Five State Election Results
-
మోదీ హామీలపైనే ప్రజలకు భరోసా
న్యూఢిల్లీ: తప్పుడు హామీలతో విపక్షాలు సాధించేదేమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ వాస్తవాన్ని అవి ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ ఇచి్చన, ఇస్తున్న ‘మోదీ హామీలు’ దేశవ్యాప్తంగా ప్రజల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. ‘‘వాటిని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు చక్కని రుజువు’’ అని ప్రధాని వివరించారు. కేంద్ర పథకాలు ప్రజలందరికీ చేరేలా చూసేందుకు చేపట్టిన వికసిత్ సంకల్ప్ యాత్ర లబి్ధదారులతో శనివారం ఆయన ముచ్చటించారు. ఎన్నికల్లో నెగ్గడానికి ముందు ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలా అవసమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏ పారీ్టకైనా ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడం తెలివైన పని కాదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని, భావోద్వేగపూరిత బంధాన్ని ఏర్పాటు చేయగలిగాం. ప్రజలు తమదిగా భావిస్తున్న ప్రభుత్వం మాది. మోదీ ప్రతి ఒక్కరికీ సేవకుడు. పేదలను పూజిస్తాడు. వారి క్షేమం కోసం తపిస్తాడు. ప్రతి పేదా, తల్లి, చెల్లి, రైతు, యువతి, యువకుడు నాకు వీఐపీయే’’ వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలను ప్రజలు నమ్మకపోవడానికి అవి ఇస్తున్న తప్పుడు హామీలు, ప్రకటనలే కారణం. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వాళ్లు ప్రజా క్షేమాన్ని పట్టించుకుని ఉంటే వారికి నేడు ఇంతటి నిరాదరణ ఉండేదే కాదు. ఎన్నికల్లో గెలిచేది ప్రజాక్షేత్రంలోనే తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని విపక్షాలకు చురకలు అంటించారు. పక్కా ఇల్లు, తాగునీటి నల్లా, మరుగుదొడ్డి, ఉచిత వైద్యం, రేషన్, గ్యాస్, విద్యుత్, బ్యాంకు ఖాతాల వంటి సదుపాయాలు దేశ ప్రజలందరికీ అందుతున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. పీటీఐ ప్రధాన కార్యాలయం సందర్శన ఢిల్లీలో ఉన్న ప్రముఖ వార్తాసంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. కొత్తగా ప్రారంభించిన వీడియో సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఒక వార్తసంస్థ కార్యాలయానికి మోదీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి సీనియర్ ఎడిటోరియల్, ఎగ్జిక్యూటివ్ విభాగాల సిబ్బందితో మాట్లాడారు. మీడియాకు ఎదురయ్యే సవాళ్లు, మీడియాలో అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రధాని అది ఆలోచించడం మానేస్తే మంచిది : కాంగ్రెస్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినపుడు ప్రధాని జ్ఞానం ఎక్కడ పోయిందని కాంగ్రెస్ లోక్సభపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేస్తే మంచిదని ప్రధానికి సూచించారు. కాగా, సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడుతూ ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్కు మంచి అవకాశం. ఈ ఓటమి తర్వాత వాళ్లు తమ ఫ్రస్టేషన్ తీర్చుకోవడానికి ప్లాన్లు వేసే కంటే ఈ అవకాశం నుంచి వాళ్లు నేర్చుకోవాలి’ అని మోదీ సూచించారు. ‘ఈ తొమ్మిదేళ్లలో జరిగింది వదిలేసి కనీసం ఈ సెషన్లోనైనా పాజిటివ్గా ముందుకు వెళితే ప్రజలు కాంగ్రెస్ పట్ల అభిప్రాయం మార్చుకునే చాన్స్ ఉంది. వారి కోసం కొత్త తలుపులు తెరచుకునే అవకాశం ఉంది’ అని మోదీ కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాజాగా వెలువడిన ఐదు స్టేట్స్ ఎన్నికల ఫలితాల్లో ఒక్క తెలంగాణలో తప్ప రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అధికారం గ్యారెంటీ అనుకున్న ఛత్తీస్గఢ్లోనూ ఎగ్జిట్పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్కు షాకిచ్చింది. ఇదీచదవండి..మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ -
వరుస రాజీనామాలు.. మోదం, ఖేదం!
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు అలా వెలుడ్డాయో, లేదో ఇలా రాజీనామాల పర్వం మొదలైంది. ఓడిపోయిన పార్టీలకు చెందిన నాయకులు నైతిక బాధ్యతగా పదవులు వదులుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొంత మంది ఎంపీలు.. పార్లమెంట్ సభ్యత్వాలను త్యజించారు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. సంగ్రూర్ జిల్లాలోని ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. కాగా, కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమితో పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పదవిని కోల్పోయారు. మండలికి యోగి రాజీనామా యూపీ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో పర్యాయం ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్.. శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకున్నారు. తాజా ఎన్నికల్లో గోరక్పూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు. దీంతో మార్చి 21న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూలై 6న ఎమ్మెల్సీ పదవి గడువు ముగియనుంది. ఎంపీ పదవిని వదులుకున్న అఖిలేశ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఎంపీ పదవిని త్యాగం చేశారు. ఆజంగఢ్ లోక్సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలిచారు. యూపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన ఎంపీ పదవిని వదులుకున్నారు. అఖిలేశ్ బాటలో ఆజంఖాన్ సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్ కూడా అఖిలేశ్ బాటలో నడిచారు. రాంపూర్ లోక్సభ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఆయన విజయం సాధించారు. (క్లిక్: కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!) పీసీసీ ప్రెసిడెంట్లకు షాక్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నిరుత్సాహపూరిత ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఆయ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల పదవులను పీకిపారేసింది. పదవుల నుంచి దిగిపోవాలని సోనియా గాంధీ అల్టిమేటం జారీ చేయడంతో ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. అజయ్ కుమార్ లల్లూ(యూపీ), గణేశ్ గోడియాల్(ఉత్తరాఖండ్), నవజ్యోత్ సింగ్ సిద్ధూ(పంజాబ్), గిరీష్ చోడంకర్(గోవా), నమీరక్పామ్ లోకేన్ సింగ్(మణిపూర్) పదవులు కోల్పోయారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) ఎమ్మెల్యే పదవికి చద్ధా రాజీనామా ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్కు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంచార్జిగా వ్యవహరించిన ఢిల్లీ యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్ధా తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. -
సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం వాడివేడిగా సాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూసిన రాష్ట్రాల్లో అధ్యక్షులను తప్పుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణంగా సోనియా ఆదేశాల మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ చీఫ్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా.. పీసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. మరోవైపు.. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు గణేశ్ గోడియాల్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం.. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సోనియా ప్రకటించారు. సమావేశంలో అసమ్మతి నేతలు సహా అందరి అభిప్రాయాలను ఆమె తెలుసుకున్నారు. అయితే సంస్థాగత ఎన్నికల వరకు సోనియా నాయకత్వం కొనసాగించాలని ప్రతి సభ్యుడు కోరారని సూర్జేవాలా చెప్పారు. ఆగస్టు 21– సెప్టెంబర్ 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు బీజేపీ– ఆర్ఎస్ఎస్ గాంధీ కుటుంబంపై బురద జల్లుతున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. As desired by the Congress President I have sent my resignation … pic.twitter.com/Xq2Ne1SyjJ — Navjot Singh Sidhu (@sherryontopp) March 16, 2022 -
యూపీలో ఘోరపరాభవం.. అయినా సంబురాల్లో AAP!!
లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒకానొక దశలో యూపీ కంటే.. పంజాబ్ ఫలితాల మీదే దేశం మొత్తం ఆసక్తి కనబర్చింది. ఆప్ దెబ్బకు పంజాబ్ రాజకీయ చరిత్ర సంపూర్ణంగా మారిపోయింది. మొత్తం 117 అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ ఏకంగా 92 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే ముందు.. పంజాబ్ వ్యాప్తంగా ర్యాలీలు, రోడ్షోలతో పండుగను జరుపుకోనుంది ఆప్. అయితే ఒక్క సీటు కూడా గెల్వకుండా చేదు అనుభవం చవిచూసిన యూపీలోనూ జోరుగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమైంది ఆప్. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో ఆప్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. అక్కడ ఓటింగ్ శాతం 0.38 మాత్రమే వచ్చింది. విచిత్రం ఏంటంటే.. ఇది నోటా కంటే తక్కువ. చాలామంది ఆప్ అభ్యర్థులు డిపాజిట్ కూడా గల్లంతు అయ్యారు. అయినప్పటికీ పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయానికి సంబంధించి యూపీలో ర్యాలీలు చేపట్టబోతోంది. ఈ విషయాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. యూపీ ఫలితాలు ఎలా ఉన్నా.. ఢిల్లీ మోడల్కే మాకు ఆదర్శం. ప్రతీ పల్లెలో జెండా ఎగరాలి. ప్రతీ ఒక్కరూ మా పార్టీ గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ లో తాము సాధించిన ఘన విజయం.. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారబోతోందనే ప్రజల భావనను తెలియజేస్తోందని సింగ్ చెప్పారు. తమ పార్టీ గుర్తు అయిన చీపురుతో దేశంలోని రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో గ్రామ స్థాయి నుంచి ఆప్ కు బలమైన క్యాడర్ ను తయారు చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండేలా పోరాడుతామని... ఈ పోరాటం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. మార్చి 23, 24 తేదీల్లో లక్నోలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహిస్తామని... అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పర్ఫామెన్స్ పై ఈ సమావేశాల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యవస్థను విస్తరించే అంశంపై కూడా చర్చిస్తామని అన్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికలు బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మధ్యే జరిగాయని... అందువల్లే ఇతర పార్టీలకు ఓట్లు పడలేదని అభిప్రాయపడ్డారు సంజయ్ సింగ్. -
పార్టీ కోసం జీవితాలు ధారపోశాం.. ఇప్పుడిలా! : గులాం నబీ ఆజాద్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం అయ్యింది. పంజాబ్లో అధికారం కోల్పోయి.. యూపీలో అవమానకరమైన ఫలితాల్ని చవిచూసింది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీకి సంస్కరణలు ‘ఇప్పటికైనా అవసరమ’నే విషయాన్ని ఇటు సీనియర్లు, అటు జూనియర్లు గుర్తు చేస్తున్నారు. ‘‘ఫలితాలతో దిగ్భ్రాంతికి లోనయ్యా. ఒక్కో రాష్ట్రంలో మా ఓటమిని చూసి నా గుండె రక్తమోడుతోంది. పార్టీ ఇలా పతనం అవుతుండడం చూడలేకపోతున్నా’’ అని CWC సభ్యుడు గులాం నబీ ఆజాద్ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ కోసం మా యవ్వనాన్ని, జీవితాన్ని ధారపోశాం. పార్టీలోని బలహీనతలను గురించి నేను మరియు నా సహచరులు చాలా కాలంగా మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం గమనించి.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా’’ అని గులాం నబీ ఆజాద్ తెలిపారు. మరో సీనియర్ నేత శశిథరూర్ కూడా ‘మార్పు అనివార్యం..సంస్కరణ అవసరం’ అంటూ ట్వీట్ చేశారు. 1/2 All of us who believe in @INCIndia are hurting from the results of the recent assembly elections. It is time to reaffirm the idea of India that the Congress has stood for and the positive agenda it offers the nation — and (contd) — Shashi Tharoor (@ShashiTharoor) March 10, 2022 ‘‘అంతా తప్పు జరిగింది. కాంగ్రెస్లో సీరియస్గా పోటీ చేయాలనే ఉద్దేశ్యం లేదు...నరేంద్ర మోదీ, అమిత్ షా లాగా పూర్తి బలంతో పోరాడి ఉండాల్సింది. పంజాబ్లో నాయకత్వాన్ని మార్చుకోవడంతో సంస్థలో గందరగోళం నెలకొంది. మా ఇన్నింగ్స్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అయితే కాంగ్రెస్లో యువకుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్(75). జీ-23 భేటీ 2014 నుంచి ఇప్పటిదాకా 45 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెల్చింది కేవలం ఐదు మాత్రమే. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మాత్రమే అధికారంలో ఉంది. నాయకత్వ.. వ్యవస్థీకృత లోపాలు, కొత్తవారికి అవకాశం ఇవ్వకపోవడం, కష్టపడి పనిచేసేవారిని పక్కనబెట్టడం లాంటివి కాంగ్రెస్లో లుకలుకలకు కారణం అవుతున్నాయి. దీన్ని గమనించిన 23 మంది పార్టీ సీనియర్ నేతలు అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. ఆ హెచ్చరికలను మరోలా అర్థం చేసుకుని.. జీ-23గా పేరుపెట్టి సీనియర్లను వేరుగా చూడటం ప్రారంభించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి నేపథ్యంలో.. ఈ జీ-23లోని కొందరు సభ్యులు.. గులాంనబీ ఆజాద్ ఇంట్లో శుక్రవారం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఏమని ప్రచారం చేయాలి? యూపీ ఎన్నికల్లో భాగంగా.. ఒక్క ప్రియాంక గాంధీనే ఆ రాష్ట్రంలో 209 ర్యాలీల్లో పాల్గొంది. లఖింపురీ రైతుల హత్య గురించి హత్రాస్కు వెళ్లి మరీ రాహుల్తో గళం వినిపించారామె. కానీ, ఏదీ పని చేయలేదు. ఈ నేపథ్యంలో యువ వర్గం.. సమర్థవంతమైన మార్పు కావాలనుకుంటోంది. ‘హిందూ-ముస్లిం కార్డుతో బీజేపీ గెలుస్తోందని పదే పదే చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రచారానికి ఆస్కారం ఎక్కడ ఉంది? పంజాబ్లో ముస్లిం ఓటర్ల శాతం ఎంత? సామర్థ్యం లేని నాయకత్వం వల్లే ఇలాంటి ఫలితాల్ని చూడాల్సి వస్తోంది. అది పార్టీ అధినాయకత్వం కూడా అంగీకరించాల్సిందే. నానాటికీ సంక్షోభంలోకి జారుకొంటున్న పార్టీని కాపాడుకోవాలంటే.. పాత రక్తాన్ని తప్పించి.. తమకు అవకాశం ఇవవ్వాలని కోరుకుంటోంది యువరక్తం. ఒకవైపు సీనియర్ల సలహాలు.. సీనియర్ల గోల పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ వర్కింగ్ కమిటీ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. -
ప్రధాని మోదీకి ప్రశాంత్ కిషోర్ కౌంటర్.. ‘సాహెబ్’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో పూర్తి మెజార్టీతో దూసుకెళ్లింది. ముఖ్యంగా యూపీలో మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తరప్రదేశ్ ఓట్లరు అధికార యోగి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇచ్చారు. కాగా, ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలను ప్రజలు నమ్మిన కారణంగాన తమ పార్టీకి భారీ మెజార్టీ వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పును ప్రజలు 2022లోనే తెలియజేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రశాంత్ కిషోర్.. మోదీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. మోదీ వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవే అని ఆరోపించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకొని బీజేపీవైపు ఓటర్లను ఆకర్షించేందుకే ప్రధాని మోదీ తెలివిగా ఇలా మాట్లాడారని అన్నారు. ఈ విషయం సాహెబ్కు కూడా తెలుసంటూ సెటైరికల్గా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆ ఏడాదిలోని పరిణామాల వల్ల డిసైడ్ అవుతుంది తప్ప రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కాదని కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు జనం ఆకర్షితులు కావొద్దని అన్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. Battle for India will be fought and decided in 2024 & not in any state #elections Saheb knows this! Hence this clever attempt to create frenzy around state results to establish a decisive psychological advantage over opposition. Don’t fall or be part of this false narrative. — Prashant Kishor (@PrashantKishor) March 11, 2022 -
బీజేపీ భారీ విజయం.. ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన ఇదే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నాలుగు స్టేట్స్లో భారీ విజయాన్ని అందుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్నఈ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టి భారీ మెజార్టీతో కాషాయ జెండాను ఎగురవేసింది. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విజయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో హోలీ పండుగ ముందుగానే వచ్చిందని అన్నారు. బీజేపీ నిర్ణయాలు, విధానాలపై నమ్మకం పెరిగిందని, బీజేపీ స్థానాల సంఖ్య పెరిగిందని తెలిపారు. మహిళలు, యువత బీజేపీకి అండగా నిలిచారని, తొలిసారి ఓటేసిన యువకులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దేశంలో అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సైతం స్పందించింది. ప్రముఖ పత్రిక DAWN ఎన్నికల ఫలితాలపై ఓ కథనాన్ని రాసింది. దీనిలో బీజేపీ భారీ విజయాన్ని అందుకుందని పేర్కొంది. బీజేపీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ విజయం సాధించిందని తెలిపింది. కోవిడ్ కట్టడి, ఉద్యోగాల కొరత, వ్యవసాయ చట్టాల అమలుపై ఒకానొక సమయంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. ఎన్నికలపై ఆ ప్రభావం కనిపించలేదని వెల్లడించింది. మరోవైపు కరోనా సమయంలో పేదలకు ఉచిత రేషన్, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాలు బీజేపీకి పాజిటివ్గా మారాయని రాసుకొచ్చింది. కొన్ని పథకాలు ప్రజలకు ఆకర్షించాయని పేర్కొంది. దీంతో ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నట్టు తెలిపింది. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుపై కూడా కీలక కామెంట్స్ చేసింది. పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించిందని తెలిపింది. 2012 లో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి ఉద్భవించిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ కాలంలో ప్రజల ఆదరణను పొందినట్టు పేర్కొంది. ఢిల్లీ, పంజాబ్లో విజయాలు సాధించినట్టు రాసుకొచ్చింది. మరోవైపు Al Jazeera కూడా ఫలితాలపై స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీపార్టీలు ఘన విజయాన్నిఅందుకున్నాయని తెలిపింది. బీజేపీ, ఆప్ పార్టీలు ప్రజల ఆదరణతో గెలుపొందినట్టు వివరించింది. -
కాంగ్రెస్ ఘోర పరాజయం.. సోషల్ మీడియాలో రాహుల్, సిద్ధూపై సెటైర్లు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. పంజాబ్లో ఉన్న ప్రభుత్వాన్ని సైతం పోగొట్టుకుంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చలేకపోయిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కాంగ్రెస్పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని, అన్నా, చెల్లెళ్ల బ్రాండ్ విలువ కూడా తగ్గిపోయిందని విమర్శకులంటున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రియాంకాగాంధీ యూపీ ఎన్నికల్లో ఎవరూ చేయనంత ప్రచారం చేశారు. మొత్తం 209 ర్యాలీలు, రోడ్ షోలలో ప్రసంగించారు. యూపీ మీదే ఆమె ఎక్కువగా కేంద్రీకరించినా, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ల్లోనూ తిరిగారు. మహిళా సమస్యలవంటి ప్రధాన అంశాలపై ఫోకస్ చేసినా, తన సభలకు పెద్ద ఎత్తున ప్రజలను రప్పించగలిగినా, వారిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు. ఇక రాహుల్గాంధీ సైతం ఐదు రాష్ట్రాల్లో పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అయినా ఆయన మ్యాజిక్కేమీ పనిచేయలేదు. రాహుల్, ప్రియాంకాగాంధీలు పార్టీలోనూ విశ్వసనీయత కోల్పోతున్నారని, వైఫల్యానికి బాధ్యులను చేస్తూ తొందరల్లోనే సొంత పార్టీ నేతలే వారి మీద కత్తులు దూయడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్లో దళితుడిని ముఖ్యమంత్రిని చేశామని చూపించే ప్రయత్నం చేశారు కానీ అది బెడిసికొట్టింది. ప్రియాంకా గాంధీ కష్టపడ్డారనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఆమె బాగా పనిచేశారు. ప్రధానమైన మహిళల సమస్యలను లేవనెత్తారు. అయినా రాజకీయాల్లో మ్యాజిక్కులంటూ ఉండవు, కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్కు అలాంటి టైమ్ నడుస్తోంది. రాజీకీయాలు ఒక్కరాడే ఆట కాదు, ఇది టీమ్గేమని గాంధీ కుటుంబం ఇప్పటికైనా తెలుసుకోవాలని, బలమైన నేతలను ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో పార్టీ విఫలమైందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఓటమిపాలైన ప్రతిసారీ పార్టీలో అసమ్మతిరాగాలు పెరుగుతాయి. అలా గొంతెత్తిన వారిని తగ్గించే ప్రయత్నమూ జరుగుతుంది. అదే సమస్యకు అసలు కారణం. రాష్ట్రాల్లో స్థానిక నాయకులకు ప్రోత్సాహం పెరగాలి. జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సచిన్ పైలట్వంటి నేతలను కొత్తనాయకత్వంగా చూపించే ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ అందులో విఫలమైంది. గతంలో కాంగ్రెస్కు రాష్ట్రాల్లో నమ్మినబంట్ల వంటి రాజకీయ నాయకులున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు నేతలే దేశం మొత్తాన్ని సమీకరించాలనుకున్నారు. ఇక్కడే అన్నాచెల్లెళ్లు విఫలమయ్యారంటున్నారు విశ్లేషకులు. మీమ్స్ అండ్ జోక్స్.. ఐదు రాష్ట్రాల్లో ఓటమితో కాంగ్రెస్పై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వైరలవుతున్నాయి. రాహుల్గాంధీ, నవజ్యోజోత్సింగ్సిద్ధూలపై జోకులు పేలుతున్నాయి. ‘కాంగ్రెస్కు మరో ఆప్షన్ లేదు. గాంధీ ఫ్యామిలీని వదిలేసి.. కొత్త నాయకత్వంతో ముందుకు రావాలి. లేదంటే పార్టీపనైపోయినట్టేనని ఈ ఎన్నికల ఫలితాలు సందేశమిస్తున్నాయి’ అని ఫిల్మ్ మేకర్ మనీష్ ముంద్రా ట్వీట్ చేశారు. ఇక రాహుల్గాంధీ విదేశాలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు ట్వీట్స్ చేశారు. ‘రాహుల్ గాంధీ బ్రేక్ తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ఇక కాలమిస్ట్, రచయిత ఆనంద్ రంగనాథన్ అయితే ఏకంగా ఫ్లైట్ అనౌన్స్మెంట్ను అనుకరిస్తూ ట్విట్టర్ వేదికగా విమర్శించాడు. పంజాబ్లో పార్టీ ఓటమికి కారణమయ్యారంటూ మాజీ క్రికెటర్ సిద్ధూపైనా నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ ఎగ్జిట్పోల్స్ చూడగానే సిద్ధూకి కపిల్ శర్మ ఫోన్ కాల్ వస్తుందని, తనకూ పోటీ వస్తున్నందున అర్చనా పురాణ్ శర్మ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. -
మోదీ చేతికి వజ్రాయుధం.. తెరపైకి రాష్ట్రపతి ఎన్నికలు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టుని పెంచాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉంటారు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించి ఉంటే బీజేపీకి ఒడిశాలోని బీజేడీ, తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మద్దతు అవసరమయ్యేది. కానీ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ విజయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి అడ్వాంటేజ్గా మారిందని లోక్సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 233 మందితో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4,120 మంది మొత్తంగా 4,896 మంది సభ్యులుగా ఉంటారు. ఎంపీల ఓటు విలువ 708గా ఉంటే, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాలను బట్టి మారిపోతుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 83,824, పంజాబ్లో 13,527, ఉత్తరాఖండ్లో 4,480, గోవాలో 800, మణిపూర్లో 1080గా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చీలికలు తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరుని కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని కొందరు డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ 10,98,903లో 50శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలరు. జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రతిపాదించిన అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
రాష్ట్రపతి ఎన్నికలపై పెరిగిన బీజేపీ పట్టు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టుని పెంచాయి. ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగిసిపోతుంది.రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉంటారు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించి ఉంటే బీజేపీకి ఒడిశాలోని బీజేడీ, తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మద్దతు అవసరమయ్యేది. కానీ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ విజయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి అడ్వాంటేజ్గా మారిందని లోక్సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 233 మందితో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4,120 మంది మొత్తంగా 4,896 మంది సభ్యులుగా ఉంటారు. ఎంపీల ఓటు విలువ 708గా ఉంటే, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాలను బట్టి మారిపోతుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 83,824, పంజాబ్లో 13,527, ఉత్తరాఖండ్లో 4,480, గోవాలో 800, మణిపూర్లో 1080గా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చీలికలు తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరుని కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని కొందరు డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ 10,98,903లో 50శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలరు. జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రతిపాదించిన అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
యూపీలో మరోసారి ‘కమల’ వికాసం (ఫోటోలు)
-
యూపీలో బీజేపీ భారీ విక్టరీ.. సీఎం యోగి కామెంట్స్ ఇవే..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి భారీ విజయాన్ని అందుకుంది. సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోషించబోతున్నారు. యూపీ ప్రజలు యోగి సర్కార్పై నమ్మకంతో మరోసారి కాషాయ పార్టీకి అనూహ్య మెజార్టీని అందించారు. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీకి విజయం అందించిన ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. యూపీలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించిందని కితాబిచ్చారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండోసారి తమకు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు. యూపీలో ఎన్నికలు తొలిసారి ప్రశాంతంగా జరిగాయని ప్రశంసించారు. పార్టీలోని ప్రతీ ఒక్కరి కృషితోనే ఈ విజయం దక్కిందన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయని ఆరోపించారు. కానీ, ప్రజలు అవేవీ పట్టించుకోకుండా బీజేపీకి విజయం అందించారని కొనియాడారు. దీంతో అందరి నోళ్లు మూతపడ్డాయని విమర్శలు గుప్పించారు. ప్రజల తీర్పుతో యూపీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. దేశంలోనే యూపీని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామన్నారు. -
గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి
పణజి: గెలిచినా సంతోషం లేదంటున్నారు బీజేపీ అభ్యర్థి అటానాసియో మోన్సెరెట్టే. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావించిన పణజి నియోజవర్గం నుంచి 716 స్వల్ప ఆధిక్యతతో ఆయన గెలిచారు. ఇక్కడి నుంచి స్వతంత్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్పల్ పారికర్.. అటానాసియోకు గట్టిపోటీ ఇచ్చారు. ‘బాబూష్’గా పాపులర్ అయిన అటానాసియోకు 6787 ఓట్లు, ఉత్పల్కు 6071 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎల్విస్ గోమ్స్ కు 3175 ఓట్లు దక్కాయి. అతి తక్కువ ఆధిక్యంతో గెలవడం పట్ల అటానాసియో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఫలితం నాకు చాలా అసంతృప్తి కలిగించింది. చాలా మంది హార్డ్కోర్ బీజేపీ ఓటర్లు ఉత్పల్కు ఓటు వేశారు. అందుకే ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయి. స్థానిక బీజేపీ నాయకుల్లో కొందరు నాకు సహకరించలేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పాను. రాష్ట్ర బీజేపీ విభాగం కార్యకర్తలకు సరైన సందేశం ఇవ్వలేదు. దీంతో నాకు నష్టం జరిగింది. నిజం చెప్పాలంటే నేను బీజేపీ, కాంగ్రెస్తో పోరాడాను. నన్ను అభిమానించే కొంతమంది మద్దతుదారుల సహాయంతోనే మేము సీటును నిలబెట్టుకోగలిగామ’ని ఆయన వాపోయారు. గోవాలో కచ్చితంగా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అటానాసియో దీమా వ్యక్తం చేశారు. ప్రమోద్ సావంత్ తమ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాగా, అటానాసియో సతీమణి జెన్నిఫర్ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) -
ఎన్నికల రిజల్ట్.. బీజేపీకి బిగ్ షాక్.. ఆందోళనలో కాషాయ నేతలు
డెహ్రాడూన్ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ జూనియర్లు గెలుస్తూ సీనియర్లు ఓడిపోవడం పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్ సింగ్ ధామి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భువన్ కప్రీ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. పుష్కర్ సింగ్ ధామీపై భువన్ చంద్ కప్రీ.. 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధామికి 40,675 ఓట్లు రాగా.. భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆధిక్యంగా ఉంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్లో బీజేపీ 48 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల విజయం సాధించింది. -
ఆ రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఫ్లాప్ షో.. ఎందుకిలా? అవే కారణాలా?
ఢిల్లీ: వచ్చే సార్వతిక ఎన్నికలకు సెమీస్గా సాగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఉత్తరాఖండ్లో ప్రభావం చూపని ఆ పార్టీ.. పంజాబ్లో అధికారం పోగొట్టుకుంది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లో మళ్లీ బీజేపీ పాగావేసింది. యూపీలో కాంగ్రెస్ అడ్రస్లేకుండా పోయింది. ప్రియాంకగాంధీ కూడా కాంగ్రెస్ హస్తవాసిని మార్చలేకపోయింది. సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అయ్యింది. ప్రధానంగా పంజాబ్ నుంచి అవమానకర రీతిలో ఓటమి పాలైంది. సిద్ధూ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకం, చన్నీ సామాజిక వర్గ ఆదరణ.. రెండు అంచనాలూ ఘోరంగా విఫలం అయ్యాయి. ఉత్తరప్రదేశ్.. యూపీలో కాంగ్రెస్కు ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. అతిపెద్ద రాష్ట్రంలో పొతులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం, ప్రియాంకగాంధీ ప్రచారం చేసిన ప్రజలు పట్టించుకోకపోవడం బలమైన నేతలు లేకపోవడం, అతి విశ్వాసం, జాతీయస్థాయిలోనే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ బలహీనపడటం, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోలేకపోవడం, ఎన్నికల్లో కర్షక హామీలు ఇవ్వలేకపోవడం వంటి కారణాలు చెప్పవచ్చు. ఉత్తరాఖండ్.. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు పరిశీలిస్తే.. రూ.500 గ్యాస్ సిలిండర్ హామీ, పేదలకు రూ.40వేల పథకం ఓటర్లను ఆకర్షించలే ఆకట్టుకోని 4 లక్షల ఉద్యోగాల హామీ కూడా ఓటర్లను ఆకట్టుకోలేదు. టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్ హామీ ఇవ్వకపోవడం వంటి కారణాలు కాంగ్రెస్ ఓటమికి ఓటమికి కారణాలుగా విశ్లేషించవచ్చు. పంజాబ్.. పంజాబ్లో కాంగ్రెస్ భంగపాటుకు కారణాలను పరిశీలిస్తే.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, అక్రమ ఇసుక తవ్వకాలు, మద్యం మాఫియా, మాదకద్రవ్యాల ముప్పు, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత.. కాంగ్రెస్ ఓటమికి గల కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే పంజాబ్ కాంగ్రెస్లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్సింగ్ చన్నీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నా చివరి నిమిషంలో వాటిని పక్కన పెట్టి వారు పోటీకి సన్నద్ధమయ్యారు. అయితే, గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు ఆప్కే పట్టం కట్టారు. పంజాబ్లో అధికారి మార్పిడి జరగాలని ఆప్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. అలాగే ఢిల్లీ తరహాలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ ఇచ్చిన ‘ఢిల్లీ మోడల్’హామీ కూడా వర్కవుట్ అయ్యింది. దీంతో పంజాబ్లో ఆప్ ఏకపక్ష విజయం సాధించగా, కాంగ్రెస్ పూర్తిగా ఢీలా పడిపోయింది. -
ఎస్పీని బోల్తా కొట్టించిందీ.. కమలాన్ని వికసింపజేసిందీ ఆ 10 అంశాలే!
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉన్న కొన్ని పార్టీలకు ఓటర్లు భారీ ట్విస్ట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తూ బీజేపీకే యూపీ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2012 తరహాలో ఎలక్షన్ రిజల్ట్ను పునరావృతం చేయాలని భావించిన సమాజ్వాదీ పార్టీకి మరోసారి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. కానీ, 1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ రికార్డు సాధించింది. యూపీలో గతంలో ప్రతిపక్షానికి 50 సీట్లు దాటిన దాఖలాలు లేవు. బీజేపీ గెలుపునకు కారణాలు ఇవే.. 1. రామ మందిర నిర్మాణం.. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజు నుంచే అధికార బీజేపీ రామమందిర నిర్మాణం అంశాన్ని హైలెట్ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేసింది. పక్కా ప్లాన్తో ముందుకు సాగింది. 2. ఎన్నికల ప్రచారంలోకి కీలక నేతలు.. యూపీలో కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం బీజేపీకి ప్లస్ పాయింట్గా మారింది. 3. యోగి కాంట్రవర్సీ కామెంట్స్.. ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. బూల్డోజర్ల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే సహించేది లేదంటూ.. నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వారి కోసం బూల్డోజర్లు రెడీగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారమే చెలరేగింది. కానీ, అదే చివరకు అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలు శిక్ష వంటి అంశాలు కూడా కలిసొచ్చాయి. 4. అట్రాక్ట్ చేసిన ఉచిత పథకాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ.. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్-2022 పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలకు ఓటర్లలు ప్రభావితం అయ్యారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాల కాన్సెప్ట్ కూడా ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించింది. 5. ఫలించిన గో సంరక్షణ మంత్రం.. యూపీలో గోవధపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గోవులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము అధికారంలోకి వస్తే గోవుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్టు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అఖిలేష్ యాదవ్ ఓటమికి కారణాలు.. 1. స్టార్ క్యాంపెయినర్లు కరువు.. ఎన్నికల ప్రచారంలో సమాజ్వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు కరువయ్యారు. ప్రచారంలో అఖిలేష్ యాదవ్తో పాటు కేవలం ఎస్పీకి చెందిన కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్, డింపుల్ చౌదరి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నప్పటికీ వారు ప్రచారంలోకి రాలేకపోయారు. ఇది పార్టీకి పెద్ద నెగిటివ్గా మారింది. 2. ప్రభావం చూపని ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు బూస్ట్ ఇస్తాయని భావించారు. ఈ ఘటనలపై ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. 3. యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర.. యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్వాదీ పార్టీపై ముద్రవేయడంలో అధికార బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. బీజేపీ లాజిక్తో మిగతా వర్గాలు ఎస్పీకి దూరమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు కూడా వైఫల్యం చెందడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి. 4. బీజేపీ వైపే జాట్, బ్రహ్మణ వర్గాలు.. యూపీలో గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది జాట్, బ్రహ్మణ వర్గాలే. అయితే, రైతు చట్టాల రద్దు సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్లు పోరాటం చేశారు. ఈ క్రమంలో జాట్లు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం బీజేపీకి అనుకూలంగా మారడంతో ఓట్లు చీలిపోయాయి. చెరుకు పండించే జాట్ రైతులు, బ్రహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. దీంతో ఎస్పీకి ఓటు బ్యాంకు చీలిపోయింది. 5. ఫలించని మేనిఫెస్టో.. ఎన్నికల సందర్భంగా ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు వరాలు ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉచిత 2 గ్యాస్ సిలిండర్లు, బాలికలకు కేజీ టూ పీజ్ఉచిత విద్య, ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని ప్రకటించిన ఓటర్లు ప్రభావితం కాలేదు. -
పంజాబ్లో ఆప్ భారీ విక్టరీ.. కేజ్రీవాల్ స్పందన ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. పంజాబ్లో జాతీయ పార్టీలకు పెద్ద షాకిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ రూట్ క్లియర్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటికే 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. పంజాబ్ ప్రజలకు అభినందనలు.. సరికొత్త విప్లవానికి నాంది పలికారు అంటూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 -
యూపీ ఫలితాలు: 2024 ఎన్నికలకు బీజేపీకి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. యూపీ ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలకు చుక్కానిగా నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాజా ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని అంటున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలోనూ బీజేపీ సత్తా చాటేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తున్నారు. అంతేకాదు నరేంద్ర మోదీ నాయకత్వానికి మరింత దన్నుగా ఈ ఫలితాలు నిలుస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి వరుసగా రెండోసారి విజయాన్ని కట్టబెట్టిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగత ఇమేజ్ కూడా మరింత పెరిగింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీలు తాజా ఫలితాలను జీర్ణించుకోవడం కష్టమే. కేంద్రంలో మోదీ సర్కారును గద్దె దించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలకు ఇప్పుడున్న బలం సరిపోదని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. తాజా ఫలితాల నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, టీఆర్ఎస్, వామపక్ష పార్టీల భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తి నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాయో చూడాలి. బీజేపీకి దీటుగా ఆప్ అయితే బీజేపీకి దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతుండటం ఆసక్తికర పరిణామం. పంజాబ్లో కాంగ్రెస్ను ఊడ్చేసిన ఆప్.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం పన్నుతుందో చూడాలి. భవిష్యత్తులో బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి అవుతారని, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ కో-ఇంచార్జి రాఘవ్ చద్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకుని సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. (క్లిక్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!) -
రాజకీయ పండితులకు చెక్ పెట్టిన కేజ్రీవాల్.. మనీష్ సిసోడియా కామెంట్స్ ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డ్ క్రియేట్ చేసింది. జాతీయ పార్టీలను తన స్టైల్లో చెక్ పెట్టింది. పంజాబ్లో ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటి నుంచి పంజాబ్ రాజకీయాలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పోలింగ్ విధానంలో ప్రజలనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలని వినూత్నంగా ఆలోచించి ఎన్నికల ఫలితాల్లో సక్సెస్ అయ్యారు. మంచి విద్య, ఆరోగ్యం, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీకే పంజాబ్ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ గెలుపుపై ఆప్ నేత మనీష్ సిసోడియా స్పందించారు. ఈ సందర్భంగా సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ‘ఆమ్ ఆద్మీ’ (సామాన్యుడి) విజయమని అన్నారు. కేజ్రీవాల్ పాలనా విధానాన్ని పంజాబ్ ప్రజలు ఆమోదించారని తెలిపారు. ఆప్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. దేశ ప్రజలు సైతం కేజ్రీవాల్ ప్రభుత్వం తరహా పాలనను కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తాము యూపీ, గోవా, ఉత్తరాఖండ్లో కూడా పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపినట్టు తెలిపారు. అక్కడ కూడా ప్రజలు తమ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేశారని అన్నారు. ఆ రాష్ట్రాల్లో ఫలితాలు, పార్టీ పని తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. #WATCH Punjab has accepted Kejriwal's model of governance. It has gained recognition at the national level. People in the entire country will seek this model of governance, says AAP leader Manish Sisodia pic.twitter.com/iVtBjv271Q — ANI (@ANI) March 10, 2022 -
పంజాబ్లో కాంగ్రెస్, బీజేపీ ఓటమికి కారణాలు ఇవే
-
యోగి రికార్డు! యూపీలో 70 ఏళ్ల తర్వాత..
ఎగ్జిట్ పోల్ అంచనాలే దాదాపుగా నిజం అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ మరోసారి ప్రభుత్వ దిశగా దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ 202ను దాటేసి ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ప్రాంతీయ పార్టీలతో జత కలిసి కూటమిగా వెళ్లినా.. అఖిలేష్ యాదవ్కు నిరాశే ఎదురైంది. కాంగ్రెస్, బీఎస్పీ, ఎంఐఎంలకు భంగపాటు తప్పలేదు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కంటిన్యూ అవుతోంది. మోదీ-షా ప్రచార మాయజాలంతో యోగి సర్కార్కే రెండోసారి పట్టం కట్టేందుకు జనాలు మొగ్గు చూపించారు. ఫలితాల సరళిని గమనిస్తే.. మెజారిటీ స్థానాలు బీజేపీ సునాయాసంగా గెలుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానాలు కొద్దిగా తగ్గినప్పటికీ.. యోగి నేతృత్వంలో సుస్థిర బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం అయ్యింది. ముఖ్యంగా యూపీలో బీజేపీకి సోషల్ ఇంజినీరింగ్ బాగా కలిసొచ్చింది. ముజఫర్నగర్ పంచాయితీ ఎన్నికల్లో ఫలితం చూపించడంతో.. అసెంబ్లీ ఎన్నికలకు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది బీజేపీ. Social Engineering కాస్త సూపర్సక్సెస్ అయ్యింది. ఓబీసీలు యోగి సర్కార్ వెంటే నడిచారు. అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ కూటమి.. రెండో ప్లేస్లో నిలిచింది. అయితే చాలాగ్యాప్ తర్వాత ఎస్పీ వంద సీట్లు దాటడం కాస్త ఊరట ఇచ్చే విషయం. ఎంఐఎం ఓటింగ్ శాతం.. ఎస్పీపై ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. గతంలో ప్రతిపక్షం ఎప్పుడూ 50 సీట్ల కంటే ఎక్కువ గెలిచిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇక నాలుగుసార్లు యూపీని పాలించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. కనీస ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ కీలక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాల్లో మాత్రం పరిస్థితి ఘోరంగా కనిపిస్తోంది. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ స్థానంలో గెలుపుదిశగా పయనిస్తున్నారు. యూపీలో 70 ఏళ్ల తర్వాత రికార్డు బద్ధలు అయ్యేలా కనిపిస్తోంది. స్వాతంత్రం వచ్చాక యూపీకి ఒక సీఎం పూర్తిస్థాయి పదవి కాలం పూర్తి చేసుకున్నాక.. రెండోసారి ఎన్నిక కావడం ఇదే తొలిసారి కానుంది. అంతేకాదు దాదాపు 37 ఏళ్ల తర్వాత ఒక పెద్ద రాష్ట్రంలో.. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడం కూడా జరగనుంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..రయ్మంటూ దూసుకెళ్తున్న దేశీయ సూచీలు..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశీయ సూచీలు రయ్మంటూ దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల సాంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రోజున మంచి జోరు మీద ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9:31 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1085.50 పాయింట్లు లాభపడి 55,741.95 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 311.35 పాయింట్లు లాభపడి 16,657.55 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. టాటా మోటార్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాటా మోటార్స్, గ్రాసిం ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హిందూస్థాన్ యూనిలీవర్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఓఎన్జిసి, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్ , జెఎస్డబ్ల్యు స్టీల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..! -
ఈసీ ఎవరి తొత్తు కాదు: సీఈసీ సుశీల్ చంద్ర
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతోందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. గురువారం ఉదయం కౌంటింగ్ మొదలైన నేపథ్యంలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ‘‘ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికల కోసం 31,000 కొత్త పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామన్నారు ఆయన. మహిళలచే నిర్వహించబడే 1,900 పోలింగ్ బూత్లను సృష్టించాం. తద్వారా మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో మహిళలు ఓటింగ్లో పాల్గొనడం కనిపించింది. 5 రాష్ట్రాలలో 4 రాష్ట్రాల్లో పురుషుల ఓటర్ల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని చెప్పారు సీఈసీ. ఇక ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదు. 2004 నుండి EVMలు నిరంతరం ఉపయోగించబడుతున్నాయి. 2019 నుండి మేము ప్రతి పోలింగ్ బూత్లో VVPATని ఉపయోగించడం ప్రారంభించాము. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేశారు. ఇక యూపీలో ఈవీ ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ వివరణ ఇచ్చారు. స్ట్రాంగ్రూమ్ నుంచి ఓట్లు వేసిన ఏ ఈవీఎంను బయటకు తీయలేరు. కొన్ని పార్టీలు ప్రశ్నలు లేవనెత్తాయి. మేం ఇచ్చిన వివరణతో ఆ పార్టీల వాళ్లు సంతృప్తి చెందారు. వారణాసిలోని ఈవీఎంలపై లేవనెత్తిన ప్రశ్నలు శిక్షణ నిమిత్తం ఉద్దేశించబడ్డాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం శిక్షణ అవసరాల కోసం ఈవీఎంల తరలింపు గురించి రాజకీయ పార్టీలకు తెలియజేయకపోవడమే ADM చేసిన పొరపాటు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీ తొత్తు కాదు. ప్రతి రాజకీయ పార్టీ సమానమే. ఒమిక్రాన్ వేవ్ కారణంగా ఎన్నికల ర్యాలీలపై నిషేధం విధించిన సమయంలో, EC MCC ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించింది. మొత్తం 5 రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అలాగే MCC ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 2,270 ఎఫ్ఐఆర్లు నమోదు చేయబడ్డాయి. One Nation One Election is a good suggestion but this needs a change in the Constitution. The Election Commission is fully geared up and is capable of holding all the elections simultaneously. We are ready to hold elections only once in 5 years: CEC Sushil Chandra pic.twitter.com/reixPOoqIl — ANI (@ANI) March 10, 2022 మీ అభ్యర్థిని తెలుసుకోండి(Know your candidate) యాప్ ఎన్నికల సంఘం చేపట్టిన విజయవంతమైన ప్రయత్నం. నేర నేపథ్యం ఉన్నవారు ఓటర్లకు తెలియాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి, మేము ఈ యాప్ని సృష్టించాము. ఈ ఎన్నికల్లో మొత్తం 6,900 మంది అభ్యర్థులలో 1,600 కంటే ఎక్కువ మంది నేర నేపథ్యం ఉన్నవాళ్లే! అని తెలిపారు సీఈసీ సుశీల్ చంద్ర. వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి.. ఇది మంచి సూచన. అయితే దీనికి రాజ్యాంగంలో మార్పు అవసరం. అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. -
పంజాబ్ మినహా అన్ని చోట్లా విరబూసిన కమలం
-
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు.. గెలుపెవరిదో?
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పర్వం నేడు తుదిదశకు చేరుకోనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలకానున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీస్గా భావించే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల నాయకత్వ పగ్గాలు ఏ పార్టీల చేతికొస్తాయో వెల్లడికానుంది. ఓట్ల లెక్కింపు క్రతువులో 50 వేల మంది అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) భాగస్వాములను చేసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించేందుకు దాదాపు 1,200 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. 75 జిల్లాల్లో 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో 750 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పంజాబ్లో 200 కేంద్రాలు రెడీ అయ్యాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా 650కి పైగా కౌంటింగ్ పర్యవేక్షకులు విధుల్లో పాల్గొంటారు. ర్యాండమ్గా ఒక్కో నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూత్ల చొప్పున అక్కడి ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లనూ సరిపోల్చనున్నారు. కౌంటింగ్ నిరాటంకంగా కొనసాగేలా సాయపడేందుకు ఉప రిటర్నింగ్ అధికారి విధుల్లో ఉంటారు. కౌంటింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు కౌంటింగ్ రోజున అమలుచేసేలా కోవిడ్ అదనపు నిబంధనలను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. కౌంటింగ్కు ముందు, కౌంటింగ్ ముగిశాక లెక్కింపు కేంద్రాలను తప్పకుండా శానిటైజ్ చేయాలి. భౌతిక దూరం పాటించేలా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విస్తృత పరిధిలో కౌంటింగ్ సెంటర్లను సిద్ధంచేశారు. రెండు కోవిడ్ టీకాలు తీసుకున్నాసరే కరోనా లక్షణాలుంటే వారిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించబోరు. అధికారులు, భద్రతా బలగాల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరికీ మాస్క్, శానిటైజర్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ గ్లౌజ్లు అందించనున్నారు. యూపీ సహా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఫిబ్రవరి 10న మొదలైన ఈ పోలింగ్ ప్రక్రియ మార్చి ఏడో తేదీన ముగిసిన విషయం తెల్సిందే. యూపీలో బీజేపీ, పంజాబ్ ఆప్? ► గోవాలో హంగ్ ► లోక్నీతి–సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ అంచనాలు న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా కొన్ని గంటలు ఉందనగా లోక్నీతి–సీఎస్డీఎస్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని, పంజాబ్ కోటలో ఆప్ పాగా వేస్తుందని అంచనా వేసింది. ఇక ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలున్నాయన్న ఆ సంస్థ గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారుతుందని పేర్కొంది. యూపీలో బీజేపీ 43% ఓట్ల షేర్తో సునాయాసంగా భారీ విజయం సాధిస్తుందని సమాజ్వాదీ పార్టీ 35% ఓట్లకే పరిమితమైపోతుందని అంచనా వేసింది. -
Election Results 2022: కచ్చితమైన సమాచారం కోసం..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉత్తరప్రదేశ్లో 7 దశల్లో, మణిపూర్లో 2 దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్లలో ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ఆయా రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని వారంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వార్తా చానళ్లు, వెబ్సైట్లు తమ అందించిన సమాచారం ఆధారంగా ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తుంటాయి. అయితే కచ్చితమైన, అధికారిక సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా చూడాలి? ► ముందుగా ఎన్నికల సంఘం వెబ్సైట్ (results.eci.gov.in)లోకి వెళ్లాలి. ► 'అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ ఎన్నికలు - మార్చి 2022' లింక్పై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే మీరు కొత్త వెబ్పేజీకి మళ్లించబడతారు ► ఎన్నికల ఫలితాలను చూడాలనుకుంటున్న రాష్ట్రం పేరుపై క్లిక్ చేయండి. ► క్లిక్ చేయగానే ఎన్నికల ఫలితాల ట్రెండ్ పేజీ ఓపెనవుతుంది. ► పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా, అభ్యర్థులు అందరూ, నియోజకవర్గాల వారీగా ట్రెండ్స్.. ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోండి. ► ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత తుది ఫలితం వెల్లడిస్తారు. ► దీంతో పాటు sakshi.comలోనూ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. -
ఎన్నికల ఫలితాలు, యుద్ధ పరిణామాలు కీలకం
ముంబై: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిణామాలు ఈ వారం దేశీయ మార్కెట్ గమనాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, కమోడిటీ ధరల కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలు తదితర అంశాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. చమురు ధరలు దశాబ్దపు గరిష్టానికి చేరిన నేపథ్యంలో క్రూడ్ సంబంధిత షేర్లు అధిక వ్యాల్యూమ్స్తో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఎఫ్ఐఐలు పెద్ద మొత్తంలో బ్యాంకింగ్ రంగ షేర్లను అమ్మేస్తున్నారు. అయితే మెటల్, ఐటీ, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు జరగొచ్చు. యుద్ధ భయాలకు ద్రవ్యోల్బణ భయాలు ఆజ్యం పోయడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గత వారంలో సెన్సెక్స్ 1,525 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘ఈ వారంలోనూ స్టాక్ సూచీల ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు ఏ కొంత తగ్గుముఖం పట్టినా.., షార్ట్ కవరింగ్ బౌన్స్బ్యాక్ జరుగొచ్చు. గతవారంలో నిఫ్టీ ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన ప్రతిసారి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అలాగే ప్రతిట్రేడింగ్లోనూ గ్యాప్ అప్తో మొదలైంది. నిఫ్టీ ప్రస్తుతానికి దిగువస్థాయిలో 16,200 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమై న నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ యష్ షా తెలిపారు ఎన్నికల ఫలితాల ప్రభావం ఏడు విడుతల్లో దాదాపు నెలరోజులు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి పదోతేది(గురువారం) వెల్లడి అవుతాయి. కీలక రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓటమి చవిచూస్తే స్వల్పకాలం పాటు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై ఎన్నికల ఫలితాల ప్రభావితం పెద్దగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ పరిణామాలు రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేస్తుంటే ఉక్రెయిన్ ధీటుగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్పై దాడిని నిరసిస్తూ పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఫలితంగా సరఫరా భయాలతో క్రూడాయిల్ సహా కమోడిటీ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు ఎగబాకింది. క్రూడ్ ధరలు భగ్గుమనడంతో దిగుమతులపైనే 80 శాతం ఆధారపడిన భారత్కు వాణిజ్య లోటు మరింత పెరుగుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ భయాలు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో చమురు ధరలు పదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. రానున్న రోజుల్లో గోధుమ, పాయిల్, కోల్ ధరలు సైతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరలు ఆకాశానికి ఎగుస్తున్న తరణంలో తాజాగా ద్రవ్యోల్బణ భయాలు తెరపైకి వచ్చాయి. ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఆర్బీఐ ద్రవ్య పరపతి చర్యలను మరింత కఠినం చేయొచ్చనే భయాలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు కేంద్ర గణాంకాల శాఖ నేడు దేశీయ ఫిబ్రవరి పారిశ్రామిక, ఉత్పాదక ఉత్పత్తి గణాంకాలను విడుదల చేయనుంది. అంతర్జాతీయంగా చూస్తే., రేపు యూరోజోన్ నాలుగో క్వార్టర్ జీడీపీ అంచనా గణాంకాలు, బుధవారం చైనా ఫిబ్రవరి ద్రవ్యోల్బణ డేటా, గురువారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు యూరోపియన్ యూనియన్ బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనలు వెలువడునున్నాయి. కీలకమైన ఈ స్థూల ఆర్థిక గణంకాల ప్రకటన ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్ల నుంచి మార్చి మొదటి మూడు రోజుల్లోనే రూ. 17,537 వేల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు. ఎఫ్ఐఐలు నెల 2–4 తేదీల మధ్య ఈక్విటీల నుండి రూ. 14,721 కోట్లు, డెట్ విభాగం నుండి రూ. 2,808 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో డెట్ విభాగంలోనూ ఎఫ్పీఐలే అమ్మకందారులుగా ఉంటూ వస్తున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చోటుచేసుకున్న అనిశ్చితి, ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. -
ప్రాంతీయ పార్టీలకు చెదరని ప్రజాదరణ
ఇటీవల మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐదురాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, రెండు తెలుగురాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలు మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడం లాంటి జిమ్మిక్కులను తిరస్కరించాయి. తమిళనాడులో స్టాలిన్ విజయం, కేరళలో విజయన్ గెలుపు, పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీ గెలుపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ గెలుపు దక్షిణాదిలో బీజేపీలాంటి మతపార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ గెలవగలిగింది. ఏడు రాష్ట్రాల్లోనూ గెలుపు కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. ఒక్క అభివృద్ధి పథకం గురించి మాట్లాడకుండా ప్రైవేటీకరణ పేరుమీద లక్షలాది మందిని రోడ్లమీద నిలబెడుతూ ఏ ఆర్థిక పథకమూ లేకుండా దేశభక్తి, మతం ద్వేష భావాలతో గెలవాలని చూసిన బీజేపీకి ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం అపూర్వమైంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రితో పాటు మంత్రులు, పార్టీ అధ్యక్షులు, ముఖ్యులు, రాష్ట్ర నాయకత్వమంతా బెంగాల్లో మోహరించినా బెంగాల్ టైగర్ని ఎదుర్కొని నిలువలేకపోయారు. ఇప్పటికీ కార్మికవాడలో ఉన్న తన స్వగృహంలో నివసిస్తున్న మమతా బెనర్జీ నిరాడంబరజీవి. కాళ్ళకు హవాయి చెప్పులతో, అతి మామూలు వస్త్రధారణతో ఉండే ధీరవనిత. దీదీగా బెంగాల్ ప్రజలందరి హృదయాల్లో శాశ్వతస్థానం సంపాదించుకున్న వనిత. బీజేపీని మట్టికరిపించి మూడవసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేతబట్టుకుంటున్న అపర కాళికామాత. కాంగ్రెస్, సీపీఎం లాంటి జాతీయ పార్టీలను తప్ప ప్రాంతీయ పార్టీలను బీజేపీ, జయించలేదని తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపర నిరూపిస్తుంది. రాష్ట్రాన్ని ద్రావిడ శూద్ర నాయకత్వ నేపథ్యంలోంచి పాలించిన కరుణానిధి తనయుడు స్టాలిన్. తండ్రిలాగే ద్రావిడ రాజకీయాలకు నిజ మైన ప్రతినిధి. ద్రావిడ రాజకీయాలకు స్వస్తి పలికి మళ్ళీ బ్రాహ్మణ రాజకీయాలకు తెరలేపాలని చూస్తున్న బీజేపీతో అన్నాడీఎంకే పొత్తుపెట్టుకొంది. ద్రావిడ రాజకీయాలను, శూద్ర నాయకత్వాన్ని బలంగా బలీయంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాలిన్ ఎత్తుగడల ముందు బీజేపీ ఆటలు సాగలేదు. అన్నాడీఎంకే జిత్తులూ సాగలేదు. జాతీయ పార్టీలను నలభై ఏళ్లుగా రాష్ట్రంలోకి రానీయని తమిళ ప్రజలు డీఎంకేకు పట్టంగట్టి బీజేపీకి దక్షిణాదిలో స్థానం లేదని నొక్కి చెప్పారు. ఇక్కడా, పాండిచ్చేరిలోనూ బీజేపీకి పరాభవమే మిగిలింది. ప్రాంతీయ పార్టీలనే విజయం వరించింది. కేరళ భారతదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన ఏకైక రాష్ట్రం. కమ్యూనిస్టు పార్టీల పాలనను దేశంలోనే మొట్టమొదటగా ఆహ్వానించిన రాష్ట్రం. గత ఏడేళ్ళుగా పినరయి విజయన్ నాయకత్వంలో సంచలనాత్మక ప్రగతిశీల చర్యలను చేపట్టి సుపరిపాలను అందించింది. మత విశ్వాసాలు, దైవ నమ్మకాల విషయంలో సర్వమత సమానత్వాన్ని పాటిస్తూ మత సామరస్యాన్ని కాపాడుతున్న రాష్ట్రం. అలాంటి కేరళలో అడుగుపెట్టాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి ఆశాభంగమే అయింది. మత, దైవ భావనలను ఎన్నిటిని రెచ్చగొట్టినా కేరళ విద్యావిజ్ఞాన సమాజం పైన, బీజేపీ ఏమాత్రం ప్రాభవాన్ని చూపలేక పోయింది. అస్సాంలో ప్రాంతీయ పార్టీ శక్తివంతంగా లేకపోవడం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రియారాహిత్యం వల్ల, బంగ్లా ఆక్రమణల సమస్యలను బీజేపీ రెచ్చగొట్టి తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక తెలం గాణలో బలమైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ని ఢీ కొనే శక్తి బీజేపీకి లేదని నాగార్జునసాగర్ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు రుజువు చేశాయి. అలానే వైఎస్సార్సీపీని ఢీ కొనడం బీజేపీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కాదు. టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు సాధ్యంకాదని తిరుపతి ఎన్నిక రుజువు చేసింది. గత ఏడేళ్లుగా కేసీఆర్ గత రెండేళ్లుగా వైఎస్ జగన్ చేస్తున్న ప్రజోపయోగకర పనులు, మానవీయ పథకాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్టీకి స్థానం లేదని నిరూపిస్తున్నాయి. మత తాత్వికత కాకుండా మనిషి తాత్వికతదే గెలుపన్న ఈ సందేశం భారత రాజకీయాలను మానవీయ రాజకీయాల దిక్కు మరల్చడానికి దిశానిర్దేశం చేస్తుందనడంలో సందేహం లేదు. డా. కాలువ మల్లయ్య వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 91829 18567 -
