garikapati Narasimha Rao
-
'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?
ప్రభాస్ 'కల్కి' సినిమా వచ్చి నాలుగు నెలలైపోయింది. రిలీజ్ టైంలోనే అర్జునుడు, కర్ణుడు పాత్రలు వాటి మధ్య సన్నివేశాల గురించి చర్చోపచర్చలు నడిచాయి. అర్జునుడు గొప్ప అని కొందరు లేదులేదు కర్ణుడే గొప్ప అని మరికొందరు వాదించుకున్నారు. అదంతా ముగిసిపోయి చాలా కాలామైపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు 'కల్కి' సినిమాపై విమర్శలు చేశారు.గరికపాటి ఏమన్నారు?తాజాగా వినాయక చవితి సందర్భంగా గరికపాటి ప్రవచనాలు చెప్పారు. మాటల సందర్భంగా 'కల్కి' గురించి ప్రస్తవన వచ్చేసరికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మహాభారతంలో ఉన్నది వేరు సినిమాలో చూపించింది వేరు అని చెప్పారు. అశ్వద్ధామ, కర్ణుడిని హీరోలుగా చూపించడమేంటో తనకు అస్సలు అర్థం కాలేదని కౌంటర్లు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)వీడియోలో ఏముంది?'కర్ణుడు ఎవరో తెలియకపోతే 'కల్కి' సినిమాలో చూపించినవాడే కర్ణుడు. మనేం చేస్తాం. సినిమావోళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు. అశ్వద్ధామ, కర్ణుడు అర్జెంట్గా హీరోలైపోయారు. భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లేదు. బుర్రపాడైపోతుంది. పైగా మహాభారతమంతా చదివితే అర్థమవుతుంది. కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు. అశ్వద్ధామని కర్ణుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు. ఆ అవసరం లేదు. అశ్వద్ధామ మహావీరుడు. ఇక్కడేమో 'ఆచార్య పుత్ర ఆలస్యమైంది' అని డైలాగ్ పెట్టారు. ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మనకి ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువిస్తే డైలాగ్ రాసేవాడు రాసేస్తాడు కదా' అని గరికపాటి అన్నారు.'కల్కి' మూవీ గురించిజూన్ 27న థియేటర్లలో రిలీజైన 'కల్కి'.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనికి కొనసాగింపుగా తీస్తున్న రెండో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి 'కర్ణ 3102 బీసీ' అనే టైటిల్ కూడా నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. (ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)తనకు నచ్చని రాజకీయ పార్టీలపై, సినిమా హీరోలపై విమర్శలు చేసే గరికిపాటి నరసింహారావు.. తాజాగా కల్కిపై విమర్శలు pic.twitter.com/vThPZ5s4Nn— greatandhra (@greatandhranews) September 23, 2024 -
చాగంటి తో విభేదాల పై గరికపాటి మాటల్లో
-
యువతరానికి నా మెసేజ్ ఇదే..!
-
నేను అలా అన్నందుకు నామీద తిరగబడ్డారు : గరికపాటి నరసింహారావు
-
పద్మశ్రీ అవార్డు అందుకున్న కానీ..!
-
తల్లిదండ్రులు గురించి గరికపాటి నరసింహారావు గారు
-
గరికిపాటి నరసింహారావు జీవిత చరిత్ర..!
-
‘నేను–నాది’ అనే భావన వీడాలి
కాకినాడ కల్చరల్: నేను–నాది అనే భావ దరిద్య్రాలను విడిచిపెట్టినప్పుడే వ్యక్తులతోపాటు దేశం బాగు పడుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రవచనకర్త డాక్టర్ గరికిపాటి నరసింహారావు అన్నారు. స్థానిక సూర్యకళామందిర్లో సరస్వతీగాన సభ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న నలదమయంతి చరిత్రపై గరికిపాటి ప్రవచనాలు ఆదివారంతో ముగిశాయి. నలదమయంతుల కథను ఆదర్శంగా తీసుకొని జీవిత పయనంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంతో నిలవాలని అన్నారు. నలుడు అడవిలో దమయంతిని విడిచి వెళ్లిన తర్వాత ఆమె పడిన కష్టాలను వివరించారు. సుందర రూపుడయిన నలుడు అడవిలో పాముకాటుకు గురై నల్లగా మారిపోవడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నలుడు, బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు వద్ద వంటవానిగా చేరిన ఘట్టాలను వివరించారు. కష్టాలలో కూడా తనకు ఉన్న అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలో నలుడి వ్యక్తిత్వం తెలుపుతోందని వివరించారు. చివరకు ఇంద్రుని దయంతో నలుడు పూర్వ రూపం పొంది తన రాజ్యాన్ని దక్కించుకొన్న ఘట్టాలను వివరించారు. ధైర్యంగా బతకాలి, సంతోషంగా మరణించాలని అన్నారు. అహంకారం, మమకారం రెండు ప్రమాదాలే అన్నారు. కష్టం వచ్చిందంటే వెనుక సుఖం వస్తోందని సూచన అని వివరించారు. జీవితంలో కష్టాలు పెరిగాయి అంటే అర్థం సుఖాలు రానున్నాయని భావించాలి తప్ప జీవితం ముగిసిపోయిందని అధైర్య పడరాదన్నారు. అలాగే ఎండలు మండిపోతున్నాయంటే వర్షాలు బాగా పడతాయని సూచన అని మండుతున్న ఎండలపై చమత్కరించారు. అనంతరం సరస్వతీ గాన సభ సభ్యులు నరసింహరావును ఘనంగా సత్కరించారు. గాన సభ అధ్యక్షుడు కేవీఎస్ ఆంజనేయమూర్తి, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఎల్.సత్యనారాయణ్, నారాయణ్ మురళి, మునుగంటి వెంకట్రావు, శ్రీరామచందరమూర్తి, ఎస్కేవీడీ వెంకట్రావు, పెద్దాడ సూర్యకుమారి, చావలి సూర్యకుమారి పాల్గొన్నారు. -
ఎన్టీఆర్, రామ్చరణ్లపై గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్, రామ్చరణ్ మల్టీస్టారర్లుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఆర్ఆర్ఆర్ జోరు తగ్గలేదు. ఇటీవలె ఈ సినిమాలోని ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో జక్కన్న, జూనియర్, రామ్ చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇక ఈనెల 13న 95వ అకాడమీ (Oscars 2023)అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలోనాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని తెలుగువారితో పాటు భారతీయులంతా కోరుకుంటున్నారు. తాజాగా నాటు నాటు పాట, ఎన్టీఆర్, రామ్చరణ్లపై గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నాటునాటు పాట గురించి ప్రస్తావిస్తూ.. ''అచ్చ తెలుగులో రాసిన ఈ పాట ఆస్కార్కు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుత నటన,కీరవాణి సంగీతం, రాజమౌళి దర్శకత్వం, చంద్రబోస్ అద్భుత రచన కారణంగా ఇవాళ ప్రపంచ స్థాయి బహుమతి రాబోతోంది. గుడికి వెళ్తే ఆస్కార్ పురస్కారం రావాలని దండం పెట్టండి.ఇక నాటునాటులో ఎన్టీఆర్, రామ్చరణ్ల నటన అద్భుతం. నాటు నాటు పాటలో ఈయన బెల్ట్ తీస్తే ఆయనా తీశాడు, ఈయన కుడికాలు తిప్పితే ఆయనా కుడికాలే తిప్పాడు. కవలలై పుట్టినవారికి కూడా ఇది సాధ్యం కాదు. రెండు వేర్వేరు కుటుంబాల్లో పుట్టిన మహానటులు ఇద్దరూ అటువంటి నటన చేశారంటే నా కంటే చిన్నవాళ్లైనా ఇద్దరికీ నమస్కారం చేస్తున్నాను'' అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. -
గరికపాటిపై చిరంజీవి సెటైర్.. పంచ్ మామూలుగా లేదుగా!
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! ఆ కార్యక్రమంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు మహిళలు ఆసక్తి చూపగా అక్కడే ఉన్న గరికపాటి నరసింహరావు.. వెంటనే ఫొటో సెషన్ ఆపేసి చిరంజీవి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత ఆ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అంతా చూశారు. గరికపాటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇప్పటివరకు దీనిపై పెద్దగా రియాక్ట్ కాని చిరంజీవి తాజాగా గరికపాటిపై పరోక్షంగా సెటైర్ వేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలోనూ చిరంజీవితో ఫొటోలు దిగేందుకు కొందరు మహిళలు వేదిక మీదకు రాగా.. వెంటనే చిరు.. ''ఇక్కడ వారు లేరు కదా?'' అంటూ సెటైరికల్గా ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. 'వారు ఇక్కడ లేరు' అంటూ పక్కనవాళ్లు సమాధానమివ్వగా హమ్మయ్యా.. అంటూ గుండెల మీద చేయి పెట్టుకుని రిలాక్స్ అయినట్టు చిరంజీవి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దీంతో చిరు సైలెంట్గానే బలే సెటైర్ వేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. -
గరికపాటి వివాదంపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎంతటి దుమారానికి తెరదీసిందో తెలిసిందే! చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. తాజాగా ఈ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించాడు. 'అక్కడ ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలీదు. గరికపాటిగారు ఏదో మాట్లాడారు.. చిరంజీవి ఫ్యాన్స్.. అదీ ఇదీ అని! పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవిగారు ఒక లెజెండ్. ఆయనతో ఫొటో తీసుకోవడమనేది అభిమానులకు సువర్ణావకాశం. ఆయన దగ్గరకు ఎవరైనా సరే పరుగెత్తుకు వెళ్లి ఫొటో తీసుకుంటారు. ఆ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ అలాంటి పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎక్సైట్మెంట్లో ఉంటారు' అన్నాడు మంచు విష్ణు. చదవండి: బిగ్బాస్ ఎలిమినేషన్, ఆ కంటెస్టెంట్ గుడ్బై కాంతార రెండుసార్లు చూశా: ప్రభాస్ -
ఢీ కొట్టాల్సిన పని లేదు, నేనెందుకు ఉలిక్కిపడాలి: చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని గరికపాటి మెగాస్టార్ను బెదిరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా చిరంజీవి మరోసారి ఈ వివాదంపై స్పందించాడు. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయన్నాడు. 'నేను వెనక్కు తగ్గలేదు, సంయమనం పాటిస్తున్నాను. సంయమనం పాటిస్తే నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. నేను తప్పు చేయను, తప్పు చేస్తే అందరిముందే పొరపాటు అయిందని ఒప్పుకుంటా. ఒకవేళ నీ తప్పు లేకుండా ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదు, నిజం నిలకడగా తెలుస్తుందని నేను నమ్ముతాను. అసలు అక్కడ నా తప్పు లేనప్పుడు నేనెందుకు ఉలిక్కిపడాలి? నన్ను ఎద్దేవా చేసినవారు దగ్గరకు వచ్చినా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటా, ఇదే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: కాంతార సెన్సేషన్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లను దాటేసిందిగా -
గరికపాటి ఎపిసోడ్పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
-
గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి
అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! 'చిరు ఫొటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా'నని గరికపాటి చిరును బెదిరించడం సరి కాదంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ వివాదంపై చిరంజీవి స్పందించాడు. గరికపాటి పెద్దాయన అని, ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది. గాడ్ ఫాదర్ సక్సెస్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. మొన్న వచ్చిన ఆచార్య ఫ్లాప్ అయింది. అందుకని నేను బాధతో కుంగిపోలేదు. బయ్యర్లను కాపాడాలని నేను, రామ్చరణ్ మా పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. గాడ్ఫాదర్ సినిమా విషయానికి వస్తే.. లూసిఫర్ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని సుకుమార్.. చరణ్కు చెప్పాడట. ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు. ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పాడు. తని వరువన్ను అద్భుతంగా తీసిన ఆయన లూసిఫర్ రీమేక్కు న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. నిజానికి రీమేక్ సినిమాలు చేయడం ఒక సవాల్. కానీ ప్రేక్షకుల ఆదరణ వల్ల ఘరానా మొగుడు, ఠాగూర్.. ఇప్పుడు గాడ్ ఫాదర్ గొప్ప విజయాలు అందుకున్నాయి. సల్మాన్ ఖాన్.. గాడ్ ఫాదర్ చేసినట్లే నాకూ వేరే ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తే తప్పకుండా చేస్తాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. ఇకపోతే నేను చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటని అనుకుంటాను. ఇక్కడ తగ్గటం అంటే సంయమనం పాటించడం. నిజం నిలకడగా తెలుస్తుందనే మాటను నమ్మినవాడిని నేను. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పు తెలుసుకుని నా దగ్గరకు వస్తే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. చదవండి: సినిమా ఛాన్స్ అని నడుము చూపించమన్నాడు: నటి నయన్ సరోగసీపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం -
అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన పెద్ద దుమారమే రేపింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. దీంతో గరికపాటి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు స్పందించాడు. గరికపాటి తీరుని తప్పుబడుతూ వరుస ట్వీట్స్ చేశాడు. అందులో ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్లో షేర్ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్ ఇచ్చాడు. (చదవండి: రిలీజ్కు ముందే ఖరీదైన బహుమతి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? డైరెక్టర్ ట్వీట్ వైరల్) ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. ‘హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని అనుకునేవాడిని. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. అలా నిలబడి ఉంది.. ఒక మంచి పోజ్. మనం కవి కదా.. ఊరికే ఎలా ఉండగలం.. చూశా పై నుంచి కిందకు. ఒక రోజు పేపర్ చదువుతుంటే ముందు రాజకీయాలు చూస్తున్నా.. డిగ్రీ చదివే మా అబ్బాయి .. నా కాళ్ల దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను.. స్నానం చేసొచ్చి నా కాళ్లకు దండం పెడుతున్నాడు అని, కానీ వాడు అక్కడ కూర్చొని పేపర్లోని అనుష్క ఫోటోని చూస్తున్నాడు. వాడి ధోరణిలో వాడున్నాడు.. నా ధోరణిలో నేనున్నాను. దానికేముంది ఎవడికి కావాల్సింది వాడు చూసుకుంటున్నాడు. ఏంట్రా అని అడిగితే టక్కుమని లేచి వెళ్లిపోయాడు. ఏంటా అని నేను చూశాను.. ఆ ఫోటో చూసేసరికి వాడు ఈ అమ్మాయిని చూడడంలో తప్పేమి లేదనిపించింది. నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ’అని గరికపాటి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. OHO !!! MEEKU KOODAANAAA BAHU(GARIKA)BALI(PATI) GAARU ! 😜 pic.twitter.com/00rLB4oVj7 — Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2022 -
చిరంజీవిపై గరికపాటి ఫైర్.. వారు చెప్పే శాంతి వచనాలకు విలువెక్కడిది?
రాజకీయ నాయకులు, ఆద్యాత్మిక వేత్తలు, భక్తి విషయాలకు రాజకీయ అంశాలకు ముడిపెట్టి మాట్లాడడం పద్దతేనా? ఇలాంటివాటివల్ల ప్రజలకు ఏమైనా మంచి సందేశం వెళుతుందా? ఆలయానికి వెళ్లి ప్రార్ధన చేసి, ఏవో కోర్కెలు కోరుకుని వెళ్లిపోవడం రివాజు. కాని రాజకీయ నేతలు దేశం కోసమే ప్రార్ధించామని చెబుతుంటారు. నిజంగా వారు అచ్చం ప్రజల కోసమే పూజలు చేసి ఉంటే మెచ్చుకోవలసిందే. కానీ ఎక్కువ మంది తమ అదికారం కోసమో, మరే రాజకీయ ప్రయోజనం కోసమో చేస్తుంటారు. అదేమి రహస్యం కాదు. అది తప్పుకూడా కాదు. కానీ బయటకు వచ్చి చెప్పే కబుర్లే ఒక్కోసారి అనవసర వివాదాలకు తావిస్తుంటాయి. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దసరా నాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించుకుని పూజలాచరించిన తర్వాత అమరావతి రాజధాని విషయమై మాట్లాడిన సంగతులలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగులుతాయన్న భావన కలుగుతుంది. అలాగే ప్రముఖ ఆద్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్య ఒకటి ఆయనలోని పరిజ్ఞానాన్ని ప్రశ్నించేలా ఉంది. ముందుగా చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని అన్నారు. ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి రాజధానిగా నిర్ణయించాం. ప్రస్తుతం రాజధాని అమరావతిపై రోజుకోమాట మార్చడం మంచిదికాదు.. అలాంటి వాళ్లను దుర్గమ్మ కూడా క్షమించదు .. అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి తన వైఖరిపై రాజకీయంగా ఏమి మాట్లాడినా చంద్రబాబును ఆక్షేపించనవసరం లేదు. కాని దుర్గమ్మ తల్లికి లింక్ పెట్టి మాట్లాడడమే అభ్యంతరకరం. మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదని అంటే, అందువల్లే ఆయన 2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలయ్యారా? రాజధాని 29 గ్రామాల పరిధిలోనే ఉండాలని, రాష్ట్ర ప్రజలందరి సొత్తు తీసుకువచ్చి ఆ గ్రామాలలోనే పెట్టాలని దుర్గమ్మ ఏమైనా చెప్పారా? (చదవండి: గరికపాటిపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు, నువ్వేంటో..!) చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ బదులు ఇస్తూ, దుర్గమ్మ అన్ని ప్రాంతాల ప్రజల మేలు కాంక్షిస్తారని అన్నారు. చంద్రబాబును 23 సీట్లకే పరిమితం చేసి జగన్ కు 151 సీట్లను దుర్గమ్మ ఇచ్చినట్లే కదా? అసలు మాట తప్పడం అంటే ఏమిటి? లక్షకోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం మాట తప్పినట్లు అవుతుందా? లేదా? కాపులను బిసిలలో చేర్చుతామని చెప్పి చేయలేకపోవడం మాట తప్పడం అవుతుందా? 400 ఎన్నికల హామీలను ఇచ్చి అమలు చేయకపోవడాన్ని ఏమంటారు. రాజకీయ నేతలు ఇలాంటి విషయాలలో సెంటిమెంట్ జోడించి ప్రసంగాలు చేస్తే అవి వారికే తగులుతాయన్న సంగతి అర్ధం చేసుకోవాలి. ఇక గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యను గమనిద్దాం. ఏడు కొండలని రెండు కొండలు చేస్తే ఏమైందో చూశాం కదా అని అన్నారు. ఇది ఫక్తు రాజకీయ విమర్శ. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాజకీయంగా కుట్ర చేయడానికి అప్పట్లో కొందరు ఈ దుష్ప్రచారం చేశారు. నిజానికి స్థానిక ఎన్నికల వల్ల పవిత్రత దెబ్బతినకూడదని ఆనాటి ప్రభుత్వం కొంత విస్తీర్ణం పేర్కొంది. పైగా అది కూడా గత ప్రభుత్వాల టైమ్ నుంచి ఉన్నదే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మీడియా వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కు చెందిన కొందరు దీనిని వివాదం చేసి వైఎస్ కు పులమడానికి యత్నం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించడమే కాకుండా, తిరుమల అంటే ఏడు కొండలేనని వైఎస్ జిఓలు కూడా ఇచ్చారు. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా గరికపాటి అభ్యంతరకరంగా మాట్లాడారు. కేవలం ఏదో వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని మాట్లాడారేమో అనిపిస్తుంది. పైగా అలయ్ బలయ్ వంటి ప్రోగ్రాంలో ఈ ప్రస్తావనే అవసరం లేదు. పోనీ ఏదైనా శాపం వల్లే నేతలు చనిపోతారన్నది నిజమే అని పురాణ ప్రవచనకర్త గరికపాటి భావిస్తుంటే ఆయన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. మహాత్మా గాంధీని గాడ్సె దారుణంగా కాల్చి హత్యచేశాడు. దేశ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలో మరణించిన తీరు మిస్టరీ. మరో ప్రధాని ఇందిరాగాంధీ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పులలోనే చనిపోయారు. ఇంకో ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీలంక తీవ్రవాదులు బాంబులు పేల్చి హత్యచేశారు. ఇందిరాగాందీ రెండో కుమారుడు సంజయ్ గాందీ హెలికాఫ్టర్ కూలి మరణించారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రోజుల్లోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా గల్లంతైపోయింది. టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, హరికృష్ణ, లాల్ జాన్ భాష లు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పదవీచ్యుతుడై కుటుంబం నుంచే ఘోర పరాభవంతో కుమిలి, కుమిలి మరణించారు. మాజీ ప్రధాని, గొప్ప నేత అయిన అటల్ బిహారీ వాజ్ పేయి తన చివరి సంవత్సరాలలో జ్ఞాపక శక్తి కోల్పోయి చాలాకాలం మంచానికే పరిమితం అయ్యారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉదాహరణలు ఉంటాయి. వీళ్లంతా గొప్పవారు. కాని వారి జీవితాలు ఇలా ముగియడం దురదృష్టకరం. కాని అంత మాత్రాన ఏదో శాపం అనో, పాపం అనో ఆద్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి? అందువల్ల గరికపాటి వంటివారు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. మరో సంగతి. ఆద్యాత్మికవేత్తలకు మరీ కోపం ఎక్కువ ఉండకూడదు. కాని అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి గరికపాటి అంత కటువుగా వ్యవహరించి ఉండవలసింది కాదు. ప్రశాంతంగా ఉండవలసిన ఆద్యాత్మికవేత్తలు తోటి ప్రముఖుడిపైనే ఫైర్ అయితే, వారు చెప్పే ప్రవచనాలకు, శాంతి వచనాలకు ఏమి విలువ ఉంటుంది? వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
గరికపాటిపై ఆర్జీవీ ఆగ్రహం.. వదిలే ప్రసక్తే లేదంటూ..!
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వివాదాస్పద కామెంట్లు చేసే దర్శకుడు రామ్గోపాల్ వర్మ తాజాగా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఆ ట్వీట్లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైందంటే! ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’ అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు వివాదానానికి దారి తీశాయి. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా.. ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించిన సంగతి తెలిసిందే. సర్ @NagaBabuOffl గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీ ని ఎందుకు ఇచ్చారు సర్ .. సర్ సర్ సర్ @KChiruTweets ???? — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 సర్ @NagaBabuOffi గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి , దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కాని అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు 🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా @KChiruTweets నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి 😡😡😡😌😌😌 — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ @KChiruTweets ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో — Ram Gopal Varma (@RGVzoomin) October 10, 2022 -
గన్ షాట్ : అలయ్ బలయ్ లో చిరు ఇమేజ్ ని చూసి అసూయపడ్డారా ..?
-
చిరంజీవి ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన గరికపాటి
-
ఆగని గరికపాటి వ్యాఖ్యల దుమారం..‘ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్లో బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’అని అసహనం వ్యక్తం చేశారనే అంశం వివాదానానికి దారి తీసింది. అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా... ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించారు. నాగబాబు ట్వీట్పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ‘నిత్యం తన ప్రవచనాలతో సమాజాన్ని ఎంతో సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆధ్యాత్మిక వేత్తను.. నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే’ అని ఘాటుగా స్పందించారు. చదవండి: 'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు' ఆగని ట్రోల్స్ మరోవైపు చిరంజీవి అభిమానులు, నటులు గరికపాటిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ గరికపాటికి ఫోన్ చేసి డిమాండ్ చేశారు. చిరంజీవి గురించి అలా అనాల్సింది కాదంటూ గరికపాటిపై సినీనటుడు ఉత్తేజ్ మండిపడ్డారు. ఇలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపరం కొనసాగింది. చివరకు నాగబాబు మళ్లీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ‘గరికపాటి వారు ఏదో మూడ్లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప, ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయ నని అర్థం చేసుకోవాలే గానీ, ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్’అని పేర్కొన్నారు. -
'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు'
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చేసిన వ్యాఖ్యల పట్ల మెగాబ్రదర్ నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు నాగబాబు. ట్విటర్లో ఆయన రాస్తూ.. 'గరికపాటి వారు ఏదో మూడ్లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 7, 2022 ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
గరికపాటి వ్యాఖ్యలపై స్పందించిన నాగబాబు.. ఏమన్నారంటే?
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో జరిగిన సంఘటనపై ఆయన ఈ విధంగా కౌంటరిచ్చినట్లు తెలుస్తోంది. (చదవండి: గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి) అసలేం జరిగిందంటే: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
చిరంజీవిపై ఫైర్ అయిన గరికపాటి
-
గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్ బలయ్కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటో సెషన్ నిర్వహించారు. అదే సమయంలో అవధాని గరికపాటి నరసింహరావు ప్రసంగం ప్రారంభించారు. చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ‘ అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. లేదంటే నేను వెళ్లిపోతాను. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి.. ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి’ అంటూ వెళ్లిపోతా’ అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు.ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు. చదవండి: ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి -
ఎట్టకేలకు గరికపాటి క్షమాపణ
భీమవరం(ప్రకాశం చౌక్): తన వ్యాఖ్యలతో స్వర్ణకారులు బాధపడుతున్న నేపథ్యంలో వారికి క్షమాపణలు చెబుతున్నానని ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రవచనాలు చేయడానికి విచ్చేసిన ఆయన స్థానిక హోటల్లో బస చేశారు. తమను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ భీమవరానికి చెందిన విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చి క్షమాపణ చెప్పాలని ఆందోళనకు దిగారు. దీంతో స్వర్ణకారుల సంఘం నుంచి పలువురు నాయకులు అలాగే కొందరు పెద్దల సమక్షంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2006 సంవత్సరంలో ఓ చానల్లో హాస్యం అనే కార్యక్రమంలో స్వర్ణకారుల గురించి తాను వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈ సందర్భంగా బయటకు వచ్చి బహిరంగంగా కూడా స్వర్ణకారులకు ఆయన క్షమాపణ చెప్పారు. -
‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా..
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 17న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకుపోయిన పుష్ప రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్లో రూ. 300 కోట్ల క్లబ్లోకి చేరిన తొలి చిత్రంగా పుష్ప నిలిచింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకుపోతున్న ఈ మూవీపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ట్రోల్స్పై ప్రియమణి స్పందన, వారికి మాత్రమే సమాధానంగా ఉంటాను.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గరికపాటి దంపతులు ఇటీవల ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. సినిమాలు సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా ప్రస్తుతం సినిమాలు ఉండటం లేదని.. ఇటీవల వచ్చిన పుష్ప సినిమానే ఉదాహరణ అన్నారు. హీరోని స్మగ్లర్గా చూపించడం ఏంటని, పైగా స్మగ్లింగ్ చేస్తూ తగ్గేదే లే అనే డైలాగ్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘సినిమా మొత్తం స్మగ్లింగ్ చూపించి.. చివరి అయిదు నిమిషాలు మంచి చూపిస్తాం. తదుపరి భాగం వరకు వేచి చూడండి’ అని చెప్పారు. అంటే రెండో పార్ట్ వచ్చేలోపు సమాజం చెడిపోదా? అని మండిపడ్డారు. చదవండి: వరుణ్ తేజ్తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. ఇది ఎక్కడి న్యాయం, నేరం చేసే వ్యక్తి తగ్గేదే లే అంటాడా? ఇప్పుడు ఇదొక సూక్తి అయిపోయింది. అసలు దీనితో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓ కుర్రాడు ఎవరినైనా గూబమీద కొట్టి తగ్గేదే లే అంటున్నాడని.. దీనికి కారణం ఎవరని అడిగారు. ఈ డైలాగ్ తనకు కోపం తెప్పిస్తోందని అన్నారు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమా హీరోని కానీ, డైరెక్టర్ని కానీ తనకు సమాధానం చెప్పమనండని, వారిద్దరినీ అక్కడే కడిగిపారేస్తానంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తగ్గేదే లే' అనే డైలాగ్ను శ్రీరాముడు, హరిశ్చంద్రుడు వంటివారు వాడాలని... అంతేకానీ, ఒక స్మగ్లర్ ఎలా వాడతాడని గరికపాటి విరుచుకుపడ్డారు. మరి ఆయన వ్యాఖ్యలపై 'పుష్ప' టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
అది ఒక మహాఫల ప్రదానం
తీయని ఫలాల్ని దర్శిస్తాం, చవిచూస్తాం. కానీ ఫలాలుగా మారడానికి ముందు చెట్ల కళ్లు కాయలుగా కాస్తాయి. అంతకు ముందు పిందెల అందాలు చూస్తాం. నేల బిలాలు, జలాలు రసపుష్టి కలిగించ డంలో ఎంతో కృషి ఉంది. ఎంతో భూమిక ఉంది. ఇంతకు ముందే గౌరవ సమ్మాన ఫలాల్ని దర్శించి, రుచి చూసిన గరికిపాటి నరసింహారావును ఇప్పుడు భారత ప్రభుత్వం వారి ‘పద్మశ్రీ’ వరించడం ఆయన నిరంతర సాహిత్య కృషికి ఒక మహాఫల ప్రదానం. గరికిపాటిలో– నిరంతర విద్యార్థి, బోధకుడు, పరిశోధకుడు, మహాసహస్రావధాని, అసాధారణ ధారణా ధురీణుడు ఉన్నారు. ‘భాష్పగుచ్ఛం, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం’ వంటి కావ్యాల కర్త. కవితా ప్రయోగ శీలి, ఆధ్యాత్మిక ప్రసంగ ప్రవచనకర్త. ఇందరు బహుముఖ ప్రతిభా రూపాలుగా ఉండటం చాలా తక్కువమందిలో ఉంటుంది. ఆయన ప్రాచీన ఛందో రూపాలైన పద్యాలను ఆధునిక అంశాలతో చెప్పినా, ఉపన్యాసాలలో రొడ్డ కొట్టుడు మూఢ భావాలను చెండాడుతూ సంస్కార