Ayyanna pathrudu
-
ఏజెన్సీలో అగ్గి రాజేసిన స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యలు
-
లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్.. అయ్యన్న వ్యాఖ్యల అర్థమేంటి?
విశాఖ : ఏపీలో తారా స్థాయికి వెళ్లిన అధికార టీడీపీ నేతల నారా లోకేష్ భజనను స్పీకర్ అయ్యన్న పాత్రుడు తప్పుబట్టారు. లోకేష్ డిప్యూటీ సీఎం అంశంలో టీడీపీ నేతల డిమాండ్పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చెయ్యడానికి మేం ఎవరు..? డిప్యూటీ సీఎం కావాలో వద్దో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. దీంతో అయ్యన్న వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విస్మయానికి గురవుతున్నారు. మరి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సు- 2025 జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పలువురు మంత్రులు పాల్గొన్నారు. అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో టీడీపీ నేతలు మరోసారి లోకేష్ భజన ఎత్తుకున్నారు. తమ నాయకుడు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని మంత్రి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు సైతం టీడీపీకి చంద్రబాబు తర్వాత లోకేషే వారసుడు.. చిన్నపిల్నాడి అడిగినా చెప్తాడంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తామేం తక్కువ కాదన్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు.టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నేతలు ఘాటుగా స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్.. తమకు పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని తమకు ఉందని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తే తగిన విధంగా వ్యవహరిస్తాం అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. -
పెన్షన్దారులు దొంగలతో సమానం.. అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనకాపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో పెన్షన్లను తొలగించే కుట్ర జరుగుతోంది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పెన్షన్దారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెన్షన్దారులను దొంగలతో పోల్చడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెర లేపింది. పెన్షన్లను తొలగించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అయ్యన్న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్షన్దారులను దొంగలతో పోల్చారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 20 వేల మంది తప్పుడు ధ్రువపత్రాలు చూపించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు. వారంతా దొంగలతోనే సమానం అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో పెన్షన్దారుల కారణంగానే ప్రభుత్వానికి నష్టం వస్తోందన్నారు. పెన్షన్ల వలన నెలకు రూ.120 కోట్ల నష్టం వస్తోంది. సంవత్సరానికి రూ.1440 కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి. ఎవరు.. ఏం అనుకున్నా నాకు అనవసరం. ఈ పెన్షన్లను తొలగించాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో అయ్యన్నపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మితిమీరిన టీడీపీ ఇసుక దందా..ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ఏపీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన అయ్యన్నపాత్రుడు
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం, ఆయన స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సభ్యులు అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒక్కరు. ఆయన ఏకగ్రీవంగా ఎన్ని కావడం సంతోషం. స్పీకర్ స్థానంలో అయ్యన్న తన పాత్ర పోషిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. -
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేసులో పలువురు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు అయ్యన్న వైపే అధిష్టానం మొగ్గుచూపించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే వెళ్లే అవకాశాలున్నాయి. జనసేన నుంచి నెల్లిమర్ల(విజయనగరం) శాసనసభ సభ్యురాలు మాధవి లోకం పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్విప్గా ధూళిపాళ నరేంద్రకు అవకాశం దక్కవచ్చని టాక్. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. -
అయ్యన్న ఎన్ని కుయుక్తులు పన్నినా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే ఉమాశంకర్
-
‘టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా..’
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలందిస్తున్న తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీరానీయడం లేదని టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తి ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి(టీడీపీ రెబల్)గా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, ఆర్టీఐ కమిషనర్గా పదవులిచ్చే సమయంలో అయ్యన్నపాత్రుడు అడ్డుతగిలాడని చెప్పారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు. చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించారని, అప్పుడు కూడా తాను బాధపడలేదని, కానీ తాజాగా ఆమెను కూడా తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదనకు గురై.. తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని శ్రీరామమూర్తి వివరించారు. -
ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన అయ్యన్న
-
అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ, భూకబ్జాదారుడు : ఎమ్మెల్సీ దువ్వాడ
-
చంద్రబాబు టీడీపీ నేతలకు సొంత రాజ్యాంగం రాశాడు : మంత్రి జోగి రమేష్
-
చెరువు కాల్వను ఆక్రమించి అయ్యన్న ప్రహరీ గోడ నిర్మించాడు : ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్
-
అయ్యన్నపాత్రుడు, రాజేశ్ అరెస్ట్పై స్పందించిన సీఐడీ డీఐజీ సునీల్
సాక్షి, విజయవాడ: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, రాజేశ్పై ఫిర్యాదు వచ్చింది. రెండు సెంట్ల భూమి ఆక్రమించారని ఆరోపణ ఉంది. ఎన్వోసీపై సంతకం ఏఈది కాదు. ఫేక్ ఎన్వోసీతో 0.26 సెంట్ల భూమి కబ్జా చేశారు. ప్రాథమిక విచారణ తర్వాత అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేశాము. ఏ-1 అయ్యన్నపాత్రుడు, ఏ-2 విజయ్, ఏ-3 రాజేశ్గా ఉన్నారు. 464, 467, 471, 474 R/w 120-B, 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము. ఏ-1, ఏ-3ని చట్ట ప్రకారమే అరెస్ట్ చేశాము. కుట్ర చేసి భూమి ఆక్రమించారనేది ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి’ అని స్పష్టం చేశారు. -
బీసీల గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబు కు లేదు : మంత్రి కారుమూరి
-
చట్టప్రకారమే అయ్యన్నపాత్రుడు ని అరెస్ట్ చేశాం : ఏపీ సీఐడీ
-
అయ్యన్నపాత్రుడు అడ్డంగా దొరికిపోయారు : బూడి ముత్యాల నాయుడు
-
రెండు రోజులుగా కనిపించని అయ్యన్న పాత్రుడు
-
మాజీ మంత్రి అయ్యన్న కుటుంబం అక్రమ నిర్మాణం గుర్తించాం : ఎమ్మార్వో జయ
-
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
జనతంత్రం : గొప్ప కార్యక్రమం జరిగినప్పుడల్లా టీడీపీది ఇదే తీరు
-
అయ్యన్నకు బుద్ధి చెప్పిన ప్రజలు
-
అయ్యన్న పాత్రుడు వ్యవహరించిన తీరు దురదృష్టకరం
-
అయ్యన్న పాత్రుడిపై ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం
-
అయ్యన్నపై ఆగ్రహం
-
మంత్రులు, మహిళలపై అయ్యన్న ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు
-
అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారు : కొండా రాజీవ్ గాంధీ
-
విశాఖ జిల్లాలో టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వేములపూడి జగనన్న కాలనీలో భూమి చదును చేస్తున్న టిప్పర్ డ్రైవర్పై విచక్షణరహితంగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు. వారి దాడి భయంతో టిప్పర్ దిగి పారిపోతున్న డ్రైవర్ను వెంటాడి రాళ్లతో కొట్టారు. అనంతరం టిప్పర్ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. స్థానికంగా పనులు పర్యవేక్షిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడిని చితకబాదారు.ఈ దాడికి పాల్పడింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు అనుచరులని తేలింది. కాగా తనపై దాడికి పాల్పడ్డవారిపై టిప్పర్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
లాటరైట్ దోపిడీ దొంగ అయ్యన్నపాత్రుడు : ఎమ్మెల్యే ఉమాశంకర్
-
యాంకర్స్తో మాజీ మంత్రి డాన్స్.. వీడియో వైరల్
-
మాజీ మంత్రి అయ్యన్నపై మరో కేసు
-
వైఎస్సార్సీపీలోకి అయ్యన్న సోదరుడు
నర్సీపట్నం: టీడీపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ చింతకాయల అనిత, వైఎస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, పలువురు కౌన్సిలర్లు సోమవారం అమరావతిలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్నారు. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో పార్టీలో చేరేందుకు వీరు ఆదివారం ప్రత్యేక వాహనాల్లో అమరావతి బయలుదేరి వెళ్లారు. మాజీ మంత్రి అయ్యన్నకు ఇంతకాలం వెన్ను దన్నుగా ఉన్న ఒకే ఒక్క సోదరుడు సన్యాసిపాత్రుడు ఇప్పుడు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. 20 వాహనాల్లో అట్టహాసంగా మాజీ కౌన్సిలర్లు చెరుకూరి సత్యనారాయణ, సూపర్ కౌన్సిలర్లు మాకిరెడ్డి అప్పారావు, మామిడి శ్రీనువాసరావు, చిటికెల కన్నబాబు, మళ్ల గణేష్, టీడీపీకి చెందిన హౌసింగ్ బోర్డు మాజీ డైరెక్టర్ రుత్తల చినరమణ, లంక శివకుమార్ తరలివెళ్లారు. -
డోలీయే శరణ్యం
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం): డొంకాడ గిరిజన గ్రామం. ఇది నర్సీపట్నానికి సరిగ్గా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గొలుగొండ మండలంలో డొంకాడ ఓ గ్రామం. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డోలీయే వారికి రవాణాసాధనం. ఆ గ్రామానికి చెందిన కొర్రా మల్లేశ్వరి అనే మహిళకు సోమవారం తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ప్రధాన రోడ్డుకి రావాలింటే నాలుగు కిలోమీటర్లు అడవి మార్గం దాటాలి.దీంతో గ్రామస్తులు డోలి కట్టారు. అడవిని దాటించి, అక్కడ 108 వాహనం ఎక్కించారు.నర్సీపట్నం తీసుకువెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని విశాఖపట్నం తరలించారు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కవగా ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో ఉన్న గొలుగొండ మండలం డొంకాడ గ్రామానికి కూడా రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంత్రి నియోజకవర్గంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేదని గిరిజనులు వాపోతున్నారు. గత ఏడాది గర్భిణికి సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ చనిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేను రాను.. మీకో దండం..!
సాక్షి, గుంటూరు: జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక జిల్లా ఇన్చార్జి మంత్రి అయితే సమన్వయ కమిటీ సమావేశాలకు సైతం డుమ్మా కొడుతుండటం హాట్ టాపిక్గా మారింది. సమన్వయ కమిటీ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలను పట్టించుకోకపోవడంతో అందరూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనే నవంబర్ నెలలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరగలేదని సొంతపార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. తీర్మానాలు గాలికి.. జిల్లాలో ఖాళీగా ఉన్న గుంటూరు మిర్చి యార్డు, జిల్లా గ్రంథాలయ సంస్థలకు పాలక వర్గాలను నియమించాలని రెండు నెలల క్రితమే తీర్మానించి పార్టీ అధిష్టానానికి పంపినప్పటికీ ఇప్పటి వరకూ వాటిపై నిర్ణయం తీసుకోలేదు. ఇక ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలైతే ఇందుకేనా మిమ్మల్ని గెలిపించిందంటూ నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియకే సమన్వయ కమిటీ సమావేశాలకు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండే గుంటూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. పార్టీ నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా అధిష్టానం నిర్లక్ష్యం వహిస్తుందని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆసియాలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా టీడీపీ సీనియర్ నేత వెన్నా సాంబశివారెడ్డిని, వైస్ చైర్మన్గా ఏడుకొండలును నియమించాలని నాలుగు నెలల క్రితం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానించి ప్రతిపాదనను పార్టీ అధిష్టానానికి పంపారు. దీనికి తోడు పాలక వర్గాన్ని సైతం రెండు నెలల క్రితం జరిగిన సమావేశంలో ఫైనల్ చేశారు. ఇప్పటి వరకూ వీళ్ళను నియమించిన దాఖలాలు లేవు. జేసీ ఇంతియాజ్ను పర్సన్ ఇన్చార్జిగా నియమించి వదిలేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పోస్టుతోపాటు పాలక మండలిని సైతం నియమించాలని ప్రతిపాదనలు పంపినా అధిష్టానం పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు నాలుగున్నరేళ్ళలో రెండు, మూడు సమావేశాలకు మాత్రమే హాజరుతున్నారు. విభేదాలు బట్టబయలు సమన్వయ కమిటీ సమావేశాలు జరిగిన ప్రతిసారీ పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి దిగుతుండటం, ఏ ఒక్క పని ముందుకు సాగకపోవడం, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా పార్టీ అధిష్టానం తాత్సారం చేస్తుండటంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు డుమ్మా కొడుతున్నారు. గత నెల జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం ముఖం చాటేయడంతో సమావేశం జరగలేదు. మాజీ మంత్రి రావెల కిషోర్బాబు పార్టీని వీడటం, మరి కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సైతం పక్క చూపులు చూస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్న తరుణంలో పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో మరింత మంది పార్టీని వీడే ప్రమాదం ఉందని హడలిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితిపై ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
ఎంత ఘాటు ప్రేమయో!
అక్కడ కత్తులు, ఇక్కడ కౌగలింతలు.. అక్కడ విసవిసలు, ఇక్కడ పకపకలు.. జాతీయ స్థాయిలో టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.. కానీ నర్సీపట్నంలో కనిపించిన దృశ్యం అందుకు భిన్నం. ఇక్కడ ఆదివారం జరిగిన కార్యక్రమం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. పైకి వైరం నటిస్తూ.. లోన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్న రాజకీయ నాటకమా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు హల్చల్ చేశారు. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా మాజీ మంత్రి చేత ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభింప చేశారు. విశాఖపట్నం, నర్సీపట్నం: ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు.. మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావుచే ప్రారంభింపజేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రొటోకాల్ను పక్కన పెట్టిమరీ ప్రారంభోత్సవాన్ని ఓ మాజీ మంత్రిచే చేయించడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా ఒక ఎత్తయితే ఆ మాజీ మంత్రి వైద్యశాఖ అధికారులకు సూచనలిస్తూ.. సర్కారు లక్ష్య సాధనకు కృషి చేయాలని జిల్లా వైద్యశాఖాధికారికి ఉద్బోధించడంతో అక్కడున్నవారు నివ్వెరపోయారు. బీజేపీ, టీడీపీల మధ్య వైరం కేవలం మాటల వరకేననీ, తెరవెనుక రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉందనడానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కామినేని బీజేపీని వీడి పచ్చ కండువా కప్పుకోవాలనుకుంటున్నారన్న వార్తలకు ఈ ఘటన బలాన్నిచ్చినట్లయిందని మరికొందరంటున్నారు. -
మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
'జేసీబీలు తగలబెడతానంటే జనం నమ్మరు'
