ఆలయంలో చీరకు మంటలంటుకొని..! | Woman suffers injuries after saree catches fire at Vishwanatha temple in Hubballi | Sakshi
Sakshi News home page

ఆలయంలో చీరకు మంటలంటుకొని..!

Published Thu, Jun 20 2019 3:01 PM | Last Updated on Thu, Jun 20 2019 4:11 PM

Woman suffers injuries after saree catches fire at Vishwanatha temple in Hubballi - Sakshi

హుబ్లీ: కర్ణాటక హూబ్లీలోని విశ్వనాథ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో ఒక మహిళ పూజలు నిర్వహిస్తుండగా.. పక్కన ఉన్న కొవ్వొత్తి వల్ల ఆమె చీరకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 17న ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రురాలి పేరు ఛాయ అని తెలుస్తోంది. ఇక్కడి కిమ్స్‌ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. 

ఆమె చీరకు మంటలు అంటుకోవడంతో, దీంతో భయభ్రాంతులకు గురైన మహిళ సాయం కోసం అర్థించడం ఇదంతా ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో నమోదైంది. మంటలు అంటుకొని ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న వ్యక్తులు పరిగెత్తుకొని వచ్చారు. వెంటనే మంటలు ఆర్పి.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో కోల్‌కతాలోని కారుణ్యమయి కాళీ ఆలయంలో ఓ 50 ఏళ్ల మహిళ పూజలు నిర్వహిస్తుండగా.. ఆమె చీరకు ఇదేవిధంగా మంటలు అంటుకొని.. గాయాలు అయ్యాయి. దీంతో ఆలయంలో కొవ్వొత్తులు, అగరవొత్తులు వంటివి నిషేధించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement