా ఇప్పుడు గవర్నర్ తమిళిసై మాట్లాడటం గమనార్హం. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 51.8అడుగులకు చేరింది. ఎగువ నుంచి 13 లక్షల 50వేలు క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వస్తోంది. భద్రాచలం టౌన్లోని ముంపునకు గురైన కాలనీలు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. ఇప్పటికీ రామాలయం పురవీధులు చెరువులను తలపిస్తున్నాయి. 53 అడుగుల లోపు వచ్చిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదిప్ దురిశెట్టి తెలిపారు. చదవండి: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు -
భద్రాచలంలో వరద నష్టం.. బాధితుల కష్టం (ఫొటోలు)
-
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక
-
CM YS Jagan: 48 గంటల్లో సాయం
వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్తో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్ సరుకులు అందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సాయానికైనా సిద్ధం.. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్ కాల్ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. వరద తగ్గగానే పంట నష్టం అంచనా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి, క్లోరినేషన్ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి. అదనపు సిబ్బంది తరలింపు.. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. కరకట్ట పరిశీలన.. పూడికతీత గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి. తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి. అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ.. గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్కళ్యాణ్ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. -
TS: తక్షణ సాయమందాలి
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని.. ఇందుకోసం పంటలు, ఇళ్లు, ఇతర ఆస్తి నష్టంపై వెంటనే సర్వే నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, చెరువులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ములుగు, ఏటూరునాగారం ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ ఆదివారం రాత్రి హనుమకొండలోనే బస చేశారు. సోమవారం హైదరాబాద్కు బయలుదేరే ముందు ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. సత్వరమే చర్యలు చేపట్టండి భవిష్యత్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ముంపు ప్రమాదం ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఈసారి దెబ్బతిన్న ప్రాంతాల్లో సత్వరమే మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను అభినందించారు. పరిస్థితి చక్కబడే వరకు ప్రతీశాఖ అధికారులు 3 షిఫ్టులుగా పనిచేసి.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు, సహాయ కార్యక్రమాలకు అవసరమైన చర్య లు చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఎన్ని నిధులు ఖర్చయినా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంతాల్లో పరిస్థితి చక్కబడే వరకు మంత్రి సత్యవతి రాథోడ్ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉండి పర్యవేక్షించాలని సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో అవసరమైన పనులు, సహాయ చర్యలకు ఇన్చార్జులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, డాక్టర్ గోపిలను నియమిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్, వెంకటరమణారెడ్డి, వొడితెల సతీశ్కుమార్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, డాక్టర్ గోపి, మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వరంగల్లో ‘సూపర్ స్పెషాలిటీ’పై ఆరా వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై కేసీఆర్ ఆరా తీశారు. ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించి, పరిస్థితిని వివరించాలని మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, తదితరులు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డుమార్గంలో హైదరాబాద్కు.. శనివారం సాయంత్రం రోడ్డుమార్గంలో హనుమకొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. సోమవారం అదే రోడ్డుమార్గంలో తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ సోమవారం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడిన అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం నుంచే ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటేయాల్సి ఉన్నందున ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బస్సులో హైదరాబాద్కు వచ్చారు. -
వరద కుమ్మేసింది.. బురద కమ్మేసింది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద మోసుకొచ్చిన ఒండ్రుమట్టి, బురద ముంపు గ్రామాలను కమ్మేసింది. వరద వెనక్కి తగ్గగానే తమ ఊళ్లు, ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు తప్ప సమస్తం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 మండలాల ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. ఆ తర్వాత అంచనాలకు మించి వరద రావడంతో ఊళ్లకు ఊళ్లే నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న సమస్తం మట్టికొట్టుకుపోయాయి. వరద కొద్దిగా నెమ్మదించడంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్న జనం తిండితిప్పలు మాని ఇళ్లల్లోంచి బురదను తొలగిస్తున్నారు. వరదలో నాని కుళ్లిన చెట్లు, జంతువులు, చేపల కళేబరాలు, ఇతర వ్యర్థాల కారణంగా ముంపు ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంది. వరద కారణంగా జిల్లాలో మొత్తం 12,277 ఇళ్లు నీట మునగగా సోమవారం సాయంత్రానికి 11,061 ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. 2,330 మంది శానిటేషన్ సిబ్బంది నిర్విరామంగా బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 4,434 గ్రామాలు బురద నుంచి బయటపడ్డాయి. ఆయా గ్రామాల్లో దోమలు వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ చేస్తున్నారు. వరద కారణంగా ముంపు ప్రాంత ప్రజల్లో తొంభైశాతం మంది వ్యక్తిగత ఆస్తులను నష్టపోయారు. వరద ముంచుకొస్తుండటంతో కట్టుబట్టలు, విలువైన సామగ్రి మాత్రమే తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. దీంతో ఇళ్లలో ఉన్న ఇతర సామగ్రి, దుస్తులు, బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు.. ఇలా ఒకటేమిటి అన్నీ బురదలో కొట్టుకుపోయాయి. ‘తేలని’నష్టం లెక్క! వరద తగ్గితే కానీ ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందనేది తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మునకలోనే ఉన్నాయి. చాలాచోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. కాగా ఎగువ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, స్థానికంగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం తగ్గుదల ఆగింది. సోమవారం మ«ధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 56 అడుగుల వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో పలుచోట్ల వరద సహాయ శిబిరాల్లోనే ప్రజలు తలదాచుకుంటున్నారు. గ్రూప్స్కు ప్రిపేరయ్యేదెలా? గ్రూప్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు బూర్గంపాడుకు చెందిన రాజేష్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత వారం గ్రూప్స్ ప్రిపరేషన్స్కు సంబంధించి సన్నాహాక పరీక్షకూ హాజరయ్యాడు. ఇంతలోనే వరదలు వచ్చాయి. పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన పుస్తకాలే కాదు.. ఆయన కుటుంబం సమకూర్చుకున్న సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తడిసిన పుస్తకాలతో రాజేష్ కంటతడి పెడుతున్నాడు. ఈమె పేరు ఇమాంబీ. భద్రాచలం సుభాష్నగర్కు చెందిన ఈమె నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించను జమచేసుకుంటూ రూ.12 వేలు వెచ్చించి తన గుడిసెపై రేకులు వేయించుకుంది. ఇటీవలి వరదల్లో ఆమె గుడిసె నామరూపాల్లేకుండాపోయింది. కొడుకులున్నా తనకు నిలువ నీడలేదని.. కనిపించిన వారికల్లా తన బాధ చెప్పుకుంటోంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో బతుకీడుస్తోంది. ఇది ఒక్క ఇమాంబీ బాధ మాత్రమే కాదు గోదావరి వరదల్లో చిక్కున్న 12 వేల కుటుంబాల వ్యథ. -
వైరల్ వీడియో: దవాఖానాలో పాముల హల్చల్
-
మంచిర్యాల: దవాఖానాలో పాముల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, మంచిర్యాల: భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న ముంపు ప్రాంత ప్రజలను చీడపీడలు దడపుట్టిస్తున్నాయి. పరిసర ప్రాంతాలు జలమయం కావడం, చుట్టూరా చలి వాతావరణం నెలకొనడంతో పాములు, తేళ్లు ఇళ్లల్లోకి, ఆఫీసుల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో పారిశుద్య కార్మికురాలు సునీత పాముకాటుకు గురయ్యారు. ఆసుపత్రికి వరద తాకిడికి గురికావడంతో ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. పనుల్లో సునీత కూడా పాల్గొన్నారు. అదే సమయంలో పాము కాటు వేయడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సునీత అరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిటీకీ, ఫ్లోర్పై పాములు కదులుతున్న వీడియోలు వైరల్గా మారాయి. ఆపరేషన్ థియేటర్, దాని చుట్టుపక్కల పదుల సంఖ్యలో పాములు కనిపించాయని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. వాటిని బయటకు తరిమేశామని వెల్లడించారు. -
చంద్రబాబు చీప్ పాలిటిక్స్: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. చదవండి: ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి: మంత్రి వేణు ‘‘ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకున్నాం. గతంలో జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జేసీ ఉండేవారు. ఇప్పుడు జిల్లాల విభజన వల్ల అధికారుల సంఖ్య పెరిగింది. వలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులు, మంత్రులు సమన్వయంతో పని చేశారు. జిల్లాకు రెండు కోట్లు, నాలుగు కోట్లు చొప్పున కేటాయించారు. నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, పాలు, కిరోసిన్ అందించాం. సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులతో రెగ్యులర్గా మానిటరింగ్ చేశారని’’ మంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే విహార యాత్రలా చేసేవారని మంత్రి దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈనాడు పత్రికలో పిల్లలకు పాలు లేవు, పెద్దలకు తిండి లేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి ఎల్లో మీడియా లేపుతోందని మండిపడ్డారు. ఎల్లో పత్రికల్లో రాసినవి.. చంద్రబాబు ప్రెస్ మీట్లు, పవన్ ట్వీట్లు పెడుతున్నారు. రామోజీ దిగజారి చీప్గా ప్రవర్తిస్తున్నారని మంత్రి కారుమూరి నిప్పలు చెరిగారు. చంద్రబాబు పాలనలో వర్షాలు కూడా పడలేదు. సీఎం జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నా రాజకీయ జీవితంలో వైఎస్సార్సీపీ ప్లీనరీకి వచ్చిన జనాల్ని ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు చేసేవన్నీ చీప్ పాలిటిక్స్. సీఎం జగన్ ముందుచూపు వల్లే వరదల్లో ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూశాం. అదనంగా బోట్లు, హెలికాఫ్టర్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. -
గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరదల వేళ ముందస్తుగా చేస్తున్న హెచ్చరికలే ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హెచ్చరికల ఆధారంగానే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్దదైన గోదావరి నదికి జూలై నెలలో వచ్చే వరదలు సాధారణంగా పెద్దగా ప్రభావం చూపవు. చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ అందుకు భిన్నంగా ఈసారి గోదావరి మహోగ్రరూపమెత్తి ప్రజలను భయపెడుతోంది. ఎగువన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉప నదులైన మంజీరా, ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, పెన్గంగ వంటివి పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ వరద నీరంతా చేరడంతో గోదావరి కూడా ఉప్పొంగిపోతోంది. మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గత ఎనిమిది రోజులుగా గోదావరి ఉగ్రరూపం దాలి్చంది. శనివారం నాటికి కాటన్ బ్యారేజీ వద్దకు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరింది. ఆదివారం నిలకడగా ఉన్నప్పటికీ దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. రాత్రి నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ.. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో వరద ప్రమాద హెచ్చరికలు ఎంతో తోడ్పడుతున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం వద్ద 1847 – 1852 మధ్య సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించిన బ్రిటిష్ పాలకులు 1855లో రివర్ కన్జర్వెన్సీ చట్టం తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దీని ఆధారంగానే వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పేరూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ నీటి ప్రవాహాలను అధికారికంగా గంటగంటకూ ప్రకటిస్తూంటారు. గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూంటారు. వీటి ఆధారంగానే బ్యారేజీకి దిగువన ప్రజలను అప్రమత్తం చేస్తారు. పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఈ ప్రక్రియ బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ జరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 10 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. ఫ్లడ్ కన్జర్వేటర్గా హెడ్ వర్క్స్ ఈఈ వ్యవహరిస్తారు. గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. శాశ్వత, తాత్కాలిక ఫ్లడ్ స్టోర్స్లో సామగ్రిని చెక్ చేసుకుంటారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటారు. రెండో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలను విడుదల చేస్తారు. బ్యారేజీ దిగువన ఉన్న వందలాది లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారు. ఫ్లడ్ డ్యూటీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలి. మూడో ప్రమాద హెచ్చరిక బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ సమయంలో బ్యారేజీ నుంచి 17.50 లక్షలు ఆపైన వచ్చిన మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే బ్యారేజీ దిగువన గోదావరి లంకలు నీట మునుగుతాయి. ఈ హెచ్చరిక ప్రకటించిన వెంటనే ఫ్లడ్ డ్యూటీ అధికారులు వారికి కేటాయించిన ప్రదేశాల్లో 24 గంటలూ డ్యూటీ నిర్వహించాలి. గోదావరిపై రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. ఫ్లడ్ కన్జర్వేటర్గా ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వరద బాధితుల పునరావాసం, ప్రమాద నివారణ చర్యలు ఆరంభిస్తారు. రివర్ కన్జర్వెన్సీ చట్టంతోనే.. బ్యారేజీ నిర్మించినప్పటి నుంచీ వరద ప్రమాద హెచ్చరికల జారీకి బ్రిటిష్ కాలం నాటి రివర్ కన్జర్వెన్సీ చట్టాన్నే అనుసరిస్తున్నారు. భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహ వేగాన్ని బట్టి ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. వీటి వల్లే ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయడం సాధ్యమవుతోంది. మూడో ప్రమాద హెచ్చరికను రెడ్ అలర్ట్గా చెప్పవచ్చు. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్, రిటైర్డ్ ఎస్ఈ, హెడ్వర్క్స్, ధవళేశ్వరం -
AP: వరద బాధితులకు సాయం..హెలికాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ
గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి. -
వరదలతో అతలాకుతలం.. ఏపీని ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ : గోదావరికి కనీవినీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మిథున్రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపామన్నారు. ఆయా ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా లేనంతగా ప్రస్తుతం వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైందని, వందలాది గ్రామాలు నీట మునిగాయని, విపరీతమైన ఆస్తి, పంట నష్టం జరిగిందని సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందని తెలిపామని వివరించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే.. పోలవరం నిధులు విడుదల చేయాలి ► ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ ఇంకా అమలు చేయలేదు. ► పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల విడుదలలో అసాధారణ జాప్యం జరుగుతోంది. అందువల్ల ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొంత నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం నివారించాలి. రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నష్ట పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలి. ► విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కొన్నేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎందుకు కాలయాపన జరుగుతోంది? త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ► రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలో, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలి. ఈ విషయాల గురించి గతంలో సంబంధిత విమానయాన, స్టీల్ మంత్రిత్వ శాఖల మంత్రులకు కూడా విజ్ఞప్తి చేశాం. ► అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ రూ.79.72కు పడిపోవడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి ► ఉపాధిలో మహిళల ప్రాతినిధ్యం బాగా తగ్గిపోయిన విషయాన్ని కేంద్రం గమనించాలి. మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఏపీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలి. మహిళల హక్కులు కాపాడాలి. మహిళల విద్య, జీవన ప్రమాణాల పెంపు, శిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. ► పార్లమెంటులో వినియోగించకూడని పదాల (అన్ పార్లమెంటరీ) జాబితాను లోక్సభ కార్యాలయం అన్ని రాష్ట్రాలకు పంపింది. 1954 నుండి ఇది ఆనవాయితీగా వస్తోంది. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసనలు, ధర్నాలపై ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన ఆదేశాలు ఆనవాయితీగా ఇచ్చినవే. కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులివ్వాలి ► రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లా ఆస్పత్రి ఏర్పాటులో భాగంగా కొత్తగా 12 వైద్య కళాశాలల మంజూరు ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్లో ఉంది. ► ఇటీవల ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా అనేక మంది తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వారు తిరిగి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. ఇతర మెడికల్ కాలేజీలలో చదువుకోడానికి అనుమతులు ఇవ్వాలి. ► కోవిడ్ కారణంగా మూడేళ్లుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోతోంది. పౌర సరఫరాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. త్వరితగతిన జనాభా లెక్కలు సేకరించాలి. -
ముంపు ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం/పాడేరు: భారీ వర్షాలు, గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించామన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేశారని, వరదలకు సంబంధించి సమగ్రమైన నివేదికను అధికారుల ద్వారా రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తున్న మంత్రి వేణు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ, లంక గ్రామాల్లో ముంపు పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేశామన్నారు. మరో 48 గంటలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లంక గ్రామాల్లో చిక్కుకున్న 65 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృంధాలు రక్షించాయని చెప్పారు. ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నట్టు మంత్రులు తెలిపారు. బాధిత ప్రజలందరికీ సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరద పూర్తిగా తగ్గే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని, బియ్యం, ఇతర నిత్యావసరాలన్నింటిని పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేసామని మంత్రులు తెలిపారు. ఏరియల్ సర్వేలో మంత్రులతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. -
పునరావాసం.. అలుపెరగని యంత్రాంగం
సాక్షి, అమరావతి: మహోగ్ర రూపం దాల్చిన గోదావరి ఎగువన ఏజెన్సీ.. దిగువన లంక గ్రామాలను ముంచెత్తింది. ఇళ్ల చుట్టూ నీరు చేరి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వారం రోజులుగా అనేక చర్యలు చేపడుతూనే ఉంది. ఓ వైపు ముంపులో చిక్కుకున్న వారిని రక్షించడం.. నిలువ నీడ లేకుండా పోయిన వారిని పునరావాస శిబిరాలకు తరలించడం.. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం.. ఇళ్లను వదిలి బయటకు రావడానికి ఇష్టపడకుండా మేడలు, మిద్దెలపైనే ఉంటున్న కుటుంబాలకు బియ్యం, పప్పులు, పాలు, మంచినీరు వంటి నిత్యావసర సరుకుల్ని బోట్ల ద్వారా చేరవేయడం.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కంటికి రెప్పలా కాపాడటం.. ముంపులోనూ ఇళ్లను వదిలి రానివారు అనారోగ్యం బారినపడితే అక్కడికే వెళ్లి వైద్య సేవలు అందించడం.. నెలలు నిండిన గర్భిణులను హెలికాప్టర్లలో సైతం ఆస్పత్రులకు తరలించడం.. మిగిలిన గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడం.. చివరకు లంకల్లో చిక్కుకుపోయిన పశువులను రక్షించడమే కాకుండా వాటికి కూడా ప్రత్యేక రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మేత సమకూర్చడం వంటి ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూనే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల వారిని పడవల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న విపత్తు నిర్వహణ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల కీలకపాత్ర వరద బాధితులను, ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు కీలకపాత్ర పోషించాయి. అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాలకు హెలికాప్టర్లలో వెళ్లి సహాయక చర్యలు అందించారు. కాగా, బాధితులకు 1.25 లక్షల ఆహార పొట్లాలు, సుమారు 13 లక్షల వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవికాకుండా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు తమ పరిధిలోని బాధిత ప్రాంతాలకు రెండు పూటలా భోజనాలు పంపించారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సహాయక చర్యలు పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారం అందిస్తుండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. 10,757 ఎకరాల్లో పంట నష్టం వరద తీవ్రతకు ఆరు జిల్లాల్లో పంటలు, మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. 6 జిల్లాల్లో 10,757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. 3,375 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 7,382 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో 5,253 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 1,802 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు వరద ప్రభావానికి ధ్వంసమయ్యాయి. 156 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 35 రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 34,749 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత అధికారులు పూర్తి స్థాయి నష్టాలను అంచనా వేయనున్నారు. రూ.30 కోట్ల వినియోగం వరద సహాయక చర్యల కోసం 6 జిల్లాల్లో అత్యవసరంగా రూ.30 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. తొలుత రూ.2 కోట్ల చొప్పున వినియోగానికి అనుమతి ఇచ్చినా.. వరద తీవ్రత పెరగడంతో ఆ పరిమితిని పెంచారు. అల్లూరి జిల్లాలో రూ.7 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.8 కోట్లు, ఏలూరు జిల్లాలో రూ.7 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.4 కోట్ల చొప్పున ఖర్చు చేసేందుకు అత్యవసర అనుమతిచ్చారు. వరద హెచ్చరికలు మొదలైన నాటినుంచీ.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యంత్రాంగం అలుపెరగకుండా సహాయక చర్యలు అందిస్తోంది. ముందస్తు వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి వారం రోజులుగా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, సహాయ శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించడం, అక్కడ ఆహారం, మంచినీరు అందించడం, వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం వంటి పనుల్ని యంత్రాంగం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. ఫలితంగానే వరద ప్రభావానికి గురైన 6 జిల్లాల్లోని 62 మండలాల పరిధిలోని 626 గ్రామాల నుంచి 97,205 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వారి కోసం పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రదేశాల్లో 191 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ శిబిరాల్లో 84,734 మంది తల దాచుకుంటున్నారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 290 గ్రామాలకు చెందిన 53,107 మంది 103 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గోదావరి మధ్యలో, గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాల్లోని గ్రామాల ప్రజలను చాలా శ్రమకోర్చి సాహసోపేతంగా ఈ శిబిరాలకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని 169 గ్రామాల నుంచి 18,707 మందిని 23 సహాయ శిబిరాలకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 74 లంక గ్రామాల నుంచి 9,290 మందిని 29 సహాయ శిబిరాలకు తీసుకువచ్చారు. నిత్యావసర సరుకుల పంపిణీ వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 729.67 మెట్రిక్ టన్నుల బియ్యం, 50 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 22,390 లీటర్ల పామాయిల్, 54,766 లీటర్ల పాలు, 13,564 కేజీల ఉల్లిపాయలు, 11,564 కేజీల బంగాళా దుంపలను ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేసింది. -
శాంతిస్తున్న గోదారమ్మ
సాక్షి, అమరావతి, పాడేరు/సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం, ఏలూరు: పరీవాహక ప్రాంతం(బేసిన్)లో వర్షాలు తెరపివ్వడం.. ఉప నదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గోదారమ్మ శాంతిస్తోంది. ఉప నదులు ఉప్పొంగడంతో గోదారమ్మ విశ్వరూపం ప్రదర్శించటాన్ని చూసి చిగురుటాకుల్లా వణికిపోయిన ప్రజలకు ఇప్పుడు కాస్త ఊరట కలుగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్లోకి వస్తున్న వరద ప్రవాహం 24,84,356 క్యూసెక్కులకు తగ్గడంతో నీటి మట్టం 21.10 అడుగులకు పడిపోయింది. గోదావరి డెల్టాకు 9,500 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 24,74,856 క్యూసెక్కుల (213.87 టీఎంసీలు)ను బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్లోకి వచ్చే వరద క్రమేణ తగ్గనుంది. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశాల్లో వర్షాలు తెరపినిచ్చాయి. దాంతో ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, కడెంవాగు, శబరి తదితరాలలో వరద తగ్గుముఖం పట్టింది. ఇది గోదావరిలో వరద తగ్గుముఖం పట్టేలా చేస్తోంది. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్లోకి వచ్చే వరద 9.28 లక్షల క్యూసెక్కులకు, దానికి దిగువన తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజ్లోకి వచ్చే వరద 9.45 లక్షల క్యూసెక్కులకు, ఆ బ్యారేజ్కు దిగువన సీతమ్మసాగర్లోకి వస్తున్న వరద 16.68 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో తగ్గుతున్న వరద మట్టం ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు 17,58,166 క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 59.40 అడుగులకు తగ్గింది. వరద మట్టం 53 అడుగులకు తగ్గే వరకు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం వరద మట్టం 48 లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద వరద మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరుకుంటేనే ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకుంటారు. మంగళవారానికి భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం పోలవరం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వచ్చే వరద గంట గంటకూ తగ్గుతోంది. అయినప్పటికీ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహ మూర్తి నేతృత్వంలో జల వనరుల శాఖ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోలవరంలోకి వచ్చే వరద ప్రవాహం 20,83,779 క్యూసెక్కులకు తగ్గింది. దాంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 38.29 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 27.54 మీటర్లకు తగ్గింది. సోమవారం పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహం 17 నుంచి 17.50 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. వరద గండం గట్టెక్కినట్లే ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెలపై కుంపటి దిగినట్టయ్యింది. మరో రెండు రోజుల్లో అంటే మంగళవారం సాయంత్రానికి గోదావరి లంక గ్రామాలు ఊపిరి పీల్చుకునే అవకాశముంది. వారం రోజులుగా వీడని వరద ముంపుతో లంక గ్రామాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకుని వారికి బాసటగా నిలిచే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపకదిన చర్యలు తీసుకుంది. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో బాధితులకు సహాయం అందజేసేందుకు వెళుతున్న పడవ గోదావరిలో అదుపు తప్పి తిరగబడింది. వీఆర్వో లక్ష్మితో పాటు వీఆర్ఏలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్లు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు మురళీధర్రెడ్డి, అరుణ్కుమార్లు ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలిస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు కొనసాగుతున్నాయి. బోట్లపై రాకపోకలు సాగించే వారికి సాయం చేస్తున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయడంలో వలంటీర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వరద ఉధృతితో రాజమహేంద్రవరం రోడ్డు వంతెనలో భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ వేగవంతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. 3, 5, 6, 9, 16 బెటాలియన్లకు చెందిన 10 బృందాల్లోని 356 మంది సిబ్బంది రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం వరద ముంపు జిల్లాల్లోని 950 మంది బాధితులను రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో పలువురు గర్భిణులు, వృద్ధులు ఉన్నారు. లంక ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, నీరు, కొవ్వొత్తులను పంపిణీ చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు, పశ్చిమగోదావరిలో ఆచంట, నర్సాపురం, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వేలేరుపాడు మండలంలో పర్యటించారు. పోలవరం ముంపు మండలాల్లోని 61 గ్రామాల్లో 18,707 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, భోజన వసతి ఏర్పాటు చేశారు. ఆచంట మండలంలోని లంక గ్రామాల్లో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రతిరోజు వెయ్యి మందికి తన సొంత నిధులతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సాపురం పట్టణం, మండలంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వరద తీవ్రతను పరిశీలించారు. విలీన మండలాల్లో వరద నీరు కాస్త తగ్గడంతో అధికార యంత్రాంగం, స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. చింతూరు నుంచి ముంపు గ్రామాలకు లాంచీల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకుల రవాణాను వేగవంతం చేశారు. అంటు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు నెల్లిపాక వీఆర్వో కట్టం వెంకటేశ్వర్లు, విస్సాపురం వీఆర్వో ముచ్చిక వీర్రాజులపై జేసీ సూరజ్ గనోరే చర్యలకు ఆదేశించారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
-
తగ్గేదేలే.. ఎవరికి వారే.. అటు గవర్నర్.. ఇటు కేసీఆర్ పోటాపోటీగా..
