'టీఆర్ఎస్, మజ్లిస్ పొత్తు ఎండగట్టాలి' | G.kishan reddy meeting with BJP leaders state executive committee | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్, మజ్లిస్ పొత్తు ఎండగట్టాలి'

Published Fri, Feb 13 2015 2:41 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

'టీఆర్ఎస్, మజ్లిస్ పొత్తు ఎండగట్టాలి' - Sakshi

హైదరాబాద్: జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ సందర్బంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... అధికార టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మధ్య పొత్తును ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు తెలిపారు.

ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న టీఆర్ఎస్... మాటలకే మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. రాజయ్య బర్త్రఫ్పై ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్రెడ్డి ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement