Foreign policy
-
నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందం
ప్రధానిగా మన్మోహన్సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మన్మోహన్ దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దంపట్టింది. అణ్వస్త్రపరంగా భారత్ను దశాబ్దాలపాటు ఏకాకిగా మిగిల్చిన ప్రపంచ దేశాలకు భారత్ ఈ చరిత్రాత్మక ఒప్పందంతో దీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతలో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చేలా మన్మోహన్ అవిరళ కృషి చేశారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్యూ. బుష్తో కలిసి మన్మోహన్సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ–1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా మన్మోహన్ ముందడుగు వేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొని మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. 2008 అక్టోబర్లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. చదవండి: ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
వినూత్న విదేశాంగ విధానం
నలుగురు నడిచిన బాటలో నడవటం, సంప్రదాయంగా వస్తున్న విధానాలను అనుసరించటం శ్రేయస్కరమని చాలామంది అనుకొనేదే. కొత్త ప్రయోగాలకు దిగితే ఏం వికటిస్తుందోనన్న సంశయమే ఇందుకు కారణం. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించిన తాజా యూరోప్ పర్యటన మన విదేశాంగ విధానం కొత్త మలుపు తిరిగిన వైనాన్ని వెల్లడించింది. ఇది మంచిదా, కాదా అన్నది మున్ముందు తేలుతుంది. అయితే తాము ఎవరికీ దగ్గరా కాదు... దూరమూ కాదని అటు రష్యాకూ, ఇటు పాశ్చాత్య దేశాలకూ మనం చెప్పినట్టయింది. ఒక రకంగా ఇది ప్రచ్ఛన్న యుద్ధ దశలో మన దేశం అనుసరించిన అలీన విధానాన్ని గుర్తుకుతెస్తుంది. మోదీ రెండు రోజులు పోలెండ్లో పర్యటించారు. అధ్యక్షుడు ఆంద్రెజ్ దుదాతో సమావేశమయ్యారు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు. ఇవి రివాజులో భాగంగా సాగిన పర్యటనలు కాదు. మన దేశ ప్రధాని ఒకరు పోలెండ్ను సందర్శించటం గత నలభై అయిదేళ్లలో ఇదే తొలిసారి. 1955లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, 1967లో ఇందిరా గాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఆ దేశంలో పర్యటించారు. కానీ అప్పటికది సోవియెట్ యూనియన్ ఛత్రచ్ఛాయలో ఏర్పడ్డ వార్సా సైనిక కూటమిలో భాగం. అయితే, 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలడానికి చాలా ముందే పోలెండ్ బాట మార్చింది. సోవియెట్కు వ్యతిరేకంగా ఏర్పడిన నాటో కూటమి దేశాలకు చేరువైంది. 1999లో నాటోలో చేరింది. 2004లో యూరొపియన్ యూనియన్ (ఈయూ)లో భాగమైంది. ఆ తర్వాత మరెప్పుడూ మన ప్రధానులు ఆ దేశాన్ని సందర్శించ లేదు. ఇక సోవియెట్లో ఒకప్పుడు భాగమైన ఉక్రెయిన్ 26 ఏళ్ల క్రితం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. పాశ్చాత్య దేశాల సలహాతో తన అణ్వస్త్రాలను స్వచ్ఛందంగా వదులుకుంది. భిన్న సందర్భాల్లో వాటి మనోభావాలకు తగినట్టు తన విధానాలను తీర్చిదిద్దుకుంది. వాజపేయి హయాంలో మన దేశం నిర్వహించిన అణు పరీక్షలను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేసింది. మన కశ్మీర్ విధానాన్ని ఖండిస్తూ వచ్చింది. పాకిస్తాన్కు శతఘ్నులు విక్రయించింది. రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలు మూడో దేశానికి వ్యతిరేకమని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. అలాంటి మూర్ఖత్వాన్ని ఈమధ్య అమెరికాతో పాటు ఉక్రెయిన్ కూడా ప్రదర్శించింది. జూలై రెండో వారంలో మోదీ రష్యాలో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా భారత్ను విమర్శించారు. నెత్తురంటిన పుతిన్తో ఎలా కరచాలనం చేస్తారని మోదీని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నేరగాడిని హత్తుకోవటం విచారకరమన్నారు. ఆ సమయంలో మోదీ తమ దేశంలో ఉన్నారన్న సంగతిని కూడా విస్మరించి కియూవ్లో పిల్లల ఆస్పత్రిపై రష్యా బలగాలు దాడి చేసిన మాట వాస్తవమే. అయితే ఆ ఉదంతాన్ని పుతిన్ సమక్షంలోనే మోదీ ఖండించారు. అయినా జెలెన్స్కీకి అది సరిపోలేదు. తాము రష్యాతో యుద్ధం చేస్తున్నాం గనుక ప్రపంచమంతా దాన్ని దూరం పెట్టాలన్న వైఖరిని ప్రదర్శించారు. ఇది తెలివితక్కువతనం. భారత్–రష్యా సంబంధాల సంగతే తీసుకుంటే రష్యా అనేక కారణాల వల్ల పాకిస్తాన్కు ఆయుధ విక్రయంపై ఉన్న ఆంక్షలను పదేళ్లక్రితం సడలించింది. దూరశ్రేణి క్షిపణులు, ఇతర రక్షణ పరికరాలు అందజేసింది. ఎంఐ–26 సైనిక రవాణా హెలికాప్టర్లను సమకూర్చుకోవటానికి సాయం అందజేసింది. మనకు ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు విక్రయించినప్పుడల్లా సమతూకం పాటించే నెపంతో పాకిస్తాన్కు కూడా అమ్మకాలు సాగించటం రష్యా నేర్చుకుంది. చైనాతో దాని సంబంధాలు సరేసరి. ఇలా మనకు బద్ధ వ్యతిరేకమైన రెండు దేశాలతో రష్యా సంబంధాలు నెరపుతున్నప్పుడు మనం మాత్రం తమతోనే ఉండాలని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కోరుకోవటం అర్థరహితం.రష్యా – ఉక్రెయిన్ల మధ్య మూడేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపటానికి ఒక తటస్థ దేశంగా భారత్ కృషి చేయాలని చాలా దేశాలు ఆశపడుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను మన దేశం ఖండించలేదు. రష్యాను విమర్శిస్తూ తీసుకొచ్చిన తీర్మానాలపై వోటింగ్ సమయంలో మన దేశం గైర్హాజరైంది. అయితే యుద్ధ క్షేత్రంలో కాక చర్చలతో, దౌత్యంతో మాత్రమే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వివిధ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఈ మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. ఇరు దేశాలూ చర్చలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. సరిగ్గా నాటో 75 యేళ్ల ఉత్సవాల సందర్భంలో రష్యా పర్యటనను ఎంచుకున్నందుకు అమెరికా ఆగ్రహించింది. అయితే ఎడతెగకుండా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకడమెలా అన్నది దానికి బోధపడటం లేదు. తన మద్దతుతో, పాశ్చాత్య దేశాల సహకారంతో 3, 4 నెలల్లో రష్యాను ఉక్రెయిన్ అవలీలగా జయిస్తుందన్న భ్రమ మొదట్లో అమెరికాకు ఉంది. కానీ రోజులు గడిచేకొద్దీ అది కొడిగట్టింది. నిరుడు ఫిబ్రవరిలో శాంతి సాధన పేరుతో చైనా ఒక ప్రతిపాదన చేసింది. కానీ అందులో రష్యావైపే మొగ్గు కనబడుతోందన్న విమర్శలొచ్చాయి. పైపెచ్చు చైనా అధికారిక మీడియా మొదటి నుంచీ రష్యాను వెనకేసుకొస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ దౌత్యంపై ఆశలేర్పడటం సహజం. అయితే పరస్పరం తలపడుతున్న వైరి పక్షాలు మానసికంగా చర్చలకు సిద్ధపడితే తప్ప ఎవరి ప్రయత్నాలైనా ఫలించే అవకాశాలుండవు. ముఖ్యంగా ఈ యుద్ధంలోని నిరర్థకతను రష్యాతో పాటు అమెరికా, యూరొప్ దేశాలు గుర్తించాల్సివుంది. ఆ తర్వాతే ఉక్రెయిన్ దూకుడు తగ్గుతుంది. ఆ మాటెలావున్నా మోదీ పర్యటన మన విదేశాంగ విధానానికి కొత్త బాట పరిచింది. -
భారత్, రష్యాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధం!
రష్యా కొత్త విదేశాంగ విధానంపై చైనా సానూకూలంగా స్పందించింది. దీని గురించి విలేకరులు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందన కోరగా..చైనా రష్యా, భారత్ గుర్తించదగిన రీతిలో అతిపెద్ద శక్తులుగా ఎదుగుతున్నాయి. పైగా ప్రభావంతంగా అభివృద్ధి చెందుతున్నాయి కూడా. ప్రస్తుతం అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు సంక్లిష్ట మార్పులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా, భారత్ సహా అంతర్జాతీయ సమాజంతో సంబంధాల బలోపేతం చేసుకోవడానికి తాముగా సిద్ధంగా ఉన్నాం. అంతేగాదు పరస్పర గౌరవం, శాంతియుత జీవన, గెలుపు-విజయాల సహకారంతో కూడిన ఈ సరికొత్త విదేశాంగ విధానంతో సంబంధాలను మరింతగా పెంపొందించడానికి చైనా రష్యాలు అంకితభావంతో పనిచేస్తున్నాయి. అని చెప్పారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత శుక్రవారమే కొత్త విదేశాంగ విధానంపై సంతకం చేశారు. దీనిలో రష్యా చైనా, భారత్తో సంబంధాలను బలోపేతం చేసే దౌత్యపరమైన ప్రాధాన్యత గురించి పేర్కొంది. ఈ మేరు 42 పేజీల ఆ కొత్త విదేశాంగ విధానం డాక్యుమెంట్లులో చైనా భారత్ సంబంధాలను ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. అంతేగాదు యురేషియా ఖండంలో ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరింతగా పెంచుకోవడం, సమన్వయం చేసుకోవడం వంటి ప్రాముఖ్యతనును కూడా రష్యా నొక్కి చెప్పింది. అలాగే ఈ ప్రాంతంలో భారత్తో వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తామని, అలాగే ప్రత్యర్థి దేశాలు, కూటములు చేపట్టే ‘విధ్వంసకర చర్యల’ను నిరోధిస్తామని పుతిన్ ఆ విదేశాంగ విధానంలో వివరించారు. (చదవండి: భారత్ ఐడ్రాప్స్ యూఎస్ ఆరోపణలు! తోసిపుచ్చిన ఫార్మా కంపెనీ) -
అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా?: రాహుల్
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కుబేరుడిని చేయడమే మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానామా? అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. నరేంద్ర మోదీ గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో మోదీ ఎక్కడికెళ్లినా అదానీని సైతం వెంట తీసుకెళ్లారని గుర్తుచేశారు. PM का विदेश जाना और वहां अडानी को नए बिज़नेस डील मिलना, कोई संयोग नहीं है। ‘मोडानी’ ने भारत की फॉरेन पॉलिसी को फॉरेन ‘डील’ पॉलिसी बना दिया है। पूरा वीडियो देखें: https://t.co/63gl5II39Q pic.twitter.com/CshP26wK6D — Rahul Gandhi (@RahulGandhi) March 14, 2023 ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణం: జైరాం పార్లమెంట్లో ప్రతిష్టంభనకు ముమ్మాటికీ మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్విట్టర్లో ధ్వజమెత్తారు. కీలకమైన అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడం ప్రధాని మోదీకి, ఆయన సహచరులకు ఒక అలవాటుగా మారిందన్నారు. రాహుల్ విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ హయాంలోనే అదానీ వ్యాపారావేత్తగా ఎదిగారన్నారు. ‘‘గుజరాత్ కాంగ్రెస్ సీఎం చిమన్భాయ్ పటేల్ తనకు మొదటి బ్రేక్, రాజీవ్ గాంధీ రెండో బ్రేక్ ఇచ్చారని అదానీ స్వయంగా చెప్పారు. ప్రధాని మోదీని దూషించడమే ప్రతిపక్షాల ఉద్దేశం. అంబానీ–అదానీ సాకులే. యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలన వివాదాలమయం. మోదీ సర్కారు వచ్చాకే అభివృద్ధి జరుగుతోంది’’ అన్నారు. ప్రమాదంలో భావప్రకటనా స్వేచ్ఛ: ఖర్గే మాట్లాడే స్వాతంత్య్రం, నిజాలు రాసే స్వేచ్ఛ ప్రమాదంలో చిక్కుకున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్మత్ జాతీయ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు మీడియాను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఓ వర్గం మీడియా వారికి లొంగిపోయిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ కేంబ్రిడ్జి అరుపులు, లండన్ అబద్ధాలు ఆపాలని సదస్సులో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హితవు పలికారు. విపక్ష నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. చదవండి: ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్ను మార్చుకోండి.. -
India Foreign Policy: 2023లో మన విదేశాంగం ఎటు?
మరొక కల్లోలభరితమైన సంవత్సరం ముగిసింది. 2022 ప్రారంభంలో యుద్ధం యూరోపియన్ తీరాలకు చేరుకుంది. కోవిడ్–19 అనంతర సాధారణ స్థితికి ప్రపంచం వస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడంతో ప్రపంచ క్రమవ్యవస్థకు కొత్త సవాళ్లను విసిరినట్టయింది. అమెరికా–చైనా మధ్య ఘర్షణ పదునెక్కుతున్న స్థితిలో రష్యా–చైనా మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆయుధీకరణ కొత్త వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నందున ప్రపంచీకరణ వ్యతిరేక క్రమం చుట్టూ చర్చ బలం పుంజుకుంటోంది. ఈ ఉపద్రవం మధ్య అంతర్జాతీయ సంస్థలు నూతన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. కాబట్టి, నూతన సంస్థాగత నిర్మాణాల కోసం శోధన ముందుకు వచ్చింది. జాతీయ వ్యూహాత్మక చింతనకు చెందిన కొన్ని మౌలిక భావనలకు బహిరంగంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు భారతీయ విదేశీ విధానం ఒక సంవత్సర కాలంలో ఈ అన్ని మలుపులకూ స్పందించాల్సి వచ్చింది. 2020లో గల్వాన్ సంక్షోభం భారత ప్రభు త్వాన్ని తన చైనా విధానాన్ని తిరిగి మదింపు చేసుకునేలా ఒత్తిడికి గురిచేసింది. ఆ విధంగానే ఉక్రెయిన్ యుద్ధం భారత్ను తన రష్యా విధాన చోదక శక్తుల పట్ల వైఖరిని తిరిగి పరిశీలించుకునేలా చేసింది. అలాగే పాశ్చాత్య ప్రపంచంతో తన వ్యవహార శైలిని కొత్తగా రూపొం దించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. 2022 ఫిబ్ర వరిలో రష్యన్ దురాక్రమణ ప్రారంభమైనప్పుడు, డిమాండ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు ఒకవైపు, విఘాతం కలిగించే రష్యా మరొకవైపు ఉంటున్న స్థితిలో రెండు శక్తులతోనూ సంబంధాలను భారత్ ఎంత కష్టంగా నిర్వహిస్తుందనే అంశంపై చాలా చర్చ జరిగింది. అయితే అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ సమస్యపై భారత్ సమతుల్యత ప్రదర్శించడం నుంచి నూతన సంవత్సరం నాడు ప్రారంభమైంది. ఇంధన భద్రత కోసం రష్యాతో తన సంబంధ బాంధవ్యాలను భారత్ కొనసాగించడమే కాదు, మాస్కోతో ఇంధన పొత్తులను మరింతగా పెంచుకోగలిగింది. రష్యాను బహిరంగంగా ఖండించక పోవడం ద్వారా పాశ్చాత్య ప్రపంచం పక్షాన భారత్ నిలబడలేదని పాశ్చాత్య దేశాల్లో కొంతమంది విమర్శిస్తున్న సమయంలోనే, సంవత్సరం పొడవునా పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ తన వంతుగా ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సార్వభౌమాధికారం నేపథ్యంలో రష్యన్ దురాక్రమణపై ఆరోపించడం నుంచి తన వైఖరిని మార్చు కుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది యుద్ధ సమయం కాదని రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్కు బహిరంగం గానే బోధ చేసేంతవరకు పోయారు. బాలి సదస్సులో జీ20 దేశాల చర్చల సమయంలో సెంటిమెంటును రంగరించి మరీ మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం ముగిసే సమయానికి ఉక్రెయన్ సంక్షోభాన్ని ముగించే విషయంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర చేపట్టనుందని అంచనాలు పెరిగిపోయాయి. చివరకు ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ ఫోన్ చేసి మరీ మాట్లాడారు. రష్యా పట్ల భారత్ వైఖరిని పాశ్చాత్య ప్రపంచం ప్రారంభంలో విమర్శనాత్మకంగా అంచనా వేసింది. కానీ ఉక్రెయిన్ సమస్యపై దౌత్యపరమైన ప్రయత్నాల విషయంలో భారత్ చొరవను చివరకు పాశ్చాత్య దేశాలు హేతుపూర్వకంగా గుర్తించాల్సి వచ్చింది. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అవుతాయి కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అనే ఆలోచనలోని కపటత్వాన్ని భారత్ నొక్కి చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇండో–పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి భారత్ కేంద్ర స్థానం విషయంలో యూరప్ దేశాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో ఈ సంవత్సరం భారత్–యూరోప్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ స్థలపరిధుల్లో రష్యాకు ప్రధాన స్థానం ఉన్నప్పటికీ, చైనా నుండీ, దాని దూకుడు ఎత్తుగడలనుంచే తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక సవాళ్లు ఎదురు కానున్నాయని యూరప్ దేశాలకు స్పష్టంగా బోధపడింది. వారి వ్యూహాత్మక తర్కం కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు కూడా ముందంజ వేశాయి. ఇండో–పసిఫిక్ నేడు అత్యంత కీలకంగా మారింది. పసిఫిక్ ప్రాంతంలో ‘క్వాడ్’, మధ్య ప్రాచ్యంలో ‘ఐ2యు2’ (ఇజ్రాయెల్, ఇండియా, యూఎస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రెండు కీలక భూభాగాల్లో సంస్థాగత వ్యాఖ్యాత లుగా ఆవిర్భవిస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్ ద్వైపాక్షిక సంబంధా లకు మించి, తమ వ్యవహారాలకు చెందిన ఎజెండానే పునర్నిర్వ చించుకుంటున్నాయి. దాంతోపాటు తమ ఆకాంక్షల ఆకృతులను మరింతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. భారతదేశం నిర్వహంచే అంతర్జాతీయ పాత్రను ప్రపంచం ఇప్పుడు మరింత సీరియస్గా తీసుకుంటోంది. ఎందుకంటే సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యలను భారత్ ఇప్పుడు మరింతగా పట్టించుకుంటూ, నాయకత్వం వహించగలుగుతోంది. ప్రపంచ సమస్యలకు అది పరిష్కారాలు అందించడానికి సిద్ధపడుతోంది. భావసారూప్యత కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తన అధ్యక్ష స్థానాన్ని.. సంస్కరించిన బహుపాక్షికతను, శాంతిపరిరక్షణను, ఉగ్రవాద నిరోధకతను, సముద్ర భద్రతను నొక్కి చెప్పడానికి ఉపయోగించుకుంది. ఈ సమస్యలు భారత్ ప్రయోజనాలకే కాదు, ప్రపంచంలోని విశాల భాగం ప్రయోజనాలకు కూడా చాలా ముఖ్యమైనవి. భద్రతాసమితిలో భారత్ వ్యవహరిస్తున్న తీరులో ఆచరణా త్మకతకు చెందిన కొత్త అర్థం ప్రస్ఫుటమవుతోంది. ఇంతవరకు వినపడకుండా కనిపించకుండా పోయిన విశాల మెజారిటీ దేశాల గురించి మాట్లాడేలా భారత వాణి ఉంటోంది. ఈ ప్రాధాన్యత ప్రాతిపదికపైనే అది జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతను చేపడుతోంది. బహుపాక్షికత అనేది తన విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లు కొన్నింటికి పరిష్కారాలను అందించే విషయంలో అందరి కళ్లూ న్యూఢిల్లీ చేపట్టిన జీ20 నాయకత్వంపైనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పర్యవసానాలను రూపుదిద్దగలిగే ‘నాయకత్వ శక్తి’గా భారత్ తన విశ్వసనీయతను పెంపొందించుకోవలసిన సమయం. ప్రత్యే కించి భారత గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఇది ఎంతో అవసరం. భారత్ అంతర్జాతీయ పాత్రను మెచ్చుకునే పరిణామాలు ఏర్పడు తున్న సమయంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచం మొత్తంగా బీజింగ్ వ్యవహారాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తపరుస్తున్న తరుణంలో చైనా దూకుడును నిలువ రించడంలో దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకుంది. 2022లో ఇలాంటి కొన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడంలో భారతీయ విదేశీ విధానం విజయవంతమైంది. మరోవైపున చైనా సవాలు సమీప భవిష్యత్తులో భారత ప్రభుత్వ సమర్థతను పరీక్షించడం కొనసాగించనుంది. శీతాకాలం తర్వాత కూడా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగినట్లయితే భారత్, రష్యా పొత్తు కూడా నిశిత పరిశీలనకు గురవుతుంది. న్యూఢిల్లీ పదేపదే చెబుతున్న ‘బహుళ–అమరిక వాదం’ కూడా 2023లో తీవ్రమైన ఒత్తిడి పరీక్షకు గురికాక తప్పదు. అయితే 2022 గురించి ఏమైనా చెప్పుకోవాలీ అంటే, భారత వాణి విశిష్టతను ప్రపంచం గుర్తించింది. మున్ముందు అది అంతర్జాతీయ వేదికలపై మరింతగా విస్తరిస్తుంది. ఇప్పుడప్పుడే దాని ప్రతిధ్వనులు తగ్గిపోవు. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!) - హర్ష్ వి. పంత్ ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్తో స్వేచ్ఛా వాణిజ్యానికి సై: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
లండన్: భారత్–బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్ నూతన ప్రధాని రిషీ సునాక్ మరోమారు స్పష్టంచేశారు. ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్ మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సునాక్ ప్రసంగించారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్ ముందునుంచీ మద్దతు పలుకుతోంది. రాజకీయాల్లోకి రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం. 2050కల్లా ప్రపంచవాణిజ్యంలో సగం వాటాను ఇండో–పసిఫిక్ హస్తగతం చేసుకుంటుంది. అందుకే ఇండో–పసిఫిక్ సమగ్రాభివృద్ధి ఒప్పందం(సీపీటీపీపీ)లో భాగస్వాములం అవుతున్నాం. ఇందులోభాగంగా భారత్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషిచేస్తున్నాను’ అని సునాక్ అన్నారు. చైనాతో స్వర్ణయుగ శకం ముగిసినట్లే ‘చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక, రాజకీయ సంస్కరణలు, సత్సంబంధాలకు దారితీయాలి. కానీ చైనా రాజ్యవిస్తరణవాదం, ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు. చైనాతో బ్రిటన్ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్లే’ అన్నారు. -
బ్రిటన్, చైనా మధ్య స్వర్ణయుగం ముగిసింది: రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్లో సోమవారం జరిగిన సమావేశంలో తొలిసారి విదేశాంగ విధానంపై ప్రసంగించారు. బ్రిటన్ చైనా మధ్య స్వర్ణ యుగంగా పిలవబడే సంబంధాలు ముగిశాయని వ్యాఖ్యానించారు. యూకే విలువలు, ఆసక్తులపై చైనా వ్యవస్థాగత సవాలు విసరుతోందని, ఇది మరింత తీవ్రమవుతున్నాయని మండిపడ్డారు. చైనా నిరంకుశ పాలనపట్ల బ్రిటన్ దృక్పథాన్ని అభివృద్ధి పరచాల్సిన సమయమిదని అన్నారు. చైనాలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని విమర్శించారు. ‘సామాజిక రాజకీయ సంస్కరణలకు దారితీస్తుందనే అమాయక ఆలోచనతో పాటు మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్ కాలంలో స్వర్ణయుగంగా పిలవబడిన సంబంధాలు బ్రిటన్, చైనా మధ్య ముగిశాయని స్పష్టం చేస్తున్నాను. మన విలువలు, ఆసక్తులకు వ్యతిరేకంగా డ్రాగన్ దేశం వ్యవస్థాగత సవాలు విసురుతుందని మేము గుర్తించాం. ఇది తీవ్రతరమవుతూ.. మరింత నిరంకుశత్వం వైపు మళ్లుతోంది’ అని అన్నారు. కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్న బీబీసీ జర్నలిస్ట్ను చైనా పోలీసులు అరెస్ట్ చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ రిషి సునాక్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ వ్యవహారాల్లో చైనా అందించిన ప్రాముఖ్యతను మరచిపోలేదని రిషి సునాక్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్తోపాటు అనేక ఇతర దేశాలు కూడా దీనిని అర్థం చేసుకున్నాయని అన్నారు. అలాగే ఉక్రెయిన్కు గత ప్రధానులు బోరిస్, ట్రస్ అందించిన మద్దతును కొనసాగిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఉక్రెయిన్కు సైనిక, మానవతా సాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ మిత్రదేశాలతో వాణిజ్యం, భద్రతా సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. చదవండి: మంకీపాక్స్ పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. ఇకపై ఇలానే పిలవాలి..! కాగా రిషి సునాక్ చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదు. ప్రధాని రేసులో ఉన్న సమయంలో కూడా బ్రిటన్తోపాటు ప్రపంచ భద్రతకు చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా నుంచి భారత్ వరకు ఎన్నో దేశాలను చైనా లక్క్ష్యంగా చేసుకుందనడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. బ్రిటన్ ప్రధానిగా తాను ఎన్నికైతే డ్రాగన్ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయన్నారు. చైనా సాంకేతిక దూకుడుకు ముక్కుతాడు వేసేందుకు నాటో మాదిరి సరికొత్త మిలటరీ వ్యవస్థను రూపొందిస్తానని తెలిపారు ‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి. షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘షీ జిన్పింగ్ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో బీబీసీ జర్నలిస్టు ఒకరిని పోలీసులు అరెస్టు చేసి కస్టడిలో ఆమెపై దాడి చేసినట్లు తెలిసింది. బీబీజీ ప్రతినిధిపై దాడి ఘటన తీవ్రంగా కలవరపరిచిందని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ అన్నారు. చదవండి: రిషి తోటలో రూ.12 కోట్ల శిల్పం.. వివాదాస్పదంగా ప్రధాని అధికార నివాసం -
ఉగ్రవాదంపై మోదీ వ్యాఖ్యలు...పాక్, చైనాకు ఊహించని ఝలక్
No Money for Terror: పాక్ చైనాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అంతర్జాతీయ మంత్రివర్గ సమావేశంలో ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్(నో మనీ ఫర్ టెర్రర్)పై మాట్లాడుతూ...."కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను అడ్డుకుంటూ పరోక్షంగా మద్దుతిస్తున్నాయి. ఉగ్రవాదం పట్ల సానుభూతి చూపే సంస్థలు, వ్యక్తులను ఒంటరిని చేయాలి. ఇలాంటి విషయాల్లో క్షమాగుణం చూపకూడదు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించేలా ప్రంపంచం ఏకం కావాలి. ఈ సందర్భంగా లష్కరే తోయిబా(ఎల్ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్తో సహా ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు యత్నించిన అంతర్జాతీయ ప్రయత్నాలను చైనా ఎలా విఫలం చేసిందో ప్రస్తావించారు. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలను అరికట్టేందుకు నిధులను నిలిపేయాలి. టెర్రర్ ఫైనాన్సింగ్పై దాడి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతేగాదు టెర్రర్ ఫైనాన్సింగ్ కోసం కొత్తరకాల టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అలాగే మనీలాండరింగ్, ఆర్థిక నేరాలు వంటి కార్యకలాపాలు టెర్రర్ ఫండింగ్కి సహయపడతాయని తెలుస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూఎన్ఎస్సీ, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఎఫ్ఏలీఎఫ్) వంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాయం చేస్తున్నాయి. ఉగ్రవాదానికి సంబంధించిన ఒక్క దాడి జరిగిన, ఒక్క ప్రాణం పోయినా సహించం, నిర్మూలించేంత వరకు వదిలిపెట్టం. కాశ్మీర్ తరుచుగా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని, పరిష్కరించడం అత్యంత ముఖ్యమని చెప్పారు. యావత్తు ప్రపంచం ఉగ్రవాదాన్ని తీవ్రంగా పరిగణించక ముందే భారదత్ తీవ్ర భయాందోళనలు ఎదుర్కొందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ రూపాల్లో ఉగ్రవాదం భారత్ని దెబ్బతీయాలని చూసిన తాము ధైర్యంగా పోరాడం" అని చెప్పారు. ఈ క్రమంలో సదస్సును ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ...ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడమే అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఉగ్రవాదాలను తమ హింసను నిర్వహించేందుకు... యువతను రిక్రూట్ చేసుకోవడం, ఆర్థిక వనరులను పెంచుకోవడం తదితరాల ఎప్పటికప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తారన్నారు. ఉగ్రవాదుల తమ ఉనికిని దాచేలా డార్క్నెట్ని వినియోగిస్తున్నారని జాగుకతతో ఉండాలని సూచించారు. (చదవండి: వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్) -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
-
పాకిస్తాన్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అణ్వాయుధాల సమన్వయం లేని పాకిస్తాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఒకటిగా అభివర్ణించారు. ఈ మేరకు బైడెన్ లాస్ ఏంజిల్స్లో జరిగిన డెమోక్రటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా రష్యా తీరుపై కూడా విమర్శలు కురింపించారు. బైడెన్ చైనా, రష్యాలతో గల యూసెస్ విదేశాంగ పాలసీ విధానం గురించి చెబుతూ పాకిస్తాన్పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కి తనకు కావల్సిన దానిపై పూర్తి క్లారిటీ ఉందని, కానీ పలు వివాదాలను ఎదుర్కొంటున్నాడని అన్నారు. ఈ 21వ శతాబ్దంలో రెండో త్రైమాసికంలో అమెరికాను మరింత శక్తివంతంగా మార్చేందుకు పలు అపారమైన అవకాశాలు ఉన్నాయని నమ్మకంగా చెప్పారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా వ్యూహాం విదేశాంగ పాలసీ సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఐతే అమెరికా విడుదల చేసిన 48 పేజీల ఈ డాక్యుమెంట్లలో పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఆ డాక్యుమెంట్లో... హద్దులేని భాగస్వామ్యంతో చైనా, రష్యాలు కలిసిపోతున్నాయని హెచ్చరించారు. ఆ రెండు దేశాలు విసిరే సవాళ్లు చాలా విభిన్నంగా ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాలతో యూఎస్కి ఎదురయ్యే ముప్పు గురించి నొక్కి చెప్పారు. రష్యా ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాపై శాశ్వతమైన పోటీని కొనసాగించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనాతో పోటీ ఎక్కువగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. (చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్) -
భారత్పై మరోమారు ఇమ్రాన్ ప్రశంసలు.. ‘జైశంకర్’ వీడియో ప్రదర్శన!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్పై ప్రశంసలు కురిపించారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందంటూ కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో భారత్పై పశ్చిమ దేశాలు విమర్శించటాన్ని తప్పుపడుతూ ఈ మేరకు భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. లాహోర్ జాతీయ హాకీ మైదానంలో శనివారం అర్ధరాత్రి బహిరంగ సభలో మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేసిందన్నారు. ‘భారత్, పాకిస్థాన్ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. విదేశాంగ విధానం విషయంలో భారత్ ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేస్తున్నాయి. భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రశ్నించారు.’ అని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జేశంకర్ ప్రశ్నించిన వీడియోను సభలో ప్రదర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్థాన్ ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. Former Pak PM Imran Khan plays out video clip of India's foreign minister Dr S Jaishankar during his mega Lahore Rally on Saturday, pointing out his remarks how India is buying Russian oil despite western pressure. Says, 'yeh hoti hai Azad Haqumat' pic.twitter.com/tsSiFLteIv — Sidhant Sibal (@sidhant) August 14, 2022 ఇదీ చదవండి: తైవాన్లో అమెరికా బృందం పర్యటనపై చైనా ఆగ్రహం -
భారత్పై మరోసారి పొగడ్తల వర్షం కురిపించిన ఇమ్రాన్ఖాన్
ఇస్లామాబాద్: భారత్పై మరోసారి ప్రశంసలు జల్లు కురిపించాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకవైపు పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై వస్తున్న విమర్శలను ఖండిస్తూ... పాక్ మాజీ ప్రధాని భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు లాహోర్లోని భారీ సభను ఉద్దేశిస్తూ... భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రష్యా చమురు కొనుగోలు విషయమై స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్లో జూన్ 3న మాట్లాడిన వీడియో క్లిప్ని ప్లే చేశాడు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం విషయంపై భారత్పై అమెరికా ఒత్తిడి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధం చేసేలా రష్యాకు నిధులు చేకూరుస్తున్నారంటూ అమెరికా దాని మిత్ర దేశాలై పశ్చిమ దేశాలు పెద్దఎత్తున్న భారత్పై ఆరోపణలు చేశాయి. ఆ సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రజలకు కావల్సినంత మేర గ్యాస్ కొంటాం అని స్పష్టం చేశారు. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటుండగా కేవలం భారత్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగడానిన భారత్ ఖండిస్తుందని ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా తమ వంతు సాయం అందిస్తామని కూడా భారత్ చెప్పిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. భారత్-పాకిస్తాన్ ఒకే సమయంలో స్వాతంత్య్రాన్ని పొందాయి. కానీ తమ ప్రజలకు అనుగుణంగా భారత్ విదేశాంగ విధానాన్ని రూపొందించిందని ప్రశంసించారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ పై వస్తున్న విమర్శలను ఖండించడమే కాకుండా న్యూఢిల్లీ అమెరికా ఒత్తిడికి తలవొంచకుండా తీసుకున్న దృఢమైన వైఖరిని ఎంతగానో మెచ్చుకున్నారు. పైగా భారత్ అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమని కూడా అన్నారు. కానీ పాక్.. భారత్లా చెప్పలేదు. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం చేయలేకపోయింది. పైగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వివరణ ఇచ్చుకోలేక పోయింది. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ మరో విషయం గురించి ప్రస్తావిస్తూ... కేవలం భారత్ చౌకగా రష్యా చమురు కొనుగోలుతో యుద్ధానికి నిధులు సమకూరుస్తే మరీ యూరప్ దేశాలు కూడా రష్య చమురు కొనుగోలు చేస్తున్నాయి కదా మరీ అవి కూడా యుద్ధానికి నిధులు సమకూర్చినట్లేనా! ఒక్కసారి ఆలోచించండి అని భారత్కి మద్ధతుగా మాట్లాడారు. ( చదవండి: మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్) -
చైనా దోస్తీ వల్లే నాకీ పరిస్థితి: ఇమ్రాన్ ఖాన్
చైనాతో పాక్ వాణిజ్య బంధం కొనసాగాలన్న తన ఉద్దేశం వల్లే ప్రధాని పీఠం నుంచి దించేశారని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత.. లాహోర్లో నిర్వహించిన ఓ భారీ బహిరంగసభలో ఖాన్ మాట్లాడారు. పనిలో పనిగా.. భారత్ విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మరోసారి కీర్తిస్తూనే.. సొంత దేశం రాజకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుంది. కానీ, పాక్లో అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్లే ప్రస్తుత సంక్షోభం నడుస్తోందని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. అయినా రష్యా నుంచి చమురు తీసుకుంటోంది. చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్కు అమెరికా సూచించినప్పుడు.. ‘మా దేశానికి ఏది మంచో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని సూటిగా చెప్పేసింది. భారత్ విదేశాంగ విధానం అనేది తన సొంత ప్రజల కోసం. కానీ, మన విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. చైనాతో మన స్నేహాన్ని వారు(తన రాజకీయ ప్రత్యర్థులు) సైతం ఇష్టపడడం లేదు. అప్పుడే కుట్ర (తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా) మొదలైంది’’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులకు కూడా చైనాతో వ్యాపారవాణిజ్యాలు నేను మెరుగుపర్చుకోవడం ఇష్టం లేదు. అందుకే ప్లాన్తో కుట్రకు తెర లేపారు. కానీ, ఇక్కడి ప్రతిపక్షాల సహకారం లేనిదే అది జరుగుతుందా?. అలా తనను పదవి నుంచి దించేయడంపై తన చైనా దోస్తీ ఓ కారణమైందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. రష్యా పర్యటన సమర్థన ఇక ప్రధాని హోదాలో తాను రష్యా పర్యటన చేయడం విదేశీ శక్తులకు నచ్చలేదన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ పర్యటనను సమర్థించుకున్నారు. తాను రష్యాకు వెళ్లింది 30 శాతం డిస్కౌంట్తో చమురు కొనుగోలుకేనని, పాక్ ద్రవ్యోల్బణం నియంత్రణకే తాను ప్రయత్నించానని కామెంట్లు చేశాడు. అయితే.. తన స్వతంత్ర విదేశాంగ విధానమే తనకు శాపంగా మారిందని, అది విదేశీ శక్తులకు నచ్చలేదని, కానీ, అలాంటి విదేశాంగ విధానంతోనే భారత్ ముందుకెళ్లడం గొప్పదనమని పేర్కొన్నాడు ఇమ్రాన్ ఖాన్. చదవండి👉🏾: కానుకల కక్కుర్తిపై ఇమ్రాన్ ఖాన్ స్పందన ఇది -
జైశంకర్ను ఆకాశానికెత్తిన రష్యా విదేశాంగ మంత్రి
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ను.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికెత్తారు. నిజమైన దేశభక్తుడంటూ జైశంకర్ను అభివర్ణించారాయన. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా భారత్ సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. చాకచక్యంగా దౌత్యం నడిపించడంలో జైశంకర్ ముందుంటున్నారంటూ పేర్కొన్నారు సెర్గీ లావ్రోవ్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు, కొన్ని సవాళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది. ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్ వ్యవహరించిన తీరు హర్షణీయం. అందుకే ఆయన అతని దేశానికి నిజమైన దేశభక్తుడు అంటూ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆకాశానికి ఎత్తాడు. జైశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, నిజమైన దేశభక్తుడు. దేశ భద్రత కోసం, అభివృద్ధికి అవసరమని భారత్ ఏదైతే విశ్వసిస్తుందో.. మేం కూడా ఆ (భారత్) మార్గంలోనే వెళ్లాలనుకుంటున్నాం. పైగా చాలా దేశాలు భారత్లా వ్యవహరించలేవు కూడా అని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో భారత్ కొనసాగించిన లావాదేవీలపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. విదేశాంగ మంత్రి జైశంకర్ బదులు ఇచ్చారు. ముందు ఈయూ సంగతి చూడాలని, వాళ్లతో పోలిస్తే తాము(భారత్) చేసుకుంటున్న దిగుమతుల మోతాదు చాలా తక్కువేనని, పైగా మానవ హక్కుల ఉల్లంఘన విషయంలోనూ అమెరికా లేవనెత్తిన అభ్యంతరాలకు గట్టి కౌంటరే ఇచ్చారాయన. ఈ నేపథ్యంలో.. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. -
ఇమ్రాన్ ఖాన్ టంగ్ స్లిప్.. ఖండించిన అమెరికా
తనను గద్దెదింపేందుకు జరుగుతున్న రాజకీయ కుట్ర వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు భారీగా డబ్బు ఎరవేసి ఆ దేశం ఈ పని చేయిస్తోందంటూ ఖాన్, అతని అనుచర గణం.. అవిశ్వాసం దరిమిలా పదే పదే రీల్ వేస్తున్నాయి. ఈ తరుణంలో.. తాజాగా నేరుగా అగ్రరాజ్యం అమెరికా మీదే ఖాన్ విమర్శ చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని వైట్హౌజ్ ఉన్నతాధికారి కేట్ బెడింగ్ఫీల్డ్ వ్యాఖ్యానించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పాక్ రాజ్యాంగం, చట్టాలపై మాకు గౌరవం ఉంది. జోక్యం చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు మేం పరిశీలిస్తున్నాం’’ అంటూ ప్రకటనను ఆమె మీడియాకు చదివి వినిపించారు. అంతకు మించి స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారామె. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఓ జాతీయ టీవీ ఛానెల్లో ఇమ్రాన్ ఖాన్ సుదీర్ఘ ప్రసంగం ప్రసారం అయ్యింది. ఈ సందర్భంగా తనను గద్దె దించేందుకు కారణం తన స్వతంత్ర్య విదేశాంగ విధానమే అని పేర్కొన్న ఖాన్.. ఉక్రెయిన్ ఉద్రిక్తల సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే సదరు దేశం తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు. అయితే గంటపాటు సాగిన ప్రసంగంలో దాదాపుగా అమెరికా పేరు తీయకుండా మాట్లాడిన ఆయన.. మధ్యలో మాత్రం ఒకసారి నోరు జారి అమెరికా అని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ తరుణంలోనే అమెరికా స్పందించింది. ఇక భారీగా మిలిటరీ, ఆర్థిక సాయం పాకిస్థాన్కు అందించినప్పటికీ.. తనను మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఇమ్రాన్ ఖాన్, అమెరికాను ఒక విలన్గా చూస్తూ వస్తున్నాడు. అయితే అమెరికా మాత్రం పాక్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. -
పందికొక్కులు పాక్ను దోచుకుతింటున్నాయి: ఇమ్రాన్ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం పాక్ అసెంబ్లీలో ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొబోతోంది. కాగా, ఇప్పటికే ఇమ్రాన్కు సొంత పార్టీ ఎంపీలు, మిత్రపక్షాల నేతలు కీలక సమయంలో హ్యాండ్ ఇచ్చారు. అయితే, అవిశ్వాసం నేపథ్యంలో ఆదివారం ఇస్లామాబాద్లో ఇమ్రాన్ఖాన్ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వేలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తుల ప్రమేయం ఉందన్నారు. విదేశీ శక్తుల డబ్బుతో ఇక్కడి రాజకీయ నాయకులనే వినియోగించి పాక్ విదేశాంగ విధానాన్నే మార్చాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా తన వద్ద ఓ లేఖ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతోనే పాక్లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఆ డబ్బు అందుకున్న నాయకులు విదేశీ ఖాతాలకు డబ్బు బదీలీ చేస్తున్నారు. నా ప్రభుత్వం కొనసాగినా, పడిపోయినా.. తాను ప్రాణాలతో ఉన్నా లేకున్నా అలాంటి దేశదోహ్రులను విడిచిపెట్టాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు తొత్తులు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లుగా మూడు పందికొక్కులు దేశాన్ని దోచుకుంటున్నాయని పాక్ మాజీ ప్రధానులపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. వైట్కాలర్ నేరగాళ్ల కారణంగా పాకిస్థాన్ ఇంకా పేదరికంలోనే ఉందని ఇమ్రాన్ఖాన్ పేర్కొన్నారు. ముషారఫ్ లాగా ఇమ్రాన్ ఖాన్ కూడా లొంగిపోవాలని ఈ డ్రామా అంతా చేస్తున్నారని విమర్శించారు. వారు తమ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఈ ర్యాలీపై పాక్ ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతలు.. ఇమ్రాన్ఖాన్ అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకునేందుకు ఇస్లామాబాద్ వీధుల్లో రక్తపాతం చేయడానికి కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. Asad Umar: It looks like we will come with 2/3 majority next time Faisal Javed Khan: Unbelievable scenes today Testimonials by @Asad_Umar and @FaisalJavedKhan after seeing the Epic Jalsa Crowd from the main stage! #IamImranKhan pic.twitter.com/14Lbg9mCIp — PTI (@PTIofficial) March 27, 2022 -
ఉక్రెయిన్-రష్యా వివాదం: సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన తాలిబన్లు!