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఓ వైపు సీఎం కేసీఆర్, మరో వైపు గవర్నర్ తమిళిసై పర్యటనలు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలిస్తున్నారు. తమిళిపై పర్యటనలో కలెక్టర్, జిల్లా ఎస్పీ కనిపించలేదు. గవర్నర్ వెంట ఏఎస్పీ, ఆర్డీవో మాత్రమే ఉన్నారు. పోటోకాల్ వివాదంపై నో కామెంట్ అంటూ గవర్నర్ మాట దాట వేశారు. బాధితుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని ఆమె పేర్కొన్నారు. చదవండి: వర్షంలోనే సీఎం కేసీఆర్ పర్యటన.. గోదారమ్మకు శాంతి పూజలు 36 ఏళ్ల తర్వాత గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో రావడంతో భద్రాచలం నీట మునిగింది. వరద ముంపు ప్రాంతాలలో సీఎం, గవర్నర్ పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గాన హనుమకొండ నుంచి భద్రాచలంకు సీఎం వచ్చారు. మరో వైపు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మణుగూరు చేరుకుని అక్కడ నుంచి అశ్వాపురంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళ్ సై పర్యటనలు పోటా పోటీగా సాగుతున్నాయి. -
సీఎం జగన్ ఆదేశాలు.. మంత్రులు ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు, అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణు గోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు. చదవండి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా తాగునీరు,పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. -
తప్పుల వల్లే తిప్పలు
సాక్షి, అమరావతి: బుధవారం 129.98 టీఎంసీలు.. గురువారం 132.98 టీఎంసీలు.. శుక్రవారం 161.99 టీఎంసీలు.. శనివారం 204.20 టీఎంసీలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 800.75 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దీన్లో ఈ నాలుగు రోజుల్లోనే 629.15 టీఎంసీలు కడలిలో కలిశాయంటే గోదావరి ఏ స్థాయిలో విశ్వరూపం చూపిందో అర్థం చేసుకోవచ్చు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 1862 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. గత 160 ఏళ్లలో జూలైలో అదీ ప్రథమార్థంలో కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో గోదావరి వరద జలాలు కడలిలో కలిసిన దాఖలాల్లేవు. ఆకస్మిక వరదలతో గోదావరి విశ్వరూపం ప్రదర్శించటానికి వాతావరణ మార్పులు ఎంత కారణమో అడవుల నరికివేత, ఇసుక కోసం నదీ గర్భాన్ని ఎడాపెడా తవ్వేయడం వంటి మానవతప్పిదాలు కూడా అంతే కారణమయ్యాయని వాతావరణ, సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. కర్బన ఉద్గారాల వల్ల కాలుష్యం పెరిగిపోవడంతో వాతావరణంలో భారీమార్పులు జరుగుతున్నాయి. భూమి, సముద్ర ఉష్ణోగ్రతల్లోను అంతేస్థాయిలో మార్పులు వస్తున్నాయి. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలో పెరు దేశం వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఏర్పడే ఎల్నినో (సముద్రం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం), లానినో (సముద్ర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడం) పరిస్థితుల ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రం, బంగాళఖాతం, హిందూమహాసముద్రం మీదుగా దేశంలోకి వీచే గాలులు రుతుపవనాలను.. ప్రధానంగా నైరుతి రుతుపవనాల క్రమం, లయను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల దేశంలో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షం కురిసి అతివృష్టికి దారితీస్తే.. లానినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అనావృష్టికి దారితీస్తోంది. కుంభవృష్టి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్కు సమీపంలో త్రయంబకేశ్వర్ వద్ద జన్మించే గోదావరి.. తూర్పు కనుమల మీదుగా 1,465 కిలోమీటర్లు ప్రవహించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పరీవాహక ప్రాంతం 3,12,150 చదరపు కిలోమీటర్లు. దీన్లో మహారాష్ట్రలో 48.5 శాతం, తెలంగాణ, ఏపీల్లో 23.30, ఛత్తీస్గఢ్లో 12.5, మధ్యప్రదేశ్లో 8.6, ఒడిశాలో 5.70, కర్ణాటకలో 1.40 శాతం ఉంది. దేశ విస్తీర్ణంలో ఇది 9.5 శాతంతో సమానం. గోదావరి బేసిన్లో గత 30 ఏళ్ల వర్షపాతం ఆధారంగా.. కనిష్టంగా 877 మిల్లీమీటర్లు, గరిష్టంగా 1,493 మిల్లీమీటర్లు, సగటున 1,117 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని కేంద్ర జలసంఘం అంచనా వేసింది. ఇందులో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జూన్ 12 నుంచి సెప్టెంబరు 30 వరకు సగటున 824 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా. గోదావరికి ఉన్న తొమ్మిది సబ్ బేసిన్లలో ఎల్లి సబ్ బేసిన్ (జి–2) (మహారాష్ట్ర)లో కనిష్టంగా 758.34.. కుంట సబ్ బేసిన్ (జి–7) (శబరి–ఒడిశా, ఆంధ్రప్రదేశ్)లో గరిష్టంగా 1,503 మి.మీ. వర్షం కురుస్తుంది. జూలై ప్రథమార్థంలో ప్రాణహిత (జి–2 టెక్రా), గోదావరి (జి–4 మంచిర్యాల), ఇంద్రావతి (జి–5 పాతగూడెం), శబరి (జి–7 కొంటా)లలో సగటున 526 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అంటే.. రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షంలో 63.84 శాతం పది రోజుల్లోనే కురిసింది. సుమారు 60 రోజుల్లో కురవాల్సిన వర్షం పది రోజుల్లోనే పడింది. భూమిలోకి ఇంకని నీరు గోదావరి బేసిన్ విస్తరించిన పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో దశాబ్దాలుగా భారీ ఎత్తున అడవులను నరికేస్తున్నారు. ఇటీవల అడవుల నరికివేత మరింత తీవ్రమైంది. దీనివల్ల గరిష్టంగా వర్షం కురిసినప్పుడు.. భూమిపై పడిన వర్షపు నీరు అదే రీతిలో నదిలోకి చేరుతోంది. అడవులు నరికివేయకపోతే వర్షపు నీరు భూమిలోకి పూర్తిగా ఇంకిన తరువాత మిగిలినది వాగులు, వంకల ద్వారా ఉప నదుల్లోకి చేరి తర్వాత గోదావరిలోకి చేరేది. ఇక గోదావరిలో ఎగువన అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తవ్వేయడంతో నదీగర్భం గట్టినేలగా మారిపోయింది. దీంతో నదిలోకి వచ్చిన నీరు వచ్చినట్టుగా ప్రవహిస్తోంది. ఇవే ప్రస్తుతం గోదావరి ఆకస్మిక వరదలకు దారితీశాయని యాక్షన్ పెటర్నా ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వై.వి.మల్లారెడ్డి చెప్పారు. -
మేమున్నామని.. మీకేం కాదని..
నట్రా సత్యవతి గర్భిణి.. పురిటి కోసం పది రోజుల క్రితం లంకాఫ్ ఠాణేలంకలోని పుట్టింటికి వచ్చింది. ఊహించని రీతిలో గోదావరి వరద ఇంట్లోకి వచ్చి, మోకాలు లోతున చేరింది. ఈ ఇంట్లో గర్భిణి ఉందన్న వార్త శనివారం అధికారులకు అందింది. పీహెచ్సీ వైద్యాధికారులు వెంటనే ప్రత్యేక బోటులో అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ జాకబ్, వైద్య సిబ్బంది సత్యవతిని పరీక్షించారు. మందులు ఇచ్చారు. ఆమెకు ధైర్యం చెప్పారు. గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఊహించనంతగా విరుచుకుపడిన వరదతో వణికిపోతున్న లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ఇది ఒక నిదర్శనం. కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధులు వడ్డాది శీనివాసరావు, పంపాన వరప్రసాద్: ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సహాయ, పునరావాస చర్యలు చేపడుతోంది. బాధిత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు అధికారులే వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. వారికి కావల్సిన నిత్యావసరాలు, వైద్య సహాయం అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లకు చెందిన 25 బృందాలు, 1,200 మంది గజ ఈతగా>ళ్లు, మత్స్య శాఖకు చెందిన 750 బోట్లను వినియోగిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రజలకు రక్షణ గోదావరి వరదలో చిక్కుకున్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు వైఎస్ జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకే వంటి ప్రత్యేక వ్యవస్థలను కూడా ఉపయోగించుకొని చక్కటి ప్రణాళిక రచించింది. గ్రామాలవారీగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, పశు సంవర్ధక శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ, ఆర్బీకే సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి స్థితిగతులు, ఆరోగ్యం ఇతర సమాచారాన్ని నమోదు చేశారు. దీంతో గ్రామాలవారీగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికార యంత్రాంగానికి స్పష్టత వచ్చింది. ప్రణాళిక ప్రకారం ప్రజలను, మూగజీవాలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా రికార్డు స్థాయిలో వరద ముంచెత్తినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం, పశునష్టం జరగలేదు. లంకలను విడిచి రాని వారిని కూడా కంటికిరెప్పలా చూసుకుంటూ వలంటీర్ల ద్వారా వారికి కావాల్సిన నిత్యావసరాలు, మంచినీరు, మందులు సరఫరా చేస్తున్నారు. మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, దుంపలు, లీటర్ వంటనూనె, పాలు, కొవ్వొత్తులు సరఫరా చేశారు. మొత్తం 3 వేల టన్నుల బియ్యం, 1.2 టన్నుల చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా, వంటనూనె, 1150 లీటర్ల పాలు, 32 వేల కొవ్వొత్తులు అందించారు. పునరావాస శిబిరాల నిర్వహణ కోనసీమ జిల్లాలో 65 పంచాయతీలకు 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14, ఏలూరు జిల్లాలో 58, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 50 వేల మందిని ఈ కేంద్రాలకు తరలించారు. వీరికి భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. తాగునీరు, మందులు, దుస్తులు మొదలైనవి సరఫరా చేస్తున్నారు. చిన్న పిల్లలు కలిగిన కుటుంబాలకు 2 లీటర్లు, ఇతర కుటుంబాలకు లీటర్ చొప్పున 1.40 లక్షల పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. శిబిరాల్లో ఉన్న పిల్లలు, వృద్ధుల కోసం మొత్తం 33 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 13వేల బ్రెడ్ ప్యాకెట్లను అందించారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు లంక గ్రామాలను ఆనుకొని ఉన్న వరద గట్ల పక్కనే ప్రభుత్వం 160 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామాల నుంచి తీసుకొస్తున్న ప్రజలకు అక్కడే ప్రాధమిక వైద్య పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరికొన్ని వైద్య బృందాలు ప్రత్యేక బోట్లలో లంక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తినీ పరీక్షిస్తున్నాయి. వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో కూడా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వేలాది పశువులను ప్రత్యేక బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటికి సంపూర్ణ మిశ్రమదాణా, పచ్చి గడ్డిని అందుబాటులో ఉంచారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్లు, మందులు ఇస్తున్నారు. అప్రమత్తంగా అధికార యంత్రాంగం మరో 24 గంటలు వరద తీవ్రంగా ఉంటుందన్న అంచనాతో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎగువ ప్రాంతాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తీవ్రతను అంచనా వేస్తోంది. కాలువ గట్లకు గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గట్ల వెంబడి ఇసుక బస్తాలు సిద్ధం చేసింది. ప్రత్యేక బృందాలతో గట్లను 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు నాకు 87 ఏళ్లు. ఎన్నో వరదలను చూశా. ఇంత పెద్ద వరద ఎప్పుడూ చూడలేదు. ఊళ్లో ఉండలేక అందరం పునరావాస కేంద్రాలకు వచ్చేశాం. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. – పొల్నాటి కొండమ్మ, అయినవిల్లిలంక సత్వరమే వైద్యసహాయం అందిస్తున్నాం లంక గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యటిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ముంపు గ్రామాల్లో 5,063మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. – డాక్టర్ ఎస్.జాకబ్, కొత్తలంక పీహెచ్సీ వైద్యుడు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం వరద ఇంత వస్తుందని ఊహించలేదు. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి నీరు చొచ్చుకు రావడంతో ఆందోళన చెందాం. అధికారులు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం. – అంగాడి ముత్యాలరావు, లంకాఫ్ ఠానేలంక -
మరో 24 గంటలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: గోదావరి వరద నేపథ్యంలో మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ శనివారం ఉదయం సమీక్షించారు. గోదావరి ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ బృందాలను వినియోగించుకుంటూ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్దేశించారు. రేషన్ సరుకులు.. నగదు సాయం వరద బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన రేషన్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికైతే రూ.వెయ్యి చొప్పున వెంటనే నగదు సాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వరద పరిస్థితిపై గంట గంటకూ తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు. -
భద్రాద్రి జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఢిల్లీ పర్యటన రద్దు చేస్కొని మరీ..
సాక్షి, హైదరాబాద్: కనీవినీ ఎరుగనిరీతిలో గోదావరి మహోగ్రరూపంతో గోదావరి తీర ప్రాంతాల్లో కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, వరద ప్రభావిత భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో ఆదివారం గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. శనివారంరాత్రి ఆమె రైలుమార్గం ద్వారా కొత్తగూడెంకు బయలుదేరివెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున మణుగూరుకు చేరుకోనున్నారు. గవర్నర్ పర్యటనను అధికార టీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండగా, వరదబాధితులను కలుసుకుని వారి కష్టాలను అడిగి తెలుసుకోవడానికి ఈ పర్యటన జరుపుతున్నట్టు ఆమె వెల్లడించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు విందులో పాల్గొనడానికి గవర్నర్ తమిళిసై ఆదివారంరాత్రి ఢిల్లీకి వెళ్లాల్సింది. కానీ, భద్రాచలం పరిసర ప్రాంతాల ప్రజల దీనస్థితిని చూసి చలించిన గవర్నర్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని కొత్తగూడెం జిల్లాకు వెళ్లాలని నిర్ణయించినట్టు రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తమిళిసై రాష్ట్రపతికి ఫోన్లో వివరించి, తాను అత్యవసరంగా కొత్తగూడెం జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉందని విన్నవించారని పేర్కొంది. పునరావాస శిబిరాలను సందర్శించనున్న గవర్నర్ కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా గవర్నర్ పునరావాస కేంద్రాలను సందర్శించి వరదబాధితులను కలుసుకోనున్నారు. రెడ్క్రాస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి వచ్చిన విరాళాలు, సామగ్రిని బాధితులకు పంపిణీ చేయనున్నారు. బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందజేయాలని, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పునరావాస కేంద్రాలు, ఇతర ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య, ఇతర సహాయాన్ని అందించాలని తమిళిసై ఈఎస్ఐ వైద్య కళాశాల, రెడ్క్రాస్ సంస్థలను కోరారు. కాగా, వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలకు గవర్నర్ పర్యటనతో ఆటంకం కలగనుందని టీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి. గవర్నర్ పర్యటన రాజకీయమేనని ఆరోపిస్తున్నాయి. ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్ తీసుకోవాలి: గవర్నర్ అమీర్పేట (హైదరాబాద్): కరోనా నివారించాలంటే ప్రతిఒక్కరూ తప్పక బూస్టర్ డోస్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శనివారం అమీర్పేట 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె బూస్టర్ డోస్ తీసుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన గవర్నర్కు వైద్య సిబ్బంది టీకా వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం
ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేసి కార్యకర్తలతో కలసి తిరిగి వస్తున్న క్రమంలో పెట్రోల్ అయిపోయి వాగుమధ్యలో పడవ ఇంజిన్ ఆగిపోయింది. వరద ఉధృతికి పడవ వాగు ఒడ్డుకు కొట్టుకువచ్చి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఆమె వెంట ఉన్న నాయకులు చెట్టు కొమ్మల సాయంతో సీతక్కను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పడవ ఆగిపోయిన సమయంలో సీతక్క ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉన్నారని, వరద ఉధృతికి పడవ చెట్టును ఢీకొట్టి ఆగిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆమె వెంట ఉన్న వారు తెలిపారు. -
లంక వీడని జనం.. గోదారి ఈదుతున్న యంత్రాంగం
(పశ్చిమ గోదావరి లంక గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్వీ కృష్ణకిరణ్): చుట్టుముట్టిన వరద.. ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడని లంక వాసులు.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత బతిమాలినా లంక వీడేదిలేదని మంకుపట్టు. గత్యంతరం లేక ప్రభుత్వ యంత్రాంగామే పడవలతో గోదావరి దాటుకుని లంకల్లోకి వెళ్లి నిత్యావసరాలు అందిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటోంది. లంక వాసుల క్షేమం కోసం గోదావరి గట్టుపై పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, గజ ఈతగాళ్లను నియమించింది. వారు కంటి మీద కునుకులేకుండా గస్తీ కాస్తున్నారు. ప్రజా ప్రతిప్రతినిధులు కూడా వరద నీటిలో గ్రామాలకు వెళ్తున్నారు. శనివారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో పర్యటించి వరద సహాయక చర్యలను సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరద బాధితులకు పాలు, గుడ్లు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్ర భోజనం, వసతి ఏర్పాట్లు చేసింది. ఆచంట నియోజకవర్గంలోని పెదమల్లంక, కోడేరు లంక, అయోధ్యలంక, రావి లంక, పుచ్చల లంక, అణగారి లంకల ప్రజలు కొంత మంది మాత్రమే పునరావాస శిబిరాలకు వచ్చారు. ఈ లంకలకు చెందిన మిగతా వారితోపాటు భీమలాపురం, ఏటిగట్టు ప్రాంత వాసులు సైతం గ్రామాలను వీడి వచ్చేందుకు ఇష్ట పడలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగమే పడవలపై లంక గ్రామాలకు వెళ్తోంది. వారికి బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, మంచినీరు, పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలను అందిస్తోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నాలుగు రోజులుగా సిద్దాంతం, ఆచంట మండలంలోని లంక ప్రాంతాల్లో బోట్లపై ప్రయాణిస్తూ లంక వాసుల బాగోగులు చూస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోని వారికి ఆహారం, లంకల్లో ఉండిపోయిన వారికి సరుకులు అందించేలా సమన్వయం చేస్తున్నారు. ఆయన శనివారం భోజనాలతోపాటు 600 కిలోలకు పైగా చికెన్, 2 వేలకుపైగా గుడ్లను బాధితులకు అందించారు. ప.గోదావరి జిల్లా లంక గ్రామాల్లోని వారి కోసం నిత్యావసరాలను తరలిస్తున్న దృశ్యం పగలంతా పడవలో.. రాత్రయితే పునరావాసంలో.. దొడ్డిపట్ల రేవులో గోదావరి కట్టకు దిగువన 150పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. కట్టకు సమాంతరంగా వరదనీరు ప్రవహిస్తున్నప్పటికీ నీట మునిగిన ఇళ్ల వద్దే వారంతా పడవల్లో ఉంటున్నారు. ఇళ్లలో సామాన్లు దాదాపు 240 పడవల్లో వేసి, వర్షానికి తడవకుండా బరకాలు కప్పి వాటిపైనే పిల్లలు, పెద్దలు ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారు. పగలు పడవల్లో, రాత్రి పునరవాస కేంద్రాల్లో ఉంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎంత నచ్చచెప్పినా సురక్షిత ప్రాంతాలకు రావడంలేదు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, తదితర సిబ్బంది వారి కోసం గట్టుపై గస్తీ కాస్తున్నారు. దొడ్డిపట్ల రేవు వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతంలో వరదనీరు గ్రామంలోకి చొచ్చుకుని వస్తుండటంతో యుద్ధ ప్రాతిపదికన గట్టును పటిష్టం చేశారు. డేంజర్ జోన్లో నర్సాపురం గోదావరి నీరు సముద్రంలో కలిసే నర్సాపురానికి వరద తాకిడి ఆందోళనకరంగా మారింది. వరదనీరు నర్సాపురం – పాలకొల్లు ప్రధాన రహదారి పైకి సైతం చేరింది. స్లూయిజ్ల నుంచి నీరు వస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు నాలుగు రోజులుగా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. శనివారం రాత్రి వరదనీరు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. అన్నానికి మాత్రమే వెళ్తున్నాను! గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడం మునుపెన్నడూ చూడలేదు. ఏటు గట్టు పక్కనే ఉంటున్న మా ఇల్లు పైకప్పు వరకు మునిగిపోయింది. పది అడుగులు మేర ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామగ్రిని పడవల్లో వేసి తాళ్లతో చెట్లకు కట్టేశాం. భార్య, బిడ్డలను దొడ్డిపట్ల ప్రభుత్వ హైస్కూల్లోని సహాయక శిబిరంలో ఉంచి నేను రేయింబవళ్లు పడవలను కాపలా కాస్తున్నాను. ప్రభుత్వం మూడు పూటలా ఆహారం అందిస్తుండటంతో ఆ కాసేపు శిబిరానికి వెళ్లి మళ్లీ పడవల దగ్గరకు వచ్చేస్తున్నా. – కొప్పాడి శ్రీను, మత్స్యకారుడు, దొడ్డిపట్ల శివారు, యలమంచిలి మండలం బడిలో తలదాచుకుంటున్నాం! మాకు ముంపు అలవాటే. కానీ, ఈ సారి భయపడేంతగా వచ్చింది. కొబ్బరి చెట్టులో సగభాగం నీళ్లలో నానుతోంది. నేను కూలికి వెళితే, మా ఇంటాయన పడవలో ఇసుక తవ్వగా వచ్చిన డబ్బులతో నాలుగు నూకలు కొనుక్కునే వాళ్లం. వారం రోజులుగా ఏ పనీ లేదు. ఇల్లు వదిలి బడిలో తలదాచుకుంటున్నాం. ప్రభుత్వమే అన్నం పెడుతోంది. అధికారులు రెండు పూటలా మమ్మల్ని చూసి వెళ్తున్నారు. – లంకె సత్యవతి, దొడ్డిపట్ల పునరావాస కేంద్రం, యలమంచిలి మండలం అమ్మ చిరునవ్వు వెనుక.. ఊహకందని ఉప్పెనలో.. ఊహ తెలియని చిన్నారితో.. వీపుపై ఊయల ఊపుతూ.. కష్టమంతా కొట్టుకుపోయినా.. కన్నీళ్లు పెట్టించినా.. ఒడ్డుకొచ్చిన ఊపిరితో.. చిరునవ్వులోనే బాధను దాచుకున్న ఈ మహిళ పేరు సెరి మరియమ్మ. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈమె భర్తతో కలిసి దొడ్డిపట్ల ప్రభుత్వ పాఠశాలలోని సహాయక శిబిరంలో తలదాచుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే పాలతో బిడ్డకు ఉగ్గుపడుతూ.. తానూ ఇంత అన్నం తింటోంది. శనివారం ముంపు లంకల్లో పర్యటించిన సాక్షి బృందానికి కనిపించిన చిత్రమిది. -
Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం
సాక్షి, అమరావతి, ధవళేశ్వరం, సాక్షి ప్రతినిధి, ఏలూరు, నెట్వర్క్: భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గోదావరి వరద విరుచుకుపడుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఊరూ ఏరూ ఏకమయ్యాయి. లంకలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి వరద పోటెత్తుతుండటంతో పరీవాహక ప్రాంతంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశాలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన గోదారమ్మ శాంతిస్తోంది. ప్రాణహిత గోదావరిలో కలిసే ప్రదేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజ్లోకి వరద 11.65 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ దిగువన సమ్మక్క(తుపాకులగూడెం) బ్యారేజ్లోకి వచ్చే వరద కూడా 13.16 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఆ తర్వాత ఉన్న సీతమ్మసాగర్లోకి వచ్చే వరద కూడా 21.18 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి భద్రాచలంలో క్రమంగా తగ్గుముఖం.. ఎగువ నుంచి విడుదలైన ప్రవాహం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు భద్రాచలం వద్దకు 24,43,684 క్యూసెక్కులు చేరడంతో వరద మట్టం 71.30 అడుగుల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఎగువ నుంచి ప్రవాహం గంట గంటకూ తగ్గడంతో వరద నీటిమట్టం కూడా తగ్గుతూ వచ్చింది. శనివారం రాత్రి 9 గంటలకు 22,41,144 క్యూసెక్కులకు తగ్గడంతో భద్రాచలం వద్ద వరద మట్టం 67.70 అడుగుల్లో ఉంది. 53 అడుగుల కంటే దిగువకు చేరుకునే వరకూ మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగించనున్నారు. సోమవారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులు లేదా అంతకంటే దిగువకు చేరుకునే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. పోలవరం వద్ద అప్రమత్తం.. భద్రాచలం నుంచి దిగువకు వరద పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తిలతో కలసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వరద నియంత్రణను పర్యవేక్షించారు. శనివారం రాత్రి పోలవరంలోకి 22,41,144 క్యూసెక్కులు చేరుతుండటంతో ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద మట్టం 38.760 మీటర్లకు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 28.820 మీటర్లకు చేరుకుంది. ఆదివారం ఉదయం వరకూ పోలవరం వద్ద వరద పెరగనున్న నేపథ్యంలో అధికారులు కంటికి కునుకు లేకుండా సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలవరంలోకి 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎదుర్కొనేలా ఎగువ కాఫర్ డ్యామ్ను పటిష్టం చేయడం, ఎత్తు పెంపు పనులను ముమ్మరం చేశారు. 40.5 మీటర్ల నుంచి 42.5 మీటర్ల వరకూ కాఫర్ డ్యామ్ మధ్యలో కోర్ (నల్లరేగడి మట్టి) నింపి మరో 1.5 మీటర్ల ఎత్తున మట్టికట్ట నిర్మాణ పనులను వేగవంతం చేశారు. తద్వారా కాఫర్ డ్యామ్ ఎత్తు 44 మీటర్లకు చేరుకోనుంది. కోనసీమ జిల్లా పాశర్లపూడిబాడవలో వరద బాధిత కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం ధవళేశ్వరంలో వచ్చిన వరద వచ్చినట్లే.. ధవళేశ్వరం బ్యారేజ్లోకి శనివారం రాత్రి 9 గంటలకు 25,56,474 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 21.50 అడుగులకు చేరుకుంది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. డెల్టా కాలువలకు 11,500 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 25,48,974 క్యూసెక్కులను బ్యారేజ్ 175 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2006 ఆగస్టు 7న బ్యారేజ్లోకి 28,50,664 క్యూసెక్కులు రావడంతో నీటి మట్టం 22.80 అడుగులకు చేరుకుంది. 16 ఏళ్ల తర్వాత శనివారం ధవళేశ్వరం బ్యారేజ్లోకి గరిష్ట వరద ప్రవాహం రావడం.. అది కూడా జూలైలోనే రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజ్లోకి వరద శనివారం అర్ధరాత్రి గరిష్ట స్థాయికి చేరుకుని ఆదివారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కాటన్ బ్యారేజ్పై వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు. వైఎస్సార్ ముందుచూపుతో.. ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. 2004–05లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో రూ.650 కోట్లతో గోదావరి ఏటిగట్లను పటిష్టం చేయడంతో 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునే విధంగా ఉన్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులు సహాయ శిబిరాల్లో 71,200 మంది ఇప్పటి వరకు ఆరు జిల్లాల్లో 76,775 మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 71,200 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాడేపల్లిలోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పది చొప్పున సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. 62 మండలాల్లో 324 గ్రామాలు వరద బారినపడ్డాయి. మరో 191 గ్రామల్లోకి నీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురంలో అనారోగ్యంతో ఉన్న దేవి ముత్యాలమ్మ (68) శనివారం తెల్లవారు జామున బయటకు వెళ్తున్న క్రమంలో గోదావరిలో పడిపోయి గల్లంతైంది. ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఏటిగట్టు ప్రాంతంలో పలువురు పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలిలంక గ్రామానికి పడవపై వెళ్తున్న హోం మంత్రి తానేటి వనిత, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ► అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏడు మండలాల్లో 125 గ్రామాలు మునిగిపోగా 165 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. జిల్లాలో 101 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 49,623 మందిని తరలించారు. చింతూరు, ఎటపాక మండలాల్లో ఎక్కువ గ్రామాలు మునిగిపోయాయి. గోదావరి ఒడ్డున ఉన్న వీఆర్ పురం, దేవీపట్నం, కూనవరం మండలాల్లో ముంపు తీవ్రంగా ఉంది. ► అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 18 మండలాల్లోని 74 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు ఏసి 9,290 మందిని తరలించారు. ► ఏలూరు జిల్లాలో ఏడు మండలాలకు చెందిన 26 గ్రామాలు ముంపులో ఉండగా 33 గ్రామాల్లోకి నీరు చేరింది. 18 పునరావాస కేంద్రాలు తెరిచి 9,363 మందిని తరలించారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలోని 8 మండలాల్లో 28 గ్రామాలు ముంపులో ఉండగా మరో 27 గ్రామాల్లోకి నీరు చేరింది. 18 పునరావాస కేంద్రాల్లోకి 1345 మందిని తరలించారు. ► తూర్పు గోదావరి జిల్లాలో 21 మండలాల్లో 13 గ్రామాలు ముంపునకు గురవగా 23 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ► కాకినాడ జిల్లాలో తాళ్లరేవు ముంపునకు గురి కావడంతో సహాయ శిబిరం ఏర్పాటు చేసి 90 మందిని తరలించారు. ► ఇళ్లు నీట మునగడంతో తలదాచుకునేందుకు పైకి ఎక్కిన వందలాది మందిని ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. -
రెప్ప వాల్చని ఏపీ సర్కారు.. వలంటీర్ నుంచి ఉన్నతాధికారి వరకు..
(వేలేరుపాడు నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్వీ కృష్ణ కిరణ్): కట్టుబట్టలతో ఉన్న పళంగా అందుబాటులో ఉన్న వస్తువులను మూటలుగా కట్టి నెత్తిన పెట్టుకుని.. చంటి పిల్లల్ని చంక నెత్తుకుని.. ముసలి వారిని వాహనాలపై ఎక్కించుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు లంక గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మూగ జీవాలను సైతం రక్షించుకునేందుకు తాపత్రయ పడుతూ.. ఉన్న ఇంటిని, సొంత ఊరిని వదిలి వేలాది మంది ట్రాక్టర్లు, ఆటోలపై సహాయక శిబిరాలకు, బందువుల ఇళ్లకు వెళ్తున్న దృశ్యాలు ఈ ప్రాంతంలో ఊరూరా కనిపిస్తున్నాయి. ‘వరద ముప్పు పెరుగుతోంది.. ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలి’ అంటూ వలంటీర్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అనుక్షణం అప్రమత్తం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ముందు చూపునకు నిదర్శనం. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించడం, శిబిరాల ఏర్పాటు, బాధితులకు పక్కాగా భోజన ఏర్పాట్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. భోజన, వసతి ఏర్పాట్లకు అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది సేవలు ఉపయోగించుకుంటున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా, అనారోగ్య సమస్యలు దరిచేరకుండా 24 గంటల పాటు వైద్య సిబ్బంది విశేష సేవలు అందిస్తున్నారు. అయినవిల్లి మండలంలో ముంపు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్న వరద బాధితులు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకులు, టార్పాలిన్, బరకాలు పంపిణీ చేయడం ద్వారా ప్రభుత్వం బాధితులకు అడుగడుగునా భరోసా కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో విలీన మండలాలైన వేలేరుపాడు, కుకునూరు పరిధిలోని అనేక ముంపు గ్రామాల్లో శుక్రవారం ఈ వసతి సౌకర్యాలు కనిపించాయి. ప్రభుత్వ యంత్రాంగం.. వలంటీర్ మొదలు కలెక్టర్ వరకు కంటిపై కునుకు లేకుండా సహాయక చర్యల్లో ముమ్మరంగా నిమగ్నమవడం కనిపించింది. బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ సాయం ♦వేలేరుపాడు మండలంలో 44 గ్రామాలు(ఏడు రెవెన్యూ పంచాయతీలు), కుకునూరు మండలంలో 72 గ్రామాలు(15 రెవెన్యూ పంచాయతీలు) వరద తాకిడికి గురయ్యాయి. ఈ గ్రామాల్లోని వారు చాలా మంది శిబిరాలు, ఎత్తు ప్రాంతంలో ఉండే అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. వరద తాకిడికి సెల్ఫోన్ నెట్వర్క్లన్నీ మూగబోయాయి. ♦వేలేరుపాడు మండలంలో ఏర్పాటు చేసిన శివకాశిపురం, కస్తూరిబా బాలికల హైస్కూల్ పునరావాస శిబిరాల్లో 1050 మందికి, కుకునూరు మండలంలో 13 శిబిరాల్లో 2199 కుటుంబాలకు వసతి సౌకర్యం కల్పించారు. శిబిరాల్లో ఉన్న వారికి ఉదయం గుడ్డుతో పాటు టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి.. కూర, సాంబారు, పప్పుతో భోజనం అక్కడే వండి వడ్డిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు సరఫరా చేస్తున్నారు. ♦బంధువుల ఇళ్లకు వెళ్లిన వారికీ ప్రభుత్వం సహాయం అందిస్తోందని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎం.ఝాన్సీరాణి, జెడ్పీ సీఈవో కేవీఎస్ రవికుమార్ తెలిపారు. బాధితులకు తక్షణావసరాలకు బియ్యం, నూనె, కందిపప్పు, 8 రకాల కాయగూరలు శుక్రవారం అందించారు. కొయిదా, కట్కూరు గ్రామాలకు హెలికాప్టర్ ద్వారా నిత్యావసరాలు, టార్పాలిన్లు అందించారు. ♦పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించారు. పాము కాటు, గుండెపోటు.. తదితర అత్యవసర మందులు అందుబాటులో ఉంచారు. గర్భిణులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రభుత్వమే కడుపు నింపుతోంది మా కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. నేను పనిపై జంగారెడ్డి గూడెం వెళ్లి వచ్చేలోగా మా ఊరిలోకి నీళ్లు వచ్చేశాయి. ఇంటిలో ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఏం చేయగలరు.. అన్నీ వదిలేసుకుని అధికారులు పెట్టిన ట్రాక్టర్లలో వచ్చి శివకాశీపురంలో తల దాచుకుంటున్నాం. మా ఊరిలో మొత్తం పశువులు అన్నీ పోయాయి. ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసరాలతోనే కడుపునింపుకుంటున్నాం. – మడకం బుచ్చయ్య, రేపాకగొమ్ము -
మరో 24 గంటలపాటు హైఅలర్ట్గా ఉండాలి: సీఎం జగన్
-
గోదావరి వరదలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలన్నారు. చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం తెలిపారు. ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
గోదావరి ఉగ్రరూపం.. జల దిగ్భంధంలో భద్రాచలం (ఫొటోలు)
-
Andhra Pradesh: గోదా'వర్రీ'!.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, అమరావతి, ధవళేశ్వరం, చింతూరు/దేవీపట్నం: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వర్షాలు తెరపి ఇవ్వడంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి తగ్గినప్పటికీ రానున్న 24 గంటలు కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద 24,29,246 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దాంతో నీటి మట్టం 71 అడుగులకు చేరుకుంది. 32 ఏళ్ల క్రితం అంటే.. 1990 ఆగస్టు 24న గోదావరికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు భద్రాచలంలో వరద నీటి మట్టం 70.8 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు 32 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తుండటం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద వరద మట్టం 72 అడుగులకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గంట గంటకూ పెరుగుతున్న వరద ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 20,00,162 క్యూసెక్కులు చేరుతుండటంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 37.7 మీటర్లకు చేరుకుంది. గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పోలవరం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. శనివారం రాత్రికి 28.50 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద పోలవరంలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలో వరద మట్టం 17.75 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 21,78,427 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దాంతో నీటి మట్టం 19.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టాకు 10,000 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 21,68,427 క్యూసెక్కుల నీటిని కడలిలోకి వదిలేస్తున్నారు. ఎగువన శాంతిస్తున్న గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదారమ్మ శాంతిస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీరాంసాగర్లోకి వచ్చే వరద 96,265 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలోకి వస్తున్న వరద 2,94,429, లక్ష్మీ బ్యారేజీలోకి చేరుతున్న వరద 23,29,903 క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ నుంచి విడుదల చేస్తున్న వరదతో సమ్మక్క బ్యారేజ్లోకి 24,21,180 క్యూసెక్కులు చేరుతోంది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సీతమ్మసాగర్లోకి 23,94,567 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద విడుదల చేసిన వరద.. ధవళేశ్వరం బ్యారేజ్కు చేరుకోవడానికి 48 గంటలు పడుతుంది. కాటన్ బ్యారేజ్పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 48 గంటలపాటు గోదావరి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. గోదావరి బేసిన్లో హైఅలర్ట్ను ప్రకటించింది. వందలాది గ్రామాలు నీట మునక వరద గోదావరి ఊళ్లను ముంచెత్తి ప్రవహిస్తోంది. 1986 తర్వాత గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద నీరు కారణంగా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, వి.ఆర్.పురం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలుగు మండలాల్లో వరదనీరు చుట్టుముట్టడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కూనవరం, వీఆర్.పురం మండలాలు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకోగా చింతూరు, ఎటపాక గ్రామాల్లో నది పరీవాహక గ్రామాలను వరద ముంచెత్తింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద బ్యాక్ వాటర్ పోటు కారణంగా పోశమ్మగండి వద్ద వరద నీరు కొండను తాకింది. దేవీపట్నం మండలంలో కొండమొదలు పంచాయతీలోని కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గ్రామస్తులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని సురక్షిత ప్రదేశాల్లో తల దాచుకుంటున్నారు. వీరికి శుక్రవారం దుప్పట్లు, టార్పాలిన్లు, కూరగాయాలు తదితర నిత్యావసరాలు పంపించినట్టు తహసీల్దార్ వీరభద్రరావు తెలిపారు. -
భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏకంగా 24,13,509 క్యూసెక్కుల వరద వేగంగా దిగువకు ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాతి నుంచి శనివారం తెల్లవారుజామున 6 గంటల మధ్య వరద స్థాయి మరింతగా పెరుగుతుందని.. ఆ సమయంలో 72 నుంచి 75 అడుగుల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆ స్థాయిలో వరద వస్తే భారీగా ముంపు నమోదయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే భద్రాచలం సహా ఏజెన్సీ మండలాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించింది. 101 మందితో కూడిన ఆర్మీ బృందం కూడా భద్రాచలానికి చేరుకుంది. అత్యవసర పరిస్థితిలో వినియోగించేందుకు ఒక ఆర్మీ హెలికాప్టర్ను కూడా భద్రాచలంలో సిద్ధంగా ఉంచారు. టూరిజం, అగ్నిమాపక శాఖకు చెందిన బోట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకోవాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉండగా, మరిన్ని బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక బలగాల మోహరింపు వరద కారణంగా ఎలాంటి ఇబ్బందులు, ఇతర సమస్యలు తలెత్తకుండా పెద్ద సంఖ్యలో పోలీసులనూ భద్రాచలం ఏజెన్సీకి తరలించారు. ఐజీ నాగిరెడ్డి భద్రాచలం చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ప్రభుత్వ సిబ్బందిని వరద సహాయ కార్యక్రమాల కోసం రప్పించారు. వీరితోపాటు నలుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్కు వరద సహాయ కార్యక్రమాల ప్రత్యేకాధికారిగా బాధ్యత అప్పగించారు. సీఎం కేసీఆర్తోపాటు చీఫ్ సెక్రెటరీ సోమేశ్కుమార్ సహాయ కార్యక్రమాల్లో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రాచలంలో సహాయక కేంద్రాలకు వెళ్లాలని బాధితులకు చెబుతున్న మంత్రి పువ్వాడ అంధకారంలోనే ఏజెన్సీ వరద కారణంగా విద్యుత్ స్తంభాలు, సబ్స్టేషన్లు మునిగిపోవడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక మండలాలు అంధకారంలో మునిగిపోయాయి. మణుగూరు వద్ద మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్ వరదలో మునిగిపోవడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 1,730 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. శిబిరాల్లో ఆకలి కేకలు గోదావరి వరద 80 అడుగుల వరకు చేరుకోవచ్చనే ప్రచారం జరగడంతో.. గురువారం రాత్రి నుంచి లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాలకు పోటెత్తారు. సొంత వాహనాల్లో సామాన్లతో సహా తరలివచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో.. తగిన స్థలం చూపించడం, సమయానికి ఆహారం అందించడంలో ఆలస్యం జరిగింది. అన్నం పెట్టాలంటూ సహాయ శిబిరాల్లోని బాధితులు శుక్రవారం మధ్యాహ్నం ఆందోళన చేశారు. అతి పెద్ద వరదగా మారుతుందా? భద్రాచలం: భద్రాచలం వద్ద ఈసారి గోదావరి ఉధృతితో పాత రికార్డులన్నీ బద్దలుగొట్టే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న 75.6 అడుగుల వరద రావడం ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఆ తర్వాత 1990 ఆగస్టు 24న 70.8 అడుగుల వరద రెండో స్థానంలో నిలిచింది. ఈసారి వరద రెండో రికార్డును శుక్రవారం రాత్రి 8గంటలకు దాటేసింది. ఇప్పటివరకు జూలై నెలలో గోదావరికి వచ్చిన వరదల్లో ఇదే అత్యధికం. ప్రవాహం మరింతగా పెరుగుతుందన్న అంచనాల మేరకు.. 1986 నాటి రికార్డును కూడా తాజా వరద అధిగమిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జూలై నెలలోనే కాకుండా.. గోదావరి వరదల్లోనే ఇదే అతి పెద్దదిగా నమోదు కానుంది. కలవరపెడుతున్న కరకట్ట భద్రాచలం పట్టణానికి రక్షణగా ఉన్న కరకట్ట అధికారులను కలవరపెడుతోంది. 1986లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ఈ కరకట్టను డిజైన్ చేసినా.. భారీ వరదను ఏమేరకు తట్టుకుంటుందనే ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కరకట్టకు ఉన్న డ్రైనేజీ స్లూయిస్ల నుంచి నీరు లీకవుతోంది. భద్రాచలంలోని అయ్యప్పకాలనీ, యటపాక దగ్గర కరకట్టలో లీకేజీలు శుక్రవారం బయటపడ్డాయి. అప్పటికప్పుడు ఇసుక బస్తాలు వేశారు. కరకట్టపై ఎక్కడ లీకేజీలు వచ్చినా అడ్డుకునేందుకు ప్రతీ వంద మీటర్లకు ఒకచోట ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు. ఆ ఆరు గంటలే కీలకం శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరికి గరిష్ట వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. తర్వాత క్రమంగా ఉధృతి తగ్గుతుందని అంటున్నారు. వరద ప్రవాహం 60 అడుగులకన్నా దిగువకు చేరితే.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి సహాయ శిబిరాల్లో ఉన్నవారిని ఇళ్లకు పంపిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. అప్పటివరకు ప్రజలు సహకరించాలని కోరారు. నీట మునిగిన గ్రామాలు.. చర్ల మండలంలో 18 గ్రామాలు, దుమ్ముగూడెం మండలంలో 20, మణుగూరులో 3 గ్రామాలు, అశ్వాపురంలో 8, బూర్గంపాడు, చుట్టూ ఉన్న గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలంలోని సుభాష్ నగర్, కొత్తకాలనీ, అయ్యప్పకాలనీ, ఇండస్ట్రియల్ ఏరియా, రాజుపేట, శాంతినగర్, అశోక్ నగర్, ఏఎంసీ కాలనీ, రామాలయం పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దుమ్ముగూడెం వద్ద కరకట్టపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో ఇసుక బస్తాలు వేశారు. వరద పెరిగితే కరకట్టకు గండ్లు పడే అవకాశం ఉంది. పోటెత్తిన వరదతో 42 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో కోల్ యార్డులోకి వరద నీరు చేరుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాబోయే 24 గంటలు చాలా కీలకం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గోదావరి వరదలు..సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఏరియల్సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియమించారు. రాబోయే 24 గంటలు చాలా కీలకం.. హైఅలర్ట్గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతోనూ చర్చించిన సీఎం జగన్.. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఏ జిల్లాకు ఎవరంటే.. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్కుమార్, డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రవీణ్కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్లను నియమించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనుంచి ఎలాంటి సహాయంకోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించేలా చూడాలని అన్ని విభాగాల సీఎస్లకు సహా అన్ని విభాగాల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎంవో కార్యదర్శులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని, గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రేపుకూడా(శనివారం) గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు ఉండడంతో.. లంక గ్రామాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని సూచించారాయన. వరద ప్రభావం గ్రామాలపై ఫోకస్ గోదావరి గట్లకు ఆనుకుని ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. గట్లు బలహీనంగా ఉన్నచోట గండ్లు లాంటివి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన పక్షంలో తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని సిద్ధం చేయాలని తెలిపారు. వీలైనన్ని ఇసుక బస్తాలను గండ్లుకు ఆస్కారం ఉన్న చోట్ల ముందస్తుగా ఉంచాలని సూచించారు. ముంపు మండలాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలి. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, పాలు అందించాలి. వచ్చే 48 గంటల్లో వరద ప్రభావిత కుటుంబాలకు వీటిని చేర్చాలి. సహాయ శిబిరాల్లో ఉంచే ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల రూపాయలు ఇవ్వాలి. రాజమండ్రిలో 2 హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర సర్వీసులకోసం, పరిస్థితిని సమీక్షించేందుకు ఆ హెలికాప్టర్లను వినియోగించుకోండి. గ్రామాల్లో పారిశుధ్య సమస్యరాకుండా, తాగునీరు కలుషితం రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి. పాముకాటు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత ఇంజెక్షన్లను కూడా ఆయా ఆరోగ్యకేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలి. వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో అందించే సేవలు నాణ్యంగా ఉండాలి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెల్టవర్లకు డీజీల్ సరఫరాచేసి.. నిరంతరం అవి పనిచేసేలా చూడండి’’ అని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చదవండి: సీఎం జగన్ ఏరియల్ సర్వే.. ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి -
ఏపీ వరదలు.. సీఎం జగన్ ఏరియల్ సర్వే (ఫొటోలు)
-
Kadem Project: కడెంపై ఆ 9 మంది ‘చివరి’ సెల్ఫీ..! ఉగ్ర గోదారి ఉరిమి చూస్తే!
