సంత్కబీర్ నగర్: ఉత్తరప్రదేశ్లోని సంత్కబీర్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మతి చెందిన వారి సంఖ్య మంగళవారం సాయంత్రానికి 26కు చేరింది. ఢిల్లీ నుంచి గోరఖ్పూర్కు వెళుతున్న రైలు సోమవారం చురైబ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి పక్కలైన్లో ఉన్నగూడ్స్ రైలు మీదకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముందున్న ఆరు బోగీలు దెబ్బతినగా... 14 మంది మరణించినట్లు అధికారులు తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే.
సోమవారం రాత్రి నుంచి మరో 12మంది మృత దేహాలను వెలికితీశామని, మొత్తం 93 మంది గాయపడ్డారని మంగళవారం ఆస్పత్రిలో క్షతగాత్రుల్ని కలిసిన కేంద్రమంత్రి కల్ రాజ్ మిశ్రా తెలిపారు.ఈ ఘటనపై ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామన్నారు.