-
ఏపీ సీఎం వైఎస్ జగన్ విజన్ విశాఖ స్టాల్స్, గ్యాలరీని సందర్శించారు
-
మిల మిల మెరిసే దుస్తులలో మాధూరి దీక్షిత్.. ఫొటోలు
-
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
Parliament: లోక్సభకు పొగ
కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహ సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీ పాస్ సంపాదించినట్టు తేలింది. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్సభలో జీరో అవర్ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు. ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్ను చేరుకునేందుకు వెల్కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్ 13వ తేదీనే పాకిస్తాన్లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్ప్రీత్ మండల్ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దుండగులకు పాస్లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా జరిగింది... సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గంటపాటు వాయిదా వేశారు. సభలో లేని మోదీ, అమిత్ షా ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్రామ్ మేఘ్వాల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాందీ, అదీర్ రంజన్ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేరు. ఆరుగురూ ఒకే ఇంట్లో... పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3 నెలలుగా పార్లమెంటు పాస్ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరీ సింహా? దుండగులకు విజిటర్స్ పాస్లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్ పాస్లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్ల జారీని నిలిపేశారు. -
Wamiqa Gabbi: అందాల సొయాగాలు..వావ్ అనాల్సిందే (ఫోటోలు)
-
Radhika Merchant: కాబోయే పెళ్లి కూతురు రాధికా ట్రెండీ లుక్స్
-
Raghava Lawrence: రుద్రం మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ
Raghava Lawrence: రుద్రం మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ -
ఫుట్బాల్ మ్యాచ్లో అపశ్రుతి.. చూస్తుండగానే కుప్పకూలింది
కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్లోని ఎల్పీ స్కూల్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో ప్రేక్షకులు పోటెత్తారు. సామర్థ్యానికి మించి రావడంతో మైదానంలోని గ్యాలరీలు నిండిపోయాయి. అయితే ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఒకవైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ మ్యాచ్కు ఏకంగా 8వేల మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Nicholas Pooran: 'ఒక్క సీజన్ మాత్రమే చెత్తగా ఆడాను.. నేనేంటో చూపిస్తా' బీర్ బాటిల్తో మ్యాచ్ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా #WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV — ANI (@ANI) March 20, 2022 -
విక్రయాలలో సైట్ ఆఫీస్ కీలకం