నిర్మల్/కడెం: గోదావరి మహోగ్రరూపాన్ని కడెం ప్రాజెక్టు సిబ్బంది కళ్లారా చూశారు. క్షణం ఆలస్యమైనా వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. ప్రాజెక్టుపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డ్యామ్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులు వస్తున్నా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇంతలో వరద ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఈఈ రాజశేఖర్.. కలెక్టర్ ముషరఫ్ అలీకి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మీరందరూ వెంటనే డ్యామ్ వదిలి వెళ్లిపోవాలని కలెక్టర్ గట్టిగా ఆదేశించడంతో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ సెల్ఫీ ఫొటో తీసుకుని వచ్చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఈ సునీల్ పరిస్థితిని చూసివద్దామంటూ ఈఈ రాజశేఖర్, డీఈ భోజదాస్, గేట్ ఆపరేటర్లు చిట్టి, సంపత్లను వెంటబెట్టుకుని వెళ్లారు. తాము అక్కడికి వెళ్లిన కాసేపటికే వరద ఒక్కసారిగా పోటెత్తిందని, ప్రాజెక్టు పై నుంచి నీళ్లు ఉప్పొంగాయని, దీంతో వెంటనే తమ బైక్ అక్కడే వదిలేసి, ఎస్ఈ కారులో వచ్చేశామని గేట్ ఆపరేటర్లు తెలిపారు. డ్యామ్పై నుంచి సునామీలా వచ్చిన వరదను చూసి వణికి పోయామని చెప్పారు. -
వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం
Live Updates: 6:00 PM గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ సమగ్ర సమీక్ష. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటుచేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన సీఎం జగన్ వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్ అధికారి నియామకం వచ్చే 24 గంటలు హైఅలర్ట్గా ఉండాలని సీఎం జగన్ ఆదేశం 4: 24 PM ►గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వరద సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సీఎం వైఎస్ జగన్ ►గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్ష ►ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం ► గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్షించనున్నారు. ► విశాఖపట్నంలో వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బయలుదేరారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం.. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం వరదలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. ►గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. ఇక గురువారం ఉదయం నాటి గోదావరి వరద పరిస్థితి గురించి సీఎం ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ►రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్లు వారు వివరించారు. దాదాపు 23 నుంచి 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందన్నారు. ►ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని.. అలాగే, వారికి తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎస్డీఆర్ఎఫ్ ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధితులకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా 150 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు ముంపు మండలాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఏలూరు, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. అల్లూరి జిల్లాలోని కూనవరం, వీఆర్ పురం, రాజుపేట ఎస్సీ కాలనీ, ఏలూరు జిల్లాలోని సుడిగుమ్మరీపగుమ్మ, కోనసీమ జిల్లాలోని టేకుల సెట్టిపాలెం, వీరవల్లిపాలెం, కొట్టిలంక, గుంజరామేక తదితర గ్రామాల ప్రజలను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలవరం ముంపు మండలాల పరిధిలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 30 మంది విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భద్రత కల్పించాయి. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఆహారం పంపిణీ చేశాయి. -
Godavari River Floods: ఉగ్ర గోదారి 'హై అలర్ట్'
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ అమలాపురం/ధవళేశ్వరం/సాక్షి ప్రతినిధి, ఏలూరు/ చింతూరు/ ఎటపాక/దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్లను గోదావరి వరద ముంచెత్తింది. లక్ష్మీ బ్యారేజ్ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. గురువారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద 19,90,294 క్యూసెక్కులు ఉండగా.. వరద నీటి మట్టం 63.20 అడుగులకు చేరగా. ఇది శుక్రవారం 70 అడుగులను దాటే అవకాశముందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. అనంతరం.. గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు. తూర్పు గోదావరి జిల్లా బొబ్బిల్లంక వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న హోం మంత్రి వనిత, ఎమ్మెల్యే రాజా, కలెక్టర్ మాధవీలత తదితరులు పోలవరం వద్ద హైఅలర్ట్.. ఎగువ నుంచి గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. 24 గంటలూ ప్రాజెక్టు వద్ద వరద ఉధృతిని అధికారులు సమీక్షిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం వద్దకు గురువారం రాత్రి 9 గంటలకు 16,48,375 క్యూసెక్కులు చేరుతుండగా.. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద వరద మట్టం 36.495 మీటర్లకు చేరగా.. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 26.20 మీటర్లకు చేరుకుంది. ఇక్కడకు శుక్రవారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంత వరద వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు చర్యలు చేపట్టారు. ధవళేశ్వరం బ్యారేజ్లోకి వరద ఉధృతి మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. బ్యారేజ్లోకి గురువారం 16,61,565 క్యూసెక్కులు చేరుతోంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి 16,76,434 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. వరద మట్టం 15.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అలాగే, శుక్రవారం సాయంత్రం లేదా రాత్రికి ధవళేశ్వరం బ్యారేజీలోకి 28.50 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశముంది. అప్పుడు వరద మట్టం 17.75 అడుగులను దాటే అవకాశం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేయనున్నారు. రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటిమట్టం 17.60 అడుగులుగా ఉంది. ఇక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం పెరిగితే ఆరు జిల్లాల్లోని 42 మండలాల్లో 554 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశముంది. అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరిలో 8, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 5, పశ్చిమ గోదావరి 4, ఏలూరు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 2 మండలాలపై వరద ప్రభావం చూపే అవకాశముంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా గ్రామంలో హెలికాప్టర్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న దృశ్యం కోనసీమ లంక వాసుల ఆందోళన గోదావరికి మరింత వరద వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో కోనసీమ లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, కె.గంగవరం, ఐ.పోలవరం మండలాల్లోని పలుచోట్ల ఇళ్లలోకి నీరుచేరింది. 18 మండలాల్లోని 59 గ్రామాలు వరద నీట చిక్కుకున్నాయి. 73,400 మంది వరదబారిన పడ్డారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఈ మండలాల్లో మరికొన్ని గ్రామాలతోపాటు కాట్రేనికోన, కపిలేశ్వరపురం, ఆత్రేయపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరే అవకాశముంది. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెక్టు సమీపంలో ఏటిగట్టు తెగే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పలు లంకలకు అధికారులు పడవలు ఏర్పాటుచేశారు. అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 65 ఇళ్లు వరద ముంపుబారిన పడ్డాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంక శివారు పల్లిపాలెం, ఎల్.గన్నవరం శివారు జొన్నలలంక. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పుచ్చల్లంక, రాయలంక, కనకాయలంక, అయోధ్యలంకల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఈ జిల్లాలో 73 పునరావస కేంద్రాలను గుర్తించి, 143 బోట్లను సిద్ధంచేశారు. 7,600 మందికి అహార ప్యాకెట్లు అందించగా, సుమారు రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లు అందించారు. 79 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కె.గంగవరం మండలం కోటిపల్లి మత్స్యకార కాలనీలో ముంపు బాధితుల వద్దకు మంత్రి వేణు పడవపై వెళ్లి నిత్యావసర సరుకులు అందజేశారు. పాండిచ్చేరీ యానాంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలోకీ వరద నీరు చేరింది. ‘తూర్పులో ఎనిమిది ప్రాంతాలపై దృష్టి ధవళేశ్వరం హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ‘తూర్పు’లో ఎనిమిది వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వూరులో 70, సీతానగరం మండలంలో 270 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో నీటిలో చిక్కుకున్న 8 మంది గొర్రెల కాపరులను, 60 గొర్రెలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కరకట్టలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కలెక్టర్ కె.మాధవీలత గురువారం పర్యటించారు. విశాఖ జిల్లా ఎటపాక పోలీసుస్టేషన్లోకి గోదావరి వరద చేరింది. తూర్పు గోదావరి జిల్లా బుర్రింక వద్ద గోదావరి లంకల్లో చిక్కుకున్న గొర్రెలు, గొర్రెల కాపరులను ఒడ్డుకు చేర్చేందుకు బోట్లపైకి ఎక్కిస్తున్న దృశ్యం విలీన మండలాలు విలవిల గోదావరి మహోగ్రరూపంతో పోలవరం ముంపు (విలీన) మండలాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని అనేక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. 12,694 కుటుంబాలకు చెందిన 36 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చింతూరు కేంద్రంగా అధికారులు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయంతో లాంచీలు, బోట్ల ద్వారా నిత్యావసరాలను ముంపు ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అందచేస్తున్నారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. వేలేరుపాడు మండలంలో కొయిదా గ్రామానికి గురువారం హెలికాఫ్టర్ ద్వారా 800 మందికి సరిపోయే నిత్యావసరాలు అందించారు. శుక్రవారం కూడా ఇలాగే అందించనున్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్పీ రాహుల్దేవ్శర్మలు వేలేరుపాడులో పర్యటించి పునరావాస కేంద్రాలు పరిశీలించారు. -
ఏపీ: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే
-
తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు అతిభారీ వర్ష సూచన ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతిభారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని తెలిపింది. మరో మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండడంతో.. మిగతా చోట్ల సైతం సాధారణం నుంచి వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాచలం వద్ద.. అరుదుగా వరదలొచ్చే నదులు పొంగిపొర్లడంతో మూకుమ్మడిగా గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ప్రాణహిత, పెన్గంగా, వార్ధా నదులు వరదలతో ఉగ్రంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, కడెం నుంచి దిగువకు భారీగా వరద నీరు విడుదల అవుతోంది. భూపాలపల్లి జిల్లాలో గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. పలిమెల పోలీస్ స్టేషన్ నీట మునిగింది. మేడిగడ్డ కంట్రోల్ రూంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు కొందరు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం. అలాగే భద్రాద్రికి రాకపోకలు బంద్ అయ్యాయి. మిగిలిన ఏకైక మార్గం కూడా మూసివేశారు అధికారులు. అత్యవసరమైతేనే భద్రాద్రిలోకి అనుమతిస్తున్నారు. భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటల పాటు రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. 48 గంటలపాటు ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం 62 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం.. రాత్రికి లేదంటే రేపు ఉదయానికి గోదావరి మట్టం 70 అడుగులకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాలు డేంజర్ జోన్లో ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. సీఎస్ సోమేశ్కుమార్ అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏపీలోనూ.. రాజమండ్రి: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉదృతంగా ఉంది. నీటిమట్టం 16 అడుగులు దాటింది. 17.75 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. అదే జరిగితే ఆరు జిల్లాలపై ప్రభావం పడనుంది. 42 మండలాల్లోని 524 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పోలవరం నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపులోకి మరికొన్ని ప్రాంతాలు. ఆచంట, యలంచిలి మండలాల్లో లంకగ్రామాలు నీట మునగ్గా.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద సహాయక చర్యల్లో ఏడు ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఏపీ విపత్తుల శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
AP: వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గురువారం చేపట్టిన ఇరిగేషన్ రివ్యూ సందర్భంగా.. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో గోదావరి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల నుంచి సీఎం జగన్.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే 48 గంటల్లో వరదనీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు, సీఎం జగన్కు తెలిపారు. ఎగువన తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్సహా బేసిన్లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతోంది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్కు అధికారులు వెల్లడించారు. దీంతో పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని సీఎం జగన్ సూచించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
వరద నీటిలో మంత్రి వేణు పడవ ప్రయాణం.. ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, కోనసీమ జిల్లా: గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును మంత్రి వేణుగోపాలకృష్ణ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యవసర మందులు, తాగునీరు, కిరోసిన్ అందుబాటులో ఉంచామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందిస్తున్నామని మంత్రి వేణు పేర్కొన్నారు. చదవండి: బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు గౌతమీ గోదావరి వరద తీవ్రతతో రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో కే గంగవరం మండలంలో పలు లంకలు, కోటిపల్లి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. లంకలతో పాటు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఇళ్ల మధ్యకు వరద నీరు చేరుకోవడంతో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో పాటు సమీపంలోనే గౌతమి గోదావరి ఉండటంతో మరో రెండు మూడు రోజులు పాటు ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు చెబుతున్నారు. -
వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి అమలాపురం: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. మూడు దశల్లో కచ్చితమైన అంచనాకు వస్తుంటారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తొలిదశలో గోదావరి నదికి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగా గోదావరికి వచ్చే వరదపై అధికారులకు అంచనా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఏకంగా 3,12,812 స్క్వేర్ మీటర్లు. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాలలో విస్తరించింది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాల వివరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీబ్ల్యూసీ) పంపిస్తోంది. మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ప్రాంతంలో భారీగా కురిసినా నేరుగా వరద ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చే అవకాశం తక్కువ. మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నందున ఆలస్యమవుతోంది. అదే తెలంగాణలోని వరంగల్, ఏటూరి నాగారం, మంచిర్యాలా, మణుగూరు, ఇచ్చంపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఉధృతి కనిపిస్తోంది. కాళేశ్వరం టూ ధవళేశ్వరం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షంతో వచ్చే అంచనాతోపాటు రెండవ దశలో గోదావరి, ఉప నదుల మీద ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ల వద్ద రీడింగ్ల ద్వారా వరద అంచనా వేస్తారు. వరదపై చాలా వరకు పక్కాగా లెక్క వస్తోంది. ప్రధానంగా భద్రాచలం గేజ్ స్టేషన్ వద్ద ఉన్న నీటి పరిణామాన్ని బట్టి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం తేలుతోంది. ఆయా గేజ్ స్టేషన్ల దూరాన్ని బట్టి ధవళేశ్వరం బ్యారేజీకి వరద వచ్చేందుకు పట్టే సమయం తేలుతోంది. గోదావరిపై పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద, కొత్తగా కాపర్డామ్, పోలవరం వద్ద, అలాగే ఉప నది శబరిపై కుంట, కొయిడాల వద్ద గేజ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరద వచ్చేందుకు 18 గంటల సమయం పడుతోంది. గేట్ల నుంచి వెళ్లే నీటి పరిమాణంతో వరద లెక్క మూడవ దశలో వరద లెక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తేలుతోంది. బ్యారేజ్ స్పిల్ లెవిల్ మీద 10.67 స్పిల్ లెవిల్ మీద ఎంత ఎత్తున నీరు వచ్చిందో చూస్తారు. మొత్తం 175 గేట్లు ఉండగా, ఎన్ని గేట్లు ఎత్తారు, గేట్ల మధ్య పొడవు, వెడల్పును పరిగణలోకి తీసుకుని ఒక సెకనుకు ఎన్ని క్యూసెక్కులు వెళుతోంది లెక్క కడతారు. గాంధీ గడియారం... పేపర్ బాల్స్ ఇప్పుడంటే బ్యారేజీకి వచ్చే వరదపై కచ్చితమైన అంచనాకు సాంకేతికంగా పలు పరికరాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరద ప్రవాహాన్ని, వేగాన్ని కొలవడం అధికారులకు కత్తిమీద సామే. ఇందుకు వారు గాంధీ గడియారం, పేపర్ బాల్స్ (పేపర్లతో చుట్టిన బంతి)ని వినియోగించేవారు. ‘పేపర్ను ఉండగా చుట్టి బ్యారేజీ ఎగువ వైపు వేసేవాళ్లం. బ్యారేజీ దిగువకు ఎంతసేపటిలో వచ్చిందనేది తెలుసుకోవడానికి గాంధీ గడియారాన్ని ఉపయోగించేవాళ్లం. ఈ సమయాన్ని నమోదు చేయడం ద్వారా వరద వేగాన్ని గుర్తించే వాళ్లం’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇన్చార్జి ఎస్ఈ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
Andhra Pradesh Rains: వానలే వానలు.. వరదెత్తిన నదులు
సాక్షి,అమరాతి/సాక్షినెట్వర్క్: పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు వరదెత్తాయి. తెలంగాణ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో శనివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తుండటంతో తెలంగాణలోని ఎస్సారెస్సీ రెండు రోజుల్లో నిండనుంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో సమ్మక్క బ్యారేజీ వద్దకు ఆదివారం ఉదయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంచేరింది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరుకోనుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. వరద ముప్పును తప్పించడానికి ముందుగా పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలను అధికారులు ఖాళీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,67,782 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 6,350 క్యూసెక్కులు విడుదల చేసి, మిగులుగా ఉన్న 1,60,432 క్యూసెక్కులను ధవళేశ్వరం ఆర్మ్, ర్యాలీ ఆర్మ్, మద్దూరు ఆర్మ్, విజ్జేశ్వరం ఆర్మ్లలోని మొత్తం 175 గేట్లు ఎత్తి కడలిలోకి వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఎగువ నుంచి భారీ వరదను దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి పోలవరం ప్రాజెక్టు వద్దకు 10–12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద నీటి మట్టం 30.1 మీటర్లకు చేరింది. దీంతో మొత్తం 48 రేడియల్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా, ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా పనులు చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. గంటకు 25 సెంటీమీటర్ల చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో దిగువ కాఫర్ డ్యామ్, గ్యాప్–2 పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జల వనరుల శాఖ అధికారులు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. వరద ముప్పును తప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణ కంటే తుంగభద్రకే ఎక్కువ వరద కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, ఉప నదులు పోటెత్తాయి. కృష్ణా కంటే దాని ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. తుంగభద్ర డ్యామ్లోకి 91 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 101 టీఎంసీలు. దీంతో కొద్ది గంటల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆ వరద జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలానికి చేరుకుంటాయి. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టిలోకి 75 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ 79.74 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, దాని దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే మరో 55 టీఎంసీలు అవసరం. మరో రెండు రోజులు పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఆ రెండు జలాశయాలు నిండితే.. ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకోనుంది. తెలంగాణలోని మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో పులిచింతల్లోకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్రలోనూ వరదలు బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 4,135 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,343 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్టకు చేరుకుంటున్నాయి. దీంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 4,900 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 2,778 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు కాలువలకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న 2,307 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉరకలెత్తుతుండటంతో చెరువులు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నాయి. మరో 5 రోజులు వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో సగటున 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 9.2 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేటలో 8.2, ఎన్టీఆర్ జిల్లా అట్లప్రగడ కొండూరులో 8.1, ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి, కొయ్యలగూడెం, నూజివీడులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తిరువూరు, కుక్కునూరు, గజపతినగరం, భీమడోలు, దవళేశ్వరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ► ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, పడమటి వాగు, వైరా, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కట్టలేరు ఉధృతితో గంపల గూడెం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి, వరి పంటలకు ఊపిరి పోస్తున్నాయి. వరినాట్లు, పసుపు పంట వేసుకొనేందుకు ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరు, మోతుగూడెం పిక్నిక్ స్పాట్ సమీపంలో దుయం భారీ కొండ చరియలు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రానికి ఉద్యోగులు మరో మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్లారు. ఏపీ జెన్కో ఇంచార్జ్ సీఈ వెంకటేశ్వరరావు, ఈఈ బాబురావు కొండ చరియలు పడిన ప్రాంతాన్ని సందర్శించారు. రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. -
డ్రెడ్జింగ్, వైబ్రో కాంపక్షన్కు ఓకే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతికి కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఢిల్లీ–ఐఐటీ రిటైర్డ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కొలిక్కి తెచ్చింది. ప్రధాన డ్యామ్కు 6 కిలోమీటర్ల దిగువన పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక దిబ్బలను డ్రెడ్జింగ్ చేసి.. ప్రత్యేక పైపులైన్ ద్వారా కోతకు గురైన ప్రాంతంలో పొరలు పొరలుగా ఇసుకను పంపింగ్ చేసి, వైబ్రో కాంపక్షన్ చేయడం ద్వారా పటిష్టం చేయాలని కమిటీ నిర్ణయించింది. దీనిపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు ఈనెల 28న నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులో నిర్వహించే డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు. ఈ విధానం ద్వారా కోతకు గురైన ప్రాంతాన్ని వేగంగా çపూడ్చి.. ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను పూర్తి చేయకుండానే టీడీపీ సర్కారు కాఫర్ డ్యామ్లు, ప్రధాన డ్యామ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్–) పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది. దీంతో కాఫర్ డ్యామ్ల ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద ప్రవహించడంతో.. ఆ ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో 280 మీటర్ల పొడవున కోతకు గురై 12 మీటర్ల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. గ్యాప్–2లో 300 మీటర్లు, 425 మీటర్ల పొడవున 12 మీటర్ల లోతుతో మరో రెండు పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వీటిని పూడ్చే విధానంపై ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ రమణ, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ జానకిరామ్, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు 2020 నుంచే అధ్యయనం చేస్తున్నారు. డ్రెడ్జింగ్ చేస్తూ.. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పంపింగ్ చేసి.. వైబ్రో కాంపక్షన్ చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ విధానాన్ని డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు వ్యతిరేకించాయి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నీటిని తోడివేసి కోతకు గురైన ప్రాంతంలో ఇసుకను పోస్తూ.. వైబ్రో కాంపక్షన్ చేయాలని ప్రతిపాదిస్తున్నాయి. కానీ నీటిని తోడటానికి రూ.2,100 కోట్లకుపైగా ఖర్చవుతుంది. పైగా అత్యంత శ్రమతో కూడినది. ఇలా నీటిని తోడకుండానే డ్రెడ్జింగ్ ద్వారా గోతులు పూడ్చవచ్చునని ఈనెల 13న నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు వివరించారు. దాంతో ఆ విధానానికి సీడబ్ల్యూసీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గోతులు పూడ్చడానికి విధి విధానాలు రూపొందించాలని ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని 8 మంది సభ్యుల నిపుణుల బృందానికి సూచించింది. ప్రొఫెసర్ రాజు బృందం గత గురువారం, శుక్రవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించింది. నీటిని తోడకుండానే కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు విధి విధానాలు రూపొందించింది. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ పటిష్టతను పరీక్షించింది. కోతకు గురైన ప్రాంతంలో దానికి సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయడంపై కూడా అధ్యయనం చేసింది. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది. ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2,600 కుటుంబాలు తరలింపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. -
పోలవరంలో మరో కీలకఘట్టం పూర్తి
సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతితో పోటీ పడుతూ కరోనా ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. పోలవరం పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని ‘మేఘా’ సంస్థ పూర్తి చేసింది. 153.5 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు, 8.50 మీటర్ల వెడల్పుతో ఈ డ్యామ్ను నిర్మించారు. దీని నిర్మాణంలో సుమారు 23 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వినియోగించారు. నిర్మాణం పూర్తయిన కాంక్రీట్ డ్యామ్కు ప్రభుత్వ సలహాదారు (డిజైన్లు) గిరిధర్రెడ్డి, పోలవరం సీఈ సుధాకర్బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ తదితరులు గురువారం శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరిలో భూభౌగోళిక పరిస్థితుల వల్ల నదికి అడ్డంగా ఇసుక తిన్నెలపై ఈసీఆర్ఎఫ్, కుడి గట్టుపై స్పిల్ వే(కాంక్రీట్ డ్యామ్).. ఈసీఆర్ఎఫ్కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేలా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పోలవరం ప్రాజెక్టు డిజైన్ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారం స్పిల్వేను 1,118.4 మీటర్ల పొడవు, 55 మీటర్ల ఎత్తుతో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ను మూడు భాగాలుగా నిర్మించాలి. ఒక్కో లక్ష్యాన్ని అధిగమిస్తూ... పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు నిర్దేశించిన లక్ష్యాల్లో ఒక్కొక్కటీ అధిగమిస్తూ శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–3 పూర్తవడంతో స్పిల్వే నుంచి ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2లను అనుసంధానం చేయడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. దిగువ కాఫర్ డ్యామ్ పనులను కొలిక్కి తెస్తూనే ఈసీఆర్ఎఫ్ గ్యాప్–2లో ఇప్పటికే 11,96,500 క్యూబిక్ మీటర్ల మేర వైబ్రోకాంపాక్షన్ విధానంలో ఇసుక పొరలను పటిష్టం చేసే పనులు పూర్తి చేశారు. పూజలు నిర్వహిస్తున్న ప్రాజెక్టు సీఈ సుధాకర్ బాబు తదితరులు వరదలకు కోతకు గురైన ప్రాంతంలో 1,61,310 క్యూబిక్ మీటర్ల మేర శాండ్ ఫిల్లింగ్ (ఖాళీ ప్రదేశాలను ఇసుకతో నింపడం) పనులు పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1లో 400 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్(పునాది) పనులు పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1 నిర్మాణ ప్రాంతంలో ఇసుక పొరలను పటిష్టం చేసేందుకు స్టోన్ కాలమ్స్ పూర్తి చేశారు. ఈ పనుల్లో అత్యంత కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ వేగంగా జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడేసి ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2లలో రాతి మట్టికట్టల నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేస్తామని సీఈ సుధాకర్బాబు తెలిపారు. మట్టికట్ట స్థానంలో కాంక్రీట్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1లో 564 మీటర్లు, గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున రాతి మట్టికట్ట (ఈసీఆర్ఎఫ్), గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున మట్టికట్ట నిర్మించాలి. కానీ సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్రం ఏర్పాటు చేసిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) పోలవరం ప్రాజెక్టు భద్రత దృష్ట్యా గ్యాప్–3లో మట్టికట్ట స్థానంలో కాంక్రీట్ డ్యామ్ను నిర్మించాలని ప్రతిపాదించింది. దాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం 140 మీటర్ల పొడవున మట్టికట్ట స్థానంలో 153.5 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్ను నిర్మించారు. అంటే ఈసీఆర్ఎఫ్ పొడవు 2,454 మీటర్ల నుంచి 2,467.5 మీటర్లకు పెరిగినట్లు స్పష్టమవుతోంది. -
విస్తారంగా వర్షాలు.. గోదావరి ఉగ్రరూపం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరద ప్రవాహంతో పరుగులు తీస్తున్నాయి. ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 6.71 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవడంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి 9.60 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 5.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.80 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గురువారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 9 నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలంలోకి తగ్గిన వరద.. కృష్ణా బేసిన్లో వర్షపాత విరామం వల్ల కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలంలోకి 89,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 30 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 877.92 అడుగుల్లో 177.35 టీఎంసీల నీరుంది. సాగర్లోకి 12,200 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుదుత్పత్తి ద్వారా 10,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్లో 587.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 23,480 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వస్తున్న జలాలకు కట్టలేరు, మున్నేరు, వైరా ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,16,771 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 9,821 క్యూసెక్కులు వదిలి, మిగిలిన 1,06,950 క్యూసెక్కులను బ్యారేజీ 60 గేట్లను రెండడుగులు, 10 గేట్లను మూడడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళిలో పెరిగిన వరద వంశధార, నాగావళి నదుల్లో వరద మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 12,132 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్ట వద్దకు చేరుతున్న 7,400 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సోమశిల రిజర్వాయర్లోకి 25,613 క్యూసెక్కులు చేరుతుండగా 10,486 క్యూసెక్కులను కండలేరుకు, దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 71.51 టీఎంసీల నీరుంది. మరో 6.5 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. కండలేరులోకి 8,600 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 54.10 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 14 టీఎంసీలు అవసరం. -
Andhra Pradesh: పోలవరం.. శరవేగం
వాస్తవానికి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. గత ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం పట్టుబట్టి నిర్మాణ బాధ్యతలు భుజాలకెత్తుకున్నారు. ప్రణాళిక లోపంతో తూతూ మంత్రంగా అరకొరగా పనులు చేశారు. తదనంతరం బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత సర్కారు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేస్తూ.. ఆనక అతి కష్టంతో రీయింబర్స్ చేసుకుంటోంది. సకాలంలో నిధులు అందకపోయినా, కరోనా కకావికలం చేసినా.. రేయింబవళ్లు పనులను పరుగులు పెట్టిస్తోంది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: గోదావరి వరద ఉధృతితో పోటీ పడుతూ పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం రూ.2,300 కోట్లను రీయింబర్స్ చేయడంలో జాప్యం జరుగుతున్నప్పటికీ.. ప్రాజెక్టు పనులు నిర్విఘ్నంగా సాగడం కోసం రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన గడువు 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ వైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే.. మరో వైపు వరదల్లోనూ ఎగువ కాఫర్ డ్యామ్ను 43 మీటర్ల (42.5 మీటర్లు, 0.5 ఫ్రీ బోర్డ్) ఎత్తుతో అధికారులు పూర్తి చేశారు. రివిట్మెంట్ పనులు ఈనెల 10 నాటికి పూర్తవుతాయి. దిగువ కాఫర్ డ్యామ్లో 80 మీటర్లు మినహా 1,537 మీటర్ల పొడవున 20 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగింది. వరద ఉధృతి కాస్త తగ్గాక దిగువ కాఫర్ డ్యామ్లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసి.. 30.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నదిలో నిల్వ ఉన్న నీటిని తోడేసి.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్) పనులు చేపట్టి, 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలోనే భారీ సామర్థ్యంతో స్పిల్ వే గోదావరిపై పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 194.6 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తోంది. సాధారణంగా నదీ ప్రవాహానికి అడ్డంగా స్పిల్ వే (కాంక్రీట్ డ్యామ్)ను నిర్మిస్తారు. గోదావరిలో భూ భౌగోళిక పరిస్థితుల వల్ల నదీ గర్భంలో ఇసుక తిన్నెలపై నీటిని నిల్వ చేసేలా ప్రధాన డ్యామ్(ఈసీఆర్ఎఫ్)ను 2,454 మీటర్ల పొడవున నిర్మిస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ ప్రకారం గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దిగువకు విడుదల చేసేలా.. నది కుడి గట్టుపై 1,118.4 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మించేలా ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ సామర్థ్యంతో దిగువకు నీటిని విడుదల చేసే స్పిల్ వే ఇదే కావడం గమనార్హం. నది ఎడమ గట్టున 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని చేపట్టారు. కుడి కాలువ ద్వారా మూడు లక్షలు, ఎడమ కాలువ ద్వారా 4.2 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ రికార్డు సమయంలో స్పిల్ వే పూర్తి ► పోలవరం స్పిల్ వేను 1,118.4 మీటర్ల పొడవుతో 55 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. దీన్ని 53 బ్లాక్లుగా నిర్మించాలి. వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే 53 పియర్స్ (కాంక్రీట్ దిమ్మెలు)ను 55 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. స్పిల్ వే 54.5 మీటర్ల ఎత్తులో 192 గడ్డర్లను ఏర్పాటు చేసి వాటిపై 1118.4 మీటర్ల పొడవుతో స్పిల్ వే బ్రిడ్జిని పూర్తి చేశారు. ► స్పిల్ రివర్ స్లూయిజ్లకు పది గేట్లను బిగించారు. స్పిల్ వేకు 48 గేట్లకుగానూ 42 గేట్లను బిగించారు. వాటిని ఎత్తడానికి, దించడానికి వీలుగా 84 హైడ్రాలిక్ హాయిస్ట్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని బిగించారు. కరోనా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జర్మనీ నుంచి మరో 14 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల దిగుమతిలో జాప్యం వల్ల ఆరు గేట్లను బిగించలేకపోయారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు మూడు నెలల క్రితం వచ్చాయి. వరద తగ్గాక వాటితో మిగిలిన 6 గేట్లను బిగించనున్నారు. ► స్పిల్ వే నుంచి విడుదల చేసిన వరద జలాలను గోదావరి సహజ మార్గంలో కలిపేందుకు 2.92 కి.మీ. పొడవున వెయ్యి మీటర్ల వెడల్పుతో స్పిల్ చానల్ తవ్వాలి. దానికి కాంక్రీట్ లైనింగ్ చేయాలి. ఆ తర్వాత 1.5 కి.మీ. పొడవున వెయ్యి మీటర్ల వెడల్పుతో ఫైలట్ చానల్ తవ్వాలి. స్పిల్ వే కాంక్రీట్ పనులను దాదాపుగా పూర్తి చేశారు. ఫైలట్ చానల్ కూడా పూర్తి చేశారు. ► వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో అతి భారీ స్పిల్ వేను పూర్తి చేశారని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ► గోదావరి సహజ ప్రవాహ మార్గాన్ని స్పిల్ వే వైపు మళ్లించేందుకు సింగన్నపల్లి నుంచి స్పిల్ వే వరకు ప్రారంభంలో 500 మీటర్ల వెడల్పు, చివరకు వచ్చే సరికి వెయ్యి మీటర్ల వెడల్పుతో 2.18 కి.మీ. పొడవున అప్రోచ్ చానల్ తవ్వాలి. ఇందుకు 154.88 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలి. ఈ ఏడాది వరద ప్రారంభమయ్యేలోగా 112.48 లక్షల క్యూబిక్ మీటర్ల మేర అప్రోచ్ చానల్ తవ్వి.. జూన్ 11న గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించారు. జలాశయంగా రూపుదిద్దుకుంటున్న పోలవరం ► ఈసీఆర్ఎఫ్ను 2,454 మీటర్ల పొడవున మూడు భాగాలు (564 మీటర్ల పొడవున గ్యాప్–1.. 1,750 మీటర్ల పొడవున గ్యాప్–2.. 140 మీటర్ల పొడవున గ్యాప్–3) నిర్మించాలి. ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి వీలుగా.. దానికి 500 మీటర్ల ఎగువన 2,480 మీటర్ల పొడవుతో నదికి అడ్డంగా 43 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్.. 350 మీటర్ల దిగువన 1,617 మీటర్ల పొడవు, 30.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ► ఈ ఏడాది వరదలు ప్రారంభమయ్యే నాటికే 39 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్ను ప్రభుత్వం పూర్తి చేసింది. గోదావరి నది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో అప్పుడే పోలవరం జలాశయంగా రూపు మార్చుకుంది. జూన్ 11న సిల్ప్ వే మీదుగా వరదను మళ్లించాక.. గోదావరి వరదల్లోనూ ఎగువ కాఫర్ డ్యామ్ను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేశారు. దిగువ కాఫర్ డ్యామ్లో 1,617 మీటర్లకుగానూ 1,537 మీటర్ల మేర 20 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు. ► వరద తగ్గాక దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి.. వాటి మధ్యన ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులు చేపట్టనున్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు ఈసీఆర్ఎఫ్ గ్యాప్–3లో 140 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టి.. ఇప్పటికే ఒక కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్ఎఫ్ను 2022 నాటికి పూర్తి చేయనున్నారు. వడివడిగా కాలువలు, అనుసంధాన పనులు ► కుడి కాలువ పనులు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానం పనులను గతేడాదే ప్రభుత్వం పూర్తి చేసింది. ► ఎడమ కాలువలో మిగిలిన పనులను వేగవంతం చేసింది. జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానం పనులను కొలిక్కి తెచ్చింది. ► కుడి కాలువ కింద మూడు లక్షలు, ఎడమ కాలువ కింద 4.2 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను నిర్మించడానికి సర్వే పనులను పూర్తి చేసిన అధికారులు.. నవంబర్కు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి.. పనులు చేపట్టనున్నారు. వేగంగా విద్యుత్ కేంద్రం పనులు ► పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్లో ఈసీఆర్ఎఫ్కు ఎడమ వైపున జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెవాగాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ► పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా.. దిగువన ఏర్పాటు చేసిన కెప్లాన్ టర్బైన్స్పైకి పంపిస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ► ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్ టన్నెళ్లను తవ్వే పనులను వేగవంతం చేశారు. ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్భైన్లు ఏర్పాటు చేస్తారు. ► ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ చానల్ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను తిరిగేలా చేసి.. విద్యుదుత్పత్తి చేస్తారు. ► టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ చానల్ ద్వారా ఈసీఆర్ఎఫ్కు దిగువన నదిలో కలుపుతారు. ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ తయారు చేస్తోంది. ఈ విద్యుత్ కేంద్రంలో వినియోగిస్తున్న టర్బైన్లు ఆసియాలోనే అత్యంత పెద్దవి కావడం గమనార్హం. జల విద్యుత్ కేంద్రం టన్నెల్స్ తవ్వకం పనులు నిర్వాసితులకు పునరావాసంపై ప్రత్యేక శ్రద్ధ ► పోలవరం ప్రాజెక్టులో ఉభయ గోదావరి జిల్లాల్లో 371 గ్రామాలు ముంపునకు గురవుతాయి. గ్రామాల్లోని 1,05,601 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై టీడీపీ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదు. ► వైఎస్సార్సీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల పునరావాసం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తొలి దశలో 41.15 కాంటూర్ పరిధిలోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులు చేపట్టింది. ► ఇందులో ఇప్పటికే 6,314 కుటుంబాలకు పునరావాసం కల్పించింది. మిగిలిన 14,632 కుటుంబాలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ తర్వాత మిగిలిన 84,655 కుటుంబాలకు పునరావాసం కల్పించనుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రాజుపాలెంలో పూర్తయిన పునరావాస కాలనీ అది టీడీపీ సర్కార్ నిర్వాకం ► స్పిల్ వే పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాసం కల్పించాక.. ప్రదాన డ్యామ్ కట్టడానికి వీలుగా నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు కాఫర్ డ్యామ్ను నిర్మించాలి. కానీ.. గత టీడీపీ సర్కారు కమీషన్ల దాహం, అవగాహనా రాహిత్యం, ప్రణాళిక లోపంతో వరద మళ్లించే స్పిల్ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేసింది. ► వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే గోదావరికి అడ్డంగా 1,200 మీటర్ల పొడవున 28 నుంచి 33 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసింది. 2019, 2020లో సహజ ప్రవాహానికి కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో వరద నీటి మట్టం పెరిగి ముంపు గ్రామాల్లోకి ఎగదన్ని నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాఫర్ డ్యామ్ మీదుగా వరద ప్రవహించడం వల్ల ఈసీఆర్ఎఫ్ పునాది డయాఫ్రమ్ వాల్ కొంతమేర దెబ్బతింది. ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. ► స్పిల్ వేలో 53 బ్లాక్ల పియర్స్ను సగటున 22 మీటర్ల ఎత్తున చేసింది. 25.72 మీటర్ల ఎత్తు నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో స్పిల్ వేకు 48 గేట్లను బిగించాలి. వీటిని పరిశీలిస్తే టీడీపీ సర్కార్ ఐదేళ్లలో స్పిల్ వేను పునాది స్థాయిలోనే వదిలేసినట్లు స్పష్టమవుతోంది. కానీ.. 42, 43 పియర్స్ను 34 మీటర్ల ఎత్తు వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకును అడ్డుగా పెట్టి గేట్లు బిగించేసినట్లు 2018 డిసెంబర్ 24న అప్పటి సీఎం చంద్రబాబు డ్రామాలాడారు. ► నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు అప్రోచ్ చానల్ తవ్వకం పనులు చేపట్టలేదు. స్పిల్ చానల్ పనుల్లో మట్టి పనులు.. కొంత మేర కాంక్రీట్ పనులు చేసింది. జల విద్యుత్ కేంద్రం పనుల్లో పునాది పనులకుగాను కొండను 18 మీటర్ల మేర మాత్రమే టీడీపీ సర్కార్ తవ్వింది. ఇది నేటి ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి, రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లు ఆదా చేశారు. ప్రచారార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్ 14న, గత జూలై 19న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్వాసితుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పునరావాస కాలనీల్లో అన్ని వసతులతో విశాలమైన ఇళ్లను నిర్మించి.. నిర్వాసితులకు అందిస్తున్నాం. పరిహారాన్ని నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాం. 2019 నుంచి ఇప్పటి వరకు 6,314 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాం. ఏ ఒక్క నిర్వాసితుడూ ఇబ్బంది పడకుండా పునరావాసం కల్పిస్తున్నాం. – ఓ.ఆనంద్, అడ్మినిస్ట్రేటర్, పోలవరం. 2022లోగా పోలవరం పూర్తి వరదల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తున్నాం. రికార్డు సమయంలో స్పిల్ వేను పూర్తి చేశాం. ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేశాం. వరద తగ్గాక దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి.. ఈసీఆర్ఎఫ్ను చేపట్టి 2022లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆయకట్టుకు నీళ్లందించే పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. డిస్ట్రిబ్యూటరీలకు టెండర్లు పిలిచి.. ప్రణాళికాయుతంగా పూర్తి చేస్తాం. – సుధాకర్ బాబు, చీఫ్ ఇంజనీర్, పోలవరం. -
పులస.. తగ్గుతోంది వలస
సృష్టిలో ఏ జీవి అయినా సంతానోత్పత్తి కోసం పుట్టింటికే వెళుతుంది. సముద్ర జలాల్లో జీవించే ఇలసలు సైతం సంతానోత్పత్తి కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ పుట్టినిల్లయిన గోదావరి నదిలోకి చేరుకుంటాయి. గోదావరి నీటిలోని తీపిని ఆస్వాదిస్తూ.. నదిలోనే సంతానాన్ని వృద్ధి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవించి.. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానోత్పత్తి అనంతరం తిరిగి సముద్రంలోకి చేరుకుని ఇలసలుగా రూపాంతరం చెందుతాయి. ఇలస.. పులస అవుతుందిక్కడ ఆస్ట్రేలియా, థాయ్లాండ్ వంటి దేశాల్లోని సముద్ర జలాల్లో జీవించే ఈ అరుదైన చేప సంతానోత్పత్తి కోసం హిందూ మహాసముద్రాన్ని దాటి బంగాళాఖాతంలోకి చేరుకుంటుంది. ఆయా ప్రాంతాల్లో దీనిని హిల్సా, హిల్సా హెర్రింగ్, ఇలిషా పేర్లతో పిలుస్తారు. మన ప్రాంతంలో మాత్రం సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అంటారు. వేల కిలోమీటర్ల దూరాన్ని ఈదుకుంటూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి చేరుకుంటాయి. వరదల సమయంలో వచ్చే ఇలసలు ఎర్ర నీటిలోని తీపిదనాన్ని ఆస్వాదిస్తూ.. గోదావరి ప్రవాహానికి ఎదురీదుకుంటూ ముందుకొస్తాయి. ఈ నదిలోనే సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ క్రమంలో వాటి శరీరంలో మార్పులు సంభవిస్తాయి. తెల్లటి ఇలసలు కాస్తా ఎరుపు, గోధుమ వర్ణాలను సంతరించుకుని పులసలుగా మారతాయి. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో తిరిగి బంగాళాఖాతం గుండా హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోతాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిలో ఒక్కసారి మాత్రమే లభించే పులస ఉనికి కోల్పోతోందా. అవుననే అంటున్నారు మత్స్య రంగ నిపుణులు. గోదావరికి వరద (ఎర్ర నీరు) వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులస రాక దారుణంగా తగ్గిపోయింది. పులసల సీజన్ మొదలై రెండు నెలలు గడిచిపోయింది. చివరి దశకు చేరుతోంది. అయినా.. గోదావరిలో ఈ ఏడాది పులసల జాడ పెద్దగా కనిపించలేదు. గతంలో కేజీ నుంచి నాలుగైదు కేజీలుండే పులసలు లభించేవి. ఒక్కొక్కటీ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలికేవి. ప్రస్తుత సీజన్లో అరకిలో పులస దొరకడమే గగనమైపోయింది. తూర్పు గోదావరి జిల్లా యానాం, కోటిపల్లి, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, కేదార్లంక, పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, ఆచంట, యలమంచిలి మండలాల్లోని గోదావరి తీరంలో పులసలు విరివిగా దొరికేవి. ప్రస్తుతం ఎక్కడా వీటి జాడ కనబడటం లేదు. తగ్గడానికి కారణాలివీ.. ► సముద్ర ముఖ ద్వారాల నుంచి పులస గోదావరి నదిలోకి ప్రయాణిస్తుంది. అఖండ గోదావరి సముద్రంలో కలిసే ముందు ఏడు పాయలుగా విడిపోయింది. ప్రధాన పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి పాయల వద్ద ఉండే సముద్ర ముఖద్వారాల నుంచి ధవళేశ్వరం వరకూ సుమారు 60 కిలోమీటర్ల మేర గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. కృష్ణా, గోదావరి (కేజీ బేసిన్)లో చమురు కార్యకలాపాలు, ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో పులసలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి రావడం లేదు. ► గోదావరి, బంగాళాఖాతం కలిసే ముఖద్వారం వద్ద రిలయన్స్, ఓఎన్జీసీ, కెయిర్న్ ఎనర్జీ తదితర చమురు సంస్ధలు చమురు వెలికితీత పనులు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల సముద్ర జలాల్లో కంపనాల (వైబ్రేషన్స్)కు భయపడి పులసలు గోదావరి జలాల వైపు రావడం లేదు. ► మరోవైపు సముద్ర ముఖద్వారాల వద్ద ఇసుక మేటలు వేయడం కూడా వాటి రాకకు అడ్డుపడుతున్నాయి. ► గోదావరి పొడవునా రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి వేలాది ఎకరాల్లోని రొయ్యల చెరువుల సాగు వ్యర్థాలు నేరుగా గోదావరిలోనే కలుస్తున్నాయి. దాదాపు అన్ని నదీపాయల పరిధిలో రొయ్యల సాగు జరుగుతోంది. ఈ పాయల పరిధిలో డంపింగ్ యార్డులు కూడా ఉన్నాయి. ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్తో పాటు పటిక(అం) వినియోగిస్తారు. గోదావరి నుంచి ఈ అవశేషాలన్నీ సముద్రంలో కలుస్తుండటంతో పులస గోదావరిలోకి రావడం తగ్గిపోయింది. ► సముద్రంలో చేపల వేట విచక్షణా రహితంగా సాగటం కూడా పులస అంతరించిపోవడానికి మరో కారణం. కాలుష్యంతో పులస మనుగడకే ముప్పు గోదావరి నది కాలుష్యంతో పాటు విచక్షణా రహితంగా సాగుతున్న వేట వల్ల గోదావరి నదిలో పులసల సంఖ్య పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఆధునిక వలలతో లోతు జలాల్లో వేట సాగుతోంది. దీనివల్ల పులసల పునరుత్పత్తి తగ్గిపోతోంది. ఈ తగ్గుదల ఆందోళనకరంగా ఉంది. మత్స్యకారులకు సూచనలు చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. – పీవీ కృష్ణారావు,అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ చమురు కార్యకలాపాలూ ప్రధాన కారణం సముద్ర జలాల్లో చమురు కార్యకలాపాలే పులసల తగ్గుదలకు ప్రధాన కారణం. అధిక వేట, నీటి కాలుష్యం కూడా దీనికి కారణాలే. బ్రీడింగ్ సమయంలో వేట నిషేధం కఠినతరం చేయాలి. పరిశ్రమలు, పట్టణాల కాలుష్యం గోదావరిలోకి వదిలేయటాన్ని నివారించాలి. – డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జువాలజీ విభాగం యానాం -
శాంతించిన కృష్ణమ్మ.. శ్రీశైలంలోకి తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల(రెంటచింతల)/అచ్చంపేట/విజయపురి సౌత్: పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణమ్మ శాంతించింది. అధికారులు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తూ.. దిగువకు విడుదల చేసే నీటి పరిమాణాన్ని తగ్గిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్లోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో శ్రీశైలంలోకి వచ్చే వరద తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాల ద్వారా 1,77,321 క్యూసెక్కులను వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 29,792 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ గేట్లను మూసివేశారు. సాగర్ విద్యుత్కేంద్రాల ద్వారా దిగువకు 68,126 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈ నీటితో దిగువన టెయిల్పాండ్ను నింపుతున్నారు. నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 23,706 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగ నరసింహారావు మంగళవారం తెలిపారు. మొత్తం మీద పులిచింతలలోకి 51 వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతల గేట్లను కూడా అధికారులు మూసివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ఉధృతి కాస్త తగ్గింది. మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 2,05,689 క్యూసెక్కులు చేరుతుండగా.. 9,689 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేశారు. మిగులుగా ఉన్న 1.96 లక్షల క్యూసెక్కులను 70 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. జూన్ 1 నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు సుమారు 77 టీఎంసీల జలాలు సముద్రంలో కలవడం గమనార్హం. గోదావరిలోనూ వరద తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న నీటిని డెల్టాకు విడుదల చేయగా.. మిగులుగా ఉన్న 91 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
గోదావరిలో పెరిగిన వరద ఉధృతి
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: వర్షాల ప్రభావం వల్ల ఎగువన ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు 9.01 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్వే వద్ద నీటిమట్టం 32.94 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 10,14,385 క్యూసెక్కులు చేరుతుండటంతో వరద నీటిమట్టం 11.75 అడుగులు దాటింది. దాంతో ఆదివారం రాత్రి 7.30 గంటలకు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి డెల్టాకు 5,700 క్యూసెక్కులు ఇచ్చి మిగులుగా ఉన్న 10,08,685 క్యూసెక్కులు (87.16 టీఎంసీలు)ను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఆదివారం పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో వరద తగ్గుముఖం పడుతోంది. లంకల్ని చుట్టేస్తున్న వరద ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. పి.గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న కనకాయలంక కాజ్వే ఆదివారం వరద ఉధృతికి నీట మునిగింది. ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తుండటంతో అధికారులు పడవలు ఏర్పాటు చేశారు. జి.పెదపూడి రేవులో రహదారి కొట్టుకుపోవడంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి జిల్లాల సరిహద్దున గల అనగారలంక, పెదమల్లంలంక, సిర్రావారిలంక, అయోధ్యలంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 28, 252 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం పెరగడం లేదు. బుధవారం నాటికి శ్రీశైలంలో 843.7 అడుగుల్లో 67.84 టీఎంసీ లు నిల్వ ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం కూడా శ్రీశైలంలోకి ఇదే రీతిలో వరద కొనసాగే అవకాశం ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది అయిన తుంగభద్రలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. పులి చింతలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ వదిలేస్తున్న నీటికి.. స్థానికంగా కురిసిన వర్షాల వల్ల వస్తున్న ప్రవాహంతో కలిపి ప్రకాశం బ్యారేజీ లోకి 9,080 క్యూసెక్కులు వస్తోంది. ఇందులో 4,5 50 క్యూసెక్కులను సాగునీటి కాలువలకు ఇస్తూ.. మిగులుగా ఉన్న 4,530 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 66 వేల క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 59 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
పెరుగుతున్న గోదా‘వడి’
సాక్షి, అమరావతి: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమేణా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటిమట్టం 28.75 అడుగులకు చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,10,941 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 1,03,741 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. తెలంగాణలో బ్యారేజీలు నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగుల నుంచి కూడా భారీగా వరద గోదావరిలోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 21,082 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను వదిలేస్తుండటంతో.. ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడం లేదు. ప్రస్తుతం 806.89 అడుగుల్లో 32.53 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వర్షాల వల్ల వచ్చిన వరదకు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో పులిచింతల్లోకి 9,262 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 10,521 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతుండగా మిగులుగా ఉన్న 8,094 క్యూసెక్కులను 20 గేట్లు అర్ధ అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. -
గోదావరి వరద మళ్లింపు పనులు కొలిక్కి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే మీదుగా గోదావరి వరద మళ్లించే పనులు కొలిక్కివచ్చాయి. దీంతో ఎగువ కాఫర్ డ్యామ్ గ్యాప్–3లో ప్రవాహం దిగువకు వెళ్లేందుకు వదిలిన ఖాళీ ప్రదేశాన్ని అధికారులు వేగంగా భర్తీచేయిస్తున్నారు. నది నుంచి స్పిల్ వే వైపు వరదను మళ్లించేందుకు వీలుగా అప్రోచ్ చానల్ తవ్వకం పనులను వేగవంతం చేశారు. స్పిల్ వే 10 రివర్ స్లూయిజ్ గేట్లను ఇప్పటికే పూర్తిగా ఎత్తివేసిన అధికారులు.. శుక్రవారం స్పిల్ వేకు అమర్చిన గేట్లను ఎత్తే పనులు ప్రారంభించారు. ఈ సీజన్లో గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. వరద సమయంలోను కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనులు చేపట్టి 2022లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో 194.6 టీఎంసీలను నిల్వచేసే ప్రధాన డ్యామ్ ఈసీఆర్ఎఫ్ను నిర్మించాలంటే గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించాలి. ఇందుకు ఈసీఆర్ఎఫ్కు ఎగున, దిగువన కాఫర్ డ్యామ్లను నిర్మిస్తున్నారు. కాఫర్ డ్యామ్ల పనులు వేగవంతం గోదావరి డెల్టాలో రబీ పంటలకు నీరు సరఫరా చేయడానికి వీలుగా ఎగువ కాఫర్ డ్యామ్ రీచ్–3లో 300 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని శుక్రవారం యుద్ధప్రాతిపదికన భర్తీచేశారు. జూన్ నెలాఖరుకు 38 మీటర్ల ఎత్తుకు, జూలై నెలాఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు ఎగువ కాఫర్ డ్యామ్, 30 మీటర్ల ఎత్తుకు దిగువ కాఫర్ డ్యామ్ పూర్తిచేస్తామని సీఈ సుధాకర్బాబు తెలిపారు. శరవేగంగా అప్రోచ్ చానల్ పనులు నది నుంచి స్పిల్ వే వరకు 2.16 కిలోమీటర్ల పొడవున.. ప్రారంభంలో 500 మీటర్ల వెడల్పు, తర్వాత 550, 600, 650.. ఇలా స్పిల్ వే సమీపంలోకి వచ్చే సరికి 1,000 మీటర్లు వెడల్పు తవ్వేలా అప్రోచ్ చానల్ డిజైన్ను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) ఆమోదించడంలో తీవ్ర జాప్యం చేసింది. నెలన్నర కిందట ఆమోదించడంతో అప్రోచ్ చానల్ తవ్వకం పనులు ప్రారంభించారు. అప్రోచ్ చానల్లో 1.16 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులకుగాను ఇప్పటికే 66 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తిచేశారు. జూన్ నెలాఖరుకు అప్రోచ్ చానల్ పనులు పూర్తవుతాయి. ఆలోగా స్పిల్ చానల్ కూడా సిద్ధమవుతుంది. గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టి 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. పనులను పరిశీలించిన ఈఎన్సీ నారాయణరెడ్డి పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, కాఫర్ డ్యామ్, గేట్లు ఎత్తడం తదితర పనుల్ని శుక్రవారం ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట సీఈ ఎం.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ఎ.సతీష్బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి తదితరులున్నారు. వరద మళ్లింపునకు స్పిల్ వే సిద్ధం గోదావరి వరదను మళ్లించడానికి వీలుగా పోలవరం స్పిల్ వేను సిద్ధం చేస్తున్నారు. స్పిల్ వేకు ఇప్పటికే బిగించిన 10 రివర్ స్లూయిజ్ గేట్లను వరదను దిగువకు విడుదల చేయడానికి వీలుగా అధికారులు ఎత్తేశారు. ఇక స్పిల్ వేకు 48 గేట్లకుగాను 42 గేట్లను ఇప్పటికే బిగించారు. ఈ గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల చొప్పున 84 సిలిండర్లను బిగించారు. 2 గేట్లకు బిగించిన 4 హైడ్రాలిక్ సిలిండర్లను ఒక పవర్ ప్యాక్ను బిగించి, వాటిని కంట్రోల్ యూనిట్లతో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే 34 గేట్లకు పవర్ ప్యాక్లను బిగించి, వాటిని కంట్రోల్ యూనిట్లతో అనుసంధానం చేశారు. మిగిలిన గేట్లకు పవర్ ప్యాక్లను అమర్చుతూనే, ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధమైన గేట్లను వరదను దిగువకు విడుదల చేయడానికి 40 మీటర్లకు ఎత్తే పనులను శుక్రవారం ప్రారంభించారు. నెలాఖరునాటికి 42 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తేస్తామని అధికారులు తెలిపారు. జర్మనీలో కరోనా కట్టడికి సుదీర్ఘకాలం నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో 12 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల దిగుమతిలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 6 గేట్లను వచ్చే సీజన్లో అమర్చాలని అధికారులు నిర్ణయించారు. -
17,269 కుటుంబాలకు పునరావాసం
సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 90 గ్రామాలకు చెందిన 17,269 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సహాయ పునరావాస విభాగం, జలవనరులశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్దాస్ ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరులు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణశాఖ, సహాయ పునరావాస విభాగం ఉన్నతాధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. 90 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు 73 కాలనీలను నిర్మించాలని, ఇందులో 26 కాలనీలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయని, మిగిలిన 46 కాలనీలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్శాఖల నేతృత్వంలో చేపట్టిన పునరావాస కాలనీల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎస్ ఆదిత్యనాథ్దాస్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, గ్యాప్–3లో ఖాళీ ప్రదేశం భర్తీ పనులు కొలిక్కి వచ్చాయని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబు తెలిపారు. ఈనెల 25నాటికి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు. జూన్ నెలాఖరునాటికి కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయని, గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి అవసరమైన అన్ని పనులు పూర్తిచేస్తామని తెలిపారు. -
వరద గో'దారి' మళ్లింపు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వైపు గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే అప్రోచ్ చానల్ తవ్వకం పనులను జల వనరుల శాఖ అధికారులు వేగవంతం చేశారు. సుమారు కోటి క్యూబిక్ మీటర్ల మట్టి పనులను చేస్తే ఈ చానల్ పూర్తవుతుంది. ఈ మేరకు జల వనరుల శాఖ అధికారులు రూపొందించిన డిజైన్కు ఈనెల 23న డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం విధించిన గడువు మే లోగా పనులను పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. గోదావరి డెల్టాలో రబీ పంటలకు ఈ నెల 31 వరకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్ల ఇరు వైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తారు. గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటలకు జూన్ మొదటి వారంలో నీటిని విడుదల చేస్తారు. జూన్లోనే గోదావరికి వరద ప్రవాహం వస్తుంది. ఆలోగా స్పిల్వే, స్పిల్ చానల్ను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్పిల్వే వైపు ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ చానల్ను పూర్తి చేయాలి. కానీ ఇన్నాళ్లూ అప్రోచ్ చానల్ డిజైన్ను డీడీఆర్పీ ఆమోదించక పోవడంతో వాటి పనులను చేపట్టలేని పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఆ సమస్య లేనందున పనులు వేగంగా పూర్తి చేయనున్నారు. మొదట్లో అప్రోచ్ చానల్ను 550 మీటర్ల వెడల్పుతో 450 మీటర్ల పొడవున తవ్వితే సరిపోతుందని.. ఈ లెక్కన 50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి వస్తుందని లెక్క వేశారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదిక ఆధారంగా స్వల్ప మార్పు గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా స్పిల్వే వైపు మళ్లించడానికి అప్రోచ్ చానల్ను ఎలా తవ్వాలనే అంశాన్ని పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) శాస్త్రవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాయి. పీడబ్ల్యూపీఆర్ఎస్ ఆవరణలో ఎకరం విస్తీర్ణంలో 3–డీ పద్ధతిలో నమూనా పోలవరం ప్రాజెక్టును నిర్మించిన శాస్త్రవేత్తలు.. లక్ష క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చినప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో అంతే ఒత్తిడితో స్పిల్ వైపు నీటిని పంపింగ్ చేస్తూ.. అప్రోచ్ చానల్ తవ్వకంపై అధ్యయనం చేశారు. ఇందులో వెల్లడైన అంశాల ఆధారంగా నది నుంచి అప్రోచ్ చానల్ను ప్రారంభంలో 550 మీటర్ల వెడల్పుతో.. ఆ తర్వాత చానల్ వెడల్పును 600, 650, 700, 750, 800, 850, 900, 950 మీటర్లకు పెంచుతూ.. స్పిల్ వేకు సమీపంలో దానికి సమానమైన రీతిలో అంటే వెయ్యి మీటర్ల వెడల్పుతో తవ్వడం ద్వారా ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేయొచ్చని తేల్చారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన డీడీఆర్పీ.. ఆ నివేదికతో ఏకీభవించి, డిజైన్కు ఆమోద ముద్ర వేసింది. డిజైన్ మారిన నేపథ్యంలో అప్రోచ్ చానల్లో సుమారు కోటి క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు చేపట్టాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరద వచ్చేలోగా పనులు పూర్తి గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంటల సాగుకు నీటిని ఇవ్వాలన్నా, ఇటు వరద ప్రవాహాన్ని సులభంగా దిగువకు విడుదల చేయాలన్నా మే లోగా అప్రోచ్ చానల్ తవ్వకం పనులను పూర్తి చేయాలి. ఈ పనులను ఈనెల 24న ప్రారంభించారు. భారీ ఎత్తున ప్రొక్లెయిన్లు, టిప్పర్లను మోహరించిన కాంట్రాక్టు సంస్థ.. గడువులోగా పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. రోజుకు 1.50 లక్షల నుంచి 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వడం ద్వారా గడువు కంటే ముందే పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా జూన్లో వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. కాఫర్ డ్యామ్ల మధ్య ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను నిర్విఘ్నంగా చేపట్టడం ద్వారా ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నాయి. -
రేయింబవళ్లు.. పోలవరం పనులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మధ్యలో గోదావరి వరద ప్రవాహం స్పిల్వేలోకి వచ్చినా పనులను ఆపకుండా అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ సీజన్లో రెండుసార్లు వచ్చిన వరదతో స్పిల్ చానల్ మునిగిపోయింది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల ప్రవాహం స్పిల్వే నుంచి ప్రవహించింది. అయినా పనులను ఆపలేదు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పోలవరంలో 3,356 మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఏకకాలంలో భీమ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి.. ఒక వైపు నుంచి గేట్లు అమర్చుకుంటూ.. మరోవైపు నుంచి గడ్డర్లపై బ్రిడ్జి స్లాబ్ పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. 159 గడ్డర్ల నిర్మాణం పూర్తి స్పిల్వే పియర్స్ అన్నీ 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. మిగిలిన ఆరు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ఇప్పటివరకు 159 గడ్డర్ల నిర్మాణం పూర్తి కాగా మరో 33 గడ్డర్ల నిర్మాణం ఈ నెలాఖరుకు పూర్తవుతుంది. 37 గడ్డర్లను స్పిల్వే పియర్స్పై పెట్టగా మిగతా వాటిని మరో వారం నుంచి పెడతారు. మొత్తం 1,81,269 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఇంకా 87,940 క్యూబిక్ మీటర్ల పని ఉంది. స్పిల్వే పొడవు 1,050 మీటర్లు కాగా ఇప్పటివరకు 161 మీటర్లు బ్రిడ్జి కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 25 నుంచి గేట్ల అమరిక గేట్ల అమరిక ప్రక్రియను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 48 గేట్ల పనులు పూర్తవుతాయి. స్పిల్ చానల్లో రెండు నుంచి మూడు టీఎంసీల వరద నీటిని డిసెంబర్ 15 కల్లా తోడాక కాంక్రీట్ పనిని ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 1,12,116 క్యూబిక్ మీటర్ల స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఇంకా 5,17,967 క్యూబిక్ మీటర్ల పని ఉంది. స్పిల్ చానల్ మట్టి తవ్వకం పనులు 10,64,417 క్యూబిక్ మీటర్లు పూర్తి కాగా, ఇంకా 33,35,583 క్యూబిక్ మీటర్ల పనులు మిగిలి ఉన్నాయి. ఈ పనులను, ఎగువ కాఫర్ డ్యామ్ పనులను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సకాలంలో పూర్తి చేస్తాం పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని సీఎం కార్యాచరణను నిర్దేశించారు. ఈ మేరకు వర్షాలు, వరదల సమయంలో కూడా పనులు సాగుతున్నాయి. స్పిల్ చానల్లో చేరిన వరద నీటిని గోదావరిలోకి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నీటిని తోడగానే ఆ పనులు కూడా చేపడతాం. – నాగిరెడ్డి, ఎస్ఈ, పోలవరం. జూన్ నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పూర్తి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను వచ్చే జూన్ నాటికి పూర్తి చేసి.. తర్వాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులు ప్రారంభిస్తారు. జూన్ నుంచి గోదావరి నీటిని స్పిల్వే మీదుగా, స్పిల్ చానల్ నుంచి దిగువకు వెళ్లేలా చేయనున్నారు. స్పిల్ చానల్లో నిర్మించే బ్రిడ్జికి సంబంధించిన పియర్స్ పనులను త్వరలో చేపడతారు. గ్యాప్–3లో మట్టి తవ్వకం పనులు, కొండరాయి బ్లాస్టింగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభమయ్యే కాంక్రీట్ నిర్మాణ పనులను ఫిబ్రవరి నాటికి, పవర్హౌస్ మట్టి పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించారు. -
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పెన్గంగ, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 4,02,581 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.44 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 8 వేల క్యూసెక్కులు మళ్లించి.. 2.36 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాలో మరింత తగ్గిన ప్రవాహం ► కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్ల నుంచి, విద్యుత్ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 37,297 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 215.3263 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.90 అడుగులకు చేరుకుంది. రాయలసీమ ప్రాజెక్టుల నీటి వాటా విడుదల కోసం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ► నాగార్జున సాగర్లోకి 15,357 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి ప్రవాహం 2,500 క్యూసెక్కులకు తగ్గింది. ► ప్రకాశం బ్యారేజీలోకి 31,630 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు మళ్లించి.. 27,739 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
మానవతా దృక్పథంతో ఆదుకుందాం
వరద బాధితులకు తక్షణమే సాయాన్ని అందచేయాలి. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో ఉదారంగా వ్యవహరించాలి. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడవద్దు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని బాగా చూసుకోవాలి. వారి నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు. మూగజీవాల కోసం పశువుల దాణా కూడా అందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు బాధిత కుటుంబాలకు రూ.2,000 చొప్పున ప్రత్యేకంగా ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సాధారణంగా ఇచ్చే సాయానికి అదనంగా ఈ ప్రత్యేక ఆర్థిక సాయాన్ని తక్షణమే అందచేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గోదావరి వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్లకు సూచిస్తూ విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్షించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. దీన్ని మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని, ఖర్చు విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ముందు నిర్ణయించిన ప్రకారం స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి ఉన్నా భారీ వర్షాల నేపథ్యంలో దీన్ని మూడు జిల్లాలకే పరిమితం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. గోదావరి ముంపుపై క్యాంపు కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం జగన్ ► సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని బాగా చూసుకోవాలి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలపై ప్రత్యేకశ్రద్ధ వహించి పూర్తి స్థాయిలో సాయం అందించాలి. అధికారులంతా సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నమైనందున వరద పరిస్థితిని పరిశీలించేందుకు నేనే ఏరియల్ సర్వే నిర్వహిస్తా. అధికార యంత్రాంగం తమ పనులను యథావిధిగా కొనసాగించాలి. ► వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా చేసి వారు ఇచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలి. ఇందుకోసం ఒక అధికారిని నియమించాలి. ఒక్క ఫిర్యాదూ రాకూడదు.. ► సహాయక శిబిరాల్లో ఉన్నవారి నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు. శిబిరాల పర్యవేక్షణ బాధ్యతను జేసీకి అప్పగించాలి. శానిటేషన్, ఆహారం, వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. సహాయక చర్యల కోసం అవసరమైతే మరికొంత మంది ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. ► రేషన్ సరుకుల సరఫరాలో ఏ లోటూ ఉండకూడదు. మూగజీవాల కోసం పశువుల దాణా కూడా అందించాలి. తగ్గాక మరో పోరాటం.. ► వరద తగ్గిన తర్వాత మరో పోరాటం చేయాల్సి ఉంటుంది. ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహించాలి. తాగునీటిని క్లోరినేషన్ చేయాలి. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. రోగాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి. ► వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలి ► భద్రాచలంలో క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. మంగళవారం రాత్రి కల్లా గోదావరిలో వరద 17 లక్షల క్యూసెక్కులకు తగ్గవచ్చని అంచనాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం 12 లక్షల క్యూసెక్కులకు, గురువారం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉంది. ► సహాయక శిబిరాల్లో కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని, చింతూరు లాంటి సుదూర లంక గ్రామాల్లో చిక్కుకున్నవారికి పాలు, కూరగాయలు సరఫరా చేస్తున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. 95 శిబిరాల్లో 14,477 మంది ► తూర్పుగోదావరి జిల్లాలో 95 సహాయక శిబిరాల్లో 14,477 మందికి వసతి కల్పించామని, 105 గ్రామాలలో వరద ప్రభావముందని, 77 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, ఆయా గ్రామాలలో 30 వేల కుటుంబాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో 26 శిబిరాలు నిర్వహిస్తుండగా 5 వేల మంది వసతి పొందుతున్నారని అధికారులు తెలిపారు. 71 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా, ఆయా గ్రామాలలో 10 వేల కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. సహాయ పనుల కోసం లాంచీలు, బోట్లు వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల మంచినీటి ప్యాకెట్లు ఇచ్చామని, గిరిజనులకు లాంచీలలో కూరగాయలు సరఫరా చేశామని తెలిపారు. సీఎం సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్తోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలకు ఆదేశం రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో సమీక్ష సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వరద ముంపు బాధితులను ఆదుకోవడంలో ఎలాంటి జాప్యం చేయకుండా పక్కా ప్రణాళికతో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాలను మంగళవారం ఏరియల్ సర్వే ద్వారా సీఎం జగన్ పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గ్రామాలతోపాటు కోనసీమ లంక ప్రాంతాలను ఏరియల్ సర్వేలో వీక్షించారు. అనంతరం రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులో కలెక్టర్ మురళీధర్రెడ్డి, ఇతర అధికారులతో సహాయక చర్యలపై సమీక్షించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో నీటమునిగిన పంట పొలాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలి: సీఎం ► వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణమే ప్రతి గ్రామంలో విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలి. శానిటేషన్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన పది రోజుల్లోగా రోడ్లు, కమ్యూనికేషన్ ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులోకి రావాలి. ► విలీన మండలాలు, కోనసీమ లంక ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలనుఈ సందర్భంగా కలెక్టర్ సీఎంకు వివరించారు. సీఎం వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ తదితరులున్నారు. -
గోదావరి వరద బాధితులకు రూ. 2 వేల సాయం
సాక్షి, అమరావతి : ఉభయ గోదావరి జిల్లాల వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయక చర్యలలో పాల్గొంటూనే బాధితులను గుర్తించాలని గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. వరద బాధితులకు సహాయం చేసే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. చదవండి : గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే -
గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
-
గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ ఆయన అన్నారు. చదవండి : వరద పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ -
గోదావరి వరద పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
వరద పరిస్థితులపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ‘‘అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని’ సీఎం జగన్ తెలిపారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సీఎం స్పష్టం చేశారు. ‘‘వరద సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయండి. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వారు ఇచ్చే సమాచారం తీసుకోవడంపై ఒక అధికారిని కూడా పెట్టండి. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించండి. ఈ రాత్రికి 17 లక్షల క్యూసెక్కులకు, రేపు ఉదయానికి 12 లక్షల క్యూసెక్కులకు, ఎల్లుండికి 8 లక్షల క్యూసెక్కులకు వరద తగ్గుతుందన్న సమాచారం వస్తోంది. వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
ప్రమాద హెచ్చరికలు మూడే మూడు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి వరదల సీజన్ ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వరద ఉధృతిని అంచనా వేసి, అప్రమత్తం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు 3 ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తుంటారు. మొదటి ప్రమాద హెచ్చరిక : 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. నీటిపారుదల, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేస్తారు. ఏటిగట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. రెండో హెచ్చరిక : 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ 13.75 అడుగులకు నీటిమట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వెంటనే వరదకు సంబంధించిన అధికారులు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులకు హాజరవుతారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలు చేపడతారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కలిసి ఇరిగేషన్ అధికారులు పనిచేస్తుంటారు. మూడో హెచ్చరిక : 18 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలు విడుదల చేస్తూ నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. వెంటనే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా లంక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పటిష్ట చర్యలను చేపడతారు. గోదావరిలో అన్ని రకాల పడవలు, పంట్ల రాకపోకలపై పూర్తి నిషేధం ఉంటుంది. -
వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలి
సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ముమ్మరంగా సహాయక కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని పేర్కొన్నారు. గోదావరి వరదలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్, పశ్చిమ గోదావరి కలెక్టర్ ముత్యాలరాజుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్ను కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటు రాకూడదు: సీఎం జగన్ ► వరద బాధితులకు సహాయక శిబిరాల్లో సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బంది, లోటు రాకుండా చర్యలు తీసుకోవాలి. మంచి భోజనం అందించాలి. నిత్యావసర సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► వరద ఉన్నంతకాలం నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. సీఎంవో అధికారులు పాల్గొనగా ఎమ్మెల్యే బాలరాజు వీడియో కాన్ఫరెన్స్ద్వారా హాజరయ్యారు. 20 లక్షల క్యూసెక్కుల వరద అంచనా: తూర్పుగోదావరి కలెక్టర్ మురళీధర్ ► గోదావరి వరద ప్రవాహంతో దాదాపు 5 బ్రిడ్జిలు మునిగిపోయాయి. 13 మండలాల్లో వరద ప్రభావం ఉంది. 161 గ్రామాలలో ముంపు పరిస్థితి నెలకొంది. అమలాపురంలో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 20 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వస్తుందనే అంచనాతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం. ఇప్పటివరకూ 63 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశాం. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ► శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచాం. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే వచ్చాయి. నిత్యావసర సరుకులు, వస్తువులు తరలించడానికి, ఇతరత్రా అవసరాల కోసం 14 లాంచీలు సిద్ధం చేశాం. మరో 86 బోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనా వేస్తాం. 30 గ్రామాల్లో ప్రభావం: పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ► పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి 7 మండలాల్లో 30 గ్రామాల పరిధిలో వరద ప్రభావం ఉంది. ముంపు గ్రామాల నుంచి బాధితులను తరలించాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మూడుచోట్ల సిద్ధం చేశాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు అందుబాటులో ఉన్నాయి. పాము కాటు బాధితుల కోసం మందులు సిద్ధంగా ఉంచాం. ► పోలవరం వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న నాలుగు చోట్ల ఇసుక బస్తాలతో పటిష్టంచేశాం. గట్టుకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. -
వారి పట్ల ఉదారంగా వ్యవహరించండి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముంపు బాధితులను ఆదుకోవడంతో ఉదారంగా వ్యవహరించాలని, ఖర్చుకు వెనకాడవద్దని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కోవిడ్ను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణా బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు. గోదావరి వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. (చదవండి : డిజిటల్ పేమెంట్స్ను ప్రారంభించిన సీఎం జగన్) గోదావరి వరద, దీని వల్ల తలెత్తిన పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. దాదాపు 5 బ్రిడ్జిలు మునిగిపోయాయని, 13 మండలాల్లో వరద ప్రభావం ఉందని, 161 గ్రామాలలో ముంపు పరిస్థితి ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వివరించారు. అలాగే దిగువన అమలాపురంలో మరో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. 20 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వస్తుందనే అంచనాతో అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటి వరకూ 63 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ను కూడా దృషిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సహాయ శిబిరాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. అవసరమైన వారందరికీ కోవిడ్ టెస్టులు చేస్తున్నామని, మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు వస్తున్నందువల్ల వీలైనన్ని శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే వచ్చాయని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. నిత్యావసర సరుకులు, వస్తువులు తరలించడానికి, ఇతరత్రా అవసరాల కోసం 14 లాంచీలు సిద్ధం చేశామని, మరో 86 బోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వరదల వల్ల ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనా వేస్తామన్నారు. సహాయ శిబిరాల్లో సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మంచి భోజనం అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి 7 మండలాల్లో 30 గ్రామాల పరిధిలో వరద ప్రభావం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు చెప్పారు. పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మూడు చోట్ల సిద్ధం చేశామన్నారు. ముంపు గ్రామాల నుంచి వృద్ధులను, గర్భవతులను తరలించామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు సిద్ధం చేశామని, పాముకాట్లు ఉంటాయి కాబట్టి.. కావాల్సిన మందులన్నీ అందుబాటులో ఉంచామన్నారు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనా వేస్తామన్నారు. పోలవరం వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న నాలుగు చోట్ల ఇసుక బస్తాలతో పటిష్టం చేశామని, గట్టుకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. వరద ఉన్నంత కాలం నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్టుగా కలెక్టర్లు చెప్పారు. కార్యక్రమంలో సీఎంఓ అధికారులు పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్స్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు హాజరయ్యారు. -
అనుసంధానంతో సస్యశ్యామలం
