
ప్రధాని నరేంద్ర మోదీతో జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్
న్యూఢిల్లీ : జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు విచ్చేశారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆమెకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్కు విచ్చేసిన ఆమె భారత్, జర్మనీ సత్సంబంధాలపై మాట్లాడారు. అనంతరం రాజ్ఘట్లో జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. నేటి పర్యటనలో భాగంగా మెర్కెల్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరగనుంది. దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రేపటి (శనివారం) పర్యటనలో భాగంగా మెర్కెల్ పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరపనున్నారు. చివరగా ద్వారకా సెక్టార్ 21 మెట్రో స్టేషన్ను ఆమె సందర్శించనున్నారు.