సాక్షి, విశాఖపట్నం : దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్తుల కోసం పొట్లాడుకుంటున్నారని వైస్సార్సీపీ ఆనకాపల్లి సమన్వయ కర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. నర్సీపట్నంలో ఆర్టీసీ స్థలం ప్రత్యుషా కంపెనీకి కేటాయించినప్పుడు అయ్యన్న ఏం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జేసీబీలు తగల బెడతానంటే జనం నమ్ముతారా అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి నర్సీపట్నం ప్రజల దృష్జి మరల్చేందుకే అయ్యన్న డ్రామాలు చేస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు. -
మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప
జిల్లా పశుగణాభివృద్ధి కమిటీ అధ్యక్ష ఎన్నిక, ఒక పత్రికలో సర్వే పేరుతో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాల నేపథ్యంలో అలక పాన్పు ఎక్కిన మంత్రి గంటా తెలుగుదేశం పార్టీకి మాత్రం అంటీముట్టనట్లే ఉంటున్నారు..ఆ రెండు ఘటనల విషయంలో ఉప ముఖ్యమంత్రి, సీఎంల బుజ్జగింపులతో మంత్రి అలకపాన్పు దిగినట్లు కనిపించినా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం అంతగా పాల్గొనడం లేదు..నగరంలో గురువారం జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి నగరంలోనే ఉన్నా.. గంటా డుమ్మా కొట్టడం.. ఆయన గైర్హాజరుపై జిల్లా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనంతో వ్యంగ్య బాణాలు విసరడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారింది. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకమైన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. గత రెండు నెలలుగా ఆయన పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీ కార్యక్రమాలకు ఇవ్వడం లేదన్న వాదన పార్టీలో బలంగా విన్పిస్తోంది. మంత్రులు పాల్గొనే కీలక అధికారిక సమీక్ష సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. కీలక సమావేశానికి సైతం.. తాజాగా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప అధ్యక్షతన గురువారం జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి గంటా గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు పార్టీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి గంటా కోసం ఉదయం 9 నుంచి గంటన్నర పాటు వేచి చూశారు. కానీ ఆయన వచ్చే సూచనలు కన్పించకపోవడంతో 10.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. కీలకమైన ఈ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం పట్ల సహచర మంత్రుల్ది్దరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోనీ స్థానికంగా లేరా అంటే.. గంటా జిల్లాలోనే ఉన్నారు. భీమిలిలో తన అనుచరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారని తెలుసుకున్న ఇన్చార్జి మంత్రి చినరాజప్ప పుట్టినరోజు వేడుకలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఇవ్వకపోవడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప ‘మంత్రి గారికి ఏం పనులున్నాయో.. ఏమో ? అని చినరాజప్ప మంత్రి గంటానుద్దేశించి ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గంటా విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రిలిరువురూ తీవ్ర అసహనంతోనే బదులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గంటా కూడా సమాచారం ఇచ్చాం. ఆయన రాకపోతే ఏం చేస్తాం అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ మీటింగ్తో పనేముంది?..ఆయన కోసం ఏం చెబుతాం:అయ్యన్న మంత్రి గారికి బోల్డన్ని పనులు.. ఈ మీటింగ్తో పని ఏముంది అంటూ మరోమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యం గ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన తీరు మీకు తెలియదా? అని ప్రశ్నించారు. పార్టీ సమావేశాన్ని కాదని పుట్టిన రోజు వేడుకల్లో గంటా పాల్గొన్నారట..మీ దృష్టికి రాలేదా? అంటూ విలేకర్లు మరోసారి గుచ్చిగుచ్చి ప్రశ్నించగా ఆయన కోసం ఏం చెబుతాం? అంటూ బదులివ్వడానికి కూడా ఇష్టపడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలక వీడలేదా? డీఎల్డీఏ వివాదంతో అలకపాన్పు ఎక్కిన గంటా ఇంకా పాన్ను దిగలేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మంత్రి అయ్యన్న కోసం డీఎల్డీఏ పదవిని తన అనుచరుడు గాడు వెంకటప్పడుకు దక్కనీయకుండా హోంమంత్రి చినరాజప్ప కలెక్టర్పై ఒత్తిడి తేవడం పట్ల గంటా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చివరికి అదే చినరాజప్ప జోక్యంతో గంటా అనుచరుడే ఆ పదవి చేపట్టడంతో ఆ వివాదానికి తెరపడింది. కాగా ఓ పత్రికలో తనకు వ్యతిరేకంగా వచ్చిన సర్వేను సాకుగా చూపి గంటా కేబినెట్కు సైతం డుమ్మా కొట్టి గత నెలలో మరోసారి అలక బూనడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జూన్లో జరిగిన పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం పర్యటనలో మంత్రి పాల్గొంటారో లేదోనన్న పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే మళ్లీ ఇన్చార్జి మంత్రి చినరాజప్పే గంటా ఇంటికి వెళ్లి బుజ్జగించి తన వెంట తీసుకెళ్లి సీఎం పక్కనే కూర్చొబెట్టారు. సీఎం కూడా బుజ్జగించడంతో ఆయన కాస్త మెత్తబడినట్టు కనిపించారు. కానీ పార్టీ కార్యక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదని.. మరీ ముఖ్యంగా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప పాల్గొన్న కార్యక్రమాలకు గంటా డుమ్మా కొడుతుండడం టీడీపీలోనే చర్చనీయాంశమైంది. -
బాలకృష్ణకు పదవి ఇస్తారా ? లేదా ?
గుంటూరు, పెదనందిపాడు: రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని తెలుగు తమ్ముళ్లు నిలదీశారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నర్రా బాలకృష్ణకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ పదవి ఇస్తారో చెప్పే వరకు కదలనివ్వబోమని అడ్డుకున్నారు. మంగళవారం పెదనందిపాడులో టీడీపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమయంలో తాము ఒట్లు వేసి గెలిపించింది ఇందుకోసమేనా అంటూ మంత్రిని నిలదీశారు. తన చేతుల్లో ఏమీ లేదని, పార్టీ ఆధిష్టానంతో చర్చించి చెబుతానని మంత్రి సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న పోలీసులు తెలుగు తమ్ముళ్లను పక్కకు నెట్టేసి మంత్రిని పంపించారు. ఆగ్రహించిన కార్యకర్తలు లిఫ్టు ఇరిగేషన్ ప్రారంభోత్సావానికి వెళ్లకుంగా మిన్నకుండిపోయారు. -
గంటాకు వద్దు.. అయ్యన్నకు ముద్దు
మాతృసంస్థకు సరెండర్ చేసిన గంటా సీఈఓగా అందలమెక్కించిన అయ్యన్న ఎస్ఎస్ఏ పీవో వ్యవహారం మంత్రుల మధ్య ఆగని ఆధిపత్య పోరు విశాఖపట్నం: ఏ అధికారిపైనైనా ఆరోపణలొస్తే ఏం చేస్తారు? అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో వేస్తారు! లేదా బదిలీ చేస్తారు. మన విశాఖ జిల్లాలో అయితే అలా చేయరు. ఒక మంత్రి అతనిపై చర్య తీసుకుంటే మరో మంత్రి ఆ అధికారికి అడ్డగోలుగా కొమ్ముకాస్తారు. అందలమెక్కిస్తారు. ఒకే ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పడుతున్న తాజా వ్యవహారం ఇదీ! సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి నగేష్ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్డీ కూడా. నగేష్ చాన్నాళ్లుగా జోడు పదవుల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయ పథకం కింద సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో చాలా వరకు నిర్మాణం పూర్తయినట్టు ఎస్ఎస్ఏ అధికారులు మంత్రి గంటాకిచ్చిన నివేదికలిచ్చారు. వారం రోజుల క్రితం గంటా ఆనందపురం మండలంలో ఓ స్కూలుకు ఆకస్మిక తనిఖీకెళ్లినప్పుడు అక్కడ మరుగుదొడ్డి నిర్మాణం జరగకపోవడంతో పీవో నగేష్, ఈఈ భానుప్రసాద్లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేశారు. దీంతో నగేష్ తన మాతృసంస్థ సహకారశాఖకు వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ మూడ్రోజులు తిరక్కుండానే శ్రీకాకుళం జిల్లా సీఈవోగా నియమితులయ్యారు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. అయ్యన్నకు సన్నిహితంగా.. ఎప్పట్నుంచో మంత్రులు అయ్యన్న, గంటా వీలు చిక్కినప్పుడల్లా ఎవరు సత్తా వారు చాటుకుంటున్నారు. సాక్షాత్తూ మంత్రి గంటా తన ఓఎస్డీని సరెండర్ చేస్తే ఆయనకు అయ్యన్నపాత్రుడు శ్రీకాకుళం సీఈవో పోస్టు ఇప్పించినట్టు తెలుస్తోంది. గంటా తొలుత ఏరికోరి తెచ్చుకున్న నగేష్ కొన్నాళ్లుగా అయ్యన్నతో సన్నిహితంగా మెలుగుతుండడం కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరుగుదొడ్ల అవకతవకలపై గంటా స్పందించి సరెండర్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో నగేష్ వెనువెంటనే మంత్రి అయ్యన్నను ఆశ్రయించడం, ఆయన ఎస్ఎస్ఏ పీవోకంటే కీలకమైన శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో తనకు సన్నిహితుడు ఆ జిల్లా మంత్రి కె.అచ్చెన్నాయుడు కూడా సహకరించడంతో అయ్యన్న పంతం నెగ్గించుకోవడానికి వీలు చిక్కిందంటున్నారు. మరోవైపు ఎస్ఎస్ఏ పీవోతో పాటు సరెండర్ చేసిన ఈఈ ఇప్పటికీ అదే విధుల్లో కొనసాగుతుండడం విశేషం. ఈయన కొనసాగడానికి గుంటూరు జిల్లా మంత్రి సహకరించినట్టు తెలుస్తోంది. -
మూడో కుంపటి!?
ఎమ్మెల్సీ మూర్తి నేతృత్వంలో తెరపైకి మూడోవర్గం ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో బలప్రదర్శన గంటా, అయ్యన్న వర్గాలకు కొత్త సవాల్ జిల్లా టీడీపీలో వర్గవిభేదాల సెగ విశాఖపట్నం : జిల్లా టీడీపీలో వర్గ పోరు ఆసక్తికర మలుపుతిరుగుతోంది. ఇప్పటికే రెండువర్గాల పోరు రాజేస్తుంటే తెరపైకి మూడో కుంపటి వచ్చి చేరింది. మంత్రులు అయ్యన్న, గంటా వర్గాలకు పోటీగా జిల్లా టీడీపీలో మూడో వర్గం రూపపుదిద్దుకుంటోంది. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిని ముందుంచుతూ ఈ వర్గం బలప్రదర్శనకు సంసిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రుల వైఖరితో విసిగిపోయిన ఎమ్మెల్యేలు ఈ మూడో వర్గం గొడుకు కిందకు చేరుతుండటం గమనార్హం. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందున్న అంచనాల నేపథ్యంలో ఈ మూడో వర్గం సత్తాన్ని చూపడానికి పావులు కదుపుతోంది. మంత్రులకు మూర్తి చెక్!: మంత్రులు గంటా, అయ్యన్నలు వారి ప్రయోజనాలే చూసుకుంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. మూర్తి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో వారికి ఓ ప్రత్యమ్నాయాన్ని చూపించాయి. గంటా, అయ్యన్నలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా ఈయనకు సన్నిహితమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, గణబాబు ఎమ్మెల్సీ మూర్తితో జట్టుకట్టారు. ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు కూడా ఎంవీవీఎస్ మూర్తితో సాన్నిహిత్యం ఉంది. ఆయన కూడా ఈ వర్గంలో చేరిపోయారు. దాంతో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో ఈ వర్గం బలంగా తయారైంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వీరితో టచ్లో ఉంటుండటం గమనార్హం. మంత్రుల విఫలయత్నం : ఈ పరిణామాలు మంత్రులు అయ్యన్న, గంటాలకు కంటగింపుగా తయారైంది. ఎమ్మెల్సీ మూర్తికి నేరుగా సీఎం చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉండటం వారికి దడపుట్టిస్తోంది. పోటీగా ఓ బలమైన వర్గం రూపుదిద్దుకోవడం వారికి కంటగింపుగా మారింది. ఈ వర్గ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎంవీవీఎస్ మూర్తి జిల్లాకు తొలిసారి వచ్చినప్పుడు టీడీపీ నేతలు పెద్దగా హాజరుకాకుండా ఉండేలా కట్టడి చేశారు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు హాజరుకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా అయ్యన్నకు సన్నిహితుడైన సిటీ ఎమ్మెల్యే ఒకరు ద్వితీయశ్రేణి నేతలకు ఫోన్లు చేసి మరీ ఆ సమావేశానికి వెళ్లొద్దని చెప్పారు. మంత్రి గంటా అనుచర వర్గం పూర్తిగా రంగంలోకి దిగి ఆ సమావేశం విఫలం చేసేందుకు ప్రయత్నించింది. తాజా మాజీ కార్పోరేటర్లు ఎక్కువగా సమావేశానికి వెళ్లకుండా కట్టడి చేసింది. ఇద్దరు మంత్రుల యత్నాలు పూర్తిగా సఫలీకృతం కాకపోవడంతో మూర్తి శిబిరంలో ఉత్సాహాన్నింపింది. మంత్రి పదవే లక్ష్యంగా వ్యూహరచన : మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారన్న సమాచారం నేపథ్యంలో టీడీపీలో వర్గ పోరు పీటముడి మరింతగా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు గంటా, అయ్యన్నల వర్గ విభేదాలతో విసిగిపోయిన చంద్రబాబు కొత నేతను తెరపైకి తెస్తారని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ మూర్తివర్గం పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. మూడో మంత్రి పదవి అవకాశం ఇవ్వాల్సి వస్తే ఎలా చేయాలి?... ఇద్దరు మంత్రుల్లో ఒకర్ని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే ఎలా చేయలి అనే ప్రతిపాదనలతో చంద్రబాబును కలవాలని భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల అభిప్రాయాలను కూడగట్టే పనిలో నిమగ్నమైంది. హడావుడిలేకుండా చాపకింద నీరులా సాగిస్తున్న ఈ వ్యవహారం మాత్రం అయ్యన్న, గంటా వర్గాల్లో కారం చల్లుతోంది. -
పదవులు శాశ్వతం కాదు: మంత్రి అయ్యన్న
విశాఖపట్నం: పదవులు శాశ్వతం కాదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉన్నస్థానంలో ఉన్న రోజులున్నాయని, కింద కూర్చున్న రోజులు కూడా ఉన్నాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అందరూ చుట్టూ చేరుతారని, పదవి లేకపోతే ఎవరూ మాట వినరని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా వారి వెంట కార్యకర్తలు వెళ్లకూడదని సూచించారు. 10 ఏళ్లు అధికారంలో లేనప్పుడు మన అధికారులను ఎక్కడికెక్కడో పంపారని, ఇప్పుడు తీసుకువస్తే తప్పేముందని మంత్రి అన్నారు. -
అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపు
-
అయ్యన్న పేషీలో అవినీతి.. ఓఎస్డీ, పీఎస్ తొలగింపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యన పాత్రుడి పేషీలో అవినీతి ఆరోపణలు వచ్చిన ఇద్దరు అధికారులను తొలగించారు. 45 కోట్ల రూపాయల పనుల కేటాయింపునకు సంబంధించి మంత్రి ఓఎస్డీ, పీఎస్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మంత్రి దృష్టికి రావడంతో వారిద్దరినీ విధుల నుంచి తప్పించారు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి, పాడేరు రహాదారులకు సంబంధించి 45 కోట్ల రూపాయల విలువైన పనులను తమ వారికి ఇప్పించుకునేందుకు మంత్రి ఓఎస్డీ, పీఎస్ ప్రయత్నించారు. భారీ మొత్తంలో నిధులున్న పనులను నామినేషన్ల పద్ధతి ద్వారా కేటాయించాలని మంత్రికి ఫైలు పంపారు. ఈ విషయంపై మంత్రి ఆరా తీయగా, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెప్పారు. అధికారులు అవినీతికి పాల్పడినట్టు అయ్యన్న పాత్రుడి దృష్టికి రావడంతో వారిని తొలగించారు. గతంలో కూడా వీరిద్దరూ ఓ ఆర్డీఓ బదిలీ విషయంలో జోక్యం చేసుకున్నట్టు మంత్రి దృష్టికి వచ్చింది. ఆర్డీఓ నుంచి తీసుకున్న 30 లక్షల రూపాయల లంచాన్ని మంత్రి ఆదేశాల మేరకు అధికారులు వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. -
టీడీపీ పంచాయతీ
వైరివర్గాలతో బాబు 14న భేటీ గవిరెడ్డి, ఆడారిలకు పిలుపు గంటా, అయ్యన్నలకూ క్లాస్! జిల్లా టీడీపీని అతలాకుతలం చేస్తున్న అయ్యన్న, గంటా వర్గం విభేదాల సెగ సీఎం చంద్రబాబును తాకింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఆయనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నెల 14న జిల్లా పర్యటన సందర్భంగా మంత్రులు గంటా, అయ్యన్న వర్గాలన కూర్చొనబెట్టి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. విభేదాలకు తెరముందున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావులకు ఇప్పటికే కబురు అందింది. విశాఖపట్నం: జిల్లా టీడీపీలో విభేదాలకు ఆద్యులైన తెరవెనుక పాత్రధారులు మంత్రులు గంటా, అయ్యన్నలను పిలిచి మాట్లాడాలని సీఎం చంద్రబాబు నిశ్చయానికి వచ్చారని సమాచారం. దీంతో అధినేత ముందే తాడోపేడో తేల్చుకోవడానికి ఇరు వర్గాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 14న విశాఖపట్నంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రత్యేకంగా కలవాలని గవిరెడ్డి రామానాయుడు, ఆడారి తులసీరావులకు పార్టీ కార్యాలయం నుంచి వర్తమానం అందింది. జిల్లాలో ఇటీవల పార్టీకి నష్టకలిగించేలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో ఆయనకే వివరణ ఇవ్వాలని కూడా చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రులు గంటా, అయ్యన్నలకు కూడా తెలిపారు. తద్వారా గవిరెడ్డి, ఆడారిలు చంద్రబాబును కలిసే సమయంలో వారిద్దరూ ఉండాలని చెప్పకనే చెప్పారు. ఇలా చంద్రబాబు అందర్నీ ప్రత్యేకంగా పిలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ పరువును బజారును పడేసిన గవిరెడ్డి, ఆడారిలను చంద్రబాబు తీవ్రస్థాయిలో మందలించనున్నారని స్పష్టమైంది. ఇప్పటికే ఎన్నికలు హామీలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల్లో పార్టీ, ప్రభుత్వ ప్రతష్ట దిగజారింది. మరోవైపు పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ పార్టీ పరువు బజారున పడేస్తుండటాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నారు. అందులోనూ పార్టీ నేతలే సహచార నేతలు, ప్రభుత్వంపైన అవినీతి ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబును తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ విషయాలపైనే చంద్రబాబు గవిరెడ్డి, ఆడారిలను మందలిస్తారని తెలుస్తోంది. మంత్రులకూ క్లాస్! మంత్రులు గంటా, అయ్యన్నలను కూడా చంద్రబాబు మండిపడుతున్నారు. అందుకే వారిద్దరికీ కూడా ఆయన గట్టిగా క్లాస్ పీకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగైదుసార్లు సుతిమెత్తగా చెప్పినప్పటికీ తీరు మార్చుకోకపోవడంపట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో తాను మరో ప్రత్యమ్నాయ నేతను చూసుకోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేస్తారని తెలుస్తోంది. జిల్లా, జీవీఎంసీ పార్టీ అధ్యక్షుల మార్పు!? వర్గ విభేదాల పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోవడంతో చంద్రబాబు పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్నారు. జిల్లా, జీవీఎంసీ పార్టీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించాలని యోచిస్తున్నారు. గంటా, అయ్యన్నవర్గాలకు చెందకుండా తటస్థంగా ఉండే నేతలను సూచించాల్సిందిగా చంద్రబాబు మంత్రి నారాయణకు చెప్పారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కత్తులు నూరుతున్న వైరివర్గాలు చంద్రబాబు వద్ద పంచాయితీకి గంటా, అయ్యన్నవర్గాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకరు చేసిన తప్పులను మరొకరు ఎత్తిచూపడానికి జాబితా రూపొందిస్తున్నారు. గవిరెడ్డి, ఆడారిల విషయం వరకే చంద్రబాబు పరిమితమైతే ఒకలా... నేరుగా తమనే లక్ష్యంగా చేసుకుంటే మరోలా ఎదురుదాడి చేయాలని భావిస్తున్నారు. దాంతో ఈ నెల 14న సమావేశం ఎలా ఉండబోతోందనని టీడీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
చేరికలోనూ.. చెరోవైపు
⇒ ఆధిపత్యం కోసం మంత్రుల అమీతుమీ ⇒ కొణతాల కోసం అయ్యన్న ఆరాటం ⇒ దాడి కోసం గంటా పోరాటం ⇒ టీడీపీలో మండుతున్న విభేదాల కుంపటి విశాఖపట్నం కాదేదీ ఆధిపత్యపోరుకు అనర్హం అన్నరీతిలో టీడీపీలో మంత్రులు అయ్యన్న, గంటాల మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి చోటామోటా నేతల వరకు ఇరువర్గాలుగా చీలిపోయారు. అంతటితో సరిపోలేదనుకున్నారేమో మంత్రులు ఇద్దరూ ప్రస్తుతం ఏ పార్టీలో లేని నేతలకు కూడా గాలం వేస్తూ తమ వర్గబలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. గంటా వర్గం ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు అయ్యన్న కొణతాలకు స్వాగతహస్తం చాస్తుండగా... అయ్యన్నకు పక్కలో బల్లెంలా తయారు చేసేందుకు దాడి పార్టీలో చేరికకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఒకరి ఎత్తును చిత్తు చేసేందుకు మరొకరు తమ అనుచరవర్గంతో వీధి పోరాటాలు చేయిస్తున్నారు. గంటా ఆధిపత్యంపై కొణతాల అస్త్రం.. - అయ్యన్న ఎత్తుగడ పదేళ్ల తరువాత పార్టీ అధికారం చేపట్టినప్పటికీ జీవీఎంసీ పరిధిలో పట్టులేకపోవడం అయ్యన్నకు అసంతృప్తిగా ఉంది. జీవీఎంసీ పరిధిలోని ఎంపీ అవంతితోపాటు ఎక్కువమంది ఎమ్మెల్యేలు గంటా వర్గంగా కొనసాగుతుండటం ఆయనకు కంటగింపుగా మారింది. ప్రధానంగా పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ అవంతి పూర్తిగా గంటాకు వర్గీయులుగా ఉన్నారు. ఇటీవల ఆర్డీవోల బదిలీ వ్యవహారంతోసహా పలు కీలక విషయాల్లో అయ్యన్నను తీవ్రంగా వ్యతిరేకించి ఢీ అంటే ఢీ అన్నారు. దాంతో కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకురావడం ద్వారా జీవీఎంసీ పరిధిలో గంటా ఆధిపత్యానికి గండికొట్టాలని భావించారు. ఈమేరకు కొన్ని రోజులుగా తెరవెనుక మంతనాలు ముమ్మరం చేశారు. కొణతాలను ఒప్పించేందుకు ఆయన ప్రధాన అనుచరుడు గండిబాబ్జీ ద్వారా పావులు కదిపారు. బాబ్జీకి అవసరమైన పనులు చేస్తామని ఎర వేయడం ద్వారా కొణతాలను పార్టీలోకి రప్పించాలన్నది అయ్యన్న వ్యూహంగా ఉంది. అయ్యన్నపై ‘దాడి’ - గంటా ప్రతివ్యూహం మరోవైపు రూరల్ జిల్లాపై అయ్యన్న ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు మంత్రి గంటా చకాచకా పావులు కదుపుతున్నారు. అందుకే కొన్ని రోజులుగా దాడి వీరభద్రరావుతో మంతనాలు సాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీలో 25ఏళ్లు అయ్యన్న వ్యతిరేకవర్గానికి నేతృత్వం వహించిన చరిత్ర దాడికి ఉంది. గతంలో ఎన్టీరామారావు మంత్రివర్గంలో ఉన్నప్పటి నుంచి వీరిద్దరూ ఉప్పూనిప్పులా ఉండేవారన్నది బహిరంగ రహస్యమే. అందుకే మరోసారి అయ్యన్న ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ‘దాడి’ని ప్రయోగించాలని గంటా భావిస్తున్నారు. దాడి ఇటీవల పలుసార్లు మంత్రి గంటాతో సమావేశం కావడం టీడీపీలో చర్చనీయాంశమైంది. దాడికి మార్గం సుగమం చేస్తే కొణతాల పార్టీలోకి వచ్చే ఆలోచనను విరమించుకుంటారన్నది గంటా వర్గం వ్యూహంగా ఉంది. సై అంటే సై కొణతాల, దాడి చేరికల అంశంలో తమ పంతం నెగ్గించుకునేందుకు గంటా, అయ్యన్న వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కొణతాల చేరికకు లైన్ క్లియర్ అవుతోందన్న సమాచారం లీక్ కావడంతో గంటా వర్గం తీవ్రంగా స్పందించింది. అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో గంటా వర్గీయులు కొణతాల దిష్టిబొమ్మలను దహనం చేయడం ద్వారా తమ ఆగ్రహావేశాలను వెళ్లగక్కారు. కొణతాలను చేర్చుకోవాలని నిర్ణయిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబుకు పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు అయ్యన్న కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి సిద్ధపడుతోంది. దాడి చేరికను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేస్తోంది. అందుకోసం విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, ఈస్టు ఎమ్మెల్యే వెలగపూడిలతోసహా అయ్యన్న హైదరాబాద్లోనే అమీతుమీ తేల్చుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో వర్గపోరు మరోసారి బజారున పడుతోంది. మునుముందు పరిణామలు ఎలా ఉంటాయోనని టీడీపీవర్గాలు చర్చించుకుంటున్నాయి.