సాక్షి, హైదరాబాద్: షాపింగ్ మాల్కు వెళ్లినప్పుడు మన చూపు అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దిన డిస్ప్లే వస్తువులపై పడుతుంది. వెంటనే ఆయా వస్తువుల కొనేందుకు లేదా ఎంక్వైరీకి ప్రయత్నిస్తాం. ఇదే తరహాలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ సైట్ ఆఫీస్ డిస్ ప్లే లాంటిది. శక్తివంతమైన మార్కెటింగ్ సాధనమిది. లగ్జరీ గృహాలతో పాటూ అఫర్డబుల్, మిడ్ సైజ్ గృహాల విక్రయాలలోనూ సైట్ ఆఫీస్ అనేది అత్యంత కీలకంగా మారింది. మన దేశంలో గృహ విక్రయాలు పోర్టా క్యాబిన్స్ లేదా నమూనా ఫ్లాట్ ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తుంటారు. సేల్స్ ఆఫీస్ అనేది ముందుగా లగ్జరీ ప్రాజెక్ట్లలో డెవలపర్లు అనుభవం, ప్రాజెక్ట్ ఆఫర్ల గురించి ఏర్పాటు చేసేవాళ్లు. తర్వాతి కాలంలో ఈ కాన్సెప్ట్ అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లకు కూడా పాకింది. ఎక్కువ మంది కస్టమర్లకు వసతి కల్పించడానికి, విక్రయాలను క్రమబద్దీకరించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి కొత్త ప్రాజెక్ట్ సైట్లో సేల్స్ ఆఫీస్ ఉంటుంది. సేల్స్, సైట్ ఆఫీస్ లేదా సేల్స్ గ్యాలరీ అనేది మొత్తం రియల్ ఎస్టేట్ లావాదేవీలో సమగ్రమైన, కీలకమైన విభాగం. ఆకర్షణీయమైన, సమగ్ర నిర్వహణ సేల్స్ ఆఫీస్ లేకపోతే విక్రయాలు కూడా గణనీయంగా క్షీణిస్తాయి. ప్రాజెక్ట్లోని ఉత్తమ ఫీచర్ల ప్రదర్శన, ప్రయోజనాల డిస్ప్లే, వాకిన్స్, సైట్ విజిట్స్ నిర్వహణ వంటివి సేల్స్ ఆఫీస్ ప్రత్యేకత. మార్కెటింగ్లో కీలకం.. ప్రాపర్టీల మార్కెటింగ్లో సేల్స్ ఆఫీస్ కీలకమైన విభాగంగా మారింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్పై కొనుగోలుదారులలో మంచి అభిప్రాయం కలిగేది సైట్ ఆఫీస్ నుంచే మొదలవుతుంది. మార్కెటింగ్ బృందానికి అప్పటికే చేతిలోకి రాని ప్రాజెక్ట్లోని ఫీచర్లు, ప్రయోజనాలు కస్టమర్లకు అనుభవపూర్వకం చేసే అవకాశం కలుగుతుంది. అభివృద్ధి పనులు జరుగుతున్న దశల వారీగా సైట్ ఆఫీస్లో ప్రదర్శించే వీలుంటుంది. ఆయా ప్రాజెక్ట్లో తాము భాగస్వామ్యమైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే ఓ ఊహాజనిత చిత్రాన్ని చూపించేదే సైట్ ఆఫీస్. కొందరు కస్టమర్లు పలుమార్లు సైట్ ఆఫీస్ను సందర్శించే అవకాశం ఉంటుంది కాబట్టి దీర్ఘకాలం ప్రభావవంతంగా, క్రియాత్మకంగా ఉండాలి. రియల్టీ ప్రాజెక్ట్ ప్రారంభమైన రోజు నుంచి 2–3 ఏళ్ల పాటు సాగుతాయి. ప్రాజెక్ట్లోని ఇన్వెంటరీలో 90 శాతం విక్రయాలయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుందని అనరాక్ గ్రూప్ స్ట్రాటర్జీ హెడ్ సునీల్ మిశ్రా తెలిపారు. ► ప్రాజెక్ట్ నిర్మాణం, విక్రయాలు పూర్తయ్యే వరకూ సేల్స్ ఆఫీస్ ఉంటుంది. నిర్మాణ సంస్థకు, కొనుగోలుదారులకు మధ్య వారధి లాంటివి సేల్స్ ఆఫీస్. ఇక్కడి నుంచే కస్టమర్ల సందేహాలను నివృత్తి చేయడంతో పాటూ ప్రాజెక్ట్ ఫీచర్లను ప్రదర్శిస్తారు. దీంతో పాటు ధర నిర్ణయం, లావాదేవీలు కూడా జరుగుతాయి. ప్రవాస కస్టమర్లు మినహా వంద శాతం ప్రాపర్టీ లావాదేవీలు సైట్ ఆఫీస్ల నుంచే జరుగుతాయి. సేల్స్ ఆఫీస్ అనేది డెవలపర్ పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మాత్రమే కాదు.. కొత్త ప్రాజెక్ట్ల లాంచింగ్, 80–85 శాతం కస్టమర్ల ఫిజికల్ ప్రాపర్టీ అనుభవం ఇక్కడ్నుంచే జరుగుతాయి. మంచి సేల్స్ ఆఫీస్ కారణంగా కస్టమర్ల అంతర్గత ప్రచారంతో సైట్ విజిట్స్ పెరుగుతాయి. విక్రయాల నిష్పత్తి 4–5% వరకు వృద్ధి చెందుతాయి. కొత్త మార్కెట్లలో కూడా డెవలపర్ బ్రాండ్ను తెలిపేది సైట్ ఆఫీసులే. గ్రేడ్–ఏ, బీ డెవలపర్లు సేల్స్ ఆఫీస్ల నిర్వహణతో 50% విక్రయాలను మెరుగుపర్చుకుంటున్నారు. సేల్స్ ఆఫీస్ క్లబ్ హౌస్గా.. మంచి సేల్స్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 0.5 శాతం అవుతుంది. చాలా మంది డెవలపర్లు తాత్కాలిక సేల్స్ ఆఫీస్ను ఏర్పాటు కంటే శాశ్వత నిర్మాణాన్ని చేపడతారు. వాస్తవానికి ఇది మంచి నిర్ణయం. ప్రాజెక్ట్ పూర్తయ్యాక సేల్స్ ఆఫీస్ను క్లబ్ హౌస్గా మార్చేసి.. హౌసింగ్ సొసైటీకి అప్పగిస్తారు. దీంతో సైట్ ఆఫీస్ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా సేల్స్ ఆఫీస్ పరిమాణం 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటుంది. కొన్ని టౌన్షిప్లలో 8 వేల నుంచి 10 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి కూడా ఉంటాయి. -
అందగత్తెపై కెమెరామెన్ జూమ్.. కామెంటేటర్ పాట
సాధారణంగా కెమెరామెన్ల కన్ను మైదానంలోనే ఆట, ఆటగాళ్ల మీదే కాదు.. చుట్టుపక్కల జరిగే వాటి మీద కూడా పడుతుంది. వెరైటీగా అనిపించేవాటితో పాటు అందంగా కనిపించే ఆడవాళ్లను కూడా బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తుంటారు. ఆ టైంలో స్క్రీన్ మీద కనిపించే వాళ్ల రూపాల్ని చూసి మురిసిపోతుంటారు కూడా. అయితే అలాంటి ఘటనే ఒకటి వీడియో ఇప్పడు వైరల్ అవుతుండగా.. రకరకాల రియాక్షన్లు వ్యక్తం అవుతున్నాయి. ఆడియెన్స్ గ్యాలరీలో కాళ్లు ముడుచుకుని కూర్చున్న ఓ అమ్మాయిని, ఆమె అందాల్ని పదే పదే జూమ్ చేస్తూ ఉండిపోయాడు కెమెరామెన్. అది గమనించిన కామెంటేటర్.. ఆ కెమెరామెన్ టైమింగ్కు తగ్గట్లే ఓ పాట పాడాడు. అలా ఒక్కసారి కాదు.. జూమ్ వేస్తూ చాలాసార్లు ఫోకస్ చేశాడు. ఇక ఆ చేష్టల్ని చూయింగ్ గమ్ నములుతూ ఆ అమ్మాయి కూడా అంతే లైట్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ ద్వారా వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏ మ్యాచ్ సందర్భంగా జరిగిందో తెలియదు. పాతదో కొత్తదో లేదంటే ఎడిట్ చేసిందో క్లారిటీ లేదు. కానీ, @hfussbaIl అనే ట్విటర్ అకౌంట్ నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరు ఆ కెమెరామెన్ను, మరికొందరు పాటపాడిన ఆ కామెంటేటర్ తీరును తప్పుబడుతూ తిట్లు తిడుతున్నారు. నైతిక విలువలు లేకుండా వ్యవహరించిన వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంకొందరి బాధేంటంటే.. ఆ వ్యక్తి పాడిన పాటకి అర్థం తెలుసుకోవాలనే ప్రయత్నం. దీంతో ఓ వ్యక్తి అది అరబ్ పాట అని చెబుతూ.. ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. ఆ అందానికి గుండెలో ముళ్లు గుచ్చుకున్నట్లు అయ్యిందని, జీవితాంతం ఆమె పాదాల దగ్గర పడి ఉండాలని ఉంద’ని ఆ పాట సారాంశం అని సదరు వ్యక్తి బదులిచ్చాడు. చదవండి: హిల్లరీ క్లింటన్ను ఉరి తీశారా? -
చంద్రయాన్-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక
సాక్షి, సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం విలక్షణమైన గ్యాలరీని షార్ అధికారులు నిర్మించారు. తొలుత ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున చంద్రయాన్–2 ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ఇస్రోకే ప్రతిష్టాత్మకం కావడంతో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశా వ్యాప్తంగా పౌరులను ఆహ్వానించింది. వీరి కోసం షార్లోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తూ గ్యాలరీ నిర్మాణం చేపట్టారు. ఈ తరహా గ్యాలరీ నిర్మాణాన్ని సైతం షార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ప్రయోగానికి గంట వ్యవధిలో సాంకేతిక కారణాలతో కౌంట్ డౌన్ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆహ్వానితులకు మళ్లీ అవకాశం ఈ నెల 15న ప్రయోగం నిర్వహించతలపెట్టినప్పుడు సందర్శకులు దేశంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇస్రో వెబ్సైట్లో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఆ పాస్లతో రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని ఎన్నో ఆశలతో వచ్చారు. అర్ధరాత్రి వేళ అని చూడకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రయోగం వాయిదా పడడంతో నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్ నంబర్లో వెబ్సైట్లో కొడితే అనుమతి వస్తోంది. కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం సైట్ ఓపెన్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త వారికి కూడా చంద్రయాన్–2 ప్రయోగాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పించాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు. -
అతిథులకు నాలుగు రకాల పాస్లు
-
తమిళదేశంలో తెలుగు గ్యాలరీ
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు ఎన్టిర్ ఏఎన్నార్ శివాజీ గణేశన్... వంటి సినీతారలు; వైఎస్రాజశేఖరరెడ్డి, కరుణానిధి, సుర్జీత్ సింగ్ బర్నాలా... వంటి రాజకీయ నేతలు; ఎవిఎం... విజయ వాహినీ వంటి సినీ రంగ సంస్థల సుప్రసిద్ధులు... ఇలా ఎందరినో ఎంతో సాదరంగా ఆహ్వానించి, చెన్నపట్టణంలోని ప్రముఖుల గృహాలను అందంగా తీర్చిదిద్దిన చరిత్ర... నూట పది సంవత్సరాలుగా చెన్నపట్టణంతో మమేకమై ఉన్న యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీది. సుమారు అరవై ఏళ్లుగా తమిళనాడు రాజ్భవన్ అలంకరణ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీదే! అక్కడి ఇంటీరియర్, గవర్నరును చూడటానికి వచ్చిన వారికి బహుమతులు వంటివన్నీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ చేతుల మీదుగానే సాగుతాయి. తమిళనాడు మాజీ గవర్నరు సుర్జీత్సింగ్ బర్నాలా మంచి చిత్రకారుడు. ఆయన వేసిన బొమ్మలన్నిటికీ ఈ ఆర్ట్ గ్యాలరీ వారే ఫ్రేము చేయాలి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీకరుణానిధి ఈ ఆర్ట్ గ్యాలరీకి సుమారు 60 సంవత్సరాలుగా నిత్య వీక్షకులు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తంజావూరు విధానంలో గ్లాస్ పెయింట్ చేసిన ఘనత కూడా యతిరాజ్ గ్యాలరీకి ఉంది...ఎక్కడా లేని విధంగా థాయ్లాండ్ సీత, కామధేనువు ఎంబాసింగ్ వర్క్, గోల్డ్ ప్లేటెడ్ వెంకటేశ్వర స్వామి ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేకం. వరలక్ష్మి అమ్మవారు, వెన్న కృష్ణుడు, శివుడు, ఆండాళ్... చిత్రాలన్నీ వంద సంవత్సరాలుగా ఈ ఆర్ట్ గ్యాలరీని మ్యూజియంగా మార్చాయి. ఎన్నో ఆటుపోట్లు మరెన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ కూడా కళా సేవ చేయడం మానలేదు ఈ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరు కళాచిత్రాలతో పాటు ఇతర ఇంటీరియర్ వస్తువులను కూడా తయారుచేయడం