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను గరిష్ఠంగా ఒడిసి పట్టి, కనిష్ఠ వ్యయంతో తక్కువ సమయంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలించడంపై సమగ్రంగా అధ్యయనం చేసి.. నెలలోగా నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖాధికారులను ఆయన ఆదేశించారు. పోలవరంతోపాటు వెలిగొండ, వంశధార, తోటపల్లి తదితర ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టుల కాలువల విస్తరణతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులను చేపట్టి శరవేగంగా పూర్తిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. పోలవరం, గండికోట, వెలిగొండ ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు తదితరులతో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ సామర్థ్యాన్ని మరో రెండు టీఎంసీలకు పెంచి, రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరి వరద జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్కు తరలించి.. అక్కడి నుంచి బీసీఆర్ (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)లోకి తరలించే ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగంగా నదుల అనుసంధానం.. తక్కువ ఖర్చుతో గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం.. అధికంగా జలాల తరలింపు.. శరవేగంగా పనులు పూర్తయ్యే మార్గాలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ విస్తృతంగా చర్చించారు. పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి తరలించే గోదావరి జలాలను.. అక్కడ నుంచి ‘రివర్స్ పంపింగ్’ ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి.. మళ్లీ అక్కడి నుంచి టెయిల్ పాండ్లోకి.. ఆ తర్వాత సాగర్లోకి.. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోసే అంశంపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు వైఎస్ జగన్ సూచించారు. నదిలో జలాలను తరలించడంవల్ల భూసేకరణ సమస్య ఉత్పన్నం కాదని.. దీనివల్ల వ్యయం కూడా తగ్గుతుందన్నారు. దీనిపై నెలలోగా నివేదిక ఇవ్వాలని.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పారు. కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గుతున్న నేపథ్యంలో.. ఆ జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలకు గోదావరి జలాలను తరలించి.. కరువురహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పోలవరం నిధులు రాబట్టండి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.1,850కోట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సోమవారం చేరాయని, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన మిగిలిన రూ.3,823 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోదం ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి, పోలవరానికి నిధులు రాబట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం చెప్పారు. అలాగే, జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. పోలవరం, గండికోట, వెలిగొండ, సీబీఆర్ (చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) తదితర ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రాజెక్టుల పనులను క్షేత్రస్థాయిలో తాను పరిశీలిస్తానని, ఇందులో భాగంగా ఈనెల 19న వెలిగొండ ప్రాజెక్టు.. 27న పోలవరం పనులను తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కరువు నివారణకు రూ.33,869 కోట్లు కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో ఆ వరద జలాలను ఒడిసి పట్టేలా రాయలసీమ ప్రాజెక్టుల కాలువల సామర్థ్యాన్ని పెంచడం.. కరువు నివారణ పనులకు రూ.33,869 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని సీఎం వైఎస్ జగన్కు అధికారులు వివరించారు. దీంతో ఆ పనులకు పరిపాలన అనుమతులిచ్చి.. టెండర్లు పిలవాలని ఆయన ఆదేశించారు. అలాగే.. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి.. కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మంది ప్రజల దాహార్తి తీర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యత ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.15,488 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని అధికారులు వివరించగా.. ఈ పనులూ చేపట్టడానికి అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు నీటిని తరలించే నిమిత్తం పైప్లైన్ వేయడానికీ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. -
డీపీఆర్ ఇస్తే నిధులు!
సాక్షి, అమరావతి: సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గోదావరి–కృష్ణా (బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్)– పెన్నా నదుల అనుసంధానానికి నిధులివ్వాలంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ చేసిన వి/æ్ఞప్తిపై కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పంపితే పరిశీలించి నిధులిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులతో జల్ శక్తి అభియాన్, సాగు, తాగునీటి ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్ తదితర పథకాలపై గజేంద్రసింగ్ షెకావత్ సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు దీనికి హాజరయ్యారు. మూడు రాష్ట్రాలకు ప్రయోజనం గోదావరి నుంచి ఏటా సగటున 2,500 టీఎంసీలకుపైగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. నీటి లభ్యత నానాటికీ తగ్గుతుండటం, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం గోదావరి–కృష్ణా–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని నిర్ణయించిందని చెప్పారు. డీపీఆర్ రూపకల్పన బాధ్యతను వ్యాప్కోస్కు అప్పగించామన్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం వల్ల తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు ప్రయోజనం చేకూరుతుందని, ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వాటర్ గ్రిడ్కు సహకారం.. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికీ రోజూ పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు నీటిని అందచేసే వాటర్ గ్రిడ్ పథకానికి నిధులివ్వాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ కోరారు. అయితే 55 లీటర్ల నీటి సరఫరాకు అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం ఇస్తుందని, అంతకంటే ఎక్కువ పరిమాణంలో నీటిని అందించడానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుందని గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేయాలని వ్యయం తగ్గుతుందని సూచించారు. వాటర్ గ్రిడ్కు అవసరమైతే విదేశీ ఆరి్థక సంస్థల ద్వారా రుణం అందించేందుకు సహకరిస్తామని చెప్పారు. త్వరలో మిగతా నిధులు.. పోలవరానికి మిగతా రూ.3,222.75 కోట్లను కూడా రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి టి.రాజేశ్వరిని మంత్రి అనిల్కుమార్ యాదవ్, ఆదిత్యనాథ్ దాస్ కోరారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని, త్వరలోనే నిధులు విడుదలయ్యేలా చూస్తామని టి.రాజేశ్వరి పేర్కొన్నారు. భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికి సంబంధించి రూ.రెండు వేల కోట్ల బిల్లులను మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. -
గోదావరి జిల్లాలకు రూ. 10 కోట్ల వరద సాయం
సాక్షి, అమరావతి: ఉభయ గోదావరి జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలకు ప్రత్యేక సాయంగా రూ. 10 కోట్ల 9 లక్షల 20వేలను విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన కుటుంబాలకు రూ. 5వేల చొప్పున సాయం అందజేసేందుకు ఈ నిధులను మంజూరు చేసింది. వరదల కారణంగా ఒకవారంపాటు నీటిలో మునిగిపోయి ధ్వంసమైన, శిథిలమైన ఇళ్లకు సాయంగా రూ. 5 వేల చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం అందించనుంది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా.. రూ. 2,87,45,000 పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించింది. వరద బాధితులను తక్షణమే ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిధులను విడుదల చేసింది. వరదల కారణాంగా నష్టపోయిన బాధితులను గుర్తించి వారికి సాయం అందజేయాలని, నిబంధనలకు అనుగుణంగా ఈ సాయం అందుకునే లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. -
గ్రామాలను చుట్టుముట్టిన వరద
-
ఉధృతంగా గోదావరి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల నుంచి వస్తున్న వరద నీటితో ఇంకా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం భద్రాచలం వద్ద 51.2 అడుగులకు చేరిన నీటి మట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి సోమవారం సాయంత్రానికి 48.50 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద రాత్రి ఏడు గంటలకు 15.20 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నానికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశం ఉందని, అప్పటి వరకూ వరద పరిస్థితి కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నుంచి 14,81,674 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకూ గోదావరి జలాలు 2,479 టీఎంసీలు కడలి పాలయ్యాయి. సోమవారం 128 టీఎంసీలు సముద్రంలో కలసిపోయాయి. ముమ్మరంగా సహాయక చర్యలు తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లాలో వేలేరుపాడు, కుకునూరు, వీఆర్పురం మండలాలు వరద నీటిలో ఉన్నాయి. ఆ జిల్లాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. వీరవరంలో రెండు, చింతూరులో ఒకటి, రాజమహేంద్రవరంలో ఒకటి మొత్తం నాలుగు బృందాలతో ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టింది. రంపచోడవరం కేంద్రంగా 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, 90 మంది సిబ్బందితో కూడిన అగ్నిమాపక శాఖ విభాగం వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో మూడోసారి వరదలతో ఉభయ గోదావరి జిల్లావాసులకు కంటిపై కునుకులేకుండా పోతోంది. పోలవరం కాఫర్ డ్యామ్ కారణంగా దేవీపట్నం పరిసర గ్రామాలను వరద ముంచేసింది. దేవీపట్నం పరిసర 36 గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. నీట మునిగిన దేవీపట్నం దేవీపట్నం ప్రధాన రహదారి నీట మునిగింది. చినరమణయ్యపేట–దేవీపట్నం, దండంగి–పురుషోత్తపట్నం రోడ్లు ముంపులో ఉండటంతో పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. పోసమ్మగండి వద్ద అమ్మవారి విగ్రహం నీట మునిగింది. దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లో 22 పాఠశాలలు మూతపడ్డాయి. బాధితులకు ప్రభుత్వ సిబ్బంది భోజనాలు పంపిణీ చేశారు. మూలపాడు, అగ్రహారం, పెనికలపాడు, కచ్చులూరు, ఏనుగులగూడెం, గానుగులగొంది తదితర గ్రామాల గిరిజనులు కొండలపై తలదాచుకున్నారు. చింతూరు వద్ద శబరి నదికి గోదావరి బ్యాక్ వాటర్తో చింతూరు–వీఆర్ పురం, ఆంధ్రా–ఒడిశాల మధ్య రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. విలీన మండలాల్లో 17 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. కూనవరం–భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధవళేశ్వరం దిగువున కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 2,500 ఎకరాల లంక భూముల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ ఎగువున కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. వరద ఉధృతి పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉప నదులైన భీమా, తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.34 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 884.60 అడుగులకు చేరుకుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 2.17 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. సోమవారం రాత్రి సాగర్ రెండు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్లో 587.90 అడుగుల్లో 306.04 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో 20 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 308.71 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. మంగళవారానికి ప్రకాశం బ్యారేజీ వద్దకు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. స్థిరంగా వంశధార.. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలో వరద ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 30,975 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ గొట్టా బ్యారేజీ నుంచి 53.31 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. తోటపల్లి ప్రాజెక్టులోకి నాగావళి వరద ప్రవాహం కొనసాగుతోంది. -
పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం
-
భద్రాచలంలో పెరిగిన గోదావరి వరద
సాక్షి, భద్రాచలం: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నాలుగు రోజులుగా వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 43 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ రజత్కుమార్ శైనీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు 51 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. రాత్రి 7 గంటలకు 50.06 అడుగులకు చేరింది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, చర్ల మండలం దండుపేట గ్రామాలకు చెందిన సుమారు 40 కుటుంబాల వారితో పాటు భద్రాచలంలోని కొత్తకాలనీ, రెవెన్యూ కాలనీ, సుభాష్నగర్ కాలనీల ప్రజలను సైతం అప్రమత్తం చేశా రు. కొందరిని భద్రాచలంలోని యూపీఎస్, నన్నపనేని మోహన్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రాలకు తరలించారు. 50 అడుగులు దాటినట్లు చూపుతున్న సూచిక స్లూయీస్ లీకులే కారణం..? భద్రాచలంలో కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన స్లూయిస్ లీకుల వల్లే గోదావరి వరద నీరు అయా కాలనీల్లోకి చేరింది. వాస్తవానికి గోదావరి వరద నీరు ఈ స్లూయీస్ల ద్వారా కాలనీల్లోకి వచ్చే సమయంలో మూడు మోటార్ల ద్వారా వరద నీటిని ఎప్పటికప్పుడు తోడి గోదావరిలోకి పంపా ల్సి ఉంది. అయితే ఈ మూడు మోటార్లలో రెండు పనిచేయక పోవడంతో అశోక్నగర్, కొత్తకాలనీల్లోకి స్లూయీస్ల ద్వారా వరద నీరు చేరిందని ఆయా ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన రాకపోకలు.. భద్రాచలం–వెంకటాపురం మార్గంలో ఎటపాక, కన్నాయిగూడెం వద్ద రహదారిని గోదావరి వరదనీరు ముంచెత్తడంతో ప్రయాణికులు మారాయిగూడెం మీదుగా ములకపాడుకు చేరుకొని అక్కడి నుంచి చర్లకు వెళుతున్నారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక, పర్ణశాల ప్రాంతాల్లోని రహదారిని కూడా వరదనీరు ముంచెత్తింది. చర్ల మండలంలోని కుదునూరు, సుబ్బంపేట గ్రామాల్లోని రోడ్లపై రెండు అడుగుల చొప్పున వరదనీరు చేరింది. చర్ల మండలంలోని కొత్తపల్లి–దండుపేట గ్రామాల మధ్యలో ఉన్న రహదారి పై ఆరు అడుగుల మేర వరదనీరు చేరడంతో ఈ మార్గంలో రెండు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి కూనవరం మీదుగా రాజమండ్రి వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. పోలీసులు సైతం ఆ మార్గాల్లో బస్సులను పంపవద్దని సూచించడంతో బూర్గంపాడు, కుక్కునూ రు మీదుగా సర్వీసులను దారి మళ్లించారు. -
మళ్లీ పోటెత్తుతున్న కృష్ణా, గోదావరి వరదలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో రాష్ట్రంలో నదులన్నీ మళ్లీ ఉగ్రరూపం దాల్చాయి. ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉప్పొంగడంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం సోమవారం ఉదయం 50.1 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద 11.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రవాహానికి కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడంతో నీటి మట్టం 28.12 మీటర్లకు చేరింది. దాంతో వరద దేవీపట్నం మండలాన్ని చుట్టుముట్టింది. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 30,463 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నేడు (సోమవారం) ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక విభాగాలతో సహాయక చర్యలు చేపట్టింది. కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణాలో వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఆల్మట్టి నుంచి రెండు లక్షలు, నారాయణపూర్ నుంచి 2.18 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.73 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.72 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయంలోకి 99 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.15 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది నుంచి సుంకేశుల బ్యారేజీలోకి 97,945 క్యూసెక్కులు వస్తుండగా.. 95,128 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 98 వేల క్యూసెక్కులు కిందకి విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్కు నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ గేట్లు ఎత్తి 49 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 30,896 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టు నుంచి 37,142 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ పులిచింతల ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేశారు. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులో కొంత ఖాళీ చేసి 45.62 టీఎంసీలు నిల్వ ఉంచి.. పైనుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 37,654 క్యూసెక్కులు చేరుతుండటంతో 16 వేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేసి.. మిగిలిన 12 వేల క్యూసెక్కులను పది గేట్లు తెరిచి దిగువకు విడుదల చేశారు. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజీలోకి 50 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉండటంతో.. అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉప్పొంగుతున్న వంశధార, నాగావళి ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార నది పోటెత్తింది. గొట్టా బ్యారేజీలోకి 50,981 క్యూసెక్కులు చేరుతుండగా.. 55,148 క్యూసెక్కులను 22 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. నాగావళి పరవళ్లు తొక్కుతుండటంతో తోటపల్లి బ్యారేజీ నుంచి ఐదు వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గత నెల రోజులుగా తోటపల్లి బ్యారేజీ గేట్లు ఎత్తి ఉంచడం విశేషం. జల దిగ్బంధంలో లంక గ్రామాలు.. గోదావరి ఉధృతిలో తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 82 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద గోదావరి దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలను ముంచెత్తింది. వరద కారణంగా విలీన మండలాల్లోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కడలి వైపు పరుగులు తీస్తున్న గోదావరి కోనసీమ లంక గ్రామాలను కూడా ముంచెత్తుతోంది. గోదావరి పాయలైన గౌతమి, వైనతేయ, వశిష్ట పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమలోని 16 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోటిపల్లి మధ్య గౌతమీ గోదావరిలో వరద ఉధృతి మరీ ఎక్కువగా ఉండడంతో ఆ నదీపాయపై జరుగుతున్న రైల్వే వంతెన నిర్మాణ పనులు నిలిపివేశారు. వరద ఉధృతికి పోలవరం శివారు పాత పోలవరం వద్ద నెక్లెస్బండ్ కోతకు గురై నదిలోకి జారిపోతోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఆదివారం సాయంత్రానికి 36 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ముంపు గ్రామాల నుంచి ప్రజలను, పశువులను సురక్షిత ప్రాంతా లకు తరలిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉధృతంగా గోదావరి ప్రవాహం
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు/భద్రాచలంటౌన్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట తదితర ఏజెన్సీ మండలాలు అతలాకుతలమవుతున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం రాత్రి 9.1 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం ఉదయం 9.92 మీటర్లకు చేరింది. శనివారం 8.5 మీటర్లకు నీటిమట్టం చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఆదివారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం 10.9 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ముల్లకట్ట వద్ద 75 మీటర్ల ఎత్తులో సుమారు 2 కిలోమీటర్ల వెడల్పుతో 163 జాతీయ రహదారిని తాకుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలంలోని రాంనగర్, పరిసర తండాలను గోదావరి వరద చుట్టుముట్టింది. రాంనగర్ వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పిల్లర్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడకు చెందిన 150 పశువులు వరదలో చిక్కుకోవడంతో వాటిని రైతులు తాళ్ల సహాయంతో బయటకు తీశారు. వెంకటాపురం మండలం బెస్తగూడెం సమీపంలోని గోదావరి లంకల్లో గొర్రెల కాపరులు, గొర్రెలు చిక్కుకున్నాయి. వెంకటాపురం సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు నాటు పడవల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 43 అడుగులు ఉన్న వరద రాత్రి 7 గంటలకు 50.06 అడుగులకు చేరింది. దీంతో ఒక్క రోజులోనే మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. జూరాలకు 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో గద్వాల టౌన్: కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రోజురోజుకూ వరద పెరుగుతోంది. దీంతో జూరాలకు ఆదివారం 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, సోమవారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 13 క్రస్టు గేట్లను ఎత్తి 1,32,853 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 34,422 క్యూసెక్కులను మొత్తం 1.72 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. -
రీ టెండరింగ్తో ప్రజాధనం ఆదా
సాక్షి, అమరావతి బ్యూరో: గోదావరి నదికి వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్ 1వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న నీటి ప్రవాహాన్ని శనివారం సాయంత్రం మంత్రులు అనిల్కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేషన్ పద్ధతిపైనే రూ.10,000 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించారని, ఇందులో భారీగా అవినీతి చోటుచేసుకుందని చెప్పారు. పోలవరంపై రీ టెండరింగ్ నిర్వహించడం వల్ల ప్రజాధనం మిగులుతుంది తప్ప వృథా కాదని స్పష్టం చేశారు. రీ టెండరింగ్ వల్ల బేసిక్ ప్రైస్ తగ్గుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంతి వైఎస్ జగన్ అమెరికా నుంచి గంటగంటకూ వరద పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారని, ఆయన సూచన మేరకు మంత్రులు, అధికారులూ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందజేస్తామన్నారు. అంటు వ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇదే వరద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్కు మతి భ్రమించిందని అనిల్కుమార్ విమర్శించారు. వారిద్దరూ ఎక్కడో కూర్చొని వరద విషయంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వరద నియంత్రణ చేతకాక 1998లో శ్రీశైలం పవర్ ప్రాజెక్టును ముంచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జలాశయాలు నిండి రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండడం చూసి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఇదే వరద టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినట్లయితే శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లను ఎత్తి జలహారతి పేరుతో రూ.100 కోట్లు దోచుకునేవారని దుయ్యబట్టారు. వరదను కూడా రాజకీయం చేస్తారా?:బొత్స వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వరదల కారణంగా కృష్ణా జిల్లాలో బాలిక మృతి చెందిందని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరదల విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వరదను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకు తగదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ముప్పు తప్పింది.. ముంపు మిగిలింది
సాక్షి, అమరావతి/అమలాపురం/కొవ్వూరు: గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఉభయ గోదావరి జిల్లాలకు ముప్పు తప్పింది. ఏజెన్సీ, లంక గ్రామాల్లో ముంపు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఆదివారం ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద 15,61,763 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు 9,21,396 క్యూసెక్కులకు తగ్గింది. తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 11.60 అడుగులకు దిగి రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికనూ ఎత్తివేశారు. సాయంత్రం 6 గంటలకు ఆనకట్ట వద్ద నీటిమట్టం 11 అడుగులుగా నమోదైంది. 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన వరద 54 గంటలపాటు కొనసాగింది. ఈనెల 7న ఉదయం 11 గంటలకు జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను నాలుగు రోజుల అనంతరం ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద సహజ ప్రవాహానికి కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడం వల్ల నీటిమట్టం తగ్గడం లేదు. గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లి కాజ్వే వద్ద శుక్రవారం గల్లంతైన షేక్ సమీర్బాషా (23), షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) మృతదేహాలను ఆదివారం ఉదయం వెలికితీశారు. ఇదిలావుంటే.. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలోని గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కోనసీమలోని పి.గన్నవరం మండలంలో ఆరు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు ఇంకా పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి రహదారిపై రెండడుగుల వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండల పరిధిలోని మూడు గ్రామాలకు ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరణ కాలేదు. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే వద్ద పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. పశ్చిమ పోలవరం మండలంలోని ముంపు గ్రామాలు, ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టింది. -
శాంతించి‘నది’
సాక్షి అమరావతి/రాజమహేంద్రవరం/ఏలూరు: ఎగువ ప్రాంతమైన భద్రాచలం వద్ద గోదావరి నది శాంతించినప్పటికీ.. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి శని వారం కూడా కొనసాగింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో 118 గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. శుక్రవారం పాశర్లపూడి కాజ్వేపై నుంచి వెళ్తుండగా వెళ్తుండగా గల్లంతైన షమీర్బాషా, రెహ్మాన్ అచూకీ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గాలించినా ఫలితం కనిపించలేదు. మరోవైపు పి.గన్నవరం మండలం మొండెపులంక సరిహద్దులో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన నేతల సుబ్బమ్మ (82) గల్లంతైంది. ఇంటి వెనుక గోదావరి పాయలో కాళ్లు కడుక్కుంటుండగా జారి పడిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం సాయంత్రం 6 గంటలకు 15.10 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 15.01 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. భద్రాచలం వద్ద 39.20 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. మురమళ్ల వద్ద వృద్ధగౌతమి పుష్కరఘాట్ వద్ద వరద నీరు చేరడంతో బోట్లు నిలిచిపోయాయి. పాశర్లపూడి బాడవలోని మల్లికార్జున స్వామి, కనకదుర్గమ్మ ఆలయంలోకి వరద పోటెత్తింది. పి.గన్నవరం మండలం నాగుల్లంక పుచ్చల్లంకలో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. యానాం బీచ్ రోడ్డు మునిగిపోయింది. విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్పురంలలో వరద తగ్గడంతో ఉపశమనం కలిగింది. చింతూరు మండలంలో వరద తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు మొదలు కాగా, ఒడిశాకు మాత్రం నిలిచిపోయాయి. వరద ప్రభావిత గ్రామాల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి శనివారం పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలంలో 31 గ్రామాలు నీట మునిగాయి. పోలవరం మండలంలోని 19 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 3 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ సూర్యనారాయణ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. నిడదవోలు మండలం పెండ్యాల, పందలపర్రు, పెరవలి మండలం కానూరు, కానూరు ఆగ్రహారం, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాల్లో లంక భూములు ఇంకా వరద నీటిలో నానుతున్నాయి. యలమంచిలి మండలం బాడవ, యలమంచిలి లంకల్లో రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దొడ్డిపట్ల, కనకాయలంక, లక్ష్మిపాలెంల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆచంట మండలం అనగారలంక, పెదమల్లంలంక, పుచ్చల్లంక, అయోధ్యలంక, భీమలాపురం కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది. 10 రోజుల్లో 1,100 టీఎంసీలు కడలి పాలు గోదావరి నది నుంచి పది రోజుల్లో 1,100 టీఎంసీల జలాలు ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిశాయి. అంటే.. రోజుకు సగటున 110 టీఎంసీల గోదావరి జలాలు కడలి పాలైనట్లు స్పష్టమవుతోంది. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు గొట్టా బ్యారేజీకి 17,645 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలారు. -
వాన కురిసె.. చేను మురిసె..
