విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని చెరువు గట్టుపై స్థలాన్ని ఆక్రమించి.. రాయి పినతల్లి అనే వ్యక్తి గృహనిర్మాణం చేపట్టడంతో ఆయకట్టు రైతులు శనివారం నుండి రిలే నిరాహార దీక్షలకు దిగారు.
రోలుగుంట : విశాఖ జిల్లా రోలుగుంట మండలంలోని చెరువు గట్టుపై స్థలాన్ని ఆక్రమించి.. రాయి పినతల్లి అనే వ్యక్తి గృహనిర్మాణం చేపట్టడంతో ఆయకట్టు రైతులు శనివారం నుండి రిలే నిరాహార దీక్షలకు దిగారు. రెండు రోజుల క్రితమే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఈ విషయమై ధర్నా కూడా చేశారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.