
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ, ఉద్యానశాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి కన్నబాబు, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. పురుగు మందులు, ఎరువుల సరఫరా, దుకాణాల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూసార పరీక్షా పరికరాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం, వ్యవసాయం, విత్తనాల పంపిణి, గ్రామాల్లో ఏర్పాటు కానున్న వర్కషాపులు గురించి సీఎం ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment