ఎస్సీ కమిషన్ ఏర్పాటుపై పిటిషన్
Published Tue, Mar 28 2017 2:14 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు మంగళవారం విచారించింది. టీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మేడిపల్లి సత్యం వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Advertisement
Advertisement