సాక్షి, అమరావతి: గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు తగ్గింది. గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడది 19 శాతానికి తగ్గిపోయింది. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో బుధవారానికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 17.54 లక్షల హెక్టార్లకు పెరిగింది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లు పుంజుకున్నాయి. గోదావరి వరద తాకిడికి గురైన ప్రాంతాలు మినహా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ నాట్లు జోరుగా పడుతున్నాయి. అలాగే విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాధారిత పంటలతోపాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ వరి నాట్లు ప్రారంభించారు. అయితే రాయలసీమ జిల్లాలు మాత్రం ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. నాలుగు రాయలసీమ జిల్లాలుసహా మొత్తం ఏడు జిల్లాలు బుధవారానికి 20 శాతం నుంచి 50 శాతం వరకు లోటు వర్షపాతంలో ఉన్నాయి. విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు సాధారణ స్థితిలో ఉండగా శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అదే జరిగితే పంటల సాగు విస్తీర్ణం వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని చేరుతుందని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరు రావడం ప్రారంభమైంది. ఈసారి శ్రీశైలం, సాగర్లు నిండేందుకు ఆస్కారం కనిపిస్తున్నందున సాగర్ కుడికాలువకు నీరిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తగ్గిన వర్షపాతం లోటు... ఈ ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మొత్తంగా 556 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటికి 275.4 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే 224.1 మిల్లీమీటర్లే కురిసింది. అయితే గత వారం 27 శాతం లోటు వర్షపాతం ఉండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పరిస్థితి మెరుగైంది. వర్షపాతం లోటు ప్రస్తుతం 19 శాతానికి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 38.30 లక్షల హెక్టార్లుగా ఖరారు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇప్పటికి 22.17 లక్షల హెక్టార్లు అంటే సుమారు 79 శాతం విస్తీర్ణంలో పంటలు వేసి ఉండాల్సింది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఇప్పటివరకు 17.74 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. వేసిన పంటల్లో ఎక్కువగా జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు వరి ఉంది. మొక్కజొన్న, రాగి, కంది, పత్తి, చెరకు వంటి పంటలైతే 75 శాతం వరకు వేసినట్టు వ్యవసాయ శాఖ లెక్కలేసింది. ఈ సీజన్లో ఇప్పటికి 7.44 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడాల్సి ఉండగా.. 6.33 లక్షల హెక్టార్లలో వేశారు. ఖరీఫ్లో మొత్తంగా 15.19 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగు చేయాలన్నది లక్ష్యం. ఇదిలా ఉంటే.. గోదావరి వరదలతో నీట మునిగి దెబ్బతిన్న వరి నారు మళ్లు తిరిగి పోసుకునేందుకు వీలుగా నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. గమనిక: +19 % నుంచి –19% వరకు ఉంటే సాధారణ వర్షపాతం కింద, +20%, ఆపైన ఉంటే అధిక వర్షపాతం కింద, –20 % నుంచి –59 % వరకు ఉంటే లోటు వర్షపాతం కింద, –59 % నుంచి –99 % వరకు ఉంటే భారీ లోటు వర్షపాతం కింద పరిగణిస్తారు) -
చంద్రబాబు చేసిన పాపాల వల్లే..
సాక్షి, రాజమహేంద్రవరం: వరద సహాయక చర్యలపై గతంలో టీడీపీ ప్రభుత్వం స్పందించిన తీరు, తమ ప్రభుత్వం స్పందించిన తీరుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి ఆళ్ల నాని అన్నారు. గోదావరి వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష ముగిసిన తర్వాత సహచర మంత్రులతో కలిసి ఆళ్ల నాని విలేకరులతో మాట్లాడారు. వరద సహయక చర్యలపై అధికారులను సీఎం జగన్ అభినందించారని తెలిపారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ అక్కనుంచి ఎప్పటికప్పుడు నేరుగా వరద పరిస్ధితులను సీఎం సమీక్షించారని వెల్లడించారు. అదనంగా గోదావరి వరద సహాయక చర్యలు అందించాలని సీఎం సూచనలు చేశారని.. గత ప్రభుత్వంలో ఇటువంటి ఆలోచన చేయలేదన్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 వేలు సహాయాన్ని అదనంగా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదల వల్ల పంట మునిగిన రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. పోలవరం కమీషన్ల కోసం చంద్రబాబు చేసిన పాపాల వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయని, ఎటువంటి ప్రణాళికలు లేకుండా నిర్వాసితులను తరలించకుండా పోలవరం హెడ్ వర్క్ పనులను చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాలను ప్రజలు అనుభవించాల్సి వస్తోందని ఆళ్ల నాని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం వద్ద 27.7 మీటర్ల వరద నీటి మట్టం ఉందని, నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. నిత్యావసర సరుకులు వరద బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని, వండిన ఆహార పదార్థాలు కూడా అందించామని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 4824 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. (చదవండి: పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే) -
‘బాధిత కుటుంబాలకు రూ. 5వేల అదనపు సహాయం’
సాక్షి, రాజమండ్రి : గోదావరి వరద ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయంతోపాటు అదనంగా రూ. 5వేల చొప్పున అందజేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఈ సహాయం కూడా అందనుంది. గురువారం ముంపు ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటీసీ టవర్ బిల్డింగ్లో సీఎం వైఎస్ జగన్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష నిర్వహించారు. దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఇళ్లు, పంటలు నష్టపోయినా వారికి నిబంధనల ప్రకారం అందే సాయం కాకుండా ప్రత్యేకంగా రూ. 5 వేల సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నట్టు తెలిపారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. అందుకోసమే రూ. 5వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ముంపుకు గురైన గ్రామాల్లోనే కాకుండా.. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు దెబ్బతింటే.. వారికి పరిహారంతో పాటు ఉచితంగా సబ్సిడీ విత్తనాలు అందజేయాలన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్కుమార్యాదవ్, రంగనాథరాజు, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కండపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలు అంశాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరిలో 10, 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదని.. కానీ ఈసారి వరద ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. కాఫర్ డ్యామ్ కారణంగా ముంపు పెరిగిందని వారు సీఎం జగన్కు వివరించారు. అయితే దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకోని.. అందుకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలోకి వచ్చే వరద, ముంపుకు గురయ్యే ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని.. ఆ మేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. త్వరగా ముంపుకు గురయ్యే ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలన్నారు. పోలవరం పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా, సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఒక ఐఏఎస్ను నియమిస్తున్నట్టు తెలిపారు. చదవండి : పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే -
వరద బాధితులకు తక్షణ సహాయం
సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో ఆలస్యం చేయవద్దని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై సోమవారం తాడేపల్లిలోని తన నివాసంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, హోం, విపత్తుల శాఖ మంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితర అధికారులతో సీఎం సమీక్షించారు. గతంలో ధవళేశ్వరం వద్ద 2, 3 ప్రమాద స్థాయి హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యేవని, ఇప్పుడు ఒకటో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరకముందే ముంపునకు గురయ్యాయని అధికారులు వివరించారు. దీనికి కారణాలేంటో అధ్యయనం చేసి తగు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. గడచిన 56 రోజుల్లోనే 500 టీఎంసీల జలాలు గోదావరి నది ద్వారా సముద్రంలోకి కలిసిపోయినట్టుగా అంచనా వేశామని అధికారులు తెలిపారు. వచ్చే 2 రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగే అవకాశాలున్నాయని, మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండడం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన లేదని, 3 రోజుల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. వరద బాధిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని సీఎం పునరుద్ఘాటించారు. సకాలంలో సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలని, తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఇసుక ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా గోదావరి నదికి వరద పోటెత్తుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) నిర్వహిస్తున్న ఇసుక రీచ్లు మూతపడ్డాయి. రీచ్లకు వెళ్లే రహదారులు బురదమయం కావడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో ఆన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలను టీఎస్ఎండీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. డిమాండ్కు అనుగుణంగా ఇసుక సరఫరా లేకపోవడాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండటంతో బహిరంగ మార్కెట్లో ఇసుక ధర అమాంతం పెరిగింది. గోదావరికి వరద ఉధృతి తగ్గి కొత్త రీచ్లు అందుబాటులోకి వస్తేనే ఇసుక సరఫరా మెరుగవుతుందని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. మూతపడిన రీచ్లు... రాష్ట్రంలో సుమారు 30 రీచ్ల ద్వారా టీఎస్ఎండీసీ ఇసుకను వెలికితీస్తూ సగటున రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్లైన్లో విక్రయిస్తోంది. టీఎస్ఎండీసీ వెలికితీస్తున్న ఇసుకలో 96 శాతం గోదావరి తీరంలోని పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలోని రీచ్ల నుంచే వస్తోంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతుండటంతో రీచ్లు మూత పడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆరు రీచ్లే పనిచేస్తున్నాయని టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గతంలో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మాత్రం ఇసుకను లోడ్ చేస్తున్నారు. అమాంతం పెరిగిన ధరలు... ఆన్లైన్లో టన్ను ఇసుకను రూ. 600 చొప్పున టీఎస్ఎండీసీ విక్రయిస్తుండగా రవాణా, ఇతరచార్జీలు కలుపుకొని సీజన్లో రూ. 1,250 నుంచి రూ. 1,500 వరకు ధర పలికింది. ప్రస్తుతం ఆన్లైన్లో ఇసుక విక్రయాలు నిలిచిపోవడంతో కొరతను దళారీలు సొమ్ము చేసుకుంటున్నారు. నాణ్యమైన ఇసుక ధర బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం టన్నుకు రూ. 2,200కుపైనే పలుకుతోంది. ముడి ఇసుక (కోర్ శాండ్) టన్నుకు రూ. 1,400 చొప్పున లభిస్తున్నా వినియోగదారులు ఫైన్ శాండ్ కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫైన్ శాండ్కు రాష్ట్రంలో ఉన్న కొరతను దళారీలు ఆసరాగా తీసుకుని ధరలు అమాంతం పెంచేశారు. గతేడాది అక్టోబర్లో ఆఫ్ సీజన్లో టన్ను ఇసుక రూ. 3వేలకుపైగా పలికిన విషయాన్ని వినియోగదారులు గుర్తుచేస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద నిండుకుంటున్న నిల్వలు వర్షాకాలం దృష్ట్యా టీఎస్ఎండీసీ స్టాక్ పాయింట్ల వద్ద కనీసం కోటి క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇసుక డిమాండ్ నేపథ్యంలో అబ్దుల్లాపూర్మెట్, భౌరంపేట, వట్టినాగులపల్లిలో సబ్ స్టాక్ పాయింట్లు ఏర్పా టు చేసింది. అయితే ప్రస్తుతం స్టాక్ పాయింట్ల వద్ద కేవలం రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలే ఉన్నాయి. అయితే మరో 2, 3 రోజుల్లో రీచ్ల సంఖ్య పెరగడంతోపాటు ములుగు, భద్రాచలం జిల్లాల్లో కొత్తరీచ్లు అందుబాటు లోకి వచ్చే అవకాశముందని టీఎస్ఎండీసీ వర్గా లు వెల్లడించాయి. ఇసుక రీచ్లు అందుబాటు లోకి వచ్చాకే అన్లైన్ విధానంలో ఇసుక విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముంది. -
గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: గోదావరి వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సీఎస్, ఆర్థిక మంత్రి, హోం మంత్రితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు ఉదారంగా సాయం చేయాలన్నారు. సహాయక చర్యల్లో జాప్యానికి వీల్లేదని హెచ్చరించారు. మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధరణ పరిస్థితులు తీసుకు రావాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని పేర్కొన్నారు. తాగునీటి కొరత లేకుండా, అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ సూచించారు. జగన్ను కలిసిన కియా ప్రతినిధులు అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటులో కొత్తకారు ఆవిష్కరణకు ఆహ్వానించడానికి కియా ప్రతినిధులు సోమవారం సీఎం జగన్ను కలిశారు. ఈ నెల 8న కియా కొత్త కారు ‘సెల్తోస్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కియా ఎండీ, సీఈవో కుక్ హ్యూన్ షిమ్, సీఏవో థామస్ కిమ్.. సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెనుగొండ ప్లాంటు ద్వారా ఏడాదికి 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయగలమని తెలిపారు. భవిష్యత్తులో ఏడు లక్షల కార్లు ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటామన్నారు. -
గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష
-
గోదావరి జిల్లాల్లో వరద భీభత్సం
సాక్షి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి : ఉభయ గోదావరి జిల్లాలు వరద ప్రభావంతో అల్లకల్లోలం అవుతున్నాయి. వదర నీరు నలువైపులనుంచి గ్రామాలను చుట్టుముడుతుండటంతో ప్రజలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో గోదావరి నదికి వరద రావడంతో లంక ప్రాంతాలలోకి నీరు చేరుకుంటోంది. వరదల ప్రభావంతో లంక ప్రాంతాలలో కూరగాయల తోటలు, వాణిజ్య పంటలు నీట మునిగాయి. అరటి, వంగ, కంద, మునగ, పచ్చిమిర్చి, బెండ, బీర పంటలు నీట మునగడంతో రైతుల గగ్గోలు పెడుతున్నారు. సీతానగరం మండలం బొబ్బిల్లంక దగ్గర వరద ఉధృతికి గోదావరి గట్టు కోతకు గురైంది. దీంతో అధికారులు ముందస్తుగా ఇసుక బస్తాలను వేశారు. గోదావరికి ఉధృతి పెరగడంతో బొబ్బిలంక-ములకల్లంక గ్రామాల మధ్య నాటుపడవల ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తీవ్రతని రామమండ్రి అర్బన్ ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని గోదావరి ఏటిగట్టు కోతకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. పల్లిపాలెంలో 63 ఇళ్లు నీట మునిగాయి. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. అంటువ్యాధులు సోకకుండా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ముంపు బాధితులు తక్షణమే పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు ఆదేశించారు. ఆలమూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీటమునిగాయి. దీంతో సహాయక కార్యక్రమాలను ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. బడుగు వాణి లంక, తోక లంక వరద ప్రభావిత గ్రామాలలో పర్యటించిన ఆయన.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైనచోట తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద పోటెత్తడంతో 4 నిర్వాసిత గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద చుట్టుముట్టడంతో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్న ప్రజలకు అధికారులు నిత్యవసర సరుకుల్ని పంపిణీ చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంచినీటి వసతితో పాటు మెడికల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడేవారిని లాంచీల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వరద ముంపు ప్రభావిత లంక గ్రామాలలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్టం రాజు, మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆచంట నియోజకవర్గంలోని పలు లంక గ్రామాల్లో పర్యటించి అక్కడున్న ఇబ్బందులను, పరిస్థితులను ప్రజలను అడిగి తెలుసుకున్నా రు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విలీనమండలాలను సైతం గోదావరి వరద వణికిస్తుంది. శబరితోపాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరుతోంది. చింతూరులో వీరాపురం వాగుపొంగడంతో రహదారిపైకి వరదనీరు వచ్చి చేరింది. ఆంధ్రా-ఒడిషాల మధ్య రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిగువన గోదావరి లంకల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. పి.గన్నవరం మండలంలో గంటి పెదపూడి వద్ద కాజ్వే కొట్టుకుపోయింది. కనకాయిలంక కాజ్వేతో పాటు సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం- అప్పనరాముని లంక మధ్యలో ఉన్న కాజ్ వే కూడా కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
గోదావరి వరదలతో గర్భిణుల అవస్థలు
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో వరదల కారణంగా గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులకు గురువుతున్నారు. వీఆర్ పురం మండలం వడ్డిగూడెం గ్రామంలోకి అధికంగా వరద నీరు చేరింది. అంతేకాకుండా కల్లేరు గ్రామాన్ని పూర్తిగా వరదనీరు చుట్టుముట్టింది. ఈ నేపథ్యంలో ఓ గర్భిణి చింతూరు ప్రభుత్వ వైద్యశాలలో చేరినా ఇంకా ప్రసవ సమయంల రాలేదని అక్కడి వైద్యులు ఆమెను ఇంటికి పంపించేశారు. నొప్పులు అధికం కావటంతో స్థానిక అంగన్వాడి కార్యకర్త సహాయంతో ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం లాంచీపై కల్లేరు గ్రామానికి వెళ్లిన వైద్యులు తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. కాగా ఒకవైపు వరదల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతుంటే మరోవైపు దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. -
ఉగ్ర గోదావరి కొనసాగుతున్న సహాయక చర్యలు
-
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
-
పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి : గోదావరికి వరదల నేపథ్యంలో పోలీస్ యంత్రాగం అప్రమత్తంగా ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, లోకల్ పోలీసులు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. శాటిలైట్ ఫోన్స్, డ్రోన్లతో పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ముందస్తు చర్యలలో భాగంగా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారంభించామన్నారు. కాగా ఇంతకు మునుపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోదావరి వరద ఉధృతిపై ఆరా తీశారు. ముంపు గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
గోదావరి వరద ఉధృతిపై సీఎం జగన్ ఆరా
-
గోదావరి వరద ఉధృతిపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి : గోదావరి వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమాచారం కోరారు. సీఎం కార్యాలయ అధికారులు.. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఉభయ గోదావరి ప్రాంత పరిస్థితులను వివరించారు. అధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. సీఎం జగన్ ముంపు గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామాగ్రి అందించాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.