
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ సాధించుకోవడంతో పాటు, జయశంకర్ కోరుకున్నట్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండటం ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.