భావాలు వెదజల్లినా అందుకు గణనీయ నేపథ్యాలున్నాయి. ఇవి వీరేశలింగం నడయాడిన రాజమహేంద్ర వరంలో ఏర్పడ్డాయి. ఆయన రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పరిశోధన చేశారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ‘మౌఖిక సాహిత్యం’పై పరిశోధన చేసి రెండు స్వర్ణ పతకాలు పొందారు. ఆ పరిశోధన గ్రంథానికి ‘మౌఖిక సాహిత్యంపై మౌలిక పరిశోధన’ శీర్షికతో అపూర్వ పరిశోధనాంశాలతో ఒక పీఠిక సంతరించారు తిరుమల రావు. నరసింహారావు ఈ గ్రంథం తెలుగులో ఈ విష యమై మొదటి గ్రంథం అని ప్రామాణికతతో చెప్పా రంటే పరిశోధనా పాటవం తెలుస్తుంది. తిరు మల రావుగారితో చర్చలు, ఆయన ఆధునిక శాస్త్రీయ భావాలు గరికిపాటిపై ప్రభావాన్ని చూపాయి. నరసింహారావు రాసిన భౌతిక మానసిక పర్యా వరణ మహాకావ్యం ‘సాగరఘోష’. ఈ కావ్యానికి ‘తరంగం అంతరంగం’ శీర్షికతో బేతవోలు రామబ్రహ్మం పీఠిక రాశారు. అందులో రాజశేఖరుని ఉటం కిస్తూన్న సందర్భంలో ‘అవధానాలతో ఆగిపోకుండా, అవే మహాకావ్యాలని ఆత్మవంచన చేసుకోకుండా గరికి పాటి ఈ కావ్యరచన చేశారు’ అని మెచ్చుకున్నారు. గరికిపాటి పద్య రచనా శక్తికి ‘సాగరఘోష’ ప్రతి బింబం. ‘ఇది విశ్వకార్యం. భూమి చరిత్రే ఈ కావ్య ఇతివృత్తం’ అన్నారు. ఒక తరంగ బాలిక ఒక కవి వద్ద సేద తీరుతుంది. కవి కవిత్వంతో లాలిస్తాడు. ఆ కెరటం మేలుకుని అది తిరిగి వచ్చిన సముద్ర తీరాల విశేషాలను చెబుతుంది. మానవుని జీవిత కథ అంతా స్థూలంగా చెబుతుంది. అదే ‘సాగర ఘోష’.గరికిపాటి కవితాశక్తి, భావుకత, సరళ పద్య నిర్మాణ పటుత్వం, ప్రాపంచిక జ్ఞానాంశాలూ ఈ కావ్యంలో ప్రస్ఫుటమవుతాయి.‘సాగర ఘోష’ పర్యావరణ కావ్యం. ఓ పద్యంలో ఓల్గా, టైగ్రిస్, థేమ్స్ మొదలైన నదులు... తమ తీరాలపై పెరిగే కాలుష్యాలను తొలగించేవారే లేరా అని బాధపడుతాయట. ప్రవాహాలకే తమ మౌన వ్యధలు వినిపిస్తాయంటారాయన. ఓ చిన్న పద్యంలో మనం సముద్రం ‘ఉప్పు’ తిని దానికే ముప్పు చేరుస్తామంటారు. వన్యప్రాణి రక్షణ చేయాలని చెబుతూ లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, కృష్ణ జింకలు వంటి అరుదైన జంతువులు మన మింగుళ్లకు బలి అయిపోతున్నాయని ఆవేదన చెందుతారు.అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర పెట్టే నేర్పు ఉన్న నేత పనులవారి చేతులు తెగకోసిన ఆంగ్లేయుల్ని గరికిపాటి అధములైన ఆంగ్ల వీరులు అని ఎద్దేవా చేస్తారు. మార్పుకోసం, మంచి కోసం, మనిషి కోసం ‘సాగర ఘోష’ రాశానన్నారు గరికిపాటి. ఈ మానవ మార్గం విస్తరిస్తూనే ఉండాలి. గరికిపాటిలోని గుప్త జానపదుడు రచనల ద్వారా దర్శనమిస్తూనే ఉండాలి. - సన్నిధానం నరసింహశర్మ వ్యాసకర్త మాజీ గ్రంథాలయ పాలకులు, శ్రీగౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి మొబైల్ : 92920 55531 -
ప్రకృతే ప్రత్యేక గురువు
రేగిడి విజయనగరం : జగత్ అంటే ప్రకృతి అని ప్రకృతినే ప్రత్యేక గురువుగా భావించి ఉన్నత ఆశయంతో జీవిం చాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు అభిభాషించారు. రేగిడి దత్తపీఠంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక దివ్యసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. గురువులు వేరేగా ఉండరని, ఎవరికి వారే గురువుగా భావించుకోవాలన్నారు. దేశానికి, సమాజానికి నష్టం కలి గించే అలవాట్లకు నేటి యువత దూరంగా ఉం డాలని సూచించారు. జీవితం నిరంతర ప్రవా హంలాంటిదని, కష్టసుఖాలను సమానంగా తీసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవ్వాలని పోటీపడకుండా సత్యం, ధర్మం, నిజాయితీని నేర్పాలన్నారు. పిల్లలపై అతిప్రేమ పనికిరాదన్నారు. మాయమాటల్లో మంచి ఆకర్షణ శక్తి ఉంటుందని, అటువంటి మా టలను గుర్తించి అజ్ఞానంలో దిగకుండా చూడాలన్నారు. ప్రపంచంలో హిందూ సంప్రదాయం గొప్పదన్నారు. మారుమూల ప్రాంతమైన రేగిడి ఆమదాలవలసలో ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉండడం భక్తులు చేసుకున్న పుణ్యమన్నారు. నరసింహరావుకు ఘన సన్మానం.... గరికిపాటికి దత్తపీఠంలో అరుదైన గౌరవం దక్కింది. దత్తపీఠం వ్యవస్థాపకులు కిమిడి సత్యనారాయణనాయుడు, వైస్ ఎంపీపీ కిమిడి రామకృష్ణంనాయుడులు గరికిపాటికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సత్యనారాయణనాయుడు మాట్లాడుతూ మొదట్లో చిన్న దత్తపీఠాన్ని నిర్మాణం చేశామని, కాలక్రమేణా విస్తరించామన్నారు. ఈ కేంద్రం ఆధ్యాత్మిక పాఠశాలగా విస్తరిస్తుందన్నారు. ఆధ్యాత్మిక వక్త రుంకు శ్రీనివాసరావు మాస్టారు, కందుల ఆదినారాయణ, బెవర వెంకటలక్ష్మీరాంబాబు, వై.హేమసుందరరావు, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు, పలు ఆధ్యాత్మిక పీఠాలకు సంబంధించిన గురువులు పాల్గొన్నారు. -
అలాంతర్గామి గరికిపాటి కలం కడలి హోరు
మన కాలపు మహాబలిపురం రాతి ఏనుగు గరికిపాటి నరసింహారావు గారు. సాహిత్య లలిత కళా పల్లవునిగా వారి ఆభివ్యక్తి శిల్పారామం వాగ్మానస గోచరంగా ఉంటూనే, ఒక అలౌకికావరణంలోనికి మనలను తీసుకువెళ్తుంది. పద్య దారగా పటిష్టమై కుప్పించి ఎగసిన భావ తరంగాల హేష వినిపిస్తుంది వారి కండువా అంచుల కడలి కెరటాలుగా, ఒకప్పుడు కృష్ణుడి పేరిట నారాయణ తీర్థుల తరంగాలు నేటి కమనీయమైన తెలుగు పలుకుబళ్ళు. సాగర ఘోషగా గరికిపాటి చేసిన లోకదర్శనం ఈ వెయ్యిన్నూట పదార్ల పద్యాల్లో భిన్న వృత్తాల్లో ఉన్నది. మూలం తెలుగులో వెలుగు చూసి అష్టాదశ వర్షాలు కాగా, నేటికి ఈ రచన, ఇంతకు ముందరే కొన్ని ఆంగ్ల అనువాద రచనలు చేసిన మహతి గారి ఇంగ్లిష్ అనువాదంలో విశాల ప్రపంచానికి పరిచయం అవుతున్నది. ప్రథమాంతరంగం, ద్వితీయ అంటూ పది అంతరంగాలుగా విభజించి, అటు తరంగాలు, ఇటు అంతరంగం ధ్వనించేలా, తెలుగులో ఉన్న తరంగ విభాగాన్ని, ఆంగ్లంలో అధ్యాయాలుగా మార్చారు. ఉప విషయ శీర్షికలు మూలంలో ఉన్నవి తొలగించారు. అంకితం కూడా తీసేశారు. విపులంగా పాద సూచికలు ఇచ్చిన మాటలు చూస్తే, వందల ఏళ్ల కిందటి పాత నార్స్ కాలపు మాటలు అయిన ్ఛట్ఛ, వంటి ( before అనేది ఆధునిక వాడుక) మాటలు వాడారు. బడబాగ్నిని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ అని వాడాలి సులభంగా అర్ధం చేసుకోవడం మన లక్ష్యం అయితే. గుయోట్ అన్న మాట క్రీ.శ. 1870ల ముందు లేదు. పైగా ఇదొక మనిషి పేరు. ఇది మన సంస్కృతిలో ప్రాచీనమైన బడబాగ్నిని సూచించదు. అయితే కాల మహాప్రవాహాన్ని తరంగాలుగా దర్శిస్తూ, అనేక ప్రాచ్య, పాశ్చాత్య విషయాలు, ఘట్టాలు, చరిత్ర, మహాకవులు, చక్రవర్తులు ఇతివృ త్తాలుగా, గరికిపాటి వారు చేసిన ఆసక్తికరమైన, కవితాత్మకమైన సృజన, తెలుగులో ఒక బలమైన ముద్ర వేస్తుంది. ఇది ఆంగ్లంలో ఇంకా సాధన చేస్తే కానీ, ఇంకామూల విధేయత ఉంటేనే కానీ పట్టుబడదు. క్రీస్తు మీద పద్యాల్లో, ఆటవెలది చిన్న పద్యం కేవలం ఇరవై రెండు మాటలుండేది, అనువా దంలో నలభై మాటలు మించి పోవడం, ఎలా అను వాదం అనిపించుకుంటుంది? మూలంలో కవి అనని మాటలు, భావనలు అనువాదకులు చొప్పించకూ డదు. క్రీస్తుని వెస్టర్న్ క్లోన్ అనడం (పద్యం 52, పుట 30) అనువాదకుల జోడింపు. చారిత్రికంగా కూడా సరి కాదు, క్రీస్తు కూడా ఆసియా వాసే. పడమట ప్రచారంలో ఉన్నమతం కదా అని అన్నారేమో అను కున్నా, అది గరికిపాటి వారి మూల రచనలో లేదు. ఇలా అనువాదకులు, ప్రత్యామ్నాయ పంక్త్యంత్య ప్రాస (ABAB) వాడడం కోసం, తెలుగు పద్యం సొగసు, ఆంగ్లంలో ఇలా ఠ్ఛిటట్ఛ రాయడం కోసం బలవంతాన ఒదిగించారు. అనువాదంలో మాటలు అమితంగా పెంచారు. మూల విధేయత వారి దృష్టిలో లేదు. ఫ్రీ వెర్స్లో రాస్తే, ఒకింత వెసులు బాటు ఉండేది. చరిత్ర దర్శనంలో, విజ్ఞానం, విప్లవాలు, మాన వాళి విజయాలు, తాత్విక గవేషణ నమోదు చేసిన ఒక సహజ సుందర పద్య సౌధం గరికిపాటి వారి రచన. అన్నమయ్య మీద రాసిన రెండు పద్యాలలో కదన కుతూహల రాగం ప్రస్తావన చేస్తారు కవి. అను వాదకులు రెండు సంస్కృతుల మధ్య ఒక జీవ వారధి తప్ప మూల సంస్కృతిలోని విశేషాలను, లక్ష్య భాషా సమాజపు సంస్కృతిలోకి మార్చడం, ఇవాల్టి అనువాద ప్రక్రియ కాదు. కదనకుతూహల రాగం అంటూ మూలంలో కవి అన్నది ‘ఎలెగ్రో ఎలెగ్రో’ అంటూ పియానో మెట్ల రాగంగా మార్చడం, మనకి గల భిన్న విషయాల పరిజ్ఞానం చెప్తుంది కానీ, అన్నమయ్య ఆలపించిన కదన కుతూహల రాగం, భారతీయ సంగీతంలో ఎటువంటి స్థానం కలిగి ఉన్నదో తెలపదు. ఎన్నో మాటలకు పాద సూచికలు ఇచ్చిన అనువాదకులు, ఇటువంటి సంస్కృతీ విశేషాలకు సైతం, వాటిని రచనలో సాధ్యమైనంత వరకు యథాతధంగా, ఇటాలిక్స్లో వాడుక,వాటికి దిగువన తన వివరణ ఇవ్వాలి. అప్పుడే ఒక సంస్కృతీ పరిచయం జరుగుతుంది. ఈ పద్యంలో కూడా అనువాదకుల స్వేచ్చ పరిమితి దాటింది. ధూర్జటి గురించిన కవి రాసిన పద్యంలో చివరి రెండు పంక్తులు, అనువాదకులు (పుట 57 , పద్యం 96) అసలు పట్టించుకోలేదు. మనుషుల, ఊర్ల, ప్రాంతాల, సంస్కృతీ పరమైన నామవాచ కాలు, కావ్యాల పేర్లు, సంస్కృతీ సంకేతాలు లక్ష్య భాషా సమాజనికి అందచేయడం నేటి అనువాద పద్ధతి. ఈ అనువాదంలో దీన్ని పాటించలేదు. చివరగా పుస్తకం పేరు ‘సాగర ఘోష’. తరిచి చూస్తే, ఇది కాలాబాధితమైన లోకపు భిన్న మాన సిక దశల అలల పలకరింపుల కడలి సందడి. విషాద ప్రధానం కాదు. అప్పుడు ‘ఓషన్ బ్లూస్’ అన్న పేరు సరికాదు. ‘బ్లూస్’ అనేది విషాద సంకేతం ఆంగ్ల సంస్కృతిలో. మరి ఘోష అన్నారుగా కవి – అవును ‘ఓషనిక్ ట్యుముల్ట్’ లేదా ట్యుముల్టస్ ఓషన్’ అనే పేరు మూల శీర్షికకు దగ్గరగా వస్తుంది. వేల ఏళ్ల కిందటి వేద స్రోతస్వినికి, మూడు వేల ఏళ్ల నాగరిక కాల ప్రవాహానికి గళగళన్మన్గళ కళాకాహళిగా తెలుగు సంస్కృతి ఘనాపాటి గరికిపాటి. అనువాదంలో ఈ ‘సాగర ఘోష’ ఇంతకన్నా బలంగా, ఆధునికంగా, సరళ సుందరంగా, మూల విధేయంగా అందాలని ఆశిద్దాము.–రామతీర్థ, ప్రముఖ కవి, విమర్శకులు (మొబైల్ : 98492 00385) -
హైస్సా.. హైలెస్సా
పామరుడు తన శక్తికి మించిన కార్యం చేస్తున్నప్పుడు దేవుణ్ని ఇలాగే తలచుకుంటాడేమో! ఆ పామరుడికి తను దేవుణ్ణి తలచుకుంటున్నానన్న విషయం కూడా తెలియకపోవచ్చు. హైస్సా.. హైలెస్సా.. అనే ఈ ఐదు అక్షరాలే.. అతడి పంచాక్షరీ మంత్రమేమో! గరికపాటి ఈ సూక్ష్మాన్ని వివరిస్తూ.. ‘పనే దైవం.. శ్రమే దైవ పూజ’ అని వ్యాఖ్యానించారు. శాస్త్రాలు కనపడతాయి. దేవుడు కనపడడు కదా! శాస్త్రాలు దేవుడిని ఏ విధంగా చూపించాయి? వేదంలో దైవాన్ని ‘తత్’ అన్నారు. తత్ అంటే ‘అది’ అంటే వ్యాకరణంలో సర్వనామం. ఈ పదాన్ని వస్తువులకు, మనుషులకు అన్నింటికీ ఉపయోగిస్తాం. ‘అది’ ఒక శక్తి. దానికి తలో రకమైన భావన ఇచ్చుకున్నారు. చూసేవాళ్లు ఎంత మంది ఉంటే ‘అది’ అన్ని విధాలుగా కనపడు తుంది. వైదిక ధర్మంలో దైవానికి రూపకల్పన చేయలేదు. తర్వాత్తర్వాత ఓ రూపం తీసుకున్నారు. దైవాన్ని అంతర్ముఖంగా దర్శించాలే తప్ప బయటకు కనిపించేది కాదు. అంతర్ముఖులు అవడం అందరికీ సాధ్యమయ్యేదేనా? దైవాన్ని ఎలా దర్శించాలి? సాధన చేస్తే ఏదైనా సాధ్యమే! కరెంట్ వైర్లలో విద్యుచ్ఛక్తి ఉంటుంది. కానీ, బయటకు కనిపిం చదు. బల్బు ద్వారా మనకు కరెంట్ ఉన్నట్టు తెలుస్తుంటుంది. అలాగే దేవుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. మనకు కనిపించడు. మంత్రం, బీజాక్షరంతో ఆలయంలో ప్రతిష్టించారు కాబట్టి అక్కడ దైవశక్తి వ్యక్తం అవుతుంది. దేవుడికి రూపం ఇవ్వకపోతే అర్చన, ఆరాధనలకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఎవరి మనోభావాలను బట్టి వారు దైవాన్ని ప్రతిష్టించి, పూజించుకుంటున్నారు. ఈ తరహా ఆలోచనకు ముందు మీరు ఏ దైవాన్ని నమ్మేవారు? మా నాన్నగారు కనకదుర్గా ఉపాసకులు. ఆయన ఎప్పుడూ దైవం అనేవారు కాదు. ఏదైనా సమస్య వస్తే ‘అన్నీ అమ్మ చూసుకుంటుంది లేరా’ అనేవారు. మా కుటుంబసభ్యుల్లో అమ్మవారినీ ఒకరుగా భావించేవాళ్లం. అమ్మవారు శక్తి స్వరూపిణి. మనల్ని నడిపిస్తున్నది శక్తిగానే చెబుతాం. అందుకే ఆ శక్తిని అమ్మవారుగా భావించుకుంటాను. నా పద్యాల్లో ఎక్కువ భాగం అమ్మవారు, శివుడి మీదే ఉంటాయి. వెయ్యిమంది పండితులతో అవధానం చేశారు. మీకు అంతటి శక్తి ఎలా వచ్చింది? ఇది కూడా లోపల ఉండే శక్తే. ప్రతి వ్యక్తిలోనూ శక్తి ఉంటుంది. సాహిత్యపరంగా ఉన్న ఆసక్తితో గ్రంథాలు చదవడం, దానిని వినియోగించుకోవడం వల్ల నాకీ «శక్తి వచ్చింది. చిన్ననాటి నుంచే తెలుగంటే అమితాసక్తి. పై తరగతులకు వెళ్లడానికి ముందే వేసవి సెలవుల్లో తెలుగు ఉపవాచకాన్ని కంఠతా చేసేవాడిని. అలా డిగ్రీకి వచ్చేసరికి నాలుగైదు వందల పద్యాలు కంఠస్తం చేశాను. ఫలానావాళ్లు వృద్ధిలోకి వచ్చారంటే వారెంచుకున్న రంగంలో సాధన చేశారన్నది ముఖ్యం. దానికి సమాధానం చెప్పలేనివారు అదృష్టమనో, పూర్వజన్మ సుకృతమనో అంటారు. శాస్త్రాన్ని ఉన్నదున్నట్టు చెప్పాలి కదా! మీరు లౌక్యంగా చెబుతారంటారు నిజమేనా? ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఒకడు బల్లిశాస్త్రం అంటాడు, మరొకడు పుట్టుమచ్చల శాస్త్రం అంటాడు. ఇదంతా మిడిమిడి జ్ఞానం. మహానుభావులు తమ పబ్బం గడుపుకోవడానికి ఎన్నో శాస్త్రాలు పుట్టించారు. అవాస్తవాలను పెంచడం ఈ కాలంలో ఎక్కువైపోయింది. ఈ కాలానికి తగ్గట్టు వాస్తవాలను చెప్పగలగాలి. ఇలా మాట్లాడితే సంప్రదాయవాదులు వ్యతిరేకించరా? బోలెడుసార్లు సవాల్ చేశాను. వివేకానందుడు చెప్పినట్టు సత్యానికి సమాజం తలవంచాల్సిందే! కాదనేవాడిని రమ్మనమనండి. దేవుడు ఎందుకు సంకల్పిస్తాడు? ఎక్కడికో వెళ్లాలనుకుని ప్రయాణం పెట్టుకు న్నాను. కాలుజారి దెబ్బ తగిలి ప్రయాణం వాయిదా పడింది. మన ప్రయాణం వాయిదా వేయడానికి దేవుడికేం అవసరం? ఏ పూజ చేసినా ఆ స్థితి ఆ స్థితియే! నాకున్న ఆధ్మాతికానందం ఇప్పుడు ఎలా ఉందంటే.. భాగవతం చదవడానికి, బట్టలు మడతెట్టుకోవడానికి పెద్దగా తేడా తెలియడం లేదు. ఆ బట్ట కూడా నాకు భగవత్స్వరూపమే! ఆధ్యాత్మిక వేత్త ఆ స్థితికి చేరుకోవాలి. మరి ఈ పూజలన్నీ ఎందుకు? పూజల పేరుతో ఇంత ఖర్చు దేనికి? పూజలు మానకూడదు. పూజ చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. పూజల ఉద్దేశ్యం దృష్టిని దైవం మీద పెట్టడమే. అలాగే, ఈ పూజలన్నింటిలోనూ ఎక్కువగా దానాలుంటాయి. దానం వల్ల పాపం నశిస్తుంది. కానీ, చాలామంది పూజలు అనగానే అర్థాలు తెలియకపోయినా స్తోత్రాలు చదివేస్తూ ఉంటారు. పండితులు వాటికి అర్థాలు చెప్పరు. వీరు తెలుసుకోరు. వందసార్లు విష్ణుసహస్రనామం చదివినా వీళ్లు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అదే ఒక్కనామానికి అర్థం తెలుసుకుని ఆలోచిస్తే గొప్ప మార్పు వస్తుంది. గుణం తల్లిదండ్రులు ఇచ్చారంటారు. తెలివి దేవుడు ఇచ్చినదేనా? ఇది దైవ సంకల్పమా? దేవుడు నాకు మాత్రమే ధారణ ఇవ్వాలని ఎందుకనుకుంటాడు. నామీదే ఆయనకు ప్రత్యేకమైన ఇష్టం ఏంటి? దైవ సంకల్పం అని ఎందుకంటారు. అలా అనుకుంటే దేవుడు పక్షపాతి కాదా! అలాంటివాడు దేవుడు ఎలా అవుతాడు. అనేకానేక మాయ మాటల్లో ఇదొకటి. కృషి వల్ల వచ్చిందని చెప్పరు. ఇప్పుటిదాకా 11వేల పద్యాలు రాశాను. రోజూ అరగంట పాటు ఆ పద్యాలన్నీ మళ్లీ ఎన్ని వీలైతే అన్ని చదువుకుంటాను. దానికి చేయాల్సిన రాక్షస పరిశ్రమ చేయాలి. అందుకే నన్ను ధారణాబ్రహ్మరాక్షసుడు అన్నారు. దైవసంకల్పం అని ఈ ప్రచారం కూడా మాలాంటి వాళ్లే చేస్తారు. ఇది దైవశక్తి అంటే మాకు గౌరవాలు, పాదాభివందనాలు, దక్షిణలు పెరుగుతాయిగా! మీరు నమ్మే దైవం మీకు మంచి చేసిందని ఎప్పుడు నమ్మారు..? ఎప్పుడూ నమ్ముతాను. అయితే, నా ప్రయత్నం వల్ల కూడా జరగనిది దైవప్రేరణతో జరిగిన ఘటనలు మూడు నాలుగు ఉన్నాయి. సమస్య చేయి దాటినప్పుడు అమ్మవారి ఫొటో ముందుకు వెళ్లి బొమ్మా బొరుసు వేస్తాను. బొమ్మ పడితే ప్రయత్నం విడవను అని. ఇది చిన్నపిల్లవాడి మనస్తత్వంగా భావించవచ్చు. కానీ, దాని వెనకాల ఉన్న విశ్వాసం పెద్దది. హైదరాబాద్లో ఇల్లు కొనడం కోసం కాకినాడలో స్థలం అమ్మి బిల్డర్కి డబ్బు ఇచ్చాను. ఏడాది చూశాను. ఇల్లు అవడం లేదు, డబ్బులు రావడం లేదు. విసుగొచ్చింది. మరో దారి కన్పించలేదు. అమ్మవారి ముందుకెళ్లి ‘భిక్షాటన చేసైనా ఐదు కోట్లు తెచ్చిస్తా గరికపాటికి నా పాదాలు రాసిచ్చాను అని రిజిస్టర్ చేసి అందరికీ చెప్పు. లేదంటే నేను సంపాదించినదాంట్లో దోషం చూపించు. నా కష్టార్జితం పోతే నేను రేపు నీ గురించి పదిమందికి ఏం చెప్పను’ అన్నాను. ప్రయత్నం చేయమన్నట్టుగా బొమ్మపడింది. ఎలా ప్రయత్నం చేయాలో అర్థం కాలేదు. కానీ, పరిస్థితులు కలిసి వచ్చాయి. వారం రోజుల్లో నా డబ్బు చేతికొచ్చింది. కష్టం వస్తే ‘అమ్మా, కొత్త కష్టాలు వస్తే నే కొత్త పద్యాలు చెబుతానని నీ ఆశా! జీవితాంతం పద్యాలు చెబుతా గానీ, కష్టపెట్టకమ్మా!’ అని చెబుతుంటాను. మొన్నీ మధ్య ఇంట్లో ఎవరూ లేరు. నేను అమ్మవారి దగ్గర కూర్చుని ‘నువ్వు, నేను తప్ప అవనీతలమున ఎవ్వరూ లేరు. నీవు ఒకసారి కనపడితే ఎవరికీ చెప్పను తల్లీ.. అని పద్యరూపకంగా చెప్పాను. ఇది మధురభక్తి. అదో అనుభవం. ఇంతటి మధుర భక్తిని అనుభూతించే మీరు దైవం గురించి విమర్శనా వ్యాఖ్యలు కూడా చేస్తుంటారు? దైవం గురించి కాదు మూఢభక్తి గురించి. శివుడి గుళ్లో వందల లీటర్ల పాలతో అభిషేకం చేస్తున్నారు. ఎందుకు? నీళ్లతోనే అభిషేకం చేయాలి. అభిషేకాల పేరుతో చాలా శివాలయాలు ఇప్పటికే మూత పడ్డాయి. దేవుడికి ఇవి కాస్టీ›్ల, ఇవి చీప్ అని ఉండదు. అభిషేకానికి నీళ్లే వాడాలి. ధారాపాత్ర గుండా నీళ్లు లింగం మీదుగా పడుతుండాలి. ద్రాక్షారామంలో అలా అభిషేకం జరుగుతుండగా ఉద్వేగానికి లోౖ¯ð ఆశువుగా ‘ధారాపాత్ర నుండి నీరు జారునయట్లు క్షణ క్షణం బతుకు జారిపోవు... అని పద్యం చెప్పాను. వేంకటేశ్వరస్వామికి గడ్డం మీద గాయం వల్ల అయిన మచ్చ ఉంటుంది. ఇప్పటికీ దాని మీద వెన్న రాస్తారు. అంత శక్తి గల స్వామి తన గాయాన్ని ఎందుకు మాన్పుకోలేకపోయాడు. అని ఆలోచన ఎవరూ చేయరు. ఇప్పటికీ మొట్టమొదట గా ఓటికుండలో పెట్టిన అన్నమే స్వామికి నైవేద్యం. ఎందుకు? ఇవేవీ ఆలోచించరు. దేవుడికి కులం, మతం పట్టింపుల్లేవు. అది ఎందుకు గ్రహించరు. ఏది అజ్ఞానం అనిపిస్తే దాన్ని విమర్శిస్తాను. ఇలాంటి వ్యాఖ్యానాల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయేమో కదా! ఈ రోజుల్లో తొమ్మిదో తరగతి కుర్రాడికీ మనోభావాలు ఉంటున్నాయి. అందుకే వాడికి తోచింది ఫేస్బుక్లో పెట్టేస్తుంటాడు. ఆవుని పూజించమంటారు. ఆవును పూజించేవాళ్లే దూడ పాలు తాగుతుంటే దాన్ని చితగ్గొట్టి పాలు పితుక్కుంటున్నాడు ఇది జీవహింస కాదా! పుణ్యమని గోవు చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. గోవులను వ్యాపారం చేసేవారి గురించి మాట్లాడరెందుకు. ఇలాంటివాటికి మొదట్నుంచీ వ్యతిరేకిని. తప్పుడు భావం అయితే అది ఎలాంటిదైనా ఖండిస్తాను.‘సకలభూత హితాన్ని కోరి చెప్పే మాటలు దైవం మెచ్చును..’ నే చెప్పింది తప్పనిపిస్తే వాస్తవం చెప్పండి. వింటాను. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకున్న సందర్భం? 1978 నుంచి దాదాపు పదేళ్లు చాలా స్ట్రగుల్ పడ్డాను. రోజులు గడవక కాదు. ‘ఏంటీ దేవుడు..’ అని ఆలోచన. వాస్తవా లను గ్రహించడానికి వందల పుస్తకాలు చదివాను. ఉదాహరణకు కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం పుణ్యం అన్నారు. వాస్తవం– ఇంద్రియ నిగ్రహానికి చన్నీటి స్నానం. ఉపవాసం – నవంబర్ మాసానికి పల్లెల్లో గాదెలు ఖాళీ అయ్యేవి. అప్పట్లో ఇంట్లో పది మందికి పైగా ఉండేవారు. చలి వల్ల ఎలాగూ జీర్ణశక్తి మందగిస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉపవాసం అన్నారు. మన మనస్సు దేవుడి సన్నిధిలో ఉండాలి. అంతేగానీ, అన్నం మానేస్తే దేవుడు కరుణించడు. పూజలు చిత్తశుద్ధితో చేస్తే ఒకనాటికి మనలో మార్పు వస్తుంది. ఇలా పదేళ్ల పాటు సందిగ్ధావస్థలోనే ఉన్నాను. తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగం మానేసి అవధానాల్లో పాల్గొన్నాను. అవధానంలో ముందు దైవప్రార్థన చేయాలి. నేను నమ్మంది చెప్పను. ఎలా అని ఆలోచించి అమ్మమీద పద్యం చెప్పాను. ఆ పద్యం చెబుతుంటే నా కళ్లు తడిసిపోతున్నాయి, గుండె తడిసిపోతోంది. ఈ స్పందన, భావాలు ఎక్కడనుంచి వస్తున్నాయి? ఈ ఆలోచనలు దైవం వైపుగా నడిపిం చాయి. ఆనందం మనలోనే ఉందని అప్పుడే అర్థమైంది. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
వైదిక ధర్మం అనుసరణీయం
గరికపాటి నరసింహారావు శ్రీకాకుళం కల్చరల్,న్యూస్లైన్ : వైదిక ధర్మం ఎంతో గొప్పదని, అందరూ అనుసరించదగ్గదని ప్రముఖ పండితుడు, సహస్రావధాని గరికపాటి నరసింహా రావు అన్నారు. ‘కఠోపనిషత్’పై మూడు రోజులు కొనసాగనున్న ఆయన ప్రవచనాలు పట్టణంలోని ఉపనిషన్మందిరం కమిటీ ఆధ్వర్యంలో బాపూజీ కళామందిర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మనం పాటించే ఆచారవ్యవహారాల వెనుక ఎన్నో అర్ధాలు ఉన్నాయని నరసింహారావు వివరించారు. సత్వ, రజో, తమో గుణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. శ్రీరాముడు విశ్వామిత్రునితో కలిసి పయనిస్తూ తమో గుణానికి ప్రతీక అయిన తాటకిని సంహరించాడని, రజో గుణానికి ప్రతిక అయిన అహల్యను సంస్కరించాడని, సత్వగుణానికి ప్రతిక అయిన సీతను భార్యగా స్వీకరించాడని తెలిపారు. మన వేదాంతం అంతా అరచేతిలో ఉందని వివరించారు. జీవుడు దేవునితో కలవడమే చివరకు జరగాలని అన్నారు. ఎవరైనా.. ఏమైనా మాట్లాడదలచినపుడు సమాజంపై ప్రేమతో మాట్లాడాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో ఒత్తిడి పెంచుకొని రోగాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నచికేతనుడు చేసిన సాహసమే కఠోపనిషత్ సారాంశమన్నారు. ముందుగా గరికపాటి నరసింహారావును మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సత్కరించారు. ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, డీసీఎంఎస్ చెర్మైన్ గొండు కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు శిమ్మ రాజశేఖర్, కె.ఎల్ .ప్రసాద్, అబ్దుల్ రహమాన్, టీడీపీ నేతలు గుమ్మా నాగరాజు, జామి భీమశంకర్ తదితరులు పాల్గొన్నారు.