ప్రారంభించి, నవ్యతను ఆకళింపు చేసుకుంటోంది యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరు పెయింటింగులు ఓల్డ్ మద్రాసు, ఓల్డ్ కలకత్తా, ఓల్డ్ ఢిల్లీ ఫొటోలు, పెయింటింగ్లు కావాలంటే యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించవలసిందే. చెన్నైలోని వారినే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రముఖులనూ ఆకర్షిస్తున్న సంస్థ ఇది. పల్లెల్లో దేవాలయాలకు ఇక్కడి నుండే తంజావూరు పెయింటింగ్లను విరివిగా తీసుకువెతుంటారు. ఎక్కడో ఒంగోలు నుంచి చెన్నపట్టణం వచ్చి, తెలుగువారి కీర్తి బావుటాను విదేశాల వరకు రెపరెపలాడించింది లక్ష్మీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ. తంజావూరును ఆంధ్రనాయక రాజులు పరిపాలించారు. నేటికీ అక్కడ తెలుగు వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. చిత్రలేఖనంలో తంజావూరు శైలి విలక్షణం. ఎంతో శ్రమకోర్చి ఈ బొమ్మలను తయారుచేయడం ఒక ఎత్తయితే, వాటికి అందమైన, విలక్షణమైన ఫ్రేములు అమర్చడం మరో ఎత్తు. బంగారు రేకులతో తయారయ్యే ఈ తంజావూరు చిత్రాలు ఇంటికి అందాన్ని, దైవత్వాన్ని తీసుకువస్తాయి. ఇంతకీ ఈ ఆర్ట్గ్యాలరీని ఎవరు నెలకొల్పారంటారా... అక్కడికే వెళ్దాం.. ఒంగోలు నుంచి మద్రాసుకు... రామానుజకూటం యతిరాజయ్య ఓ వ్యాపారవేత్త. మంచి వ్యాపారం చేసి ధనం సంపాదించాలనే ఉద్దేశంతో ఒంగోలు నుంచి సుమారు 1890 ప్రాంతంలో మద్రాసు ప్రెసిడెన్సీకి కుటుంబంతో తరలి వచ్చారు. కొంతకాలం ఏదో ఒక పనిచేశారు. కాని ఆయనకు చేస్తున్న పని మీద తృప్తి కలగలేదు. ఇంకా ఏదో చేయాలని తపన నానాటికీ పెరుగుతూ వచ్చింది. 1905 నాటికి ఆయన లక్ష్యసాధన కార్యరూపం దాల్చింది. తను అనుకున్న వ్యాపారం ప్రారంభించారు. ప్లైవుడ్, గ్లాస్, ఫొటో ఫ్రేమ్స్... వంటి వస్తువులతో ‘యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’ అని సంస్థను మద్రాసు ప్యారిస్ కార్నర్లో దేవరాజ్ముదలి వీధిలో ప్రారంభించారు. సుమారు లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభమైన వ్యాపారం, మొదట్లో కొంత నిరాశ నే మిగిల్చింది. ఆయన ఎంత పట్టుదలతో ప్రారంభించారో అంతే పట్టుదలతో వ్యాపారాన్ని వృద్ధిచేశారు. చీమలాగ నిరంతరం కృషి చేశారు. గ్లాస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కూడా ప్రారంభించారు. చీమలాగే ధనం కూడబెట్టారు. కేవలం చెక్కలు, గ్లాస్ వంటి వాటితో ప్రారంభమైన ఈ గ్యాలరీ తంజావూరు పెయింటింగ్ల వంటి ఇంటీరియర్స్ను తయారుచేసి అమ్మడం ప్రారంభించారు. బంగారు రేకులతో తయారయ్యే ఈ కళాకృతులను చూసిన సినీవర్గీయులు, అవి తమ ఇళ్లల్లో ఉంటే ఇంటికి అందమే కాకుండా పవిత్రత కూడా వస్తుందని భావించి వాటిని కొనుగోలు చేసి కుడ్యాలకు అలంకరించారు. అలా ఈ వ్యాపారాన్ని సినీరంగ ప్రముఖులంతా ప్రోత్సహించారు. విదేశాలలో ఉన్న మిత్రులకు భారతీయ సంస్కృతి గురించి తెలియచేయడానికి చిహ్నంగా తంజావూరు చిత్రాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. తొలిసారి... బెల్జియం గ్లాస్... ఎ.వి.ఎం. విజయవాహినీ వారు... తమ స్టూడియోలకు కావలసిన ఇంటీరియర్ డెకొరేషన్ అంతా యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీలోనే కొన్నారు. ఈ అలంకరణతో వారి స్టూడియోలు అందాల బృందావనాలయ్యాయి. ఎన్టిఆర్, ఎంజిఆర్, ఏఎన్నార్, శివాజీగణేశన్... వంటి చలనచిత్ర కథానాయకులు ఈ గ్యాలరీకి నిత్య సందర్శకులు. వారివారి ఇళ్లను యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ వారి అలంకరణతో తీర్చిదిద్దుకున్నారు. బెల్జియం గ్లాస్ను మొట్టమొదటగా దిగుమతి చేసుకున్న ఘనత వీరిదే. రామానుజకూటం యతిరాజయ్యకు ముగ్గురు సంతానం. మూడవ తరంలో పదిహేను మంది, నాలుగవ తరంలో సుమారు 30 మంది. ఈ నాలుగవ తరంలోని వారే అమ్మాయి లక్ష్మి, అల్లుడు సుబ్బారావు. వీరు తమ ముత్తాత గారు ప్రారంభించిన ‘యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’ని ‘లక్ష్మీ యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీ’గా టి.నగర్లో ప్రారంభించి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లారు. మూడు లక్షల టర్నోవర్తో ఉన్నప్పుడు వ్యాపార వారసత్వాన్ని స్వీకరించి 50 లక్షల టర్నోవర్గా పెంచారు. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై ఇన్పుట్స్: సుకేల సుబ్బారావు, లక్ష్మి (నాలుగవ తరం వారు) వై.ఎస్. ప్రమాణ స్వీకారానికి కూడా... దివంగత నందమూరి తారకరామారావు భార్య బసవతారకమ్మ గతించినప్పుడు ఆమెను చిరస్మరణీయంగా తన కన్నులెదుట నిలుపుకునేందుకు వీలుగా ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుగా ఉండే చిత్రపటాన్ని వీరి చేత చేయించుకున్నారు. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో, ఆయన కుర్చీలో కూర్చుని ఉన్న ఫొటోను అందచేసే అవకాశం యతిరాజ్ ఆర్ట్ గ్యాలరీనే వరించింది. తమిళులు, ఉత్తరాదివారు, ఎన్నారైలు... అందరూ ఈ ఆర్ట్ గ్యాలరీ కస్టమర్లే. ప్రస్తుతం అందరూ పూజగదిలో తంజావూరు చిత్రాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతుండటంతో, ఈ చిత్రాలు స్థిరంగా నిలబడుతున్నాయి. -
మొరాయించిన మైకులు నిరసన తెలిపిన విలేకరులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీడియా గ్యాలరీలో మైకులు, స్పీకర్లు మొరాయించడంతో మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభం కాగానే సీఎం చంద్రబాబు మాట్లాడడం ప్రారంభించారు. ఏం మాట్లాడుతున్నారో అర్థంకాక మీడియా ప్రతినిధులు లేచి నిలబడి తమ చేతిలోని పేపర్లను ఊపడంతో సీఎం తన ప్రసంగాన్ని ఆపి అధికారులను పురమాయించారు. దీంతో అసెంబ్లీ ఇన్చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణ, సమాచార శాఖ అధికారి వెంకటేష్ సూచన మేరకు సిబ్బంది ప్రత్యామ్నాయ మైకు (స్పీకర్)ను తెచ్చి పెట్టడంతో గొడవ ముగిసింది. ఈలోపు సీఎం ప్రసంగం, స్పీకర్కు, వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య జరిగిన వాగ్వాదాన్ని విలేకరులు వినలేకపోయారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవ్వాలి: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్
యాదాద్రి భువనగిరి: పెట్రోల్ బంకులో పేలిన లారీ డీజిల్ ట్యాంక్
2030 నాటికి 16 కొత్త కార్లు.. దేశీయ దిగ్గజం కీలక నిర్ణయం
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
Indraja Sankar: విజిల్ నటి బర్త్డే సెలబ్రేషన్స్.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి.. ఆర్బీఐ ఏం చెబుతోంది?
పంజాబ్పై ఘన విజయం.. సెకెండ్ ప్లేస్కు ఎస్ఆర్హెచ్
అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement