ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా | Car turn over Express way | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా

Published Tue, Oct 25 2016 8:28 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది.

హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై కారు బోల్తా పడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న కారు ఆరాంఘర్ సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కారులో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఇతర వాహనాలేవీ ఆ సమయంలో సమీపంలో లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అయితే, వాహనాల రాకపోకలకు మాత్రం అంతరాయం ఏర్పడింది. ఘటన విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని కారును పక్కకు తొలగించారు. కొద్దిసేపటి తర్వాత వాహనాలను క్రమబద్ధీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement