ananthpur
-
కాలేజ్ బిల్డింగ్పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
-
అరాచకం బట్టబయలు.. వైరల్గా మారిన జేసీ వర్గీయుల దాష్టికం
సాక్షి,అనంతపురం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.తాజాగా, తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గూండాగిరికి దిగారు. పెద్దవడగూరు మండల కేంద్రంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త మధుసూదన్కు తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదురుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుండగా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం చోద్యం చూస్తుండిపోయారు. తమకేం పట్టనట్టుగా వారు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలు.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సోమవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఈ వ్యాఖ్యల అనంతరం జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసులు జేసీ ప్రభాకర్ను తొలుత హౌస్ అరెస్టు చేశారు. ఈలోపు జేసీ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య జోక్యం చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంతలో జేసీ ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి బయటకు రావాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. (చదవండి: యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. ) -
స్నేహితుల మధ్య ఘర్షణ ... ఒకరి మృతి
గోరంట్ల: డబ్బు విషయంగా ఘర్షణ పడిన స్నేహితులను విడిపించే క్రమంలో మరో స్నేహితుడు హతమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సాములపల్లి వద్ద నివాసముంటున్న సుబ్బన్న, అనంతపురానికి చెందిన సురేష్ బావబామ్మర్దులు. తన స్నేహితుడు షాదర్వలితో కలసి బుధవారం సాములపల్లికి సురేష్ వచ్చాడు. డబ్బు విషయంగా సుబ్బన్నతో సురేష్ గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ సమయంలో బ్లేడుతో సుబ్బన్న గొంతు కోసేందుకు సురేష్ ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన షాదర్వలి వెంటనే అడు్డకున్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాదర్వలి తలపై బండరాయితో కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుబ్బన్న, షాదర్వలిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షాదర్వలి మృతిచెందాడు. సుబ్బన్న పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన సురేష్ పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బరాయుడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: దారి తప్పితే జీవితం బుగ్గే..మళ్లీ విస్తరిస్తున్న హెచ్ఐవీ) -
మరికొద్ది గంటల్లో తెల్లారుతుందనంగా... తెల్లారిన బతుకులు
శెట్టూరు: రోజంతా పనులతో అలసిన శరీరాలు రాత్రి గాఢనిద్రలో ఉన్నాయి. తెల్లారితే మళ్లీ బతుకు పోరుకు సిద్ధమవ్వాలి. మరి కొన్ని గంటల్లో ఊరంతా నిద్ర లేస్తుందనగా.. ఒక్కసారిగా భారీ పేలుడు. రెండిళ్లు పూర్తిగా నేలమట్టం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం. ఇళ్ల నుంచి పరుగున రోడ్డుపైకి చేరుకున్న జనం. నేలమట్టమైన ఇంటి శిథిలాల కింద నాలుగు మృతదేహాలు! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకున్న పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏం జరిగిందంటే.. ములకలేడుకు చెందిన కొలిమి దాదాపీరా అలియాస్ దాదు (35), షర్ఫూనా (30) దంపతులకు ఆరేళ్ల కుమార్తె నిదా ఫిర్దోషి ఉంది. తల్లి జైనూబీ (65)తో కలిసి దాదు కుటుంబం నివసిస్తోంది. అదే గ్రామంలోని ఓ చికెన్ సెంటర్లో దాదు దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే మరో ఇంటిలో చిన్నాన్న రజాక్ సాహెబ్ నివాసముంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు రజాక్ సాహెబ్ నిద్రలేచాడు. అప్పటికే సిలిండర్ లీకేజీ కారణంగా ఇళ్లంతా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) నిండుకుని ఉంది. అవగాహన రాహిత్యం కారణంగా రజాక్ ఇంట్లో లైట్లు ఆన్ చేయడంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో రజాక్తో పాటు అతని కుమారుడు అబ్దుల్ సాహెబ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కపక్కనే ఉన్న రెండిళ్లు కుప్పకూలాయి. మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉలిక్కిపడిన గ్రామం.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యవసాయ పనులతో అలసిన ములకలేడు వాసులు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఎక్కడో.. ఏదో జరిగిందనుకుంటూ నిద్రలోనే ఇళ్ల నుంచి పరుగున బయటకు వచ్చారు. దాదు, రజాక్ ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలుసుకుని గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. శిథిలాల కింద కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రజాక్, అబ్దుల్ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పక్క ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్న దాదు, షర్ఫూనా, నిదా ఫిర్దోషి, జైనూబీ మృతదేహాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా మృతదేహాలను తొలగిస్తుంటే పలువురు అయ్యో దేవుడా? అంటూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం రూరల్ సీఐ శ్రీనివాసులు, శెట్టూరు ఎస్ఐ యువరాజ్, రాష్ట్ర విపత్తుల స్పందన/అగ్నిమాపక సేవల శాఖ అధికారి నజీర్ అహమ్మద్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన రజాక్, ఆయన కుమారుడు అబ్దుల్ని కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అంత్యక్రియలకు వెళ్లివచ్చి... దాదు భార్య షర్ఫూనా పుట్టినిల్లు కనుకూరు గ్రామం. వీరి సమీప బంధువు అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో అంత్యక్రియలను శుక్రవారం కనుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదు కుటుంబం హాజరైంది. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. తెల్లారితే ఉపాధి పనుల్లో పాలు పంచుకోవాల్సి ఉంది. ఇంతలో దారుణం చోటు చేసుకోవడంతో ములకలేడు, కనుకూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి దిగ్భ్రాంతి.. ములకలేడు ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉన్న ఆమెకు విషయాన్ని స్థానిక పార్టీ నేతలు ఫోన్ ద్వారా చేరవేశారు. విషయం తెలుసుకున్న మంత్రి భర్త శ్రీచరణ్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శివన్న, నాయకులు జయం ఫణి, బాబు రెడ్డి, సోమనాథరెడ్డి, తిమ్మరాజు, హరినాథరెడ్డి, ముత్యాలు, రమేష్, షేక్షావలి, అప్జల్, సర్పంచ్ నాగరాజు, మన్సూర్ తదితరులు ములకలేడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి శ్రీచరణ్రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్ నాగరాజు, ఎస్ఐ యువరాజ్ సమక్షంలో వైఎస్సార్ బీమా పథకం కింద తక్షణ సాయంగా రూ.20 వేలను సచివాలయ సిబ్బంది అందించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ రంగయ్య.. ములకలేడులో జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకున్న ఆయన స్థానికులతో కలిసి మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజు, వ్యవసాయ మిషన్ సభ్యుడు రాజారాం తదితరులు ఉన్నారు. పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మా ఇంటి గోడలు చీలసాగాయి. భయంతో బయటకు పరుగు తీశాం. బయటికి వచ్చి చూస్తే దాదు, రజాక్ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటి వరకూ ఏమీ కనబడలేదు. ఆ తర్వాత చూస్తే రెండిళ్లు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. నా ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. – అబ్దుల్ రహమాన్, ములకలేడు (చదవండి: 2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్ చేశారు) -
పేదింటికి పెద్ద కష్టం !
అనంతపురం కల్చరల్ /రాప్తాడు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త కళ్ల ముందే మరణించడంతో ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కన్న కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న వయసులోనే కట్టుకున్న భర్త మంచం పట్టడంతో భార్య ... తన తండ్రికి ఏమైందో తెలీక ఓ మూడేళ్ల బాలుడు.. ఇలా ఓ కుటుంబాన్ని కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త మార్కెట్యార్డులో పనిచేస్తుండేవాడు. ఆయన చనిపోవడంతో కుమారుడు కృష్ణమూర్తి, కోడలు ఆదెమ్మతో కలసి అనంతపురంలోని చిన్మయనగర్లో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. ఆదిలక్ష్మమ్మ పెన్షన్తో ఆ కుటుంబం జీవనం సాగించేది. అయితే ఆదిలక్ష్మమ్మ 2021 ఫిబ్రవరిలో మరణించడంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం అక్టోబరులో ఆదెమ్మ కుమారుడు సాకే శ్రీకాంత్ (32)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుడికి వచ్చిన జబ్బును చూసి కుంగిపోయిన ఆదెమ్మ భర్త కృష్ణమూర్తి కూడా నవంబరు 1న చనిపోవడంతో ఇక ఆ ఇల్లు దిక్కులేనిదైంది. వారంలో ఐదుసార్లు డయాలసిస్ చేస్తేకానీ శ్రీకాంత్ బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి ఆదెమ్మ , భార్య మల్లిక కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టాల్లో శ్రీకాంత్ కుటుంబం బీటెక్ పూర్తి చేసిన సాకే శ్రీకాంత్ ఆరు నెలల కిందట వరకు హుషారుగానే ఉండేవాడు. హైదరాబాద్లో అనే సంస్థల్లోనూ పనిచేశాడు. 2018లో వజ్రకరూరు మండలం, కొనకొండ్లకు చెందిన మల్లికతో వివాహం జరగడంతో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో హార్డ్వేర్ ఇంజనీరుగా చేరాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే విధి వారిని చిన్నచూపు చూసింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్కు వెళితే శ్రీకాంత్ రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. ఆఖరికి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మాత్రం ఆపరేషన్తో సమస్య తీరుతుందని దానికి రూ.40 లక్షలు అవసరమవుతాయని తేల్చి చెప్పారు. బిడ్డను బతికించండయ్యా... రెండు కిడ్నీలు పాడైపోయి నా బిడ్డ పడుతున్న బాధ చూడలేకపోతున్నా. ఉన్న డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చు పెట్టా. మా ఇంటి భారాన్ని కూతురు, అల్లుడు మోస్తున్నారు. బిడ్డ బతకాలంతే రూ.40 లక్షలు అవసరమంట. దయగల మారాజులు చేతనైంత సాయం చేసి నా కొడుకును బతికించండయ్యా.. – ఆదెమ్మ , సాకే శ్రీకాంత్ తల్లి దాతలు సాయం చేయదలిస్తే... సాకే శ్రీకాంత్ సెల్ నంబర్ – 7658971971 ఎస్బీఐ , జేఎన్టీయూ బ్రాంచ్ అకౌంట్ నం: 30453144331 ఐఎఫ్ఎస్సీ కోడ్ – ఎస్బీఐఎన్ 0021008 గూగుల్పే /ఫోన్పే నం – 7658971971 -
వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో ఉద్యోగావకాశాలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో వివిధ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ఆ విభాగం హెచ్ఓడీ నరేష్యాదవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెటర్నరీ డాక్టర్లు, డ్రైవరు పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29న కర్నూలులోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, వీపీసీ క్యాంపస్, కొండారెడ్డి బురుజు వద్ద జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వెటర్నరీ డాక్టరు పోస్టుకు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి ఉండాలి. పశు వైద్యులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన వారు కూడా అర్హులు. డ్రైవర్లకు 35 ఏళ్ల లోపు వయస్సు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, మూడేళ్ల అనుభవముండాలి. మరింత సమాచారానికి 94922 22951లో సంప్రదించవచ్చు. (చదవండి : స్మార్ట్గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు) -
అమ్మా.. రేషన్ కార్డు వచ్చిందా.. లబ్ధిదారుకు ఎమ్మెల్యే ఫోన్..
అనంతపురం సెంట్రల్: ‘హలో అనురాధమ్మనా మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని మాట్లాడుతున్నా. రేషన్కార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నావు కదా కొత్త కార్డు వచ్చిందా.’ అంటూ స్వయంగా ఓ లబ్ధిదారుకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆరా తీయడం అందరినీ ఆశ్చర్యపరచింది. శనివారం నగరంలో రహమత్నగర్లోని 27వ సచివాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ లబ్ధిదారురాలికి నేరుగా ఫోన్ చేశారు. సమస్య పరిష్కారమయిందా లేదా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారు మాట్లాడుతూ.. రేషన్కార్డు వచ్చిందని, పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా రావడం లేదని తెలిపారు. బాధ్యతగా సేవలందించండి అనంతరం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. అర్హత ఉంటే వెంటనే పథకాలు అందించాలని ఆదేశించారు. ‘స్పందన’ ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేసి.. పరిష్కారం అయిన వెంటనే పొందుపర్చాలని సూచించారు. దాదాపు 3 నెలలుగా ఫిర్యాదులు రికార్డుల్లో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులుగా నియమితులై రెండు సంవత్సరాలు పూర్తవుతోందని.. నేటికీ సరిగా విధులు నిర్వహించకపోవడమేంటని ప్రశ్నించారు. వచ్చామా.. పోయామా అంటే కుదరదని... ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ప్రతి ఇంటికీ వెళ్లాలని సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను ఆదేశించారు. ఒక సమస్యపై ప్రజలు తరుచూ తిరగకుండా, సమస్య పరిష్కారమయేంత వరకూ సచివాలయ ఉద్యోగులదే బాధ్యతని తెలియజేశారు. దీర్ఘకాలికంగా ప్రకాష్రోడ్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న రైల్వే ట్రాక్ డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు. ప్రకాష్రోడ్డు ప్రాంతానికి సంబంధించి సచివాలయం రహమత్నగర్లో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్యాలయాన్ని మార్చాలని చెప్పారు. అర్హత ఉన్న అందరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న వయస్సుల్లోనే ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని సూచించారు. కోట్లాది రూపాయలను సచివాలయ వ్యవస్థపై సీఎం వెచ్చిస్తున్నారని, ఆయన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. -
అనంతపురం : ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్ ట్యాంకర్
-
విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
-
ఢిల్లీకి వ్యవసాయోత్పత్తులు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఈ నెల 9న ప్రయోగాత్మకంగా అనంతపురం నుంచి ఢిల్లీ మార్కెట్కు కిసాన్ రైలు నడిపిన విషయం తెలిసిందే. చీనీ, మామిడి, బొప్పాయి, కర్భూజా, టమాట తదితర ఉత్పత్తులకు ఇక్కడ లభిస్తున్న ధరతో పోల్చుకుంటే ఢిల్లీ అజాద్పూర్ మండీలో అధిక ధరలు లభించాయి. దీంతో ఈ నెల 19న రెండో కిసాన్ రైలు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి జిల్లాలో పండిన వ్యవసాయ ఉత్పత్తులు కూడా పంపితే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని రకాల ఉత్పత్తులు ప్రయోగాత్మకంగా పంపి మార్కెటింగ్ పరిస్థితిపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. వేరుశనగ, పప్పుశనగ, కందులు, రాగులు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జ, కొర్రలు, అండుకొర్రలు, ఆముదాలు తదితర అన్ని రకాల ఉత్పత్తులు ఐదారు కిలోలు చొప్పున పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన కిసాన్రైలులో నలుగురు వ్యవసాయశాఖ అధికారులు కూడా ఉన్నారు. రెండో సారి వెళ్లే రైలులో ఇద్దరు అధికారులను పంపించి వ్యవసాయ ఉత్పత్తులకు లభిస్తున్న గిట్టుబాటు ధరలు, అక్కడి ప్రజల వినియోగంపై అధ్యయం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా రాజస్తాన్, గుజరాత్లో పండే వేరుశనగ, పెద్ద సైజు కాబూలీ రకం పప్పుశనగ వాడుతున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తులను అక్కడి వారికి పరిచయం చేస్తే కొంత వరకు ధరలు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అనుకున్న ఫలితాలు వస్తే భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులు కూడా తరలించే ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు. కిసాన్రైలుకు అడ్డంకులు భవిష్యత్తులో తమ వ్యాపారాలు, కమీషన్లకు గండిపడకుండా ఉండేందుకు దళారులు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. తమ లారీలు, ట్రక్కులు, ఇతరత్రా సరుకు రవాణా వాహనాలకు బాడుగలు లేకుండా పోతుందని భావించిన కొందరు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మధ్య దళారీలు కిసాన్ రైలును ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 19న ఢిల్లీకి కిసాన్ రైలు ఢిల్లీకి రెండో విడత కిసాన్ రైలు ఈ నెల 19న బయలుదేరుతుందని కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టం చేశారు. తొలుత 16న పంపించేందుకు ఏర్పాట్లు చేశామని, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 19కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంటకోతకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాటు పంట ఉత్పత్తులు తడిసి నాణ్యత కోల్పోయి రైతుకు నష్టం వాటిల్లే ప్రమాదముండడంతో కిసాన్ రైలు ప్రయాణాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. చదవండి: త్వరలోనే ‘పోలవరం’ బకాయిలు రూ.3,805 కోట్లు చెల్లిస్తాం -
రెండు లారీలు ఢీ..ఒకరు మృతి
-
వార్డు వాలంటీర్లపై టీడీపీ నేతల దాడి
-
కరువు సీమలో జలసిరి
-
నీచ రాజకీయాలకు పాల్పడటం దుర్మార్గం
-
చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
రైతులు నష్టపోకుండా సీఎం చర్యలు
-
అనంతపురంలో కట్టుదిట్టంగా లాక్డౌన్
-
రెచ్చిపోయిన టీడీపీ నేతలు
-
మహిళపై చేయిచేసుకున్న టీడీపీ నాయకులు
-
హోంక్వారంటైన్లో ఉన్నవారిపై ప్రత్యేక నిఘా
-
మెడికల్ కాలేజీలోనే కరోనా పరీక్షలు
-
అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
టీడీపీ నేత పరిటాల శ్రీరాంపై కేసు
-
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కుట్రలు చేశారు
-
అభివృద్ధి చేస్తామంటే..బాబు అడ్డుకుంటున్నారు
-
నిద్రమాత్రలు మింగిన ముగ్గురు విద్యార్ధినులు
-
అనంతపురంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్
-
అనంతపురం: బయటపడ్డ టీడీపీ నేతల కుట్ర
సాక్షి, అనంతపురం : వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు పెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తల కుట్ర బయటపడింది. వివరాలు.. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో రైతు నారాయణ రెడ్డి పాతిన బండలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నెపాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నెట్టి వారిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్ర పన్నారు. సమాచారమందుకొని బండలను ధ్వంసం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోబోయిన పోలీసులపై వారు దాడికి దిగారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఈ ఘటనలో టీడీపీ నేత నాగరాజు సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. -
సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
చంద్రబాబు సమాధానం చెప్పాలి : పురందేశ్వరి
సాక్షి, అనంతపురం : రాజధాని అమరావతి నిర్మాణంలో పూర్తిగా విఫలమై, నమ్మి ఓట్లేసిన ప్రజలను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి శుక్రవారం ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాజధాని ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్తో ఎందుకు మోసం చేశారని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు. రైతులడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం 2500 కోట్లు ఇస్తే సరైన లెక్కలు చూపలేదని విమర్శించారు. రాజధానిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని, వారిది కేవలం ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దోచుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. చంద్రబాబు మోసం చేస్తున్నాడని తాము మొదట్నుంచీ చెప్తున్నామని గుర్తు చేశారు. రాళ్లు, చెప్పులు వేయడం చంద్రబాబు నేర్పిన విద్యేనని పేర్కొన్నారు. బీజీపీ అధికార ప్రతినిధి సామంచి నివాస్ మాట్లాడుతూ.. తిరుపతిలో అమిత్షాపై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేస్తే, అధికారంలో ఉన్న చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆయన పాలనలో బీజేపీ నేతలపై చాలా దాడులు జరిగినా ఏనాడూ స్పందించలేదని విమర్శించారు. ఇప్పుడు అమరావతిలో ప్రజలు ఆగ్రహంతో రాళ్లు విసిరితే టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. -
‘మా పింఛన్లు ఆపేస్తే పెట్రోల్ పోసి తగులబెడతాం’
సాక్షి, అనంతపురం : తమ పింఛన్లు తొలగిస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు మంగళవారం అధికారులను బెదిరించారు. జిల్లాలోని కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో అధికారులు అనర్హుల పింఛన్లను తొలగించారు. తొలగించిన వారిలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శివమ్మ, నారాయణ, ఓబిలేసులు సచివాలయ కార్యాలయంలో వేటకొడవళ్లతో ప్రవేశించి హల్చల్ చేశారు. మా మాట వినకుంటే పెట్రోల్ పోసి తగలబెడతామని పంచాయితీ కార్యదర్శి మురళీకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. -
ఆత్మహత్యాయత్నం చేసిన కానిస్టేబుల్
సాక్షి, అనంతపురం : పై అధికారులు వేధిస్తున్నారనే మనస్థాపంతో ప్రకాష్ అనే కానిస్టేబుల్ శుక్రవారం అంబేద్కర్ సెంటర్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు విచారించగా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ వేధిస్తున్నారనీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్లలో తనకు అన్యాయం జరిగిందని ప్రకాష్ ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారమందుకున్న కలెక్టర్ సత్యనారాయణ ఎస్పీతో మాట్లాడి న్యాయం చేస్తానని బాధితుడికి హామీ ఇచ్చారు. -
జేసీ ట్రావెల్స్కు ఆర్టీఏ షాక్
-
వైఎస్ఆర్ కంటి వెలుగు
-
సీఎం జగన్ ‘అనంత’ పర్యటన ఖరారు
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనంతపురం జిల్లా పర్యటనకు తేదీ ఖరారైంది. ఈ నెల 10వ తేదీన కంటివెలుగు కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల, పీటీసీ మైదానాలను శనివారం సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంట్రామిరెడ్డి, విద్యా సంస్కరణల కమిటీ సభ్యులు ఆలూరు సాంబశివారెడ్డిలు పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సత్యయేసుబాబు సమీక్ష నిర్వహించారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసమే కంటివెలుగు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ కంటి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని చేపట్టామని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి చెప్పారు. తొలిదశలో విద్యార్థులకు కంటి పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కాగా, ఆటోలు, క్యాబ్లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని సీఎం జగన్ శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించారు. -
పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం!
సాక్షి, అనంతపురం : పయ్యావుల కేశవ్ సొంత పంచాయతీ కౌకుంట్లలో నలభై ఏళ్లుగా దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారని ఉరవకొండ మాజీ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆదివారం మండిపడ్డారు. కౌకుంట్ల పంచాయతీ విభజన కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా అధికారులను, ప్రజలను బెదిరిస్తున్నారనీ, ఈ ఆగడాలు ఇక సహించేదిలేదన్నారు. సోమవారం కౌకుంట్లలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని విశ్వేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. -
బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియాపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఎదుట ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశాయి. ఎస్కే వర్సిటీలో హార్టికల్చర్ పేపర్ రూపొందించారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎస్కే వర్సిటీ సిబ్బంది స్పందించింది. తమ వర్సిటీలో హార్టికల్చర్ విభాగం, ప్రొఫెసర్లు లేనప్పుడు పేపర్ ఎలా రూపొందిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అసత్య కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని ఎస్కే వర్సిటీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ..‘ ప్రశ్నాపత్రం తయారు చేయకపోయినా చేసినట్టు చూపారు. ఎస్కే వర్సిటీలో అసలు సచివాలయ ప్రశ్నా పత్రాలు రూపొందించలేదు. ఉద్యోగాల ప్రక్రియలో మాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు’ అని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడిన విద్యార్థి సంఘాలు.. ఆ పత్రిక ప్రతులను దహనం చేశాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఇటుకలపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు నమోదైంది. -
పాము కలకలం .. మంత్రికి తప్పిన ప్రమాదం
సాక్షి, అనంతపురం : మంత్రి శంకర్ నారాయణ పాల్గొన్న స్పందన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. సిబ్బంది అప్రమత్తంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలొ మంత్రి శంకర్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. అనంతరం మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. ఓ వ్యక్తి కాలు దగ్గర వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పామును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే కాలుకు ఉన్నచెప్పును విసిరి దూరంగా పరుగెత్తాడు. దీంతో పాము ప్రజల్లోకి దూసుకెళ్లింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంత్రి శంకర్నారాయణను సురక్షితంగా ప్రజల మధ్య నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆ పాము రోడ్డు మీదగా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మంత్రి పర్యటనలో పాము కలకలం
-
తాడిపత్రి సబ్ పోస్ట్ఆఫీసులో గోల్మాల్
-
నారాయణ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
జలశేఖరుడు
-
వైద్యుల నిర్వాకం,బాలింత మృతి
-
పోస్టల్ బ్యాలెట్ అక్రమాలపై ఈసీ సీరియస్
-
బస్సును ఢీకొన్న కంటైనర్,ఆరుగురు మృతి
-
టీడీపీ దౌర్జన్యం,వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గాయాలు
-
సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ - అనంతపురం జిల్లా
-
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి
-
అనంతలో టీడీపీ నేతలు,కార్యకర్తల ఆందోళన
-
మా గ్రామానికి రావద్దు
సాక్షి, అమడగూరు : పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చుక్కెదురైంది. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో రోడ్లను ప్రారంభించడానికి శుక్రవారం విచ్చేసిన ఎమ్మెల్యేకు పరాభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. ఏ పుట్లవాండ్లపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి వెళ్లగా ఊరిబయటే వేచి చూస్తున్న గ్రామస్తులు ఎమ్మెల్యే వాహనాలు రాగానే అడ్డగించారు. గ్రామంలో చాలా మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వలేదని, మా గ్రామానికి మీరు ఏం చేశారని నిలదీశారు. అలాగే లోకోజుపల్లిలో రోడ్లను ప్రారంభించడానికి వెళ్లగా డ్వాక్రా సంఘాల మహిళలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పసుపు–కుంకుమ కింద చెక్కులు ఇచ్చారు కానీ వాటికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పది రోజులు క్రితం అమడగూరులో పంపిణీ చేసిన చీరల కోసం తామంతా వచ్చినా ఒక చీర కూడా ఇవ్వలేదని, ఆ రోజు తిండి కూడా లేక కడుపు మాడ్చుకుని ఇళ్లకు వచ్చామన్నారు. అలాగే గుండువారిపల్లికి వెళ్లగా అక్కడ కూడా గోబ్యాక్ పల్లె అంటూ నినాదాలు చేశారు. అర్హులైన వారి ఇళ్లకు బిల్లులు ఇవ్వలేదని, ఇళ్లు కట్టని వారికి బిల్లులు ఇచ్చారని, సబ్సిడీ రుణాల్లో, ఆవులషెడ్ల మంజూరులో అర్హులకు అన్యాయం చేశారని గ్రామానికి రావద్దని అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన పల్లె వెనుతిరిగారు. -
పదకొండు స్థానాలపై స్పష్టత, మూడింటిలో సందిగ్ధత
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీలో సందిగ్ధం కొనసాగుతోంది. 14 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలపై స్పష్టత వచ్చినా.. కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్లు స్థానాల అభ్యర్థులను అధిష్టానం తేల్చలేదు. సిట్టింగ్లు, ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండటంతో అధిష్టానం కూడా నాన్చుడి ధోరణి అవలంబిస్తోంది. దీంతో పాటు అనంతపురం స్థానానికి ప్రభాకర్చౌదరిని ఖరారు చేశారని మీడియాకు లీకులు ఇచ్చినా, చంద్రబాబు నుంచి ఇంకా హామీ దక్కలేదని తెలుస్తోంది. వీటితో పాటు హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పను ప్రకటించారని టీడీపీ నేతలు చెబుతున్నా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసెళ్లిన చాంద్బాషాను మైనార్టీ కోటాలో ఎంపీగా నిలిపితే బాగుంటుందని పార్టీతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ స్థానాలపై ముఖ్యమంత్రితో పాటు ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, జిల్లా మంత్రి కాలవ శ్రీనివాసులు శుక్రవారం కూడా చర్చలు జరిపారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి టిక్కెట్ ఇవ్వకూడదని వ్యతిరేక వర్గీయులైన మల్లిఖార్జున, రామ్మోహన్చౌదరి, రమేశ్, నారాయణ, ఉమామహేశ్వరరావు గట్టిగా పట్టుబట్టారు. ఈయనకు టిక్కెట్ ఇస్తే పార్టీ కోసం పనిచేసేది లేదని తేల్చిచెప్పారు. తమ ఐదుగురిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను చంద్రబాబు ముందుంచారు. అయితే అనంతపురం అసెంబ్లీ స్థానం ఆశించిన అమిలినేని సురేంద్రబాబు కూడా కళ్యాణదుర్గం సీటు కోరుతున్నారు. ఈయన ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వాడని, అతనికి కూడా టిక్కెట్ ఇవ్వొద్దని చౌదరి వ్యతిరేకవర్గం గట్టిగా చెబుతోంది. ఇక ఉమామహేశ్వరరావు కూడా ఇదే సీటు ఆశిస్తున్నారు. ఇతనికి వ్యతిరేకవర్గం మద్దతు ఉంది. అయితే ఇతను కూడా స్థానికేతరుడు. ఉరవకొండ నియోజకవర్గవాసే. దీంతో ఇద్దరూ స్థానికేతరులు కాబట్టి మల్లిఖార్జున, రామ్మోహన్చౌదరిలో ఒకరికి టిక్కెట్ ఖరారు చేయాలని కళ్యాణదుర్గం అసంతృప్తి నేతలు పట్టుబట్టారు. కానీ వీరికి టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేదు. చౌదరికి.. లేదంటే సురేంద్రకు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సీఎం నివాసం నుంచి హనుమంతరాయ చౌదరి కన్నీళ్లు రాలుస్తూ బయటకు వచ్చినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే చౌదరికి టిక్కెట్ లేదనే విషయం స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా వ్యతిరేకవర్గం అసమ్మతి స్వరం విన్పించడం వెనుక మంత్రి పరిటాల సునీత హస్తం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చౌదరికి వ్యతిరేకంగా బలమైనవర్గం ఉందని చూపుతూ ఆ ముసుగులో పరిటాల శ్రీరాంకు టిక్కెట్ దక్కించుకోవాలనే ప్రయత్నం సునీత చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్రెడ్డి కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇచ్చారని, తమకూ ఇవ్వాలని టీడీపీ ఒత్తిడి తెచ్చి ఆఖరి నిమిషంలో శ్రీరాంకు ఖరారు చేసుకునే ఎత్తుగడ మంత్రి వేస్తున్నట్లు తెలుస్తోంది. మధుసూదన్ గుప్తా పేరే ఖరారయ్యే అవకాశం గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ను చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సర్వేలో పరిస్థితి బాగోలేదని, ఓడిపోయే అవకాశం ఉందని, కాబట్టి గుప్తాకు టిక్కెట్ ఇస్తున్నామని.. సహకరించాలని గౌడ్కు చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. సర్వేలో తాను బలహీనంగా ఉన్నారనే కారణంతో గుప్తాకు టిక్కెట్ ఇస్తే మంచి మెజార్టీతో ప్రత్యర్థి గెలిచే అవకాశం ఉందని, గుప్తాకు నియోజకవర్గంలో మంచిపేరు లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే జేసీ దివాకర్రెడ్డి, గుప్తా కోసం పట్టుబట్టడంతో చంద్రబాబు కూడా అతనిపేరు ఖరారు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శమంతకమణిని తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో యామినీబాలకు ఇవ్వరనేది తేలింది. అయితే అంతా శైలజానాథ్ టీడీపీలోకి వస్తారని ప్రచారం చేసినా, టీడీపీలో చేరేందుకు ఆయన విముఖత ప్రదర్శించారని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడం లేదని, అలాంటి పార్టీలోకి నేనెందుకు వెళతానని, కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగానే బరిలో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రస్తావనకు తెరపడినట్లే. ఇకపోతే బండారు శ్రావణి, యామినీబాల మధ్య పోటీ ఉంది. వీరిలో ఓ వర్గం శ్రావణికి, మరోవర్గం యామినీకి గట్టిగా మద్దతు ఇస్తున్నారు. శ్రావణితో పోల్చితే యామినీ బాలకు ఇవ్వడమే మంచిదని.. శమంతకమణి ఎన్నికలు చేసుకోగలదని, శ్రావణి అయితే కష్టమని ఓ వర్గం చెప్పినట్లు చర్చ జరుగుతోంది. దీనికి తోడు శ్రావణి అయితే శమంతకమణి కూడా సహకారం అందించరని చెప్పినట్లు సమాచారం. దీనిపై కూడా టీడీపీ అధిష్టానం లాభనష్టాలను బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఎంపీ రేసులో నిమ్మల, అత్తార్ కదిరి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని తాకట్టుపెట్టి టీడీపీలో చేరిన అత్తార్ చాంద్బాషాకు చంద్రబాబు అసెంబ్లీ అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోలేదు. మైనార్టీ కోటాలో చాంద్బాషాకు ఇవ్వాలని లోకేశ్ సిఫార్సు చేసినా కదిరిలో వైఎస్సార్సీపీ గెలుస్తోందని, చాంద్బాషా అభ్యర్థి అయితే గెలిచే ఓట్ల శాతం భారీగా ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. కనీస పోటీ ఇవ్వాలంటే చాంద్బాషా కంటే ప్రసాద్ కాస్త మేలని చెప్పినట్లు సమాచారం. దీంతో కదిరిపై టీడీపీ ఆశలు వదులకుని అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీతో పాటు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చాంద్బాషాకు టిక్కెట్ ఇస్తే మైనార్టీ ఓట్లు కొద్దిమేర అయిన కలిసొస్తాయని, ఎంపీగా అతను గెలవలేకపోయినా ఆ ప్రభావం రెండుమూడు అసెంబ్లీ నియోజకవర్గాలపై ఉన్నా పార్టీకి మేలవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిమ్మల అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చినా, చాంద్బాషాను కూడా ఆప్షన్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా టిక్కెట్ల కేటాయింపుల్లో పీఠముడి వీడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. -
గుత్తిలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు
-
పామిడిలో 25మంది ఉపాధ్యాయుల అరెస్ట్
-
నిర్బంధంలో వైఎస్సార్సీపీ నేతలు
-
బాబు సర్కార్పై డ్వాక్రా మహిళల తిరుగుబాటు
-
అనంతపురంలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
అనంతపురం జన్మభూమిలో రచ్చ రచ్చ
-
చంద్రబాబు బీసీ ద్రోహి..
-
ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : చంద్రబాబు
అనంతపురం టౌన్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శనివారం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏపార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి చేయూతను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 176 మంది కార్యకర్తలకు రూ.3.52 కోట్లు సాయం అందించామని గుర్తు చేశారు. 1984లో అవిశ్వాసం పెట్టి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను పదవి నుంచి దించితే అప్పట్లో జిల్లా ప్రజలు ఎన్టీఆర్కు అండగా నిలిచారని తెలిపారు. విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలి విభేదాలను వీడి కలిసికట్టుగా పని చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. నాయకుల్లో విభేదాలోస్తే తానే రంగంలోకి దిగుతాని స్టేజ్పైన ఉన్న ప్రజాప్రతినిధులును చూపిస్తూ అన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు ఎంతటి వారైన ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ పనితీరును వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీ సభ్యులు కష్టపడి పని చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి 100 ఓట్లకు ఒక సేవా మిత్రను ఏర్పాటు చేశామన్నారు. బూత్ కమిటీలు, సేవా మిత్రలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, జవహర్, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, శాసనమండలి చీఫ్ విఫ్ పయ్యావుల కేశవ్, ఎంపీలు నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు జితేంద్రగౌడ్, ఉన్నం హనుమంతరాయచౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, వైకుంఠం ప్రభాకర్చౌదరి, అత్తార్చాంద్బాషా, యామినిబాల, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు దీపక్రెడ్డి, శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మెట్టు గోవిందరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
పోలవరం యాత్ర పేరుతో టీడీపీ నేతల జల్సా
-
కదిరి కోర్టు చారిత్రక తీర్పు
సాక్షి, అనంతపురం : పేదల ఇళ్ల పట్టాల కోసం భూమి ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులకు కదిరి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. నల్లచెరువు తహశీల్దార్ కార్యాలయం వేలం వేసి రైతులకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1987లో జరిగిన భూ సేకరణలో భాగంగా రామిరెడ్డి, నరసింహారెడ్డి అనే ఇద్దరు రైతులకు చెందిన రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఎకరాకు కేవలం 3 వేల రూపాయలు మాత్రమే పరిహారంగా చెల్లించారు. దీంతో భూసేకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ వారిద్దరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం ఈ కేసును విచారించిన కదిరి కోర్టు తహశీల్దార్ కార్యాలయ్యాన్ని వేలం వేసి రైతులకు పరిహారం అందజేయాలని తీర్పునిచ్చింది. దీంతో 30 ఏళ్ల తర్వాత రైతులకు సరైన పరిహారం దక్కింది. కాగా తహశీల్దార్ కార్యాలయాన్ని 10.25 లక్షల రూపాయలకు వేలం వేసినట్లు సమాచారం. -
దర్గాలో వైఎస్సార్సీపీ నేతల ప్రత్యేక పూజలు
-
పోలీసుల అదుపులో కాపు రామచంద్రారెడ్డి
-
అనంతపురంలో పోలీసు దౌర్జన్యం
-
ప్రత్యేక హోదా కోసం విద్యార్ధి,యువజన సంఘాల నిరసన