![Telangana Liberation Day Celebrations Are Conducted At MLC Jevan Reddy Home - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/17/jeevan-reddy.jpg.webp?itok=6s8RqYis)
సాక్షి, జగిత్యాల : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఈ రోజు(సెప్టెంబర్ 17) ప్రాధాన్యత గురించి తెలియని వారంటూ ఉండరు అని అన్నారు. ఆగష్టు 15, 1947 తర్వాత హైదరాబాద్ రాజరిక పాలనలో ఉండేదని గుర్తుచేశారు. అలాగే నాడు భారతదేశాన్ని అస్థిరత చేసే విధంగా బ్రిటీషు వాళ్లు కుట్రలు ఉండేవని అన్నారు. హైదరాబాద్ను ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానిక చేసిన సాయుధ పోరాటాలు, ఏ కులానికో, మతానికో వ్యతిరేకం కాదని, కావాలనే కొన్ని రాజకీయ శక్తులు దీన్ని కులాల ప్రాతిపదికన విభజన చేసే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆనాడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్ధార్ వల్లాభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ను భారత యూనియన్లో కలిపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో అమరులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు.
Comments
Please login to add a commentAdd a comment