జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాల్లోని ఆర్మీ క్యాంప్లో పేలుడు సంభవించింది.
శ్రీనగర్: జమ్ము, కశ్మీర్ పుల్వామా జిల్లాలోని ఆర్మీ క్యాంప్లో శనివారం పేలుడు సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ పేలుడులో 12 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్లోని అవంతిపురా ఏరియాలోని పుల్వామాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాగా పేలుడుకు గల కారణాలు చెప్పలేమని, విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.