బీజేపీకి నిరాశ.. మళ్లీ తెరపైకి ప్రాంతీయ శక్తులు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ ఘన విజయం రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు ఉన్న భారీ బలగంతోనే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కుదరదని తేలిపోయిందని.. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి ప్రాంతీయ శక్తులు తిరిగి ప్రవేశించడం ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడిపోవడం కూడా దీనికి కారణమని పేర్కొంటున్నారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎన్డీయే సర్కారు విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు.. బెంగాల్లో గెలుపుతో చెక్ పెట్టవచ్చని, కేంద్ర విధానాలకు ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవచ్చని బీజేపీ భావించిందని విశ్లేషకులంటున్నారు. కానీ బెంగాల్ ఓటమి, తమిళనాడు, కేరళల్లో నిరాశాజనక ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయని విశ్లేషిస్తున్నారు. సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యే అవకాశం ‘‘బెంగాల్లో మమత గెలుపు దేశంలో సంకీర్ణ రాజకీయాలకు మళ్లీ తెరలేపే పరిస్థితి కనిపిస్తోంది. బెంగాల్ బయట కూడా తృణమూల్ కాంగ్రెస్కు కేడర్ ఉంది. బీజేపీని ఎదిరించి పోరాడిన ఆమెతో కలిసి పనిచేసేందుకు పలు ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ కీలకంగా ఉంటుంది. బీజేపీ తీరుతో ఆగ్రహంగా ఉన్న మమత.. యాంటీ బీజేపీ పార్టీలను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. -
అస్సాంలో కాషాయ రెపరెపలు
గువాహటి: ఎగ్జిట్పోల్స్అంచనాలను నిజంచేస్తూ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ను దాటేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ 59 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 9 చోట్ల, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 6 సీట్లలో గెలుపొందాయి. ప్రముఖుల హవా... సీఎం సర్బానంద సోనోవాల్, వైద్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ, ఏజీపీ చీఫ్, మంత్రి అతుల్ బోరా వరుసగా మజులీ, జాలుక్బరి, బోకాఖాట్ నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించారు. తమ సుపరిపాలనకు మెచ్చే ప్రజలు మరోసారి పాలన సాగించాలని ఎన్డీఏకు అవకాశం ఇచ్చారని సోనోవాల్ వ్యాఖ్యానించారు. మంత్రి హిమంతా బిశ్వా శర్మ లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు ఇది వరుసగా ఐదో గెలుపు. పటచార్కుచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్ దాస్... ఏజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పబీంద్ర దేకాపై గెలిచారు. కాంగ్రెస్కు మళ్లీ తప్పని ఓటమి... కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 51 సీట్లకే పరిమితమై మరోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ 30 సీట్లను గెలుచుకోగా మహాకూటమిలోని మిగతా పార్టీలైన ఏఐయూడీఎఫ్ 16 సీట్లలో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో, సీపీఎం ఒక చోట గెలిచాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రిపుణ్ బోరా తన పదవికి రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే భారీ మూల్యం చెల్లించుకుందని, ఎన్డీఏ గెలిచేందుకు ఇదే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుడు రాజన్ పాండే పేర్కొన్నారు. బీజేపీ సైతం అభ్యర్థుల తొలి జాబితా విడుదలలో పొరపాట్లు చేసినా ఆ తర్వాత విడుదల చేసిన జాబితాలలో ఆ తప్పుల ను సరిదిద్దుకుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామనే హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో ఓట్లు పొందలేకపోయిందన్నారు. -
తండ్రిని వెనకేసుకొచ్చిన ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ‘పెద్ద బఫూన్’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు(కేసీఆర్) చేసిన వ్యాఖ్యలను ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమర్థించారు. ఢిల్లీలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... వెర్రి పనులు చేసే వారిని బఫూన్గా వర్ణిస్తామని, పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన తింగరి చేష్టలను దేశమంతా చూసిందన్నారు. ‘సభా సంప్రదాయాలను ఉల్లఘించి లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమాంతంగా వాటేసుకోవడం జాతి యావత్తు వీక్షించింది. రాహుల్ చర్యను ప్రతి ఒక్కరు వెర్రి పనిగా భావించారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా స్పందిచార’ని కవిత వివరించారు. ప్రాంతీయ పార్టీలదే హవా తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ దారుణంగా వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం రాలేదని, బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని తెలిపారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీ20 మ్యాచ్లా ప్రజలు ఉత్కంఠతో వీక్షించారని చెప్పుకొచ్చారు. రాజస్తాన్లో పాత సంప్రదాయం కొనసాగడం వల్లే కాంగ్రెస్కు అధికారం దక్కిందని విశ్లేషించారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుందని అభిలషించారు. ‘ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండివుంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని గట్టిగా చెప్పగలను. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో జాతీయ పార్టీలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు మెరుగ్గా ఉన్నాయ’ని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ తథ్యం కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ సాకారమవుతుందని, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలను గుర్తించేలా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని డీఎంకే నేత స్టాలిన్ భావి ప్రధానిగా వర్ణించడంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ అనుకూల కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ను ఒక పార్టీ సమర్థిస్తే, అదే కూటమిలోని రెండు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయన్నారు. ‘మేము ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడో ప్రత్యామ్నాయం ఒకరిని ప్రధాని చేయడానికో, ఒక పార్టీని అధికారంలోకి తేవడానికో కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కొనుగొనాలన్న ఉద్దేశంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో మా పార్టీ ఇప్పటికే చేసి చూపించింది. తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా అమలుల్లోకి తేవాలనుకుంటున్నామ’ని ఎంపీ కవిత వెల్లడించారు. -
అధికారంపై ధిక్కారం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. మరికొద్ది నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని మరోసారి అధిరోహించాలన్న బీజేపీ విశ్వప్రయత్నాలకు ఈ ఎన్నికలు భారీగా గండికొట్టాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, 2019లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావిస్తున్న రాహుల్గాంధీల సత్తాకు పరీక్షగా మారిన ఈ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. మరోవైపు కాంగ్రెస్ ముచ్చటగా మూడు రాష్ట్రాల్లోనూ విజయకేతనం ఎగురవేసి సెమీఫైనల్స్లో సత్తా చాటింది. 2019 లోక్సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్గాంధీని ప్రధాని రేసులోకి తీసుకొచ్చింది. మరోసారి అదే పంథా.. గత 2 దశాబ్దాలుగా ప్రతీ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే అలవాటున్న రాజస్తాన్ ఓటర్లు ఈసారి అదే పంథాను కొనసాగించారు. 2013లో వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీకి 161 అసెంబ్లీ సీట్లు కట్టబెట్టి అధికారాన్ని అప్పగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే విజయం సాధించింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య కంటే ఎక్కువగానే అక్కడి ప్రజలు కట్టబెట్టారు. ఎట్టకేలకు ఛత్తీస్గఢ్లో మార్పు.. గత మూడు ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 15 ఏళ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న బీజేపీని ఛత్తీస్గఢ్ ప్రజలు ఈసారి ఇంటికి సాగనంపారు. 15 ఏళ్ల రమణ్సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఈ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనబడింది. దీని ఫలితంగా చాలా స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగినా కాంగ్రెస్ పరాభవం తప్పలేదు. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంది. రైతులే నిర్ణయించారా..! సెమీఫైనల్స్లో అధికార మార్పిడికి రైతుల్లో ఉన్న అసంతృప్తి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల రైతులు తమ కోపాన్ని అక్కడి పాలక పక్షంపై ఓట్ల రూపంలో చూపించారు.2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే రైతుల అంశమే పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిచిన 3రాష్ట్రాల్లో రుణమాఫీ అంశం బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. అక్కడ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్గాంధీ విస్త్రతంగా చేసిన ప్రచారం రైతుల ఓట్లు కాంగ్రెస్కు పడేలా చేసింది. రైతులే ప్రధాన ఎజెండా ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్పై రైతులు పూర్తి విశ్వాసాన్ని కనబరిచారు. ఆ పార్టీ రైతులు కోసం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత వ్యవసాయ కరెంటు వంటివి తిరిగి అధికారాన్ని పొందేందుకు సహకరించాయి. రాఫేల్ ఒప్పందాన్ని టార్గెట్ చేస్తూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందగా.. బీజేపీ హిందుత్వ విధానం అంతగా పనిచేసినట్లు కనిపించలేదు. మోదీ ఆలోచనలు సరిగా పనిచేయకపోవడం, యోగి ఆదిత్యనాథ్ చేసిన హనుమాన్ దళిత్ వ్యాఖ్యలు, మైనార్టీలను దేశం వదిలి వెళ్లి పోవాలనడం, నగరాలకు పేర్లు మార్చడం వంటివి కూడా ఓటమికి కారణాలని బీజేపీ సీనియర్ ఎంపీ ఒకరు తెలిపారు. తాజా ప్రతికూల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. -
సార్వత్రికానికి సంకేతమా?
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో మూడు రాష్ట్రాలు హిందీ బెల్ట్లో ఉండగా, ఒకటి ఈశాన్య రాష్ట్రం మిజోరం. మరొకటి తెలంగాణ. తెలంగాణ, మిజోరంలలో బీజేపీ అధికారంలో లేదు. కాబట్టి ఈ ఫలితాల ప్రభావం ఆ పార్టీపై పెద్దగా ఉండబోదు. మిగిలిన మూడు రాష్ట్రాల్లో–రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్–బీజేపీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంది. రాజకీయ పండితులు ఈ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సూచికగా పరిగణించారు. హిందీ బెల్ట్లో మళ్లీ బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటే మోదీ హవాకు తిరుగులేదని తేలుతుందని, అదే కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ పునరుజ్జీవానికి అవకాశం లభిస్తుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ఫలితాలను బట్టి దేశంలో కాంగ్రెస్ పునరుజ్జీవానికి మార్గం సుగమం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని సమర్థంగా నడిపించే నైతిక బలాన్ని ఈ ఫలితాలు రాహుల్కు అందిస్తాయని వారు చెబుతున్నారు. పడిలేచిన కాంగ్రెస్ శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ ఒకప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అధికారం చెలాయించింది. 2014 నాటికి దేశంలోని 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. బీజేపీ కేవలం ఏడు రాష్ట్రాల్లోనే అధికార పార్టీగా ఉంది. 2017 నాటికి కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా, బీజేపీ బలం 21 రాష్ట్రాలకు పెరిగింది. గత రెండేళ్లుగా పలు ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవుతుండటం, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ ఇమేజ్ పని చేస్తుందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేదని బీజేపీ అంటోంది.అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రుల పనితీరు ప్రభావం ఉంటుందని, లోక్సభ విషయంలో ప్రధాని ప్రతిష్ట ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడేలు నిర్వహించిన సర్వేలో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే మోదీకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలింది. కాంగ్రెస్కు నల్లేరుపై నడక కాదు రాజస్తాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల విజయం ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలను నియంత్రించడంతో పాటు బలమైన శత్రువు(బీజేపీ)ను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను కాంగ్రెస్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. పప్పూ పాస్ హోగయా... గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో బాటు కాంగ్రెస్ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో కమలనాథులు ఇక దేశంలో తమకు తిరుగులేదన్న ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ తమకు పోటీయే కాదని, రాహుల్ గాంధీ ‘పప్పు’ అని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.అయితే, తాజా ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ సత్తాను బీజేపీకి చూపించాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీకి రాహుల్ గాంధీయే పోటీ అని నిరూపించాయి. పప్పూ పాస్ హోగయా అని బీజేపీ మద్దతుదారులే అంగీకరిస్తున్నారు. తాజా ఫలితాలు కొన్ని ముఖ్య విషయాలను స్పష్టం చేస్తున్నాయి. వాటిలో మొదటిది బీజేపీకి కంచుకోటగా భావించిన రాష్ట్రాలు ఇప్పుడు విపక్షాల వశమయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో దాదాపు పదిహేనేళ్లుగా బీజేపీయే అధికారంలో ఉంది. ఇప్పుడవి చేజారాయంటే బీజేపీ తన తీరును సమీక్షించుకోవాల్సి ఉంటుంది. మోదీ వ్యక్తిగత ప్రతిష్ట రెండో అంశం. ఎంపీ, రాజస్తాన్లలో బీజేపీ ఈ మాత్రమైనా నిలబడటానికి మోదీ చరిష్మానే కారణమన్న వాదన లేకపోలేదు. ఎన్నికల వ్యూహ రచనలో కూడా జాగరూకత అవసరమన్నది మూడో విషయం. తాజా ఫలితాలు రాహుల్ గాంధీ బాధ్యతల్ని పెంచుతాయన్నది మరో కీలక విషయం.ఇప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్ మరింత బాధ్యతాయుతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే, కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమిగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీల తీరు తెన్నులు ఇంకో ముఖ్య విషయం. బీజేపీ బలం తగ్గుతోందా? తాజా ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయి. దీని ప్రభావం వచ్చే లోక్సభ ఎన్నికలపై ఉంటుందని యాక్సిస్ మై ఇండియా సంస్థ సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి ఈ సంస్థ రాజస్తాన్, మధ్య ప్రదేశ్ , ఛత్తీస్గఢ్లలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే చేసింది. దాని ప్రకారం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇప్పుడున్న సీట్లకంటే 35 సీట్ల వరకు పెరగొచ్చని తేలింది. బీజేపీ బలం 30కి తగ్గవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్కు 3, బీజేపీకి 62 లోక్సభ సీట్లున్నాయి. రాజస్తాన్ నుంచి ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎంపీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి సంఖ్య 9కి పడిపోవచ్చని, ఆ పదహారు సీట్లు కాంగ్రెస్కు రావచ్చని ఆ సర్వే పేర్కొంది. -
నోటాకు వచ్చినన్ని కూడా రాలేదు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు కనీస ప్రభావం కూడా చూపలేకపోయాయి. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ పార్టీలకు రాలేదు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మంగళవారం పేర్కొన్న సమాచారం ప్రకారం ఛత్తీస్గడ్లో 2.1 శాతం (2,46,918) ఓట్లు నోటాకు రాగా..అక్కడ 85 స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తంగా 0.9 శాతం (1,04,362) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎస్పీ, ఎన్సీపీలకు (20,233) 0.2 శాతం ఓట్లు లభించగా, సీపీఐకు 0.3శాతం (38,811)ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్లో నోటాకు మొత్తంగా 1.5 శాతం (5,11,785) ఓట్లు రాగా, ఎస్పీకి 1 శాతం(3,88,485), ఆప్కి 0.7 శాతం (2,37,897) ఓట్లు లభించాయి. రాజస్థాన్లో నోటాకు 1.3 శాతం (4,64,838) ఓట్లు రాగా సీపీఐ(మార్క్సిస్ట్)కు 1.3 శాతం(4,32,666), ఎస్పీలకు 0.2 శాతం (65,160) ఓట్లు లభించాయి. మిజోరాంలో నోటాకు 0.5 శాతం (2,917) ఓట్లు లభించగా, ప్రిజమ్కు 0.2 శాతం (1,262) ఓట్లు వచ్చాయి. నిర్మానుష్యంగా బీజేపీ ఆఫీసు న్యూఢిల్లీ: తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం మంగళవారం నిర్మానుష్యంగా మారింది. తెలంగాణ, మిజోరాం మినహా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండటంతో ఢిల్లీ అక్బర్ రోడ్ లోని ఆ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు మిన్నంటాయి. ఇప్పటివరకూ వెలువడిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా రావడంతో దీన్దయాళ్ మార్గ్లోని బీజేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. -
మార్కెట్లకు ఎన్నికల ఫలితాల దిశానిర్దేశం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, క్రూడాయిల్ రేట్లతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. రాజకీయ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరాలు వెల్లడైన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలు నిఘా చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘మంగళవారం వెల్లడయ్యే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దేశీ.. అంతర్జాతీయ స్థూల ఆ ర్థిక గణాంకాల వెల్లడి, క్రూడాయిల్ రేట్ల కదలికలు తదితర అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మంచిది. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోణంలో చూస్తే అయిదు రాష్ట్రాల ఫలితాలు చాలా కీలకంగా ఉండనున్నాయి’ అని ఈక్విటీ99 సీనియర్ రీసెర్చ్ అనలిస్టు రాహుల్ శర్మ తెలిపారు. ‘ఒపెక్ సదస్సు, హువావే గ్లోబల్ సీఎఫ్వో అరెస్టు వంటి పరిణామాలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడవేశాయి. వీటితో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. స్వల్పకాలికంగా మార్కెట్లలో హెచ్చుతగ్గులకు ఆజ్యం పోయనున్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ సంస్థ సీఈవో ముస్తఫా నదీమ్ చెప్పారు. ‘అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండటం వంటి అంశాలతో ఈ వారం దేశీ సూచీలు ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కూడా హెచ్చుతగ్గులకు దారితీయొచ్చు. సూచీలు ఇంట్రా డేలో 1% పైగా అటూ ఇటూ సాధారణంగానే తిరిగేసే అవకాశం ఉంది’ అని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ సాహిల్ కపూర్ తెలిపారు. టెక్నికల్గా చూస్తే భారీ కరెక్షన్కు లోనైన నిఫ్టీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడంతో బుల్స్ తిరిగొచ్చేందుకు ఆస్కారముందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని చెప్పారు. నిఫ్టీ గానీ 10,775 పాయింట్ల నిరోధాన్ని దాటితే మరింత పెరగొచ్చని, 10,588 పాయింట్ల వద్ద మద్దతు ఉండగలదని పేర్కొన్నారు. సెన్సెక్స్ గతవారం 521 పాయింట్లు క్షీణించి 35,673 వద్ద, నిఫ్టీ 183 పాయింట్ల నష్టంతో 10,694 వద్ద క్లోజయ్యాయి. రూపాయిపైనా ఒత్తిడి .. గతవారం ఆఖర్లో సమావేశమైన చమురు ఉత్పత్తి దేశాల కూటమి ఒపెక్ .. ముడిచమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రెట్ క్రూడ్ రేటు శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పైగా పెరిగింది. మరోవైపు, చైనా టెలికం దిగ్గజం హువావే గ్లోబల్ సీఎఫ్వో మింగ్ వాంఝూను కెనడాలో అరెస్టు చేయడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీ మార్కెట్నూ కుదిపేసింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో విడత వడ్డీ రేట్ల పెంచడంపై ఈ నెలలో నిర్ణయం తీసుకోనుండటం కూడా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించేందుకు కారణం కానుంది. వడ్డీ రేట్లు పెంపుతో భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ ఫండ్స్ రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చని, ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తవచ్చని అనలిస్టులు పేర్కొన్నారు. 70.50–72.50 మధ్య రూపాయి .. ఈ వారంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.50–72.50 మధ్య తిరుగాడే అవకాశాలు ఉన్నాయని కొటక్ సెక్యూరిటీస్ డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్ (కరెన్సీ, వడ్డీ రేట్ల విభాగం) అనింద్య బెనర్జీ తెలిపారు. ‘అమెరికా డాలర్ను ట్రేడర్లు భారీగా షార్ట్ చేశారు. కీలకమైన రాజస్థాన్, మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాకపోవొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సెషన్లో షార్ట్ కవరింగ్ జరిగి రూపాయితో పోలిస్తే డాలర్ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి’ అని ఆమె తెలిపారు. ‘వచ్చేవారం ఎన్నికల ఫలితాలే కీలకంగా ఉంటాయి. ఒకవేళ మధ్యప్రదేశ్లో మళ్లీ బీజేపీనే వచ్చి.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఏ ఒక్కదాన్లోనైనా గెలుపొందిన పక్షంలో రూపాయి ర్యాలీ చేయొచ్చు. అలా కాకుండా బీజేపీ ఓడిపోతే.. రూపాయికి ప్రతికూలంగా కాగలదు‘ అని అనింద్య వివరించారు. ఇవి కాకుండా ఈ వారం వెల్లడయ్యే స్థూల ఆర్థిక గణాంకాలూ కీలకం కానున్నాయి. 12న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాలు, డిసెంబర్ 14న టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం, ఎగుమతుల గణంకాలు విడుదల కానున్నాయి. 5 రోజుల్లో రూ. 400 కోట్లు దేశీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్న ఎఫ్పీఐలు న్యూఢిల్లీ: చైనా టెలికం పరికరాల సంస్థ హువావే సీఎఫ్వో అరెస్టుతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడిన నేపథ్యంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) గత 5 సెషన్స్లో ఏకంగా రూ. 400 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం డిసెంబర్ 3–7 మధ్య వ్యవధిలో ఎఫ్పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 383 కోట్లు ఉపసంహరించారు. అదే సమయంలో డెట్ మార్కెట్లలో రూ. 2,744 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. డిసెంబర్ 6న ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయని, ఎఫ్పీఐలు ఒక్క రోజులోనే రూ. 361 కోట్ల విక్రయాలు జరిపారని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా సీనియర్ అనలిస్ట్ మేనేజర్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. హువావే సీఎఫ్వో మెంగ్ వాంఝూ అరెస్ట్ కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా క్షీణించడం ఇందుకు కారణమైందన్నారు. -
‘ఈవీఎం టాంపరింగ్ ఆరోపణలు వద్దు’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మనదేశంలో ఎన్నికలపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. మాయావతి అనుసరించిన తప్పుడు విధానాల కారణంగానే బీఎస్పీ ఘోరంగా ఓడిపోయిందని జైట్లీ పేర్కొన్నారు. ప్రజల్లో ఆదరణ పెరగడం, ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవలంభించిన విధానాలు బీజేపీకి సానుకూలంగా మారాయని ఆయన విశ్లేషించారు. డీమోనిటైజేషన్ ను ప్రజలు సమర్థించారని చెప్పుకొచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కాషాయ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది.