కోదాడ డిపోలో పని చేస్తున్న పలువురు కార్మికులకు రెండు రోజులుగా ఓ అజ్ఞాతవ్యక్తి ఫోన్ చేసి మీ అకౌంట్లో ఏరియర్స్ వేస్తున్నాం.
సోమవారం ఓ కార్మికుడి ఖాతా నుంచి 8 వేల రూపాయలను డ్రా చేసిన అగంతకుడు మంగళవారం మరో కార్మికుడి ఖాతా నుంచి 17 వేల రూపాయలను ఇదే విధంగా డ్రా చేశాడు. దీంతో వారు లబోదిబో మంటున్నారు. కార్మికులందరికీ 82290 00176 నంబర్ నుంచే ఫోన్ వచ్చినట్టు వారు తెలిపారు. కార్మికులందరిది గ్రూఫ్ నంబర్ కావడంతో అగంతకుడు వారికే ఫ్లోన్లు చేస్తున్నాడు. కార్మికులు ఎవ్వరు తమ ఏటీఎం కార్డు వివరాలు, ఆధార్కార్డు వివరాలు చెప్పవద్దని బ్యాంక్అధికారులు సూచించారు.