కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది.
నందవరం: కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. నందవరం మండలం హాలహర్వి సమీపంలో ట్రాలీ ఆటో టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మడల్కల్కు చెందిన వారిగా గుర్తించారు.