Russia Ukraine conflict through “peaceful means: అఫ్గనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ ఉక్రెయిన్లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడమే కాక పౌరుల ప్రాణ నష్టం పై ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తీవ్రతరం చేసే విధానాలను ఇరు పక్షాలు మానుకోవాలని సూచించింది. అంతేకాదు అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది నెలరోజుల క్రితం అఫ్గాన్ రాజధాని కాబూల్లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఇదే విధమైన సైనిక దాడిని ఉపసంహరించుకుని అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో అష్రఫ్ ఘనీ ఎన్నికైన ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్లో ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానాలు, నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలను తాము సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్–చైనా ఒక్కటయ్యాయంటూ రాహుల్ గాంధీ లోక్సభలో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. పాక్–చైనా బంధంపై మాట్లాడే విషయాన్ని ఆయా దేశాల ప్రజలకే వదిలేద్దామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. అమెరికా, చైనాలలో స్నేహం కోసం దేన్ని ఎంచుకోవాలన్నది ప్రపంచ దేశాల ఇష్టమని చెప్పారు. దేశానికి రాజా అనుకుంటున్నారు... లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై అధికార బీజేపీ మాటల దాడి కొనసాగిస్తోంది. ఆయన భారతదేశానికి ఇన్నాళ్లూ యువరాజులాగా ప్రవర్తిం చేవారని, తప్పుడు రాజును అనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఎద్దేవా చేశా రు. జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులను అణచివేయడం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం రాహుల్ గాంధీ దృష్టిలో తప్పేనా? అని బీజేపీ అధికార ప్రతినిధి, బిహార్ మంత్రి షానవాజ్ హుస్సేన్ నిలదీశారు. నిజాలే మాట్లాడారన్న కాంగ్రెస్ రెండు భారతదేశాలు అంటూ పార్లమెంట్లో ప్రసంగించిన రాహుల్ గాంధీని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సమర్థించారు. దేశానికి రెండు ముఖాలు ఉన్నాయని, ఒకటి ధనికం కాగా, మరొకటి నిరుపేద అని సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రెండింటి మధ్య అంతరాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాత్రమే రాహుల్ విమర్శించారని గుర్తుచేశారు. ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని పేర్కొన్నారు. రాహుల్ నిజాలే మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రాహుల్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ మాజీ మంత్రి నట్వర్ సింగ్ ఖండించారు. సభా హక్కుల నోటీసు పార్లమెంట్ సభ్యులను, దేశ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కాంగ్రెస్ నేత రాహుల్ గాం ధీకి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసును లోక్సభ సెక్రటేరియట్కు అందజేశారు. భావాలను, అభిప్రాయాలను స్వేచ్ఛ వెల్లడించే రాజ్యాంగబద్ధ హక్కు ప్రతి ఎంపీకి ఉన్నప్పటికీ ఈ విషయంలో మర్యాద పాటించాలని దూబే పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. కేంద్రం, రాష్ట్రాలకు సంబంధించి రాహుల్ చేసి న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. భారత్ను రాహుల్ ఒక దేశంగా పరిగణించకపోవడం బా ధాకరమని, రాహుల్ అసలు రాజ్యాంగ ప్రవేశికను చదివారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించాలన్నారు. -
ఆధిపత్య చదరంగం
అధికారంలోకి వచ్చీ రాగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటా, బయటా మరమ్మతులు మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో చతికిలబడిన విదేశాంగ విధానం దుమ్ము దులిపి దానికి జవసత్వాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ మొదలుకొని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవాన్ వరకూ అందరూ విదేశీ పర్యటనల్లో బిజీగా వుండటం ఇందుకు రుజువు. సుదీర్ఘకాలం పెండింగ్లో వున్న చతుర్భుజ కూటమి(క్వాడ్) శిఖరాగ్ర సమావేశం ఈనెల 12న జరిగింది. ఆన్లైన్లో జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలు పాల్గొన్నారు. అది ప్రత్యేకించి చైనాను వ్యతిరేకించటానికి కాదని చెప్పినా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన ఆచరణాత్మక విధానాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. గత శుక్రవారం లాయిడ్ ఆస్టిన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలిశారు. అంతక్రితం ఆయన జపాన్, ఉత్తర కొరియాల్లో కూడా పర్యటించారు. అమెరికా ఉన్నతాధికార బృందంతో చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు గత వారం చివర చర్చలు జరిపారు. ఇందులో చర్చలకన్నా పరస్పర ఆరోపణలు, నిందలే ఎక్కువున్నాయి. హాంకాంగ్, తైవాన్లలో చైనా విపరీత పోకడలు, సైబర్దాడులు వగైరాల విషయంలో చైనాను గట్టిగా నిలదీశామని బ్లింకెన్ బాహాటంగానే చెప్పారు. అందుకు బదులు సైనిక బలగాలను ఉపయోగించి, ఆర్ధిక ఆంక్షలు విధించి వేరే దేశాలపై పెత్తనం చేస్తున్న అమెరికా వైఖరిని చైనా ఎత్తిచూపింది. అమెరికా చురుకుదనాన్ని చూసి రష్యా, చైనాలు సహజంగానే అప్రమత్తమయ్యాయి. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ చైనాలో సోమవారం రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. డాలర్ ఆధిపత్యాన్ని ప్రతిఘటించి, అమెరికా ఆంక్షల బారినపడిన దేశాలకు అండగా నిలవాలని తొలిరోజు చర్చల్లో నిర్ణయించారు. వేరే దేశాల సంగతలావుంచి తమపై విధించిన ఆంక్షల గురించే చైనా ఆగ్రహమంతా. చైనాలోని వీగర్ ప్రాంతంలో ముస్లింలపట్ల అనుసరిస్తున్న అణచివేత చర్యలతో ప్రమేయం వున్న ఇద్దరు చైనా ఉన్నతాధికారులపై అమెరికా ఈ ఆంక్షలు ప్రకటించింది. వీగర్ ముస్లింలపై మారణహోమం అమలవుతున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ఒకపక్క ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా అందరినీ కూడగడుతూ, మరోవైపు ఆంక్షల పేరిట పెత్తనం చలాయిస్తుండటం చైనాకు ఆగ్రహం కలిగిస్తోంది. అటు రష్యా సైతం ఈ మాదిరే కత్తులు నూరుతోంది. మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసి ట్రంప్కి సాయపడమని మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలిచ్చారని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ నివేదిక ఆరోపించింది. అయితే ఈసారి ఆ ఎత్తులు పారలేదని చెప్పింది. ఈ నివేదిక రష్యాకు ఆగ్రహం తెప్పిస్తోంది. క్రితంసారి సైతం డెమొక్రాటిక్ పార్టీ ఇలాంటి ఆరోపణే చేసి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని అంటున్నది. ఈ నేపథ్యంలోనే చైనా, రష్యా చర్చలు మొదలెట్టాయి. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సాంకేతికతలను పెంచుకుని తమ తమ కరెన్సీల వినియోగాన్ని విస్తరించాలని అవి నిర్ణయించాయి. అంతర్జాతీయ చెల్లింపులకు వినియోగిస్తున్న ‘స్విఫ్ట్’ విధానానికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని తీర్మానించాయి. వాస్తవానికి ఆ రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వాటా 2015తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అప్పట్లో డాలర్ మారకం 90 శాతం వరకూ వుంటే నిరుడు తొలి త్రైమాసికంలో అది 46 శాతానికి పడిపోయింది. మన దేశంతోపాటు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా వున్న బ్రిక్స్లో కూడా ద్రవ్య మారకానికి ఎవరికి వారు సొంత కరెన్సీలు వినియోగించాలని ఇప్పటికే చైనా, రష్యాలు ప్రతిపాదించాయి. చెప్పాలంటే అమెరికా మిత్ర శిబిరంలోని యూరప్ దేశాలు కూడా ఈ బాటే పట్టాయి. 2019లో ఇరాన్పై ట్రంప్ అమలు చేసిన ఆంక్షల్ని అధిగమించటానికి ఈయూ మారకమైన యూరోలో ఇరాన్కు చెల్లింపులు చేయటం మొదలుపెట్టాయి. డాలర్ని కాదని జరిపే చెల్లింపుల్లో ఎన్నో సంక్లిష్టమైన అంశాలు ఇమిడివున్నాయి. వాటిని అధిగమించటానికి ఇంకా సమయం పడుతుంది. ఇదంతా మరోసారి ఆధిపత్య పోటీ మొదలైన వైనాన్ని వెల్లడిస్తోంది. ఈ పోటీలో ఎవరి పక్షం వహించాలో ఏ దేశానికా దేశం నిర్ణయించుకోక తప్పని స్థితి త్వరలోనే రావొచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్ల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం పర్యవసానంగా ప్రపంచం ఎన్నో చేదు అనుభవాలు చవిచూసింది. ఎవరికి వారు ఆయుధాలు పోగేసుకోవటం, కయ్యానికి కాలు దువ్వటం అనేక సందర్భాల్లో ఉద్రిక్తతలు సృష్టించింది. ఘర్షణలు రగిల్చింది. మరోమారు ఆ దిశగానే ప్రపంచం అడుగులు వేస్తున్న దృశ్యం కనబడుతోంది. అందరూ గుర్తించినంతకాలమే ఆధిపత్యం చెల్లుతుంది. ఎవరికి వారు దాన్ని బేఖాతరు చేయటం మొదలుపెడితే ఆ అధిపత్యం తొలుత అర్ధరహితమవుతుంది. ఆ తర్వాత కనుమరుగవుతుంది. కానీ ఆధిపత్యాన్ని వదులుకునే స్థితి ఏర్పడినప్పుడు అందుకు ప్రతి వ్యూహం కూడా వుంటుంది. అది ప్రపంచ యుద్ధంగా పరిణమించకుండా ప్రతి దేశమూ సంయమనంతో మెలగాలి. యుద్ధాలవల్ల మిగిలేది జన నష్టం, అపారవిధ్వంసమేనని గుర్తించాలి. -
విదేశాంగ విధానంపైనే గురి
అమెరికా నూతన అధ్యక్షుడిగా బైడెన్ నియామకంపై వివాదాలు సడలిపోతున్న నేపథ్యంలో బైడెన్ నిర్వహించే విదేశాంగ విధానం చర్చనీయాంశం అవుతోంది. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న చైనాతో తలపడాలంటే అమెరికా తన మిత్ర దేశాలన్నింటితో కలిసి ఐక్య సంఘటన కట్టాల్సి ఉంటుందన్న బైడెన్ అంతర్జాతీయ సమాజానికి బలమైన హామీని ఇచ్చారు. కమ్యూనిస్టు చైనాతో సహకార దృష్టిని కలిగి ఉంటూనే, చైనాపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతుందని బైడెన్ తేల్చి చెప్పారు. ట్రంప్ దౌత్య వ్యూహాల్లో కొన్నింట్లో సమూల మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా. అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితులైన ఆంటోనీ బ్లింకెన్ తాజా వ్యాఖ్యలతో అమెరికా–భారత్ సంబంధాలు సానుకూలంగా పరిగణించగలవనే ఆశలు రేకెత్తుతున్నాయి. గత కొన్ని వారాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య ఘటన అయిన అధ్యక్ష ఎన్నికను యావత్ ప్రపంచం పరిశీలిస్తూ వచ్చింది. ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, ఎన్నికల ఫలితం మాత్రం స్పష్టంగా తేలిపోయింది. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జో బైడెన్ తదుపరి నాలుగేళ్లకు నిర్దేశించుకునే విదేశీ విధాన దిశపై రాజకీయ చర్చలు మొదలయ్యాయి. బైడెన్ హయాంలో అమెరికా దౌత్యవిధానాన్ని పునర్నిర్మించవచ్చని ట్రంప్ పాలనాయంత్రాంగం నిర్దేశించిన దౌత్య వ్యూహాల్లో సమూల మార్పులు చోటు చేసుకోవచ్చని అంచనా. అయితే చైనాపై అమెరికన్ దృక్పథం మాత్రం మునుపటిలాగే కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ‘చైనాపై కానీ, మరే దేశంపై కానీ భవిష్యత్తులో చోటుచేసుకునే పోటీలో నెగ్గాలంటే అమెరికా తన సాంకేతిక విన్నాణాన్ని మరింత పదును చేసుకోవలసి ఉంటుంది, పైగా వనరులను దుర్వినియోగపరుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలను సమైక్యపర్చాల్సిన అవసరం చాలానే ఉంది’ అంటూ ఎన్నికలకు ముందే అమెరికాలోని కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ ప్రచురిస్తున్న ఫారిన్ ఎఫైర్స్ పత్రికలో బైడెన్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. బైడెన్ ప్రకటన అంతర్జాతీయ సమాజానికి బలమైన హామీని ఇచ్చింది. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి కొన్ని అంశాల్లో కమ్యూనిస్టు చైనాతో సహకార దృష్టిని కలిగి ఉంటామని చెప్పినప్పటికీ, చైనాపై అమెరికా కఠిన వైఖరి కొనసాగుతుందని బైడెన్ తేల్చి చెప్పారు. అయితే ట్రంప్లాగా ప్రత్యక్షంగా చైనాపై మాటలయుద్ధం మొదలుపెట్టి పరిస్థితిని మరింత క్షీణింపచేసేలాగా కాకుండా బైడెన్ కాస్త భిన్నంగా వ్యవహరించవచ్చని అంచనా. యూఎస్–చైనా సంబంధాలు.. ఆసియన్ చైనా అసాధారణ వృద్ధి పట్ల అమెరికా స్పందన ఇకపై ఒక ద్వైపాక్షిక సమస్యగా మాత్రం ఉండబోదు. ఇరుదేశాల మధ్య నడుస్తున్న ఘర్షణల్లో చాలా దేశాలు ఇప్పటికే పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా 5జీ విషయంలో చైనా సాంకేతిక పురోగతిని యూరప్, తదితర దేశాలకు బూచిగా చూపిస్తూ వాటికి కూడా చైనా ప్రమాదకారేనని అమెరికా నచ్చచెప్పింది. దీంతో యూరప్ ఖండంలో చైనా టెలికమ్యూనికేషన్స్ దిగ్గజ సంస్థ హువై నేతృత్వంలో మొదలైన అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి లేక పూర్తిగా రద్దయిపోయాయి. అమెరికా చైనా మధ్య సాగుతున్న భౌగోళిక రాజకీయసమరంలో ఆగ్నేయాసియా మరో యుద్ధరంగంగా మారిపోయింది. స్వేచ్ఛాయుత సముద్రయానంపై అమెరికా విధానానికి, దక్షిణ చైనా సముద్రంపై తనకున్న చారిత్రక హక్కులను బలంగా ప్రకటిస్తున్న చైనా విధానానికి మధ్య వివాదం అత్యంత స్పష్టమైన రూపానికి వచ్చి చేరింది. ఆసియన్ కూటమిలోని అనేక దేశాలు కూడా దక్షిణ చైనా సముద్రంపై తమ వారసత్వ హక్కును ప్రకటిస్తున్నందున ఈ ప్రత్యేక సమస్యపై పరిష్కారం కోసం ఆసియన్ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తమ సార్వభౌమాధికార హక్కులను పరిరక్షించుకునే విషయంలో ఆగ్నేయాసియా కూటమిలోని మిత్రదేశాలకు తన మద్దతు ఉంటుందని అమెరికా స్పష్టంగా ప్రకటించింది. పైగా, తన సార్వభౌమాధికారం అమలవుతున్న జలాల్లో చైనా చట్టవ్యతిరేక చర్యలపై ఇండోనేషియా చేపట్టిన చర్యలను అమెరికా స్వాగతించింది. అక్టోబర్ చివరలో జకార్తాను సందర్శించిన అమెరికా విదేశీమంత్రి మైక్ పాంపియో తమ వైఖరిని స్పష్టపరిచారు. అయితే అమెరికా చైనాల మధ్య పోటీలో పాలు పంచుకోబోమని ఇండోనేషియా విదేశీ మంత్రి రెట్నో మర్సుది మరింత స్పష్టంగా పేర్కొన్నారు. ఆసియన్ కూటమిలోని 10 సభ్యదేశాలు కూడా ఆసియన్ తటస్థ విధానాన్ని ప్రతిబింబిస్తూ ఇండోనేషియా అనుసరించిన విధానాన్నే ప్రతిధ్వనించాయి. ఏర్పడిన నాటినుంచి తటస్థ వైఖరి అనేది ఆసియన్ కూటమి మౌలిక విలువల్లో ఒకటిగా ఉంటోంది. ప్రస్తుతం రెండు ప్రధాన ఆర్థిక శక్తుల మధ్య శత్రు వాతావరణంలోనూ ఈ కూటమికి తటస్థ విధానమే మార్గదర్శకం వహిస్తోంది. అమెరికా–చైనా సంబంధాలపై ఇండోనేషియా వైఖరి ఇతర ఆసియన్ దేశాలకు కూడా నమూనాగా ఉపకరిస్తుంది. ప్రస్తుత ఘర్షణ వాతావరణంలో వాషింగ్టన్, బీజింగ్ ప్రభుత్వాలు రెండింటితోనూ ఐక్యతతో వ్యవహరిస్తూ మంచి సంబంధాలు నెలకొల్పుకోవడంపైనే ఆసియన్ కూటమి దృష్టి పెట్టాలి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికను స్వాగతి స్తూనే ఆసియన్ కూటమి తటస్థతా సూత్రాన్ని బలంగా నొక్కిచెప్పాల్సిన అవసరం ఉంది. బైడెన్ పాలనాకాలంలోనూ కొనసాగే చైనా– అమెరికన్ ఘర్షణ మధ్యలో ఇరుక్కునే పరిస్థితినుంచి ఆసియన్ దూరం జరగాలి. రెండు బలమైన శక్తుల మధ్య అధికార పోరాటం మధ్యలో తన ఉనికిని నిలబెట్టుకోవడం ఆసియన్ కూటమికి కొత్త విషయమేమీ కాదు. గతంలోకి వెళ్లి చూస్తే సోవియట్ యూనియన్–అమెరికా ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కూడా తటస్థంగా ఉండటం ద్వారా అంతర్జాతీయ సమాజంలో కీలక విభజనకు దారి తీసే పరిస్థితులను ఆసియన్ కూటమి నిలువరించింది కూడా. ఈ విషయంలో ఆసియన్ కూటమి సాధించిన ఘనవిజయం, తన మూలాలకు కట్టుబడి ఉండటం అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో అనూహ్యంగా వచ్చే పెనుతుపానులకు కూడా ఆసియన్ దేశాలు తట్టుకుని నిలబడేలా చేసింది. బైడెన్ పాలన.. భారత్ ప్రయోజనాలు అమెరికా విదేశీ మంత్రిగా బైడెన్ ఎంపిక చేసిన ఆంటోనీ బ్లింకెన్తో సంబంధబాంధవ్యాలను నెలకొల్పుకోవడంలో భారత్ అనుసరించే వైఖరి ఇరుదేశాల మధ్య ఒత్తిళ్లను తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చేవిధంగా ఉండాలి. ఐసిస్తో పోరాటం, ఆసియాలో అధికార సమతుల్యతను పునర్నిర్మించడం, అంతర్జాతీయ శరణార్థుల సంక్షోభం వంటి అంశాల్లో బ్లింకెన్ గత మూడు దశాబ్దాలుగా కీలక స్థానాలను చేపట్టి అమెరికా దౌత్య కార్యాచరణకు స్థిరమైన మార్గం చూపారు. దాదాపు బైడెన్ ఆత్మగా వ్యవహరిస్తున్న బ్లింకెన్ వైఖరి, తాజాగా తాను చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు.. భారత్–అమెరికా సంబంధాలు సానుకూలంగా పరిణమించగలవనే ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. ఆచరణాత్మకవాది అయిన బ్లింకెన్ భారత్ పట్ల సానుకూల దృష్టితో వ్యవహరిస్తారని సౌత్ బ్లాక్లోని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తపరుస్తున్నప్పటికీ, డెమోక్రాటిక్ పార్టీలోని వామపక్షం మానవ హక్కుల పరిరక్షణపై ప్రదర్శిస్తున్న నిబద్ధత భారత్ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబించవచ్చనే విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకుని భారత పాలకులు పావులు కదపాలి. -రిఫ్కీ డెర్మవాన్, అండలాస్ యూనివర్సిటీ అధ్యాపకుడు, ఇండోనేషియా -
82 వేలు కాదు..6.4 లక్షలు!
న్యూఢిల్లీ: చైనా చెబుతున్నట్లు ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య కేవలం 82 వేలు కాదని, అది అంతకు 8 రెట్లు ఎక్కువని వెల్లడైంది. ఫిబ్రవరి మొదటి నుంచి ఏప్రిల్ చివరి వరకు సుమారు 6.40 లక్షల మంది చైనాలో కరోనా బారిన పడ్డారని తేలింది. చైనా మిలటరీకి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ నుంచి లీక్ అయిన సమాచారం మేరకు ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, వాషింగ్టన్కు చెందిన ‘100 రిపోర్టర్స్’ఒక కథనాన్ని ప్రచురించాయి. ఆసుపత్రులు, అపార్ట్మెంట్స్ సహా చైనా వ్యాప్తంగా, సుమారు 230 నగరాల వారీగా అన్ని ప్రాంతాల్లో కేసుల విస్తృతికి సంబంధించిన పూర్తి వివరాలను టేబుల్ రూపంలో తమకు అందాయని అవి పేర్కొన్నాయి. భౌగోళికంగా, ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎన్ని కేసులున్నాయనే విషయాన్ని ఆ కథనంలో సమగ్రంగా వివరించారు. కరోనా వైరస్ను మొదట గుర్తించిన హుబయి రాష్ట్రం, వుహాన్ ప్రాంతాల్లో కోలుకున్నవారి వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. పూర్తి వివరాలను భద్రత కారణాల రీత్యా ప్రజా బాహుళ్యానికి అందుబాటులో ఉంచడం లేదని, అయితే, వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు అందజేసే దిశగా ప్రయత్నిస్తున్నామని ‘ఫారిన్ పాలసీ మేగజీన్’, ‘100 రిపోర్టర్స్’ ప్రకటించాయి. దీనిపై చైనా స్పందించలేదు. కానీ, ‘కరోనా విషయంలో విదేశీ మీడియా చైనాపై వివక్షాపూరితంగా వ్యవహరిస్తోంది’ అని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వివరాలు పూర్తిస్థాయిలో నిజమా? కాదా? అనే విషయాలను పరిశీలించాల్సి ఉందని పలువురు స్వతంత్ర పరిశోధకులు పేర్కొన్నారు. ‘ఫారిన్ పాలసీ ఈ విషయాన్ని బయటపెట్టడం మంచిదే. అయితే, దీనిపై మరింత శోధన జరగాలి’ అని హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పరిశోధనలు చేస్తున్న డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ వ్యాఖ్యానించారు. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశంలోని కరోనా కేసుల సంఖ్య 82,919. మరణాల సంఖ్య 4,633గా ఉంది. -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
ముకేశ్ అంబానీ మరో ఘనత
-
ముకేశ్ అంబానీ ‘గ్లోబల్ థింకర్’!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఫారిన్ పాలసీ పబ్లికేషన్స్ 2019 ఏడాదికి సంబంధించి ప్రకటించిన 100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితాలో ముకేశ్ నిలిచారు. ఇంకా ఈ ర్యాంకింగ్స్లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లగార్డ్ తదితరులున్నారు. మొత్తం 100 మందిలో కొన్ని పేర్లను మాత్రమే ప్రకటించిన ఫారిన్ పాలసీ... పూర్తి జాబితాను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘44.3 బిలియన్ డాలర్ల సంపదతో 2018లో జాక్ మాను వెనక్కినెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆసియాలోనే నంబర్ వన్ అపర కుబేరుడిగా అవతరించారు. ప్రధానంగా చమురు, గ్యాస్, రిటైల్ స్టోర్ల ద్వారా ఆయన ఈ స్థాయిలో సంపదను దక్కించుకున్నారు. అయితే, కొత్తగా ప్రారంభించిన రిలయన్స్ జియో ద్వారా ఆయన భారత్ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఫేస్బుక్, గూగుల్లకు కూడా పోటీనిచ్చే సత్తా జియోకు ఉంది’ అని ఫారిన్ పాలసీ పేర్కొంది. కాగా, మొత్తం జాబితాను 10 విభాగాలుగా విభజించామని, అందులో ముకేశ్ అంబానీ... టాప్–10 టెక్నాలజీ థింకర్స్లో నిలిచినట్లు వెల్లడించింది. ఇంధనం, పర్యావరణానికి సంబంధించిన జాబితాలో ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్కు కూడా చోటు లభించింది. -
‘స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీశారు’
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించి చరిత్ర సృష్టించిన భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఈ ఏడాది టాప్ 100 గ్లోబల్ థింకర్స్లో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ గ్లోబల్ మ్యాగజీన్ ప్రతిష్టాత్మకంగా ప్రచురించే ఈ జాబితాలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఐఎంఎఫ్ హెడ్ క్రిస్టీన్ లాగ్రడేలకు కూడా చోటు దక్కింది. ప్రస్తుతం టాప్ 100 గ్లోబల్ థింకర్స్లో కొంతమంది పేర్లను మాత్రమే ప్రచురించిన ఫారిన్ పాలసీ జనవరి 22 నాటికి పూర్తి జాబితాను వెల్లడించనుంది. ‘44. 3 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ అంబానీ.. జాక్ మాను వెనక్కి నెట్టి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయిల్, గ్యాస్, రిటైయిల్ రంగాల్లో తనదైన ముద్రవేసిన అంబానీ.. జియోతో భారత టెలికాం రంగంలో సంచనాలు నమోదు చేశారు. జియోను ప్రారంభించిన ఆరు నెలల్లోపే వంద మిలియన్ కస్టమర్లను ఆకర్షించి స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీశారు. ఇకపై డిజిటల్ ఎయిర్వేవ్స్ ద్వారా లైఫ్స్టైల్ ప్రాడక్ట్ను అమ్మి గూగుల్, ఫేస్బుక్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు’ అని ఫారిన్ పాలసీ వెల్లడించింది. అంతేకాకుండా 2019తో గ్లోబల్ థింకర్స్ జాబితా ప్రచురణ పదేళ్ల వసంతంలోకి అడుగుపెడుతోందని ఫారిన్ పాలసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా వివిధ రంగాల్లో ప్రభావం చూపుతూ, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తుల జాబితా ప్రకటిస్తున్నామని తెలిపింది. వంద మంది గ్లోబల్ థింకర్స్లో మొత్తం 10 కేటగిరీలు ఉంటాయని, ముఖేష్ అంబానీ టాప్ 10 టెక్నాలజీ థింకర్స్లో చోటు దక్కించుకున్నారని వెల్లడించింది. -
రూ.20 కోట్లతో విదేశీ విద్యాపథకం
సాక్షి,హైదరాబాద్: వివేకానంద విదేశీ పథకం కింద బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ బ్రాహ్మణ సం క్షేమ పరిషత్ రూ.20 కోట్లను కేటాయించింది. పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన గురువారం జరిగిన ఈ సంఘం సర్వసభ్య సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. రాష్ట్రంలో రూ.10 కోట్లతో బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.5 లక్షలు మించకుండా రాయితీ కల్పిస్తూ 1,900 మంది లబ్ధిదారులకు రూ.36 కో ట్లను కేటాయించింది. అర్హులైన వారికి ఈ నెలాఖరులోగా రాయితీని చెక్కుల రూపంలో అందజేయాలని తీర్మానించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు 30న ఉద్యోగమేళా నిర్వహించాలని నిర్ణయించింది. -
శాంతి సాధన ఓ ముళ్లబాట...!
పాకిస్తాన్ నూతన ప్రధానికి అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారుల తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించ లేదు. ఇక మూడోది, ఎన్నికైన ప్రతి ప్రధాని ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. పాక్లో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పిం చిన ప్రతి ప్రయత్నమూ బెడిసికొట్టింది. ఇవన్నీ దాటుకుని ఇమ్రాన్ శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూనుకుంటాడు. భారత్, పాక్ మధ్య శాంతి స్థాపనకు అత్యంత సాహసోపేత, నాటకీయ ప్రయత్నం గురించి తెలియని విషయాలు వెల్లడించ డానికి పాకిస్థాన్ 30వ ప్రధానిగా ఇమ్రాన్ఖాన్ ప్రమాణం చేస్తున్న రోజే తగిన రోజని భావిస్తున్నా. ఈ ప్రయత్నం చేసిన ఇద్దరు ఎన్నికైన నేతల్లో ఒకరు గురువారం కన్నుమూయగా, రెండో నాయకుడు క్రూరమైన రావల్పిండి జైల్లో మగ్గుతున్నారు. దీనిలో ఈ వ్యాస రచయితకు కూడా చిన్న పాత్ర ఉంది. మియా నవాజ్ షరీఫ్ 1997లో రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాలో అధి కారంలోకి వచ్చింది. అప్పటికి కొంత కాలంగా భారత–పాక్ సంబంధాలు మందగించిన స్థితిలో ఉన్నాయి. వాజ్పేయి సర్కారు పోఖ్రాన్–2 పేరుతో అణుపరీక్ష జరపడంతో ఇవి మరింత క్షీణించాయి. పాకిస్తాన్ చాగైలో అణుపరీక్షతో పదునైన జవాబి చ్చింది. 1998 చివరి మాసాల నాటికి రెండు వైపులా ఓర్పు నశించిన సూచనలు కనిపించాయి. ఇద్దరు కొత్త నేతలూ రెండు దేశాల సంబంధాలు మెరుగుప డాలని కోరుకున్నాగాని, పరస్పర అవిశ్వాసం అందుకు అడ్డు నిలిచింది. ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉభయ దేశాల ఉన్నతాధికారుల వల్ల ముందుకు సాగలేదు. ఈ దశలో చలికాలం ఆరంభంలో పాకిస్థాన్ నుంచి నాకు ఉత్తరం వచ్చింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి నుంచి అని రాసి ఉన్న ఈ లేఖ కవరుపై ఉన్న పోస్టల్ ముద్రలను బట్టి చూస్తే ఇది ఢిల్లీ చేరడానికి చాలా వారాలు పట్టిందని అర్థమైంది. మధ్యలో ఈ లేఖ ఎన్వలప్ను రెండు దేశాలకు చెందిన వివిధ శాఖలు తెరచి, చదవి మళ్లీ మళ్లీ సీలు చేశాయి. ఎందుకంటే, పాక్ ప్రధాని సాధారణ పోస్టులో గతంలో ఉత్తరం పంపలేదు. కొన్ని నెలల క్రితం ఇంటర్వ్యూ కోసం నేను రాసిన లేఖకు జవాబుగా ఆలస్యంగా పంపినా ఆత్మీయంగా పంపిన స్పందన ఇది. నేను ఇస్లామా బాద్లోని పాక్ ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పాను. నవాజ్ షరీఫ్ నాకు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ చేయడానికి పాకిస్థాన్ ఎందుకు రాకూడదని నన్ను అడిగారు. కొద్దిసేపు నేను మాట్లాడాక, ‘‘ఇద్దరు ప్రధానులూ సంబంధాలు ముందుకు సాగ డానికి ఏమీ చేయలేకపోతున్నప్పుడు ఇంటర్వ్యూల వల్ల ప్రయోజనం ఏముంటుంది? పెద్ద ఒప్పందాల సంగతి వదిలేయండి. కనీసం బస్సు సర్వీసు కూడా మొదలు కాలేదు’’ అన్నాను. దీనికి షరీఫ్ దౌత్య వేత్తలు మాట్లాడే రీతిలో కొన్ని కారణాలు చెప్పారు. నేను సరదాగా పంజాబీలోనే మాట్లాడుతూ ‘‘ నాకు మీరిచ్చే ఇంటర్వ్యూలోనే బస్సు సర్వీసు ప్రారంభించే విషయం ప్రకటించడంతోపాటు, మొదటి బస్సులో రావాలని మా ప్రధానిని ఎందుకు ఆహ్వానించకూడదు?’’ అని ప్రశ్నించాను. నా సలహాను నవాజ్ షరీఫ్ సీరియస్గా తీసుకుని ఆలోచించారు. నా ఐడియా ఆయనకు నచ్చింది. అయితే, తాను ఆహ్వానించాక భారత ప్రధాని అందుకు నిరాకరిస్తే ఏం చేయాలి? అనే అనుమానం ఆయనను పీడించింది. అదే జరిగితే బావుండదు కదా. నేను విషయం కనుక్కుని చెబుతానని ఆయనతో అన్నాను. వాజ్పేయికీ నచ్చిందీ ప్రతిపాదన! విషయం తెలియజేయగానే, ఈ ప్రతిపాదన వాజ్పేయికి కూడా నచ్చింది. అయితే, పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చాకే నేను ఆయనను కలవాలనీ, అప్పటిదాకా ఇది ప్రచురించవద్దని వాజ్పేయి చెప్పారు. లాహోర్లోని సొంత ఇంట్లో నవాజ్ షరీ ఫ్ను ఇంటర్వ్యూ చేశాను. మధ్యమధ్యలో భారత– పాక్ క్రికెట్ టెస్ట్ ప్రత్యక్ష ప్రసారంతో మా సంభాష ణకు బ్రేకులు పడ్డాయి. ఆయన తన మాట నిలబెట్టు కున్నారు. బస్సు సర్వీసుకు అంగీకారం తెలపడమే గాక, వాజ్పేయిని ఈ బస్సులో రావాలని ఆహ్వానిం చారు. చరిత్రలో నిలిచిపోయేలా తాను భారత ప్రధా నికి స్వాగతం పలుకుతానని షరీఫ్ తెలిపారు. షరీఫ్తో ఇంటర్వ్యూను ఒక రోజు ఆపాలనీ, తాను విమానంలో లక్నోలో దిగే రోజు అది ప్రచురితమయ్యేలా చాడాలని వాజ్పేయి నన్ను కోరారు. ఆనవాయితీగా భారత విదేశాంగశాఖ అనుమానాలు వ్యక్తం చేయక ముందే తాను ఆహ్వానం అంగీకరిస్తానని వాజ్పేయి చెప్పారు. ఆ తర్వాత జరిగిదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అత్యంత నాటకీయ పరిణామాల తర్వాత అటల్ బస్సు యాత్ర జరిగింది. కొన్ని ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. ముఖ్యంగా వాజ్ పేయికి స్వాగతం పలికే సమయంలో ఆయనకు శాల్యూట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ అంగీకరించలేదు. బస్సు దిగాక వాజ్పేయి మీనారే పాకిస్తాన్ మెట్ల వరకూ వచ్చి, పాక్ సుస్థిరతతో సుసపన్నంగా ఉండడం భారతదేశా నికి మేలని ప్రకటించారు. నేను ఈ యాత్రలో భాగం కావడం నాకెంతో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఇది నాకు మొదటి ఏకైక అనుభవం. బస్సు యాత్ర విషయం నేను ఇంటర్వ్యూ ద్వారా ప్రకటించడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. ఓ పక్క ఇద్దరు ప్రధానులూ తమకు పూర్తిగా అవగాహన లేని శాంతి చర్చలు జరుపు తుంటే, మరో పక్క పాకిస్తానీ ఆర్మీ కార్గిల్ ప్రాంతం లోని విశాల సరిహద్దు గుండా తన సైనికులు భారత భూభాగంలోకి చొరబడేలా చేసింది. మే నెల మధ్య నాటికి ఉభయ దేశాల దళాల మధ్య తొలి ఘర్షణలు జరిగాయి. మే 26న ఇండియా తన వైమానికి దళాన్ని రంగంలోకి దింపింది. మరుసటి రోజు రెండు భారత మిగ్ విమానాలను పాక్ సైనికులు భుజాలపై నుంచి ప్రయోగించే క్షిపణులతో కూల్చివేశారు. శత్రు శిబిరం వివరాలు తెలుసుకునే క్రమంలో నెమ్మదిగా పోతున్న మూడో యుద్ధవిమానం ఇంజన్లలో ఒకదానికి క్షిపణి దెబ్బతగిలింది. అయితే, అది అదృష్టవశాత్తూ కూలి పోకుండా తిరిగి తన స్థావరానికి సురక్షితంగా వచ్చే సింది. ఇలాంటి నాటకీయ మలుపునకు ఎవరూ సిద్ధంగా లేరు. ప్రధాని నుంచి నా హోటల్ రూముకు ఫోన్! ఉదయం ఆరున్నరకు ముంబైలో నేను బసచేస్తున్న హోటెల్ రూములో ఫోను మోగింది. ప్రధానమంత్రి నాతో మాట్లాడాలనుకుంటున్నారని అవతలి వ్యక్తి చెప్పారు. వెంటనే వాజ్పేయి ఫోన్లైన్లోకి వచ్చి ‘‘యే క్యా కర్ రహాహై మిత్ర్ ఆప్కా?(మీ స్నేహి తుడు చేస్తున్న ఈ పనేంటి?)’’అని ప్రశ్నించారు. పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ చైనా పర్యటనలో ఉండగా కశ్మీర్ ముజాహదీన్ల చేతుల్లోకి క్షిపణులు రావడంపై అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారని ఆయన అన్నారు. ‘అసలేం జరుగుతోంది? ఈ విషయం మీరు మీ మిత్రుణ్ని అడగగలరా?’ అని ఆయన నన్ను ప్రశ్నించారు. వెంటనే నేను ఇస్లామాబాద్లోని నాకు తెలిసిన పాత ఫోన్ నంబర్కే డయల్ చేసి ఓ కబురు పంపాను. ఆ రోజు రాత్రి నాకు పాక్ రాజదాని నుంచి ఫోనొచ్చింది. నవాజ్ షరీఫ్ కూడా వాజ్పేయి మాదిరిగానే కలవరపాటుతోనే మాట్లా డారు. ‘‘నేను ఆయనకు ద్రోహం చేయబోనని ఆయ నకు మీరు చెప్పండి. అధీనరేఖపై ఎప్పటిలా కొన్ని మామూలు ఘర్షణలు జరిగాయని నిన్న నాకు చెప్పారు. నేడు గగనతల ఉల్లంఘనలు జరిగాయి. నాకు కూడా ఈ పరిణామాలపై ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ వైమానిక ఘర్షణలను ప్రస్తావిస్తూ షరీఫ్ నాతో అన్నారు. రాజధానికి రాగానే వాజ్పేయి, ఆయన సహాయకుడు బ్రజేష్ మిశ్రా నాతో ఫోన్లో మాట్లాడారు. జనరల్ ముషారఫ్, ఆయన డెప్యూటీ సైనికాధికారి మధ్య జరిగిన సంభాషణలను ‘మన మనుషులు’ రహస్యంగా విన్నారనీ, ఇది పూర్తిగా పాక్ చేపట్టిన సైనిక చర్యయేనని తేలిందని వారు నాకు చెప్పారు. ‘‘కాబట్టి, మీరు ఇంటర్వూ్య పేరుతో ఇస్లామాబాద్ వెళ్లి, పాక్ సైనికాధిపతుల మధ్య జరిగిన ఈ రహస్య సంభాషణ గురించి నవాజ్ షరీఫ్కు చెప్పగలరా?’’ అని నన్ను అడిగారు. కానీ, నాకు ఈసారి విషయం తీవ్రత అర్థమైంది. నేను మొదట చేసింది నిజమైన ఇంటర్వూ్య. దాని సత్ఫలి తమే బస్సు యాత్ర. వారు చెప్పినట్టు చేస్తే జర్నలిజం పరిధి దాటినట్టే అవుతుందని వారికి తెగేసి చెప్పాను. వారిద్దరూ అర్థం చేసుకున్నారు. వారు అంతటితో ఆగకుండా మాజీ ఎడిటర్ ఆర్.కె.మిశ్రాకు ఈ పని అప్పగించారు. ఆయన అప్పుడు అబ్జర్వర్ ఫౌండే షన్లో పనిచేస్తున్నారు. వారు చెప్పినట్టే ఆయన ఇస్లా మాబాద్కు అనేకసార్లు వెళ్లొచ్చారు. పాక్ సేనల చర్య లకు సాక్ష్యంగా పైన చెప్పిన రహస్య సంభాషణల టేపులను కూడా ఆయన పాక్ ప్రధానికి అందజే శారు. దీంతో పాత్రికేయ పరిధిని దాటిన నా సాహసం ఇంతటితో ముగిసింది. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రికి ఇక్కడ అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటగా, భారత్తో శాంతి ప్రక్రియకు ప్రయత్నించడం ప్రమాదకరమైన ఆలోచన. సైనికాధికారులు తలపై కూర్చుని అలా చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. రెండోది. ఎన్నికైన ఏ ప్రధానమంత్రినీ పాక్ సైనిక వ్యవస్థ పూర్తి కాలం పదవిలో కొనసాగడానికి అనుమతించలేదు. ఇక మూడోది ఏమిటంటే ఎన్నికైన ప్రతి ప్రధాన మంత్రీ ప్రవాసం పాలయ్యారు, జైలుపాలయ్యారు, హత్యకు గురయ్యారు. గత దశాబ్ది కాలంలో ప్రజా స్వామ్యానికి ఊపిరిపోయడానికి సంకల్పించిన ప్రతి ప్రయత్నమూ ఎదురుదెబ్బ తిన్నది. ఇవన్నీ దాటు కుని ఇమ్రాన శాంతిసాధనకు ప్రయత్నించాడంటే, పాక్ సైన్యం చెప్పి ఉంటుంది కాబట్టి దానికి పూను కుంటాడు. అంతే తప్ప సైన్యాన్ని ధిక్కరించి కాదు. చివరగా, ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకం మొదలైనట్లయితే అది అందరిలో ఆశలు రేపవచ్చు కానీ కపటత్వంతో కూడి ఉంటుంది. అప్పటికి కూడా అది ఆ తర్వాత ఎప్పుడో చెప్పాల్సిన చక్కటి గాథగా మారవచ్చు. ఈ విషయాలను ఇప్పుడు చెప్పడానికి నాకు నాలుగు కారణాలున్నాయి. వాజపేయి నిష్క్ర మణం, నవాజ్ షరీప్ జైలు శిక్ష, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం, అన్నిటి కంటే ముఖ్యంగా ఆనాటి ఘటన జరిగి ప్రస్తుతం 20 సంవత్సరాలు గడిచిపోయాయి. శేఖర్ గుప్తా(వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్) twitter@shekargupta -
విదేశీ విధానంపై చెరగని ముద్ర..
1998–2004 మధ్యకాలంలో ప్రధాని పదవిని నిర్వహించిన తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి నిలిచారు. ప్రధానిగా విదేశాంగ విధానంపై వాజ్పేయి తనదైన ముద్ర వేశారు. ఈ కాలంలో ప్రధానంగా పోఖ్రాన్–2 అణుపరీక్షలు, పాకిస్తాన్తో స్నేహసంబంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు, చొరవతో పాటు 1999లో లాహోర్ డిక్లరేషన్ను రూపొందించడంలోనూ తన ప్రభావాన్ని చూపారు. పోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా పరీక్షలు జరపడంతో దక్షిణాసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. భారత్ వైఖరిని పశ్చిమదేశాలు ఖండించడంతో పాటు వివిధ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు కూడా విధించారు. దీంతో అమెరికా ఇతర ఆర్థికసంస్థల నుంచి అందే ఆర్థికసహాయం కూడా నిలిచిపోయింది. సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా కఠినమైన ఆంక్షలు అమలయ్యాయి. పాక్తో పాటు అమెరికాతో కూడా బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు 1998లో మొదలయ్యాయి. ఈ కారణంగా రెండుదేశాల మధ్య మూడేళ్లపాటు ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం ఏర్పడింది. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు ఇవి దోహదపడ్డాయి. అమెరికా ప్రోద్భలంతో భారత–పాక్లమధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు పునఃప్రారంభమయ్యాయి. వాజ్పేయి చొరవ కారణంగా 1999 ఫిబ్రవరిలో లాహోర్కు బస్సుయాత్రలో వెళ్లి అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. రెండుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు అణ్వాయుధాల పోటీకి దిగరాదని, అణ్వాయుధాల వినియోగాన్ని విడనాడాలని, ఇరుదేశాల మధ్య ఘర్షణలు తగ్గించేందుకు కషి చేయాలని నిర్ణయించారు. 1988లో రాజీవ్ –బేనజీర్ల మధ్య అణ్వాయుధ రహిత ఒప్పందం కుదరగా, దీన్ని రెండోదిగా పరిగణిస్తున్నారు. అయితే నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముషార్రఫ్ నేతత్వంలోని సైన్యం కూలదోయడంతో ఒప్పందం నిరుపయోగంగా మారింది. తర్వాత కార్గిల్ యుద్ధం నేపథ్యంలో దీనికి విలువలేకుండా పోయింది. కశ్మీర్లోని కార్గిల్ మంచుకొండల్లోకి పాకిస్తాన్ బలగాలు చొచ్చుకురావడంతో భారత్–పాక్ల మధ్య పరిమిత యుద్ధానికి దారితీసింది. పాక్ దురాక్రమణను అమెరికాతో పాటు పశ్చిమదేశాలు ఖండించాయి.ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు పిలిపించాల్సిందిగా నవాజ్షరీఫ్ను అమెరికాకు పిలిపించి మరీ హెచ్చరించారు. ఈ విధంగా రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారిగా భారత్ పట్ల అమెరికా అనుకూల వైఖరి తీసుకుంది. 1999 జూలైలో కార్గిల్ నుంచి పాక్ దళాలు వెళ్లిపోవడంతో భారత సైన్యం ఆపరేషన్ విజయ్లో విజయం సాధించింది. 1978లో జిమ్మీకార్టర్ భారత్లో పర్యటించాక 22 ఏళ్ల అనంతరం 2000లో అమెరికా అధ్యక్షుడి హోదాలో బిల్ క్లింటన్ మన దేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘ఇండియా రిలేషన్స్ : ఏ విజన్ ఫర్ ది 21 ఫస్ట్ సెంచరీ’పత్రంపై సంతకాలు చేశారు. ఆ తర్వాతి కాలంలో అమెరికాతో భారత్ సంబంధాలు బలపడేందుకు ఈ పర్యటన, తదనంతర పరిణామాలు దోహదపడ్డాయి. 2001లో జూలైలో భారత్తో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ మనదేశాన్ని సందర్శించారు. కశ్మీర్ అంశంపై ముషార్రఫ్ మొండిపట్టుదల కారణంగా ఆగ్రాలో జరిగిన ఈ శిఖరాగ్రభేటీ నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా వియత్నాం, ఇండోనేసియా దేశాల్లో పర్యటించిన వాజ్పేయి వ్యాపార, వాణిజ్య అంశాలపై ఒప్పందాలు చేసుకున్నారు. ఆసియాన్ దేశాలతో వాజ్పేయి ప్రభుత్వం మంచి సంబంధాలు నెలకొల్పగలిగింది. 2000 జూన్లో లిస్బన్లో మొట్టమొదటి భారత్–ఐరోపా దేశాల సంఘం (ఈయూ) శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2003లో చైనాతో సంబంధాలు మెరగయ్యేందుకు, సరిహద్దు సమస్యలపై చర్చించుకునే దిశలో చర్యలు మొదలయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించిన సందర్భంగా రెండుదేశాల మధ్య ఆయుధాల సరఫరా, విమానాల కొనుగోలు, తదితర అంశాలపై సైనిక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాతి ఏడాదే వాజ్పేయి రష్యాలో పర్యటించినపుడు ఇరుదేశాల మధ్య వాణిజ్య, భద్రతా, రాజకీయ రంగాల్లో సహకారం కోసం ‘మాస్కో డిక్లరేషన్’పై సంతకాలు జరిగాయి. -
‘మోదీకి ప్రచార మోజు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత విదేశాంగ విధానానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ ప్లీనరీలో సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎన్డీఏ విదేశాంగ విధానాన్ని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం విదేశీ విధానంలో చిత్తశుద్ధి లోపించిందని, సమదృష్టి కొరివడిందని ఆరోపించారు. ప్రధాని తన ప్రచారార్భాటం కోసం పరితపిస్తున్నారని ఆరోపించారు. కీలక దేశాలతో మన సంబంధాలను సజావుగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పొరుగుదేశాలతో సంబంధాల నిర్వహణ సవ్యంగా లేదని ఆనంద్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.విదేశాంగ విధానాన్ని మోదీ వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళుతున్నారని ఇది గందరగోళంగా సరైన దిశాదశా లేకుండా సాగుతోందని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంపై ఆనంద్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మోదీ ప్రచార మోజుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల మోదీ తీరు అభ్యంతరకరమని, ఆయన తీరు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి అవమానకరమని ఆక్షేపించారు. -
ట్రంప్ అమెరికా-ప్రపంచం
(సాక్షి నాలెడ్జ్ సెంటర్) అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత డొనాల్డ్ జె.ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఎలాంటి మార్పులొస్తాయి? లెఫ్టూ, రైటూ కాని ‘ట్రంప్’ మార్కు రాజకీయాలు ప్రపంచాన్ని ఎటు తీసుకెళతాయి? రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించారని నవంబర్8న ప్రకటించినప్పటి నుంచీ ప్రపంచ ప్రజలను ఈ ప్రశ్నలు పీడిస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకు సరిగ్గా వందేళ్ల క్రితం (1917) మొదటి ప్రపంచ యద్ధంలో, తర్వాత (1941) రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికాను, దాని ప్రజాతంత్ర, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను ట్రంప్ ఓడిస్తారా? అనే ప్రశ్న కూడా ఎందరినో వేదిస్తోంది. ‘‘దక్షిణాన మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డగించడానికి సరిహద్దు గోడ నిర్మిస్తా! నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వరకూ ఇతర దేశాల నుంచి దేశంలోకి ముస్లింల రాకను నిషేధిస్తా. అమెరికా నుంచి బయటకు వెళ్లిన ముస్లింలను కూడా వారి నేపథ్యం గురించి రూఢి చేసుకోవడానికి ఆరు నెలలు దేశంలోకి ప్రవేశించకుండా చూస్తా!’’ వంటి అడ్డగోలు, వింత ప్రకటనలతో ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ట్రంప్ ధోరణి ఓ పట్టాన చాలా మందికి అర్ధంకాలేదు. పర్యావరణం వంటి అంశాలు, పాత మిత్రదేశాలు, సైద్ధాంతిక విభేదాలున్నా పరస్పర లబ్ధి కోసం స్నేహం చేస్తున్న చైనా వంటి దేశాలు, ఇరాన్, ఉత్తర కొరియా వంటి శత్రుదేశాలతో ప్రపంచ ఏకైక అగ్రరాజ్య అధినేతగా ట్రంప్ఎలా వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్ల క్రితం అగ్రరాజ్య హోదా కోల్పోయిన పాత శత్రువు రష్యా, 38 ఏళ్లుగా వాణిజ్య మైత్రి ఉన్న చైనా, మరో ఆసియా దిగ్గజం ఇండియాతో ట్రంప్అమెరికా ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటుందనేది కూడా కీలకాంశం. రాజ్యాధికారం చెలాయించే విషయంలో, విదేశాంగ విధానంలో బొత్తిగా అనుభవం లేని కొత్త అధ్యక్షుడి వ్యవహారశైలిపై నిపుణులు, విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ట్రంప్కు విదేశాంగ విధానంపై సరైన అవగాహన లేదనే ఎక్కువ మంది భావిస్తారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ, అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రధాన దేశాల ప్రభుత్వాలకు, నేతలకు ట్రంప్పంపిన సందేశాలను బట్టి చూస్తే ఈ అభిప్రాయంపై నమ్మకం కుదురుతుంది. రష్యాతో పదేళ్లుగా అనుబంధం! ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి శత్రుదేశం రష్యాతో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలు పదేళ్ల నుంచే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు అనుకూలంగా, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్కు వ్యతిరేకంగా రష్యా గూఢచారసంస్థలు పనిచేశాయనేది కూడా బాగా ప్రచారంలోకి వచ్చిన విషయం. రష్యా నేత పుతిన్ సమర్ధుడనీ, గట్టిపిండమని ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్రంప్ తన అభ్యర్థిత్వం ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ఒబామా మొదటి పదవీ కాలంలో రష్యాతో మెరుగైన సంబంధాలు కొద్ది కాలానికే దెబ్బతిన్నాయి. అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్న హిలరీ పాత్ర దీనిలో ఉందని కూడా రష్యా సర్కారు భావించింది. అంతకు ముందు ఆమె భర్త బిల్ క్లింటన్ హయాంలో (19932001) కూడా రష్యాకు ఎక్కువ నష్టం జరిగే విధానాలను అమెరికా ప్రభుత్వం అనుసరించిందనే అభిప్రాయం పుతిన్కు ఉంది. ట్రంప్తో పుతిన్కు వ్యక్తిగత పరిచయంతోపాటు ఈ అంశాలు కూడా ట్రంప్ విజయాన్ని రష్యన్లు కోరుకోవడానికి కారణాలయ్యాయి. విదేశాంగమంత్రిగా హిలరీ అనుసరించిన దుందుడుకు విధానాల వల్ల అమెరికాకు రష్యా చాలా దూరమైంది. పాత ప్రచ్ఛన్నయుద్ధం నాటి శత్రుత్వం మళ్లీ తలెత్తడంతో పుతిన్ తన దేశంలో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. బారెల్ ముడి చమురు ధర 2008 జులైలో 140 డాలర్లుండగా. అది ఆ తర్వాత వేగంగా 50 డాలర్ల దిగువకు పడిపోవడంతో దానిపైనే ఆధారపడిన రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి రష్యాను కాపాడడానికి ‘మంచి మిత్రుడి’గా సహకరిస్తారని భావిస్తున్న ట్రంప్ ఏ మేరకు పుతిన్కు మేలు చేస్తారో చూడాల్సి ఉంది. పుతిన్ ఆప్తుడే అమెరికా విదేశాంగమంత్రి అయిదో అతి పెద్ద అమెరికన్ఆయిల్ కంపెనీ ఎక్సాన్ మోబిల్ సీఈఓ రెక్స్ టిలర్ సన్ను విదేశాంగమంత్రి పదవికి ఎంపికచేయడం కూడా రష్యాకు దగ్గరవడానికి ట్రంప్ రూపొందించిన వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. ఎక్సాన్ మోబిల్కు రష్యాలో కోట్లాది డాలర్ల భారీ పెట్టుబడులున్నాయి. అమెరికారష్యా బంధాన్ని బలోపేతం చేసినందుకు టిలర్ సన్కు ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ అవార్డును పుతిన్ సర్కారు ప్రదానం చేసింది. గత 8 ఏళ్లలో రష్యాతో దిగజారిన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి టిలర్ సన్ను ట్రంప్ వాడుకుంటారని అంటున్నారు. టిలర్ సన్కు దౌత్యరంగంలో ఎలాంటి అనుభవం లేకున్నా పుతిన్తో ఉన్న స్నేహమే ఆయనకు కొండంత బలం. ఇప్పటి రష్యా పూర్వపు సోవియెట్ యూనియన్ మాదిరిగా బలమైన అగ్రరాజ్యం కాకున్నా పుతిన్ఇంకా ఆ భ్రమల నుంచి బయటపడలేదు. రష్యన్లను కూడా అవే భ్రమల్లో జీవించేలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. వాస్తవానికి 2008 నాటి సంపదను రష్యాలో సృష్టిస్తే తప్ప పుతిన్ గట్టిగా నిలదొక్కుకోలేరు. ఈ విషయంలో ఒబామా, హిలరీ, జాన్ కెరీ హయాంలో లభించని సహకారం ట్రంప్ నుంచి దొరుకుతుందని పుతిన్ ఆశిస్తున్నారు. (చదవండి : పుతిన్ చేతిలో ట్రంప్ జుట్టు?) పుతిన్తో ‘డీల్’చేయడం కష్టమా? సోవియెట్ కమ్యూనిస్ట్ పార్టీలో, తర్వాత గూఢచార సంస్థ కేజీబీలో లభించిన శిక్షణతో రాటుదేలిన పుతిన్తో అమెరికా తరఫున తెలివిగా వ్యవహారాలు నడపడం అంత సులువు కాదని కొందరు అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా, ఐరోపా దేశాలు, నాటో దేశాల విషయంలో రష్యాతో ఎలా కలిసి పనిచేయాలనే విషయంలో ట్రంప్కు గట్టి అవగాహన ఉందని కొందరు చెబుతున్నారు. అగ్రరాజ్యం హోదా, బలం కోల్పోయాక కూడా రష్యాను పాత సోవియెట్ యూనియన్లా పరిగణించి, అనవసర వైరంతో బిల్ క్లింటన్ నుంచి ఒబామా కాలం వరకూ అమెరికా ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే వాస్తవానికి పశ్చిమాసియాలో రష్యా పలుకుబడి పెరిగిందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ఇక అలాంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా రష్యాతో ‘ఎంతలో ఉండాలో అంతలో ఉండే’ పరస్పర ప్రయోజనకర పాలసీని అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు. సిరియా, టర్కీ, ఇరాక్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో రెండు దేశాల మధ్య సదవగాహన ఉంటుందని భావిస్తున్నారు. వినియోగవస్తు తయారీ రంగంలో అమెరికా, రష్యాలు ఇంకా చేయడానికి చైనా ఏమి మిగల్చకపోవడంతోఆయుధాల ఉత్పత్తి రంగమే ఈ రెండు పెద్ద దేశాలను ఆర్థికంగా ఆదుకోవాలి. రెండూ ఆయుధాలు ఉత్పత్తిచేసి రెండు చేతులా అమ్ముకోవడానికి అనువైన రీతిలో ప్రపంచాన్ని నడిపించే ఆలోచనలో పడ్డాయంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అక్రమ, అనుచిత జోక్యానికి ప్రతీకారంగా పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు ఒబామా డిసెంబర్ చివర్లో 35 మంది రష్యా దౌత్తవేత్తల బహిష్కరణతోపాటు ఆంక్షలు విధించారు. తర్వాత ఎన్నికల్లో రష్యా అక్రమ జోక్యం నిజమేనంటూన అమెరికా నిఘా, జాతీయ భద్రతా సంస్థల నివేదిక కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యాకు ఎలా ట్రంప్ స్నేహ హస్తం అందిస్తారనేది ప్రధాన సమస్య. అత్యంత సున్నితమైన ఈ విషయంలో రష్యాపై ఆంక్షలు ఉపసంహరిస్తే ఎన్నికల్లో రష్యా హ్యాకింగ్ ట్రంప్తో అవగాహనతోనే జరిగిందని వచ్చిన ఆరోపణలు నిజమేననే భావన కలుగుతుంది. అధ్యక్షుని విశ్వసనీయత దెబ్బదింటుంది. ఈ వ్యవహారంలో ట్రంప్ తొలి చర్యలే ఆయన తెలివితేటలకు పరీక్ష అవుతాయి. రష్యా సాయంతో ట్రంప్ గెలిచారా? 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా సర్కారు జోక్యం చేసుకుందనేది అమెరికా ప్రభుత్వ ఆరోపణ. పుతిన్ ఆదేశాల మేరకే డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ ఈమెయిల్స్ను హ్యాక్ చేసి, ఇలా దొంగిలించిన సందేశాలను వికీలీక్స్ సహా అనేక సంస్థలకు పంపిణీ చేశారని కూడా ఇటీవల అమెరికా నిఘా సంస్థలు నిర్ధారించాయి. అంతేగాకుండా డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిలరీని ట్రంప్తో పోల్చిచూసినప్పుడు ఆమె హీనంగా కనిపించేలా రష్యా ప్రచార ఉద్యమం పకడ్బందీగా నిర్వహించిందని వార్తలొచ్చాయి. హిలరీ, ఒబామా, ఇంకా డెమొక్రాటిక్ నేతలు పుతిన్పై వేలెత్తి చూపారు. ప్రత్యక్షంగా హిలరీపై, అమెరికాపై ఈ సైబర్ దాడులకు పుతిన్ స్వయంగా ఆదేశించడం ద్వారా తమ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని ఈ నేతలు విరుచుకుపడ్డారు. ఈ విషయంపై అమెరికా నిరసనను పుతిన్కు తెలపడానికి ఒబామా స్వయంగా‘ రెడ్ ఫోన్’ను ఉపయోగించారు. ట్రంప్ మాత్రం డెమొక్రాట్లు ఓటమి బాధతో ఈ ఆరోపణలు చేస్తున్నారుగాని తన విజయంలో రష్యా హ్యాకింగ్ పాత్ర ఏమీ లేదని తేల్చిచెప్పారు. అమెరికా ప్రజల్లో చాలా మంది హిలరీని నమ్మకపోవడం, కొన్ని కీలక రాష్ట్రాల్లో ఉపాధి కోల్పోయిన ప్రజలు ఆమెను ఓడించాలనే పట్టుదలతో ట్రంప్ను బలపరచడం వంటి ప్రధాన కారణాలున్నందున రష్యా హ్యాకింగ్ వల్లే హిలరీ ఓడారని నమ్మడానికి మీడియా, మేధావులు సిద్ధంగా లేరు. ఒక దేశం ఎన్నికల్లో మరో దేశం జోక్యం అనేది ఇది మొదటిదీ కాదు, చివరిదీ కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట జోక్యం చేసుకుని, ఫలితాన్ని ప్రభావితం చేయాలనుకున్న దేశం ఫ్రాన్స్ అని ప్రసిద్ధ బ్రిటిష్ దినపత్రిక ‘గార్డియన్’ తన సంపాదకీయంలో తెలిపింది. 1796 అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాన్స్ పక్షపాతిగా పరిగణించిన డెమొక్రాటిక్ అభ్యర్థి థామస్ జెఫర్సన్ను గెలిపించడానికి అమెరికాలో ఫ్రాన్స్ రాయబారి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంగ్లండ్కు అనుకూలుడని భావించిన ఫెడరలిస్ట్ అభ్యర్థి జాన్ఆడమ్స్ నిలిచారు. రష్యా జోక్యంపై ఇంత గొడవ జరిగినా, దానికి జవాబుగా ట్విటర్లో,‘‘రష్యాతో సత్సంబంధాలుండడం మంచిదేగాని చెడేమీ కాదు. బుర్రతక్కువవాళ్లు, మూర్ఖులు మాత్రమే అది మంచిది కాదనుకుంటారు. ఎన్నికల ఫలితాన్ని హ్యాకింగ్ ప్రభావితం చేయలేదని ఇంటెలిజెన్స్ నివేదిక చెప్పింది.’’అంటూ ట్రంప్ చెప్పిన జవాబు చాలా మంది అమెరికన్లకు నచ్చినట్టు కనిపిస్తోంది. చైనాకు చెక్ పెడతారా? 1978లో మొదలైన ఆర్థిక సంస్కరణలు, 20 శతాబ్దం ఆఖరులో వేగం పుంజుకున్న ప్రపంచీకరణ వల్ల ఆర్థికశక్తిగా ఎదిగిన చైనాను కట్టడిచేయాలనే ఆలోచన అమెరికాకు ఇటీవల వచ్చినా, రష్యాతో పెరిగిన శత్రుత్వం కారణంగా ఇది ఆచరణ సాధ్యంకాలేదు. రష్యాకు మిత్రుడనే ఇమేజ్తో వచ్చిన ట్రంప్ చైనాను అదుపు చేసే పని పూర్తిచేస్తారని దౌత్యనిపుణులు అంచనావేస్తున్నారు. అయితే, అందుకు పుతిన్కు ట్రంప్ ఎంతో కొంత మూల్యం చెల్లించకతప్పదు. తన కరెన్సీ యువాన్ విలువ తగ్గించడం నుంచి అనేక అంతర్జాతీయ వాణిజ్య విషయాల్లో చైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే చెడ్డపేరు తెచ్చుకుంది. బిల్ క్లింటన్, బరాక్ఒబామా హయాంలోనే చైనాను సైనికపరంగా, ఆర్థికంగా నిలువరించడం కుదరలేదు. ఈ విషయంలో పట్టుదలగా ఉన్న ట్రంప్కు రష్యా తోడ్పాటు అవసరం. అందుకే ఇక్కడ రష్యా అడిగినంత ఇచ్చి చైనా పనిపట్టడానికి ట్రంప్ వ్యూహాలు సిద్ధంచేసుకుంటున్నారు. అత్యధిక ప్రజానీకం ఉపయోగించే యాపిల్ ఉత్పత్తుల నుంచి వేలాది వినియోగ వస్తువులను చౌకగా తయారుచేసి అమెరికా మార్కెట్లను చైనా ముంచెత్తుతోంది. వందలాది అమెరికా, ఐరోపా కంపెనీలు చైనానే ఉత్పత్తి కేంద్రంగా చేసుకుని వ్యాపారం చేస్తున్నాయి. అమెరికాలో తయారీరంగం సైజు గణనీయంగా పడిపోయింది. మూతపడిన ఫ్యాక్టరీలున్న రాష్ట్రాల జనం ఓట్లతో గెలిచిన ట్రంప్కు కొన్ని కార్ఖానాలనైనా చైనా నుంచి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉంది. మరి అందుకు రష్యా సాయం ఎలా తీసుకుంటారో భవిష్యత్తులో తెలుస్తుంది. అమెరికా ఫస్ట్ పేరిట! అధ్యక్షపీఠంపై కూర్చున్నాక అగ్రరాజ్య హోదా ఉన్నప్పటికీ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తానని, మిత్రదేశాల కోసం అనవసర త్యాగాలు చేయనని ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వాగ్దానం చేశారు. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో తన శిబిరంలోని దేశాల కోసం ఎంతో వెచ్చించిన సోవియెట్ యూనియన్ కుప్పకూలింది. తర్వాత ప్రపంచీకరణ, రష్యాతో పోటీ కారణంగా అమెరికా కూడా మిత్రదేశాల కోసం ఖర్చుచేసి నష్టపోయింది. అందుకే అనవసరంగా ఇతర చోట్ల తలెత్తే వివాదాల్లో అమెరికా వేలు పెట్టదని ప్రకటించారు. అధ్యక్షునిగా గెలిచాక తైవాన్ ప్రధాని త్సాయ్ ఇంగ్ వెన్కు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఒక చైనా విధానానికే అమెరికా కట్టుబడాలంటూ చైనా నిరసన తెలిపినా ఆయన పట్టించుకోలేదు. చైనా నుంచి దిగుమతులు తగ్గించడానికి పన్నులు, సుంకాలు భారీగా వేస్తానని కూడా హెచ్చరించారు. చైనాతో అమెరికా వైరం భారత్కు ఎంత లాభం? అమెరికా ఫస్ట్ అనే స్వీయ ప్రయోజన సిద్ధాంతం అమల్లోకి వస్తే దక్షిణ చైనా సముద్రం వివాదంలో తమకు లాభదాయకంగా ఉంటుందని చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చైనాతో ఘర్షణకు దిగడానికే సిద్ధపడితే, అది భారత్కు అనుకూలంగా మారుతుంది. ఇందులో ప్రమాదం ఏమంటే, రెండు ఆసియా దిగ్గజాల మధ్య కొత్త ప్రచ్ఛన్నయుద్ధం మొదలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. పాకిస్థాన్కు ట్రంప్ సర్కారు గతంలో మాదిరిగా భారీగా నిధులు అందించి భారత్ను ఇబ్బంది పెట్టేకపోవచ్చనే భావిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారత్ అమెరికాకు చేసే సేవల ఎగుమతులు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారత ఐటీ దిగ్గాజాలకు ట్రంప్ విధానాల వల్ల ఆదాయం తగ్గిపోతుంది. హెచ్బీ వీసాల జారీపై ఆంక్షలు అమలు చేస్తే దేశంలోని సాఫ్ట్వేర్ నిపుణులకు అమెరికాలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఫోర్డ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలను కూడా అమెరికాలోనే తయారుచేయాలనే నిబంధన ద్వారా ఒత్తిడి చేస్తే, భారత్లో ఇలాంటి కంపెనీల ప్లాంట్లు మూతబడతాయి. ఈ విషయాల్లో ట్రంప్ చెప్పే మాటలు ఎంత వరకు ఆచరణసాధ్యమో తేలాకే కొత్త అధ్యక్షుడి విధానాలు భారత్కు నిజంగా కీడుచేసేదీ లేనిదీ తేలుతుంది. సత్సంబంధాల దశాబ్దం 1981-91 శత్రుత్వం నీడలో నడిచిన అగ్రరాజ్యాలు అమెరికా, సోవియెట్ యూనియన్(రష్యా పాత పేరు) మధ్య సంబంధాలు 1981-91 మధ్య ఎవరూ ఊహించని రీతిలో మెరుగుపడ్డాయి. ఈ దశాబ్దం చివరికి స్వీయ తప్పిదాలు, పాశ్చాత్య దేశాల ఎత్తుగడల వల్ల సోవియెట్ యూనియన్ కుప్పకూలి, ప్రచ్ఛన్నయుద్ధం ముగిసింది. 1981 జనవరిలో అధికారం చేపట్టిన మరో రిపబ్లికన్, పచ్చి కమ్యూనిస్ట్ వ్యతిరేకి రోనాల్డ్ రేగన్ హయాంలో రెండు దేశాల మధ్య సత్సంబందాలు నెలకొంటాయని ఎవరూ ఆశించలేదు. అఫ్ఘానిస్తాన్ వంటి సమస్యల కారణంగా ఆరంభంలో ఉద్రిక్తతలు పెరిగాయి. రేగన్ మొదటి పదవీకాలమంతా వేడివేడిగా నడిచింది. మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను చరిత్రలో ‘అస్తికల కుప్ప’గా మార్చేస్తానని రీగన్ ఒకానొక సందర్భంలో అన్నారు. అంతేకాదు, ఈ కమ్యూనిస్టు అగ్రదేశాన్ని ‘దుష్ట సామ్రాజ్యం’గా ఆయన అభివర్ణించారు. 1983లో దక్షిణ కొరియా (కొరియా ఎయిర్ లైన్స్ ప్రయాణికుల ఫ్లైట్)విమానాన్ని జపాన్ సముద్రంలో సోవియెట్ దళాలు కూల్చివేశాక ఎప్పుడూ లేనంతగా రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాలు దెబ్బదిన్నాయి. సోవియెట్ రాజ్యాన్ని అదుపుచేయడానికి రేగన్ వెంటనే ‘స్టార్వార్స్’ కార్యక్రమం ప్రకటించారు. 1985 మార్చిలో సోవియెట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో దేశాధినేతగా మిహాయిల్ గోర్బచేవ్ అధికారం చేపట్టాక రెండు దేశాల మధ్య సంబంధాల్లో స్వర్ణయుగం వచ్చింది. 1987 డిసెంబర్లో రేగన్, గోర్బచేవ్ రెండు దేశాల అణుక్షిపణుల తొలగింపు ఒప్పందంపై సంతకాలు చేశారు.మరుసటి ఏడాది మే నెల్లో సోవియెట్ పర్యటనకు వచ్చిన రేగన్ మాస్కో రెడ్ స్వ్కేర్లో నిలబడి, దుష్ట సామ్రాజ్యం అనేది ఈ యుగానికి సంబంధించినది కాదని మాటమార్చి సోవియెట్ నేతలను ఆనందింపజేశారు. రేగన్ తర్వాత అధ్యక్షుడైన జార్జి హెచ్ డబ్ల్యూ బుష్(సీనియర్ బుష్) మొదట కాస్త వేడిపుట్టించినా చివరికి గోర్బచేవ్తో శాంతి పునరుద్ధరణకే చేతులు కలిపారు. 1989 డిసెంబర్లో(బెర్లిన్ గోడ కూలిన నెలకు) మధ్యధరాసముద్రదేశం మాల్టాలో గోర్బచేవ్, బుష్ భేటీ అయ్యారు. సమావేశం ముగిశాక,‘‘మేం ప్రచ్ఛన్నయుద్ధాన్ని మధ్యధరాసముద్ర గర్భంలో సమాధి చేశాం’’అని గోర్బచేవ్ ప్రతినిధి ప్రకటించారు. క్లింటన్ - ఎల్త్సిన్ బంధం చెడింది సోవియెట్ యూనియన్ అంతర్దానమయ్యాక అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్కు, సోవియెట్ అధ్యక్షుడు బోరిస్ ఎల్త్సిన్కు మధ్య కొద్దికాలం సాగిన బంధం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. జూనియర్ బుష్ హయాంలో 2001 సెప్టెంబర్11 ఉగ్ర దాడుల తర్వాత అమెరికాతో సహకరిస్తానన్న పుతిన్ పొరుగుదేశం జార్జియాను ఆక్రమించి శత్రుత్వం పెంచుకున్నారు. 2009లో అధ్యక్షుడైన బరాక్ఒబామా రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. క్రిమియా, ఉక్రెయిన్, సిరియా సమస్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. చివరికి ఆయన రష్యాపై ఆంక్షలు విధించి పదవీ విరమణ చేస్తున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు ఇంత మంది అమెరికా అధ్యక్షుల కృషి ఫలించలేదు. మరి ట్రంప్ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో కాలమే చెబుతుంది. రష్యన్లకు అంత ‘ఆశ’ లేదు: అమెరికా నిపుణుడు థామస్ గ్రహమ్ ‘‘ట్రంప్ ప్రమాణం రోజే సంబంధాలు బలపడతాయని రష్యన్లు ఆశించడంలేదు. చాలా త్వరగా స్నేహబంధం గట్టిపడుతుందని వారనుకోవడం లేదు. ట్రంప్ రష్యన్లకు అడిగినవన్నీ ఇస్తారనే పాశ్చాత్య దేశాల(ఐరోపా) అంచనాలను చూసి రష్యన్లు ఆశ్చర్యపోతున్నారు.’’అని జార్జి డబ్ల్యూ బుష్సలహాదారుగా పనిచేసిన థామస్ గ్రహమ్ అభిప్రాయడ్డారు. ‘‘విదేశాంగ నీతిలో ఏమాత్రం అనుభవం లేకున్నా ట్రంప్ తనకు లాభదాయకమైన ఒప్పందాలనే కుదుర్చుకున్నారనీ, ఆయన బృదంలో అనుభవమున్న సలహాదారులున్నారని రష్యా సర్కారు భావిస్తోంది’’ అని ప్రస్తుతం విదేశాంగ విధానంలో సలహాలిచ్చే సంస్థ కిసింజర్ అసోసియేట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గ్రహమ్ చెప్పారు. -
‘మోదీనే అత్యుత్తముడు’
లండన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానంపై ప్రచురితమైన ఒక పుస్తకాన్ని లండన్లోని భారత హై కమిషన్లో ఆవిష్కరించారు. ‘ద మోదీ డాక్ట్రైన్: న్యూ పారాడైమ్స్ ఇన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ’ (మోదీ సిద్ధాంతం: భారత విదేశాంగ విధానంలో కొత్త మార్పులు) అనే ఈ పుస్తకంలో మోదీ నాయకత్వంలో భారత్ వివిధ దేశాలతో నెరిపిన సంబంధాలపై పలువురు ప్రముఖ రచయితల వ్యాసాలను సంపుటీకరించారు. బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి విజయ్ చౌతయ్వాలే మాట్లాడుతూ ‘ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసాన్ని ఆయా రంగాల్లోని నిపుణులు రాశారు. కాబట్టి దీనికి విశ్వసనీయత, నిష్పాక్షికత ఉంటాయి’ అన్నారు. ‘బ్రిటన్ ప్రధాని థెరెసా మే ద్వైపాక్షిక సంబంధాల కోసం తన తొలి ఐరోపాయేతర పర్యటనకు భారత్కు వెళ్లారు. ఇదే మోదీ గురించి ఎంతో చెబుతోంది. భారత్కు ఉన్న రాయబారుల్లో మోదీనే అత్యుత్తముడు’ అని యూకేలో భారత తాత్కాలిక హైకమిషనర్ దినేష్ పట్నాయక్ అన్నారు. -
చైనా-పాక్ లను ట్రంప్ వ్యతిరేకిస్తారా?
న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయంతో భారత్-అమెరికా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైంది. మరి భారత్ తో భాగస్వామ్యానికి ట్రంప్ ఎలాంటి దౌత్య విధానాల(ఫారిన్ పాలసీ)ను అనుసరిస్తారు?. అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే వచ్చే ఏడాది జనవరి 20 వరకూ ఆగాల్సిందే. అయితే, ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వాగ్ధానాలను బట్టి చూస్తే మాత్రం ఆయన దౌత్య విధానాలు భారత్ కు అనుకూలించేలాగే ఉన్నాయి. ప్రచారంలో భాగంగా భారత్ ను ఉద్దేశించి ట్రంప్ పలుమార్లు ప్రసంగించారు. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలిస్తున్న దేశం కూడా భారతేనని, టెర్రరిస్టులు భారత్ ను టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా అమెరికాకు ధీటుగా పోటీ పడేందుకు సిద్ధమవుతున్న చైనాపై ఆయన కొంత విముఖతను ప్రదర్శించారు. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు ఆసియాలో కీలక దేశాలైన దక్షిణ కొరియా, జపాన్లు ఆయుధ సంపత్తిని పెంపొందించుకోవాలని సూచించారు. దక్షిణ చైనా సముద్రంలో(ఎస్సీఎస్) అమెరికా సాయుధదళాలను పెంచుతామని ప్రకటించారు. అందువల్ల ఫిలిప్పీన్స్ విధానాలను మిగతా దేశాలను అనుసరించాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో ట్రంప్ వ్యాఖ్యలను జపాన్, భారత్ లు స్వాగతించాయి. నిబంధనలను ఉల్లంఘిస్తూ చైనా చేస్తున్న వ్యాపార లావాదేవీలను భారత్ లాంటి దేశాలు సొంత లావాదేవీలతో తిప్పికొట్టాలని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ సొంతలాభాన్ని చూసుకునే అవకాశం లేకపోలేదు. ఆయన ప్రచార కార్యక్రమం మొత్తం అమెరికాలో వేళ్లూనుకుపోయిన ఇతర దేశాల వారిని బయటకు పంపి అమెరికన్లకే అవకాశాలు దక్కేలా చేయడం లాంటి వాటిపైనే సాగింది. ఈ విషయంలో భారత్-అమెరికాలో మధ్య కొంత గంభీర వాతావరణం నెలకొల్పే అవకాశం ఉంటుంది. పసిఫికేతర వాణిజ్య భాగస్వామ్యం(టీపీపీ)పై ట్రంప్ ముందుకెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇది ఒక రకంగా భారత్ మంచికే. టీపీపీ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు సాగించేందుకు భారత్ ఇంకా అర్హత సాధించలేదు. రష్యాతో సంబంధాలు పెంపొందించుకుంటానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా భారత్ కు అనుకూలించేవే. మరో అడుగు ముందుకేసి రష్యాను ఏ మాత్రం శత్రువుగా భావించబోనని ట్రంప్ ప్రపంచానికి చాటి చెప్పారు. అదే విధంగా ట్రంప్ అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ సమర్ధించిన విషయం కూడా తెలిసిందే. ట్రంప్ ప్రచారంలో చెప్పినట్లు నడుచుకుంటే ఆసియాలో రష్యా తిరుగులేని శక్తిగా తయారవుతుంది. దీంతో భారత్ కు బెడదగా మారుతున్న చైనా కు చెక్ పడుతుంది. అప్ఘనిస్తాన్-పాకిస్తాన్, పశ్చిమ ఆసియా దేశాలపై ట్రంప్ ఎలా వ్యవహరించనున్న తీరు భారత్ కు కీలకం కానుంది. ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకోవడానికి సాయం చేసిన డాక్టర్ షకిల్ అఫ్రిదిని జైలు నుంచి విడుదల చేయాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ ను అమెరికా సైన్యం హతమార్చిన తర్వాత పాకిస్తాన్ అఫ్రిదిని ఖైదు చేసింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలినాళ్లు భారత్ కు మరింత కీలకంగా మారనున్నాయి. సరికొత్త టీమ్ తో భారత్ అమెరికాతో సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. -
నేనొస్తే ధ్వంసం చేస్తా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ముందువరుసలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుపోతున్న ఆయన ఏమాత్రం తన వాగ్దాడిని తగ్గించడం లేదు. అంతకంటే వేగంగా ఆయన మాటలు జారవిడుస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే విదేశాంగ విధానంలో తన తొలి ప్రాధాన్యం ఇరాన్ అణుఒప్పందం అంశమే ఉంటుందని, ఆ ఒప్పందాన్ని ధ్వంసం చేస్తానని అన్నారు. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందే ప్రపంచ ఉగ్రవాద నెట్ వర్క్కు టెహ్రాన్ మాత్రమే కీలక స్థావరంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను ఎంతో కాలంగా వ్యాపార రంగంలో ఉన్నానని, ఒప్పందాన్ని ఎలా చేసుకుంటారో తనకు తెలుసని అన్నారు. ఇరాన్ తో జరిగిన అణుఒప్పందం ఒక దురదృష్టకరం అని చెప్పారు. ఈ ఒప్పందాన్ని తాను విచ్ఛిన్నం చేస్తానని ప్రకటించారు. -
ప్రధాన రాయబారి మోదీ..!
ప్రధాని విదేశాంగ విధానం సక్సెస్ - ఆ వేగం కొనసాగించటమే సవాల్ తొలి ఏడాదిలో 18 దేశాల్లో నరేంద్రమోదీ పర్యటన ప్రపంచం దృష్టిని భారత్ వైపు ఆకర్షించటంలో సఫలం అమెరికా, చైనాలతో ఏక కాలంలో సన్నిహిత స్నేహం పాక్తో మరింత దెబ్బతింటున్న సంబంధాలు ఏడాది కాలపు విదేశాంగ విధానంపై మిశ్రమ విశ్లేషణలు ఏడాది కిందట ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ.. ఈ ఏడాది పాలనా కాలంలో సాధించిన అతిపెద్ద విజయం విదేశాంగ విధానమేనని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఏడాదిలో 18 దేశాల్లో పర్యటించిన మోదీ రికార్డు సృష్టించారు. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో.. మరోవైపు అమెరికాకు ప్రత్యామ్నాయ ప్రపంచ శక్తిగా పరిగణిస్తున్న కమ్యూనిస్టు చైనాతో ఏక కాలంలో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు మోదీ తనదైన ‘దౌత్య రాజకీయాలు’ నెరిపారు. తానే భారత ప్రధాన రాయబారిగా వ్యవహరించా రు. ఈ ఏడాదిలో భారత్ను సరికొత్తగా ప్రపంచం ముందు నిలపటానికి.. పెట్టుబడులు పెట్టటానికి ఆకర్షణీయమైన మార్కెట్గా ప్రపంచం దృష్టిని మళ్లీ భారత్ మీదకు తీసుకురావటంలో సఫలమయ్యారు. అలాగే.. దక్షిణాసియాపై ప్రధాన దృష్టి పెట్టిన మోదీ, పశ్చిమాసియాను పూర్తిగా విస్మరించారని.. బలమైన పొరుగుదేశం చైనాతో సంబంధాలను మెరుగుపరచుకునే దిశలో విజయం సాధించినప్పటికీ.. భారత్కు అతి పెద్ద సవాలుగా ఉన్న మరో పొరుగుదేశం పాకిస్తాన్తో సంబంధాల విషయంలో విఫలమయ్యారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విజయం కొనసాగేలా చూడటం సవాలు: ఏడాదిలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల్లో పర్యటించిన మోదీ.. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా వారికి విశ్వాసం కల్పించటంలో.. దేశంలో పెట్టుబడులకు ఉన్న ఆటంకాలను తొలగించేందుకు నిజాయితీగా కృషి చేస్తున్నామని నమ్మకం కలిగించటంలో కృతకృత్యమయ్యారు. దీర్ఘ కాలంగా అమలుకాకుండా నిలిచిపోయిన అణు ఒప్పందం అమలుపై అమెరికాతో సంయుక్త ప్రకటన, చైనాతో సరిహద్దు పరిష్కారానికి ప్రమాణాలను నిర్ణయించటం వంటి ఘనమైన విజయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో భూ సరిహద్దు ఒప్పందం మరో గణనీయ విజయం. అలాగే.. దక్షిణాసియాలో ఉమ్మడి సుసంపన్నత అనే ఆకాంక్షను విశదీకరించిన మోదీ.. అందులో భారత నాయకత్వాన్ని చక్కగా చూపారు. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో అనేక దేశాలతో లక్షల కోట్ల పెట్టుబడులపై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కృషిని అదే ఉత్సాహం, వేగంతో కొనసాగించటం.. ఫలితాలు వచ్చేలా చూడటం మోదీ ముందున్న సవాళ్లని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే క్రైస్తవులు, చర్చిలు, విదేశీ ఎన్జీవోలపై తరచుగా జరుగుతున్న దాడులు.. పశ్చిమ దేశాల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశముందని.. వారి దృష్టిలో ‘భారత్ విజయగాథ’ అనేది మత స్వేచ్ఛ లేని దేశంగా మారిపోయే అవకాశముందని ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. అటూ ఇటూ.. స్నేహం..: ప్రపంచ దేశాల్లో రెండు ముఖ్యమైన శక్తులు - అమెరికా, చైనాలతో మోదీ వ్యవహార శైలి.. ఆ దేశాలతో సంబంధాలను బలపరచుకోవటంతో పాటు.. భారత ప్రయోజనాలకు అనుగుణంగా నడచుకోవటం విస్పష్టంగా కనిపిస్తోంది. ‘‘అమెరికా అధ్యక్షుడు ఇక్కడికి (ఢిల్లీకి) వచ్చినపుడు.. ఆయనతో కలిసి మోదీ హిందూ మహాసముద్రంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోదీ చైనా వెళ్లినపుడు.. చైనా అధ్యక్షుడితో కలిసి వాతావరణ మార్పుల అంశంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత ప్రయోజనాల విషయంలో రెండు వైపులా వ్యవహారాలు నడపటానికి ఆయన సంకోచించలేదు. ఇది ఆయన వ్యవహారిక సత్తా వాదానికి అద్దం పడుతోంది. ఈ విధంగా చూస్తే.. అలీన విధానమైన భారత విదేశాంగ విధానానికి కొనసాగింపుగానే మోదీ విధానాన్ని భావించవచ్చు’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్కు చెందిన శ్రీనాథ్ రాఘవన్ పేర్కొన్నారు. దక్షిణాసియాలో కొత్త మైత్రి..: నేపాల్లో మోదీ పర్యటన ఆ దేశంతో భారత్ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. అయితే.. నేపాల్లో పెను భూకంపం నేపథ్యంలో ఆ దేశ రాజ్యాంగ రూపకల్పన, దేశ పునర్నిర్మాణంలో భారత్ పాత్ర సవాళ్లతో కూడుకుని ఉంటుందని చెప్తున్నారు. ఇక శ్రీలంకలో మోదీ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను పునఃనిర్వచించింది. అయితే.. లంకలో తమిళుల సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉండటం.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. బంగ్లాదేశ్తో సరిహద్దు వివాదం విషయంలో బీజేపీ వైఖరిని వదిలిపెట్టి.. ఆ దేశంతో భూ సరిహద్దును ఖరారు చేయటం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసింది. కానీ తీస్తా నదీ జలాల వివాదం కొనసాగుతూనే ఉంది. మోదీ ఈ ఏడాది జూన్లో బంగ్లాలో పర్యటించనున్నారు. పాకిస్తాన్పై తీరు మారలేదు..: మోదీ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్షరీఫ్ను ఆహ్వానించి ద్వైపాక్షిక దౌత్యానికి మంచి ఆరంభాన్నిచ్చినా.. దాన్ని అదే స్థాయిలో కొనసాగించలేకపోయారు. తనకు ముందు పాలకుల తరహాలోనే తొలుత దౌత్య చర్చలతో ప్రారంభించి.. తర్వాత చర్చల నిలిపివేతకే మొగ్గుచూపారు. ఈ క్రమంలో పాక్తో సంబంధాలు మరింతగా దెబ్బతింటున్నాయి. పాక్తో సంబంధాల్లో ప్రతిష్టంభన.. అఫ్ఘానిస్తాన్తో భారత్ సంబంధాలపైనా ప్రభావం చూపుతోంది. పశ్చిమాసియాపై ప్రేక్షక పాత్ర..: అంతర్గత సంక్షోభాలతో పశ్చిమాసియా కల్లోలంగా ఉంటే.. భారత్, మోదీ ఆ ప్రాంతంపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. పలు సంక్షుభిత ప్రాంతాల నుంచి భారతీయులను రక్షించి తేవటానికే భారత్ పరిమితమైంది. వ్యవస్థీకృత ప్రణాళికా లోపంతో చిక్కులే..: విస్తృత విదేశీ విధానం ఎత్తుగడలకు సంబంధించి సరైన వ్యవస్థీకృత ప్రణాళిక లేకపోవటం వల్ల.. భారత్కు మున్ముందు చాలా దేశాలతో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్కు చెందిన శ్రీనాథ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. తొలి ఏడాదిలో ఎదురైన సవాళ్లివీ... మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గత జూలైలో తొలి దౌత్య సవాలు ఎదురైంది. ఇరాక్లో 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారన్న వార్త వచ్చింది. ఆ తర్వాత అదే దేశంలో తలెత్తిన అంతర్గత సంక్షోభంలో భారతీయ నర్సులు చిక్కుకుపోయారన్న వార్త వచ్చింది. బలమైన దౌత్య కృషితో నర్సులను విడిపించగలిగారు. కానీ.. 39 మంది భారతీయుల ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. -
ఈ ‘సమురాయ్’ దారెటు?
నరేంద్రమోడీ ప్రధాని కాగానే, దూకుడుతో కూడిన విదేశీ, రక్షణ విధానాన్ని ప్రారంభించగలరని భారతీయులకు నమ్మకం కలిగింది. వందరోజుల్లోనే మోడీ తన బుద్ధి కుశలతతో, సానుకూల విదేశీ విధానంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నాళ్లుగా శత్రువైఖరితో ఉన్న కొన్ని దక్షిణాసియా దేశాలలో పర్యటించి అక్కడి ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. ఇలాంటి సంతోషకరమైన పరిణామాలు మరిన్ని కలుగుతాయనీ, కలగాలనీ ఆశిద్దాం. ప్రధాని నరేంద్రమోడీ జపాన్ సందర్శన దాదాపు ముగింపుకొస్తోంది. ఈ సందర్భంలో ఆయన ఆధ్వర్యంలోని రక్షణ రంగం గురించి మాట్లాడు తున్నప్పుడు జపనీయుల మహత్తర సమురాయ్ యుద్ధవీరుడి జ్ఞాపకాలు తలపు కొస్తున్నాయి. బహుశా చరిత్రలో ఇంతవరకు నమోదైన అతిగొప్ప యుద్ధవీరులు జపాన్కి చెందిన సమురాయ్లే. వీరు పురాతన గ్రీకు దేశంలోని స్పార్టన్లతో సమానులు. వీరి త్యాగం, శౌర్యం సాటిలేనివి. పలు హాలీవుడ్ సినిమాలకు వీరి శౌర్యం పునాదిగా నిలిచింది కూడా. అయితే, ఆధునిక కాలంలో దేశాలు శౌర్యం, ప్రతిష్ట సూత్రాలపై ఆధారపడి కార్యకలాపాలను సాగించలేవు. మోడీ సమురాయ్ కాలేరు. ప్రస్తుతం యుద్ధానికి వెళ్లకుండానే విదేశీ విధానాన్ని నిర్వహించే సూక్ష్మబుద్ధి కలిగిన రాజకీయ నేతలు అవసరం. విజయవంతమైన విదేశాంగ విధానం అంటే, యుద్ధం చేయకుండా తన లక్ష్యాలను దేశం సాధించడమని అర్థం. దౌత్యనీతిని నైపుణ్యంగా ఉపయోగించుకోవడం ద్వారా యుద్ధాన్ని తప్పించాలి. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినప్పుడు, ఆయన దూకుడుతో కూడిన విదేశీ, రక్షణ విధానాన్ని ప్రారంభించగలడని భారతీయులకు నమ్మకం కలిగింది. ఇరుగు పొరుగు దేశాల నుంచి ఉగ్రవాదాన్ని, బెదిరింపులను తాను సహించబోనని మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు చెబుతూ వచ్చారు. మన దేశం అవమానాల పాలయిందని, దీన్ని బలహీన దేశంగా భావించారని ఆయన పదే పదే పేర్కొన్నారు. సరైన సన్నాహకాలు లేకుండా ఏ దేశంపైనయినా దాడి చేయవలసిందిగా ైసైన్యాన్ని ఆదేశించడం ప్రధానిగా మోడీకి కష్టమే కాగలదు. దాడిని ప్రారంభించడం సులభమే. కాని దానికి ఒక నిష్ర్కమణ మార్గం కూడా ఉండాలి. అందుకే, మోడీ ప్రధాని అయ్యాక చేతలను పరిమితం చేసుకోవడం అనే కష్టభూయిష్టమైన లక్ష్యాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అదే సమయంలో బలమైన ప్రభుత్వంపై తానిచ్చిన హామీని అమలు చేయడంపై కలవరపడ్డారు కూడా. బలమైన ప్రభుత్వం అంటే పొరుగు దేశాల శత్రుచర్యలను తిప్పికొట్టడమేనని అర్థం. కానీ నిజజీవితంలో ఇలా చేయడం చాలా కష్టం. రక్షణ, విదేశీ విధాన సమస్యలు చైనా, పాకిస్థాన్ రెండింటితో భారతదేశానికి విదేశాంగ విధానంలో, రక్షణ రంగంలో తీవ్రమైన సమస్య ఉంటోంది. ఇలా ఒక పెద్ద దేశానికి రెండు పొరుగు దేశాలతో శత్రుత్వం ఉండటం అరుదు. గత 60 ఏళ్లుగా చైనా, పాకిస్థాన్తో శత్రుత్వం కారణంగా ఇతర పొరుగు దేశాలు కూడా భారత్ పట్ల ప్రతికూల వైఖరినే చేపడుతున్నాయి. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో పాకిస్థాన్ నుంచి అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. అలాంటి ఉగ్రవాద చర్యలను ప్రభుత్వం అరికట్టలేకపోయింది. కాశ్మీర్ మనకు శాశ్వత సమస్యగా మారిపోయింది. భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లోని ఒక రాజకీయ పార్టీని పాకిస్థాన్ ప్రోత్సహించడంతో ఆ దేశం కూడా సమస్యాత్మకంగా మారింది. బేగమ్ జియా అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ బంగ్లాదేశ్, భారత్ పట్ల శత్రు వైఖరితో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మారి, బేగమ్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇండియా ప్రశాంతంగా ఉంటుంది. అయితే బంగ్లాదేశ్కు వాగ్దానం చేసిన ఏ హామీలనూ నెరవేర్చకపోవడంతో వారి దృష్టిలో మన దేశం బలహీనపడి పోయింది. అలాగే శ్రీలంకతో భారత్ ఎలాంటి స్నేహపూర్వక ప్రయత్నాలు చేపట్టినా యూపీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్న తమిళనాడు పార్టీలు బెదిరింపులకు దిగేవి. దీంతో శ్రీలంక క్రమంగా చైనా, పాకిస్థాన్లకు దగ్గరయింది. నేపాల్కు భారత్తో నిరాటంకమైన సరిహద్దులున్నాయి. నేపాలీయులు వీసాలు లేకుండానే భారత్కు స్వేచ్ఛగా వచ్చి పనిచేసుకునేవారు. అయితే గత పదేళ్లుగా మన దేశం నేపాల్కు శత్రువుగా మారింది. 2014 నాటికి భారత్కు సరిహద్దు దేశాలైన, చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక తో శత్రుత్వం ఏర్పడింది. మన్మోహన్ తన పదవీకాలంలో ఎన్నడూ నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలను సందర్శించలేదనీ, ప్రధానిగా తన హయాంలో చివరి సంవత్సరం మాత్రమే ఆయన బంగ్లాదేశ్ను సందర్శించారనీ గుర్తుంచుకోవాలి. ప్రారంభం అదిరింది ఇదీ నరేంద్రమోడీ ప్రధానిగా పదవీ స్వీకారం చేసినప్పటి స్థితి. అయితే ప్రారంభం నుంచీ ఆయన గొప్ప తెలివిని, సమయస్ఫూర్తినీ ప్రదర్శిస్తూ వచ్చారు. మే 26న ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా దక్షిణాసియా దేశాల ప్రధాన మంత్రులందరికీ పది రోజులకు ముందే ఆహ్వానం పంపడం ప్రకంపనలు సృష్టించింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేని ఆహ్వానించవద్దని తమిళనాడు రాజకీయ పార్టీలు నిరసన తెలిపినప్పటికీ మోడీ పట్టించుకోలేదు. దీంతో శ్రీలంక మళ్లీ ఇండియా పట్ల మిత్రవైఖరి కనబర్చింది, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను మోడీ ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. మోడీ ప్రారంభం అదిరింది. పైగా దక్షిణాసియాలో తన తొలి పర్యటనను భూటాన్ నుంచే మొదలెడతానని మోడీ ప్రకటించారు. మన్మోహన్ హయాంలో భూటాన్తో కూడా మనకు శత్రుత్వం ఏర్పడింది. కాని వాటిని పరిష్కరించుకోలేదు. మోడీ తొలి సందర్శన భూటాన్ వాసులకు ఉపశమనం కలిగించింది. తమ దేశానికి ఇండియా అటువంటి ప్రాధాన్యతను ఇవ్వడంతో వారు బహు సంతోషపడిపోయారు. మన్మోహన్ హయాంలో నేపాల్తో మన సంబంధాలు శత్రుపూరితంగా మారాయి. కాని మోడీ తన తదుపరి సందర్శన నేపాల్కే అని చెప్పి మరీ వెళ్లారు. ఆ సందర్భంగా నేపాల్కు ఎలాంటి సూచనలు చేయడానికి భారత్ ప్రయత్నించదని నేపాలీయులకు, ఆ దేశ పార్లమెంటుకు హామీ ఇచ్చారు. నేపాల్ ఏది కోరుకున్నా భారత్ దాన్ని బల పరుస్తుందన్నారు. ఇండియాకు విద్యుత్ను అమ్మాలని నేపాల్ నిర్ణయించుకుంటే తాను స్వాగతిస్తానన్నారు. అంతే తప్ప తమ వైపు నుంచి ఎలాంటి ఒత్తిడీ ఉండదన్నారు. దీంతో నేపాల్లో భారత్ పట్ల తీవ్ర శత్రుత్వం ప్రదర్శించే శక్తుల మనసులను కూడా మోడీ గెల్చుకున్నారు. చైనా, భారత్, జపాన్ అంతర్జాతీయంగా చైనా విస్తరణవాద విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడు తోంది. చైనా ఇప్పటికే తన పొరుగు దేశాలైన వియత్నాం, ఫిలిప్పైన్స్, దక్షిణ కొరియా, జపాన్లతో జగడమాడుతోంది. ఈ నేపథ్యంలో మిత్రుల కోసం వెదుకులాటలో భాగంగా భారత్తో భాగస్వామ్యానికి జపాన్ ప్రయత్నించింది కాని మన్మోహన్ ప్రభుత్వం స్పందించలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ జపాన్కు సైన్యం లేదు. కానీ ప్రస్తుతం భారత్తో సన్నిహిత సంబంధాల కారణంగా జపాన్ మారవచ్చు. మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఇప్పుడు సన్నిహితం కావడానికి ప్రయత్నించడమే చైనాకు అవమాన కరం. దీంతో దక్షిణాసియాలో చైనా శత్రువులు కూడా జపాన్తో జత కడతారు. ఇటీవలే జపాన్ పర్యటనలో నరేంద్ర మోడీ స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏ దేశం కూడా విస్తరణవాదంతో వ్యవహరించవద్దనీ, చైనా తప్పు దోవలో పడుతోందనీ సూచించారు. ఆసియాలో చైనా ఏకాకి అవుతోంది. అంటే పాకి స్థాన్తో స్నేహానికి గాను చైనా భారీ మూల్యం చెల్లిస్తోందన్న మాట. ఇండియా నుంచి చైనాకు వెళుతున్న సందేశం ఇదే. వందరోజుల పాలన ఆశాజనకం మన్మోహన్ పదేళ్ల పాలన కంటే మోడీ తొలి వంద రోజుల పాలనలోనే మన విదేశాంగ విధానం చురుగ్గా, మెరుగ్గా ఉంది. శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియాలోని చిన్నచిన్న దేశాలను గౌరవించడం ద్వారా మోడీ పొరుగు దేశాలతో గతంలో జరిగిన తప్పులను సవరించడానికి ప్రయత్నించారు. ఏది చేయాలన్నా వందరోజులు మరీ తక్కువ సమయం. కాని విదేశాంగ విధానంలో తనకు సొంత దృక్పథం ఉందనీ, ప్రమాదాలను ఎదుర్కోవడానికి తాను వెనకడుగు వేయనని మోడీ సూచించారు. హురియత్ నేతలతో పాక్ హైకమిషనర్ మాట్లాడటంపై అభ్యంతరం తెలుపుతూ విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలను చివరి నిమిషంలో నిలిపివేసింది అందుకే. పాకిస్థాన్తో ఇంత మొండివైఖరి అవలంబించడంపై మోడీని పలువురు విమర్శించినప్పటికీ, ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్న సందేశాన్ని పాక్కు ఇండియా అందించింది. దేనికైనా సిద్ధపడటమనేది తప్పదు కానీ విదేశాంగ విధానంలో మోడీ కాస్త జాగరూకతతో వ్యవహరించాలి. ఆస్ట్రియాకు చెందిన మెటర్నిచ్, ఫ్రాన్స్కు చెందిన టాలీర్యాండ్ వంటి ప్రముఖ విదేశీ వ్యవహారాల మంత్రులు యుద్ధం లేకుండానే తమ దేశాలను అగ్రస్థానంలో నిలిపారు. ఏదేమైనా, వంద రోజుల్లోనే మోడీ తన బుద్ధి కుశలతతో, సానుకూల విదేశాంగ విధానాన్ని అనుసరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇలాంటి సంతోషకరమైన దిగ్భ్రాంతులు మరిన్ని కలుగుతాయనీ, కలగాలనీ ఆశిద్దాం. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
మిత్రులను మిగల్చని దౌత్యనీతి
67 ఏళ్ల భారత్ విదేశాంగ విధానం ప్రపంచ గమనాన్ని పట్టించుకోని రీతిలో దశాబ్దాల పాటు ఆ విధానాన్ని కొనసాగించడం ఒక బలహీనతేనని చరిత్ర రుజువు చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, నేపాల్, మైన్మార్- భారత్ను చుట్టి ముట్టి ఉన్న ఈ దేశాలలో ఒక్క దానితో అయినా మనకు ఒక్క దశాబ్దం పాటైనా సత్సంబంధాలు ఉన్నాయా? నరేంద్ర మోడీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి (మే 26, 2014) ఇరుగు పొరుగు దేశాల అధినేతలు హాజరు కావడంతో, మన విదేశాంగ విధానంలో కొత్త పోకడలు తథ్యమని విశ్లేషకులు భావించడం ప్రారంభించారు. మన విదేశాంగ విధానానికి బీజాలు వేసి, చాలా కాల ం శాసించిన వారు మొదటి ప్రధాని పండిట్ నెహ్రూయే. కానీ నెహ్రూ మరణించి ఐదు దశాబ్దాలు గడిచి పోయాయి. ప్రపంచ రాజకీయ సమీకరణలన్నీ మారిపోయాయి. సిద్ధాం తాలు అర్థం మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో నెహ్రూ విధానాలతో విభేదిం చే బీజేపీ సంపూర్ణ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. నెహ్రూ విదేశీ వ్యవ హారాలలో మౌలిక అంశాలను కూడా తీసుకునే వీలు దాదాపు లేనందునే మోడీ అనుసరించబోయే విదేశాంగ విధానం ఆసక్తికరంగా మారింది. నమ్మదగిన మిత్రదేశం ఏది? ‘విదేశీ వ్యవహారాలనేవి అంతిమంగా ఆర్థిక విధానం నుంచే ఉద్భవిస్తాయి. కాబట్టి భారత్ తనదైన ఆర్థిక విధానం రూపొం దించుకునే వరకు విదేశాంగ విధానం కొంచెం అస్పష్టంగానే ఉంటుంది.’ డిసెంబర్, 1947లో రాజ్యాంగ పరిషత్ చర్చ సందర్భంగా పండిట్ నెహ్రూ చెప్పిన మాటలివి. ఆయన దృష్టికి జోహార్లు. కానీ, ఆర్థిక విధానాలతో సమా నంగా సైనిక, వ్యూహాత్మక అవసరాలు కూడా అంతర్జాతీయ సంబంధాలను శాసించే రోజు వస్తుందని ఆ ‘శాంతిదూత’ ఊహించలేదు. నెహ్రూ జీవించి ఉన్న కాలంలోనే ఆయన విధానాల మీద విమర్శలు కురిశాయి. విదేశాంగ విధానం గురించి ఆలోచించడానికి 1925లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకుంది. దానికి అన్నీ తానే అయి నిర్వహించిన వారు నెహ్రూ. భారత స్వాతంత్య్రోద్యమం అవసరాన్నీ, సందర్భాన్నీ వివరిం చడానికి ఆయన అప్పుడే అనేక దేశాలు తిరిగివచ్చారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తరువాత విదేశీ వ్యవహారాలకు తనదైన శైలిలో ఆకృతిని ఇచ్చారు. కానీ పాక్, చైనా యుద్ధాలు ఆయన విశ్వాసాలకు ఆదిలోనే విఘా తం కలిగించాయి. 1962 నాటి చైనా యుద్ధం మిగిల్చిన క్షోభతోనే ఆయన కన్ను మూశారని పీవీ నరసింహారావు వంటివారు (లోపలిమనిషి) విశ్లేషిం చారు. నిజానికి ఈ వైఫల్యం ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతదేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. మారిన పరిస్థితులు, ప్రపంచ రాజకీయాలు, మన విదేశాంగ విధానంలో బలహీనత, ఏమైనా కావచ్చు- స్వతంత్ర భారతావ నికి ఇరుగునా, పొరుగునా ఒక్క మిత్రదేశాన్ని కూడా తయారు చేసుకునే అవ కాశాన్ని కల్పించలేదు. ఒక ఆదర్శంగా అలీన విధానం గొప్పదే. కానీ, ప్రపం చ గమనాన్ని పట్టించుకోని రీతిలో దశాబ్దాల పాటు ఆ విధానాన్ని కొనసాగిం చడం ఒక బలహీనతేనని చరిత్ర రుజువు చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, నేపాల్, మైన్మార్ - భారత్ను చుట్టి ముట్టి ఉన్న ఈ దేశాలలో ఒక్క దానితో అయినా మనకు ఒక్క దశాబ్దం పాటైనా సత్సంబంధాలు ఉన్నాయా? ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళైనా ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇరుగు పొరుగుతో బంధం ఇది! భారత్ అహింసాయుతంగా స్వాతంత్య్రం తెచ్చుకుంది. కానీ భారత్-పాక్ విభజన ప్రపంచ చరిత్రలోనే పెద్ద రక్తసిక్త ఘటన. అది మొదలు రెండు దేశాల మధ్య ఈ క్షణం వరకు శాంతి నెలకొనలేదు. 1947, 1965, 1971, 1999- నాలుగుసార్లు పాకిస్థాన్తో భారత్ తలపడవలసి వచ్చింది. సరిహద్దులలో కాల్పులకు లెక్కలేదు. పాక్ నేతలు కాశ్మీర్ వివాదాన్ని తమ మనుగడకు ఉపకరించే అంశంగా మలుచుకున్నారు. కాశ్మీర్ సమస్య, ఉగ్రవాదం రెండు దేశాల బంధం ఏమాత్రం బలపడకుండా చేశాయి. సంరతా ఎక్స్ప్రెస్ రైలు, ఢిల్లీ-లాహోర్ బస్సు, శ్రీనగర్-ముజఫరాబాద్ బస్సు-ఇవేవీ సంబంధాలను మెరుగుపరచలేకపోయాయి. 2001 నాటి పార్లమెంటు భవనం మీద ఉగ్రవాద దాడి, 2008 నాటి ముంబై దాడులు రెండు దేశాల మధ్య ఇనుప తెరను బిగించాయి. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తరువాత మొదట గుర్తించిన దేశం భారత్. కానీ ఆ సత్సంబంధాన్ని బంగ్లాదేశ్ కొనసాగించలేదు. పాకిస్థాన్ వలెనే, బంగ్లా కూడా భారత వ్యతిరేక ఉగ్రవాద మూకలకు ఆశ్రయం ఇచ్చే దేశంగా మారిపోయింది. అవామీ లీగ్ అధికారంలో ఉన్న 1972, 1996లో మినహా బంగ్లాతో సంబంధాలు సజావుగా లేవు. ఫరక్కా బ్యారేజీ, దక్షిణ తాల్పట్టి, తీన్ భిగా ప్రాంతాల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. చైనాతో సత్సంబంధాలపై నెహ్రూకు ఆనాడే సందేహాలు ఉన్నాయి. 1950 దశకంలో పెకింగ్ యాత్ర చేసినపుడే ‘ఆసియాలోని ఈ రెండు దిగ్గజాలు (భారత్, చైనా) ఏదో ఒక రోజున తలపడే రోజు వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు. మక్మెహన్ రేఖ, అక్సాయ్చిన్, అరుణాచల్ ప్రదేశ్లు కేంద్రబిందువులుగా ఉన్న వివాదాలను రెండు దేశాలు ఈనాటి వరకు పరిష్కరించుకోలేకపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే రీతిలో ఇప్పుడు చైనా చౌక వస్తువులు వెల్లువెత్తుతున్నాయి. సాంస్కృతికంగా ఎంతో దగ్గరగా ఉండే నేపాల్ కూడా చైనాకు బాసటగానే ఉంటోంది. టిబెట్ మీద డ్రాగన్ ఆధిపత్యాన్ని అంగీకరించినందుకు భారత్కు విమర్శలు తప్ప చైనా వైపు నుంచి కాస్త మేలు కూడా జరగలేదు. శ్రీలంక జాతుల సమస్యలో భారత్ తలదూర్చినప్పటి నుంచి ఆ దేశంతో సంబంధాలు క్షీణించాయి. అంతిమంగా ఆ పరిణామాలు రాజీవ్గాంధీని బలితీసుకున్నాయి. మైన్మార్లో సైనిక జుంటా, ఆఫ్ఘాన్లో ఉగ్రవాదం సత్సంబంధాలకు తావు లేకుండా నిలిపి ఉంచాయి. మార్పు సహజం ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో భారత్ అలీన విధానాన్ని నిక్కచ్చిగా అమలు చేసింది. అయితే కాశ్మీర్ విషయంలో సోవియెట్ రష్యా ఇచ్చిన మద్దతుతో అటు వైపే ఎక్కువ మొగ్గు చూపడం రహస్యమేమీ కాదు. సోషలిస్టు స్వాప్ని కుడు నెహ్రూ కూడా రష్యా అంటేనే అభిమానం చూపేవారు. ఈ బంధం వల్లనే ఆఫ్గాన్లో రష్యా తిష్టపై భారత్ నీళ్లు నమిలి, తన విధానంలోని బలహీనతను బయటపెట్టుకుంది. అప్పుడే (1990) ప్రపంచంతో పాటు భారత్ను కూడా పెనుమార్పులకు లోను చేసింది. సోవియెట్ రష్యా పతనం, భారత ఆర్థిక సంక్షోభం, కాశ్మీర్లో ఉగ్రవాదం పెచ్చరిల్లడం ఆ సంవత్సరమే జరిగింది. ఇవి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న పరిణామాలే కూడా. రష్యా బలహీనపడడంతో ఆఫ్గాన్లో ఉగ్రవాద మూకలు కాశ్మీర్ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఏక ధ్రువ ప్రపంచంలో భారత్ తన విదేశాంగ విధానాన్ని సహజంగానే పునస్సమీక్షించుకుంది. అమెరికాతో 1980 దశకం నుంచి మైత్రి ఉన్నప్పటికీ, సోవియెట్ రష్యా పతనంతోనే ఇండో అమెరికా స్నేహం కొత్త పుంతలు తొక్కింది. అలాగే 1992 నాటి లుక్ఈస్ట్ విధానం కూడా రష్యా పతనం ఫలితమే. అంటే ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామమే. దానితో ఆగ్నేయాసియా దేశాలతో భారత్ స్నేహ బంధం విస్తరించింది. దశాబ్దాల నిశ్శబ్దాన్ని వీడి ఎన్డీయే ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలకు శ్రీకారం చుట్టడం భారత విదేశాంగ విధానంలో పెద్ద పరిణామం. 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్ష అంతకు మించిన మలుపు. చైనా బెడద దృష్ట్యా భారత్కు అణు కార్యక్రమం అవసరమేనని వాదించి గెలవడం కూడా జరిగింది. దీనితోనే అణుపరీక్ష తరువాత అమెరికా,జపాన్,ఈయూ విధించిన ఆంక్షలు 2001కి తొలగిపోయాయి. కొత్త ప్రపంచంలో ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు కొత్త నిర్వచనాన్ని సంతరించుకు న్నాయి. చరిత్రలో పారిశ్రామిక విప్లవం వంటి పెద్ద పరిణామాలకు దూరంగా ఉండిపోయిన భారత్ ఆ లోటును భర్తీ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నది ‘గ్లోబల్ విలేజ్’లో విస్తృతమైన దౌత్య క్రీడ. మనది చైనా తరువాత అతి పెద్ద మార్కెట్. సైనిక వ్యయంలో ఎనిమిదో స్థానం మనదే. ఈ వాస్తవాలతో పాటు, ఇరుగు పొరుగు పరిణామాలు కూడా మనం కొత్తదీ, వాస్తవికమైనదీ అయిన విదేశాంగ విధానం వైపు జరగక తప్పని స్థితినే కల్పించాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ ప్రయోజనాలను కాపాడుతూనే వాణిజ్య, రక్షణ దౌత్యాలకు మోడీ పెద్ద పీట వేయక తప్పదని అంచనా. డాక్టర్ గోపరాజు నారాయణరావు