12 నుంచి సకలజనుల సమ్మె | Sakala Janula Samme 12th in Samaikya andhra | Sakshi
Sakshi News home page

12 నుంచి సకలజనుల సమ్మె

Published Tue, Aug 6 2013 4:11 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

రాష్ట్ర విభ జన ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే 12 అర్ధరాత్రి నుంచి సకలజనుల సమ్మెకు సిద్ధం కావాలని ప్రజలకు సమైక్యాంధ్ర

రాష్ట్ర విభ జన ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే 12 అర్ధరాత్రి నుంచి సకలజనుల సమ్మెకు సిద్ధం కావాలని ప్రజలకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డి.వి.కృష్ణయాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని పెన్నానది వంతెనపై సోమవారం సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహించారు.అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టారు.   కృష్ణయాదవ్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయని వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  సీమాం ధ్రుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్, అంజయ్య,  అరవింద్, శ్రీను, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement