Geesukonda
-
కైటెక్స్ వాస్తు కోసం భూ సర్వే
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు. పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు. ‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’ కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు. -
మొదటి జీతం.. పేదలకు అంకితం
గీసుకొండ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా నియామకమైన వలపదాసు అనూష ఇటీవల విధుల్లో చేరింది. ఆమె మొదటి నెల వేతనాన్ని పేదల ఆకలి తీర్చడానికి వెచ్చించి ఆదర్శంగా నిలిచింది. ఆకలితో అలమటిస్తున్న వంద మంది నిరుపేదలు, భిక్షమెత్తుకునే వారికి భోజనం అందజేసింది. వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతానికి చెందిన అనూష తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తల్లి బీడీలు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. అనూష పేదరికంలో బతుకుతూనే ఎంఏ బీఈడీ వరకు చదువుకుని ప్రైవేట్ టీచర్గా పని చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. పేదవారికి సాయం చేయా లానే సంకల్పంతో మొదటి వేతనంతో ఆహారం సమకూర్చానని, రానున్న రోజుల్లో తన శక్తి మేరకు సాయపడతానని అనూష చెబుతోంది. ఆమె పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పలువురు అభినందిస్తున్నారు. -
తొమ్మిది హత్యల కేసు : సంజయ్కు ఉరిశిక్ష
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రల్లో సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్ న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్యను కప్పి పుచ్చుకునేందుకు మరో 9మందిని హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు వెలువడింది. కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్డులో నేరారోపణ పత్రము దాఖలు చేశారు. కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్ట్రాక్ కోర్టు.. తీర్పును వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసినందుకు పోలీసులను అభినందించారు. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు మే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు మే 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్మార్ట్లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్పాక చేరుకున్నాడు. తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి కోర్పుకు అప్పగించారు. దీంతో నిందితుడు సంజయ్కు ఉరిశిక్ష ఖరారైంది. -
9 హత్యల కేసు; కోర్టుకు నిందితుడు
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్కుమార్యాదవ్ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్ రీకన్స్ట్రక్టషన్ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్కుమార్పై సీన్ రీ కన్స్ట్రక్షన్) -
9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?
సాక్షి, వరంగల్ రూరల్: గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భా గంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల్లో చిక్కిన నిందితుడు తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో మాత్రం తాత్సారం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే 60 మాత్రలా? కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు, జలుబు మాత్రలు కూడా విక్రయించకూడదని మెడికల్ షాపుల నిర్వాహకులను రాష్ట్ర, జిల్లా అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఔషధ దుకాణాల నిర్వాహకులు తమ తీరును మార్చుకోవడం లేదని ఈ ఘటనలో వెల్లడైంది. గొర్రెకుంట ఘటనలో నిందితుడు ఉపయోగించిన 60 నిద్రమాత్రలు ఒక్క దుకాణంలోనే కొనుగోలు చేశాడా.. లేదంటే పలు షాపుల్లో తీసుకున్నాడా అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ విషయంపై డ్రగ్ కంట్రోల్ అధికారుల వివరణ కోరగా హంతకుడు ఉపయోగించిన నిద్రమాత్రల బ్యాచ్ నెంబర్ను తమకు తెలియజేస్తే ఏ షాపులో ఔషధాలు కొనుగోలు చేశాడనేది తేలేతుతుందని చెబుతున్నారు. బ్యాచ్ నంబర్ వివరాలు తెలపాలని పోలీసులను సైతం కోరామని స్పష్టం చేస్తున్నారు. విచారణలో చెప్పలేదా.. పోలీసుల విచారణలో హంతకుడు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన ఔషధ దుకాణం పేరు వెల్లడించలేదా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. హత్య జరిగిన తీరును పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో వెల్లడించినా ఔషధ దుకాణాల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. దీంతో అసలు మతలబు ఏమిటనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులు ఈ అంశంపై పెదవి విప్పకపోగా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాత్రం మాత్రల బ్యాచ్ నంబర్ కోసం పోలీసులను అడిగామని చెప్పడం గమనార్హం. చదవండి: 9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్కు శాంపిళ్లు డేగకళ్లతో నిఘా గీసుకొండ: గొర్రెకుంట శివారులోని బావిలో తొమ్మిది మందిని, అంతకు ముందు ఓ మహిళను హత్య చేసిన నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ పోలీసు కస్టడీ కొనసాగుతోంది. కేసు విషయంలో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆయనను పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆరు రోజుల కస్టడీ ఈనెల 4వ తేదీతో ముగియనుండగా అదేరోజు కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. ఈమేరకు ఘటనా స్థలమైన బావి, బార్దాన్ గోదాంతో పాటు సంజయ్కుమార్ యాదవ్ తిరిగిన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనను తీసుకెళ్లి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈక్రమంలో ఆయనను అనునిత్యం గమనిస్తూ ఆరుగురు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఉదయం పూట విచారణకు తీసుకెళ్తే పారిపోయే అవకాశముందని భావిస్తూ కేవలం రాత్రివేళ బందోబస్తు నడుమ విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. వారితో ఎలా ఉండేవాడు? హత్యకు గురైన మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ మూడేళ్ల కుమారుడు బబ్లూ ఏడుస్తుండగా గొంతు నులిమి హత్య చేసి బావిలో వేసినట్లు తేలిన విషయం విదితమే. ఇదేక్రమంలో గ్రేటర్ పరిధి 4వ డివిజన్ స్తంభంపెల్లి పరిధిలోని ఆదర్శ నగర్లో సంజయ్కుమార్ యాదవ్ అద్దెకు ఉన్న ఇంటి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో మంగళవారం విచారణ జరిపినట్లు సమాచారం. మక్సూద్ ఆలం భార్య నిషా అక్క కూతురు రఫీకాతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తె, ఇద్దరు కుమారులతో అద్దె ఇంటిలో నివాసమున్నట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. అయితే, పిల్లలతో ఎలా ఉండేవాడు, రఫీకాను ఎలా తీసుకెళ్లి నిడదవోలు వద్ద రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడనే విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ తర్వాత మంగళవారం రాత్రి సంజయ్ను గీసుకొండ పోలీస్ స్టేషన్లోనే ఉంచినట్లు సమాచారం. -
సంజయ్కుమార్పై సీన్ రీ కన్స్ట్రక్షన్
గీసుకొండ (పరకాల): వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావి వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ పోలీసుల విచారణలో విస్మయపరిచే విషయాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ను ఆరు రోజులపాటు విచారణ నిమిత్తం పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు ఆది, సోమవారాల్లో ఘటనాస్థలం, గోదాముల ప్రాంతంతోపాటు గ్రేటర్ వరంగల్ 4వ డివిజన్ ఆదర్శనగర్లో అతను అద్దెకు ఉంటున్న ప్రాంతం, నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు విస్మయపరిచే నిజాలు వెల్లడవుతున్నాయని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. (రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?) ఇలా చేశాడు..! సంజయ్కుమార్ తొమ్మిది మందికి నిద్రమాత్రలు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కరిని గోనె సంచిలో బావి వద్దకు తీసుకెళ్లి ప్రాణం ఉండగానే అందులో పడేసినట్లు పోలీసులు ఇటీవల వెల్లడించారు. అయితే ఇంకా మరికొన్ని అంశాలు సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా తెలుస్తున్నట్లు సమాచారం. మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ మూడేళ్ల కుమారుడు ‘బబ్లూ’ను బతికి ఉండగానే గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్లు తెలుస్తోంది. బబ్లూ ఊపిరాడక చనిపోయాడని, అతనికి ఎక్కువ మోతాదులో విషం ఎక్కలేదని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని పోస్టు మార్టంలో గుర్తించినట్లు వైద్యులు వెల్లడించిన విషయం విదితమే. మే 21న రాత్రి గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాంలో 9 మందికి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు.. బయటకు వచ్చి కొంతదూరం కాలినడకన అక్కడక్కడా తిరిగాడని, ఆ తర్వాత తన జాడ పోలీసు జాగిలాలు గుర్తించకుండా పలుచోట్ల కాళ్లు కడుకున్నాడని, సైకిల్పై వరంగల్ చౌరస్తా, ఇంతెజార్గంజ్ ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం సంజయ్ అర్ధరాత్రి గోదాంకు వచ్చే ముందు అందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి నిషాకు ఫోన్ చేయగా ఆమె మత్తులోనే హా.. అని తప్ప మరో మాట మాట్లాడలేదని తెలుస్తోంది. గోదాం వద్దకు తిరిగివచ్చాక బబ్లూ ఏడ్చుకుంటూ కనిపించడంతో అతడిని గొంతు నులిమి హత్య చేసి బావిలో వేశాడని తెలిసింది. ఇప్పటికే పోలీసులు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోగా.. మిగతావి ఎక్కడ ఉన్నాయనే విషయంలో సంజయ్ను తమదైన శైలిలో విచారిస్తున్నారు. దీంతో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్కు శాంపిళ్లు
వరంగల్ అర్బన్, గీసుకొండ : గొర్రెకుంట హత్యల కేసులో 9 మంది మృత దేహాలకు ఈనెల 22న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం సందర్భంగా మృత దేహాల నుంచి పరీక్షల కోసం గుండె, కాలేయంతో పాటు శరీరం లోపలి పలు అవయవాలు, ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న ద్రవం, బావిలోని నీటి శాంపిళ్లు.. ’విశ్రా’ను సేకరించి తొమ్మిది బాక్సుల్లో భద్రపరిచారు. వీటిని శుక్రవారం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు గీసుకొండ పోలీసులు తీసుకుని వెళ్లారు. నిపుణులు ల్యాబ్లో పరీక్షించి 15 రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా హత్యకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు నమోదు చేయనున్నారు.(హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం) -
రఫికా కూతురుపైనా ఆత్యాచారం..?
సాక్షి ప్రతినిధి, వరంగల్: గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్కుమార్ యాదవ్పై మరిన్ని కేసులు నమోదు చేసేందుకు వరంగల్ పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. రఫీకా కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు వీరు ఆధారాలు సేకరించారు. దీంతో సంజయ్పై పోక్సో చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉంది. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్క కూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) -
రఫిక భర్తను కూడా ఏమైనా చేసి ఉంటాడా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో సామూహిక డెత్ మిస్టరీలో కొత్త కోణాలు, అనుమానాలు బయటకు వస్తున్నాయి. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్కకూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) ఢిల్లీలో ఫర్నిచర్ దుకాణంలో పనిచేసినప్పుడు రఫికతో సంజయ్కి పరిచయం ఏర్పడిందన్న ప్రచారం బుధవారం నుంచి తెరపైకి వచ్చింది. అక్కడే ఆమెతో సాన్నిహిత్యం పెరగడంతో పిల్లలతో సహా రఫిక వరంగల్కు మకాం మార్చిందంటున్నారు. మృతుల్లో ఒకరైన మహ్మద్ మక్సూద్ ఆలం తన కూతురు బుష్రాను సైతం ఢిల్లీలో ఖాతూన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. రఫిక వ్యవహారం ఢిల్లీలో ఉన్నప్పడే తెలియడంతో వరంగల్కు వచ్చాక ఆమెను మక్సూద్ పట్టించుకోలేదని సమాచారం. దీంతో స్తంభంపల్లిలో రఫిక హంతకుడు సంజయ్మార్ కాపురం పెట్టిందని తెలిసింది. అయితే నిషా ఆలం తన సొంత సోదరి కుమార్తె కావడంతో అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేదని, చివరకు రఫికా కనిపించకుండా పోవడాన్ని ఆమె నిలదీయడం వల్లే సంజయ్కుమార్ ఈ దురాఘతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.(హత్య.. ఆపై హత్యలు) సంజయ్కుమార్ నేర చరిత్రపై ఆరా.. మక్సూద్ సమీప బంధువు రఫిక అలియాస్ చోటీ కుటుంబంపై కూపీ లాగుతున్న పోలీసులు, నిందితుడు సంజయ్కుమార్ యాదవ్ నేరచరిత్రపైనా మళ్లీ ఆరా తీస్తున్నారు. 14 రోజుల రిమాండ్ కోసం మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసింది. నిందితుడి నేరచరిత్రపై రోజుకో రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంజయ్కుమార్ను మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ కింద అదుపులోకి తీసుకునే యోచన కూడా చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా రఫిక భర్త ఏమయ్యాడనే కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు ఆయనను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఫికా భర్త బతికే ఉన్నాడని, ఢిల్లీలోనే ఉన్నాడని.. అయితే ఆయన మానసిక ప్రవర్తన బాగాలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో స్పష్టత వస్తేనే అందరి అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది.(గొర్రెకుంట.. ఒక్కడే 9 హత్యలు ఎలా చేశాడు?) రఫిక పిల్లలను కలిసి మాట్లాడిన బంధువులు గీసుకొండ(పరకాల) : గొర్రెకుంట ఘటన తర్వాత అనాథలైన రఫిక పిల్లకు గీసుకొండ పోలీసులు రక్షణ కల్పించారు. సిర్దాస్ ఖాతూన్ను హన్మకొండ సుబేదారిలోని సఖి సెంటర్లో, ఇద్దరు కుమారులను వరంగల్ నగరం ఆటోనగర్ వద్ద గల జువైనెల్ హోంకు తరలించారు. వారిని కలవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి రఫిక తల్లికి అన్న(మేనమామ)తో పాటు మరో ముగ్గురు బంధువులు బుధవారం ఇక్కడికి వచ్చారు. పోలీసులను సంప్రదించడంతో మాట్లాడటానికి అనుమతించారు. మాట్లాడిన తర్వాత ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి పోషిస్తామని కోరగా కోర్టు అనుమతి తప్పని సరి అని పేర్కొన్నారు. వారిని పోషించే స్తోమత మీకుందని కోర్టు నమ్మితే అనుమతిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. -
ఖైదీ నంబర్ 4414
గొర్రెకుంటలో తొమ్మిది మంది హత్యకు గురైనసంఘటనకు సంబంధించి తమకు అనుమానాలు ఉన్నాయని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ బంధువులు పేర్కొన్నారు. ఒక్కడే ఇంత మందిని హత్యచేసి ఉండడని, ఇతరుల సహకారం తీసుకుని ఉంటాడని, ఘటనపై మరింత సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. ఎంజీఎం : తొమ్మిది మందిని ఒక్కడే పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు పేర్కొన్న వివరణపై పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన మక్సూద్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గొర్రెకుంటలో హత్యకు గురైన వారి మృత దేహాలు ఎంజీఎం మార్చురీలో ఉండగా.. తీసుకెళ్లేందుకు ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు మొదట మట్టెవాడ పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిషా సోదరుడు ఫిరోజ్ షా మాట్లాడుతూ తొమ్మిది మందిని సంజయ్కుమార్ యాదవ్ హత్య చేశాడని పోలీసులు పేర్కొంటున్నాడని, ఇంత మందిని ఒక్కడే ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ ఘటనలో సంజయ్కుమార్కు మరికొంత మంది సహాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఆయన మరింత సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.(వరంగల్ జైలుకు సంజయ్ ) మృతదేహాల అప్పగింత గొర్రెకుంటలో హత్యకు గురైన తొమ్మిది మందిలో ఏడుగురి అంత్యక్రియలను మంగళవారం ముస్లిం మత పెద్ద వారి బంధుమిత్రుల మధ్య నిర్వహించారు. ఉదయం పశ్చిమ బెంగాల్ నుంచి మృతుడి బంధువులు వరంగల్కు చేరుకోవడంతో ఎండీ మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలం, కుమారులు ఎండీ షాబాద్ ఆలం, కూతురు బుస్రా ఖాతూ, మనవడు బబ్లూ మృతదేహాలను గీసుగొండ ఇన్చార్జి తహసీల్దార్ సుహాసిని, రాయపర్తి తహసిల్దార్ సత్యనారాయణ, గీసుగొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అర్బన్ పంచనామా అనంతరం అప్పగించారు. పోతనరోడ్డులోని ఖబరస్థాన్లో అంత్యక్రియలను పూర్తి చేశారు.(పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?) ఆందోళన అనంతరం షకీల్ మృతదేహం అప్పగింత.. మక్సూద్ కుటుంబ సభ్యులకు ఆరు మృతదేహాలను అప్పగించిన అనంతరం షకీల్ మృతదేహాన్ని తమకు ఇవ్వకపోవడంతో షకీల్ భార్య తాహేరా బేగం పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టింది. షకీల్కు ఇద్దరు భార్యలు ఉన్నారని, ఎవరికి మృతదేహం అప్పగించాలనే విషయమై అధికారులు ఇబ్బందికి గురయ్యారు. ఈ క్రమంలో షకీల్ మొదటి భార్యకు విడాకుల ప్రక్రియ పూర్తయిందని షకీల్ సోదరుడు సజ్జర్తో వివరణ తీసుకున్న అనంతరం రెండవ భార్య తాహెర బేగంకు మృతదేహాన్ని అప్పగించారు. ఈమృతదేహానికి సైతం ముస్లిం మత పెద్దలు స్థానిక కార్పొరేటర్ రిజ్వానా షమీమ్ మసూద్, కల్పలత సూపర్బజార్ వైస్చైర్మన్ ఎం.డీ.షఫీ సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.(మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం) నిందితుడికి 14 రోజుల రిమాండ్ వరంగల్ లీగల్ : తొమ్మిది మందికి మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో వేసి హత్య చేసి నిందితుడు బీహార్కు చెందిన సంజయ్కుమార్యాదవ్ను గీసుకొండ పోలీసులు మంగళవారం మూడవ ముస్సిఫ్ కోర్టు ఇన్చార్జి జడ్జి కుమారస్వామి ఎదుట హాజరుపర్చారు. అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జి జూన్ 8న తిరిగి హాజరుపర్చాలని ఆదేశించారు. నిందితుడిపై హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించడం, విషప్రయోగం ద్వారా కిడ్నాప్ చేయడం, చనిపోయిన వ్యక్తులకు చెందిన వస్తువులను దురుద్దేశ్యంతో స్వాధీనం చేసుకోవడం, దొంగతనం చేసి హత్య నేరానికి పాల్పడిన అభియోగాలపై ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 302, 210 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడిపై సెక్షన్లు.. ఐపీసీ సెక్షన్ 449 : హత్య చేయాలని ఉద్ధేశంతో అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడం ♦ ఈ నేరం రుజువైతే నిందితుడికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా సెక్షన్ 328 : నేరానికి పాల్పడాలనే ఉద్ధేశంతో విషప్రయోగం చేయడం 10 సంవత్సరాల కారాగార శిక్ష మరియు జరిమానా సెక్షన్ 364 : హత్య చేయడానికి మృతుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి కిడ్నాప్ చేయడం యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా సెక్షన్ 380 : దొంగతనం చేయడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా సెక్షన్ 404 : చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను తెలిసి తీసుకోవడం ఏడు సంవత్సరాల జైలుశిక్ష సెక్షన్ 302 : హత్యా నేరం ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు మరియు జరిమానా సెక్షన్ 210 : బాకీ లేని అప్పు లేదా ఉన్నదానికంటే ఎక్కువ బాకీ డబ్బుల కోసం దురుద్ధేశంగా ఆర్డర్ తీసుకోవడం ,రెండు సంవత్సరాల జైలుశిక్ష లేదా జరిమానా లేదా శిక్ష + జరిమానా ఖైదీ నంబర్ 4414 : హై సెక్యూరిటీ బ్యారక్కు నిందితుడు వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట వద్ద బావిలోని తొమ్మిది మందిని, అంతకు ముందు ఒకరి హత్య కేసులోని నిందితుడైన సంజయ్కుమార్యాదవ్ను పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులకు అప్పగించగా హైసెక్యూరిటీ బ్యారక్లో ఉంచారు. అంతకు ముందు అతడికి ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. రిమాండ్ ఖైదీ సంజయ్కుమార్కు 4414 నంబర్ కేటాయించినట్లు జైలు సూపరింటెండెంట్ మురళీబాబు తెలిపారు. మార్చురీలోనే మరో రెండు మృతదేహాలు.. తొమ్మిది మందిలో బీహార్కు చెందిన ఇద్దరి మృతదేహాలు ఎంజీఎం ఫ్రీజర్లలోనే ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు వరంగల్కు వస్తున్నారని, ఇక్కడకి చేరుకున్నాక అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
గొర్రెకుంట.. ఒక్కడే 9 హత్యలు ఎలా చేశాడు?
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యలకు సంబంధించి మృతుల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం కోల్కతా నుంచి వరంగల్ చేరకున్న మక్సూద్ అలం భార్య నిషా బంధువులు.. ఎంజీఎం మార్చురీకి వెళ్లారు. అనంతరం ఈ హత్యలపై వారు మాట్లాడుతూ.. నిందితుడు ఒక్కడే 9 మందిని ఎలా హత్య చేస్తాడని ప్రశ్నించారు. ఈ సామూహిక హత్యల వెనక కుట్ర కోణం దాగుందని భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. (చదవండి : ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు) కాగా, గొర్రెకుంటలోని ఓ వ్యవసాయ బావిలో 9 మంది మృతదేహాలు లభించడం కలకలం రేపిన సంగతి తెలిసింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు సంజయ్కుమార్ అరెస్ట్ చేశారు. నిషా అలం అక్క కుమార్తె రఫీకాతో సహజీవనం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే ఈ హత్యలకు కారణమని తేల్చారు.(చదవండి : ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు) -
పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?
సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటన సంచలనంగా మారింది. ఏకంగా పది హత్యలు చేసిన హంతకుడిని విచారించిన పోలీసులకు నమ్మశక్యం కాని నిజాలు బయటపడ్డాయి. వరంగల్ సీపీ హత్యల వివరాలు వెల్లడించారు. ఈ హత్యల పరంపరలో తొలి హత్యకు బీజం పడింది జిల్లాలో కావడం గమనార్హం. చాగల్లు–బ్రాహ్మణగూడెం మధ్య ప్రాంతంలో మార్చి 7న రైలు నుంచి పడి ఒక మహిళ మృతిచెందింది. పది హత్యల హంతకుడు సంజయ్ చేసిన ఈ హత్య అనంతరం ఏకంగా మక్సూద్ కుటుంబ సభ్యులతో పాటు 9 మందిని హత్య చేశాడు. కిరాతకంగా భోజనం, కూల్డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. నిద్రలోకి జారుకున్న వెంటనే గోనెసంచెలో వేసి లాక్కుంటూ వెళ్లి బావిలో పడేశాడు. గోనెసంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మక్సూద్ కుటుంబం కనిపించలేదంటూ ఫ్యాక్టరీ యజమాని ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు హత్య కేసును ఛేదించారు. కూతురిపై కన్నేసి.. కుటుంబాన్నే కాటేశాడు మక్సూద్ కుటుంబానికి బీహార్కు చెందిన సంజయ్కుమార్ యాదవ్ నాలుగేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. మక్సూద్ భార్య అక్క కుమార్తె రఫీకా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి వరంగల్లో ఉంటుంది. సంజయ్ రఫీకాతో పరిచయం పెంచుకుని కొద్దికాలం సహజీవనం చేశాడు. ఈ క్రమంలో సంజయ్ చూపు రఫీకా కుమార్తెపై పడింది. తన కూతురుతో సంజయ్ సన్నిహితంగా ఉండటాన్ని సహించలేక రఫీకా అతనితో గొడవపడింది. ఇక ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నాడు. మార్చి 7న పశ్చిమబెంగాల్ తీసుకువెళతానని నమ్మించాడు. ఇద్దరూ గరీభ్రథ్ ఎక్స్ప్రెస్ రైలులో కోల్కతా బయలుదేరారు. ప్రయాణ సమయంలో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి తెల్లవారుజామున 3 గంటలకు చున్నీని మెడకు బిగించి రఫీకాను రైలు నుంచి కిందకు తోసేశాడు. జిల్లాలోని నిడదవోలు ప్రాంతంలోని చాగల్లు–బ్రాహ్మణగూడెం మద్యలో రైలు పట్టాల పక్కన మృతదేహం పడి ఉంది. రైల్వే పోలీసులు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత రఫీకా హత్య బయటపడకుండా ఉండేందుకు మక్సూద్ కుటుంబంతో పాటు 9మంది ప్రాణాలు బలితీసుకున్నాడు. చదవండి: గీసుకొండ బావిలో 9 మృతదేహాలు పోస్టుమార్టం నివేదికలో ఏముంది ? రఫీకా రైలులో నుంచి పడి మృతిచెందగా రైల్వే పోలీసులకు కుటుంబ సభ్యుల ఆచూకీ లభించకపోవటంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఏమి వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. సంజయ్ రఫీకాకు మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వటంతో పాటు, చున్నీ బిగించి హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. ఒకవేళ పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్థారిస్తే రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించారా? లేదా అనేది సందేహంగా మారింది. ఈ అంశంపైనా ఉన్నతాధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చదవండి: హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం -
మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం
వివాహితతో ఏర్పడిన పరిచయం ఆపై సాన్నిహిత్యంగా.. అది కూడా దాటిపోయి శారీరకంగా సంబంధానికి దారి తీసింది.. అంతటితో ఆగక ఆమె కుమార్తెతోనూ సంబంధం ఏర్పర్చుకోవాలని భావించగా గుర్తించిన వివాహిత తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.. ఆమెను అడ్డు తొలగించుకునేందుకు హత్య చేసిన నిందితుడు, ఆమె కోసం ఆరా తీసిన కుటుంబాన్ని మట్టుబెట్టేందుకు సిద్ధమయ్యాడు.. ఈ కుటుంబంలోని ఆరుగురికి తోడు పక్కనే ఉన్న పాపానికి మరో ముగ్గురు బలి కాగా.. మొత్తం తొమ్మిది మంది మృతదేహాలు వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ద బావిలో తేలిన ఘటన రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ఈ కేసును 72 గంటల్లో ఛేదించిన పోలీసులు బీహార్కు చెందిన నిందితుడు సంజయ్కుమార్ను యాదవ్ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా తొలుత తాను మహిళను హత్య చేశానని.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తొమ్మిది హత్యలు చేసినట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు వివరాలను మీడియాకు సీపీ రవీందర్ సోమవారం సాయంత్రం వెల్లడించారు. సాక్షి ప్రతినిధి వరంగల్ / కాజీపేట అర్బన్ / గీసుకొండ : ఒక తప్పు చేస్తే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చూసుకోవాలి.. అప్పుడే మనిషిలో పరివర్తన వచ్చినట్లు లెక్క! కానీ ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేస్తూ వెళ్తే దానికి అంతమనేదే ఉండదు. అచ్చంగా తొమ్మిది మృతదేహాలు లభించిన కేసులో నిందితుడు ఇలాగే చేస్తూ పోయాడు. గీసుకొండ మండలంలోని గొర్రెకుంటలో లభించిన మృతదేహాల విషయంలో ఆత్మహత్యలా, హత్యలా అనే కోణం దర్యాప్తు చేసిన పోలీసులకు సీసీ ఫుటేజీల రూపంలో ఓ తీగ దొరికింది. ఆ తీగ ఆధారంగా ముందుకెళ్లగా నిందితుడు దొరికాడు. విచారణ సందర్భంగా.. ఈ తొమ్మిది హత్యలకు గతంలో తానే చేసిన ఓ హత్య నాంది అని నిందితుడు చెప్పడం గమనార్హం. కేసు వివరాలను వెల్లడిస్తున్న సీపీ రవీందర్, పక్కన అధికారులు పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు సంజయ్ సైకిల్ కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు ఈనెల 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సామగ్రి ఒక్కరొక్కరిని.. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్మార్ట్లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్పాక చేరుకున్నాడు. 6 బృందాలు... 72 గంటలు తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్ని విభాగాల అధికారులతో కలిపి ఆరు బృందాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా సంజయ్ను గుర్తించగా.. సోమవారం సాయంత్రం మీడియాకు సీపీ డాక్టర్ వి.రవీందర్ వివరాలు వెల్లడించారు. కాగా, తొలుత హత్యకు గురైన రఫీకా ముగ్గురు పిల్లలను బాలసదనంలోకి చేర్చినట్లు వివరించారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్జోన్ ఇన్చార్జి డీసీసీ వెంకటలక్ష్మి, ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి ఇన్స్పెక్టర్లు శివరామయ్య, కిషన్, ఇన్స్పెక్టర్లు నందిరాంనాయక్, జనార్దన్రెడ్డి, రాఘవేందర్, రమేష్కుమార్ను సీపీ అభినందించారు. రంజాన్ జరుపుకోకుండానే.. రంజాన్ జరుపుకునేందుకు ముస్లిం కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటాయి. అదే తరహాలో మక్సూ ద్ ఆలం కుటుంబం కూడా కొత్త బట్టలు, సరుకులు కొనుగోలు చేశారు. కానీ వారిని మృత్యువు వెంటాడింది. ఆ కుటుంబంలో ఒక్కరూ బతికి లేకపోవడంతో పండుగ జరుపుకోలేకపోయారు. రెండున్నర అడుగల ఎత్తులో బావిగోడ మృతదేహాలు తేలిన బావి చుట్టూ ప్రహారీ ఉంది. ఒకచోట మాత్రం మట్టితో 2.5 అడుగుల గోడ ఉంది. అక్కడి నుంచే సంజయ్.. మత్తులో ఉన్న వారిని బావిలోకి తోసినట్లు చెబుతున్నారు. పాపం.. ఆ ముగ్గురు తొలుత మక్సూద్ కుటుంబంలోని ఆరుగురిని మాత్రమే సంజయ్ అంతం చేయాలనుకున్నాడు. కానీ వారి ఇంటి పక్కనే ఉండే బీహార్ కార్మికులు శ్రీరాం, శ్యాంతోపాటు పని ఉందని చెప్పడంతో వచ్చిన షకీల్ కూడా బలయ్యారు. మార్చురీలోనే మృతదేహాలు ఎంజీఎం : బావిలో తేలిన తొమ్మిది మంది మృతదేహాలు ఇంకా ఎంజీఎం మార్చురీలోనే ఉన్నా యి. కేసు ఓ కొలిక్కి వచ్చినా సోమవారం రంజా న్ కావడంతో మంగళవారం మృతదేహాల ను ఖ ననం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడేం జరిగిందంటే... దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తొమ్మిది హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నిందితుడి వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బావిలో నాలుగు మృతదేహాలు తేలిన రోజు నుంచి నిందితుడి వివరాలు వెల్లడించిన సోమవారం వరకు జరిగిన ఘటనల వివరాలివి.. నిందితుడు సంజయ్ను తీసుకొస్తున్న పోలీసులు 21 – 05 – 2020 : గురువారం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో సాయిదత్తా ట్రేడర్స్ ఆధ్వర్యాన నిర్వహించిన బార్దాన్ సంచులను కేంద్రానికి ఆటోడ్రైవర్ను అక్కడకు పంపించారు. నిల్వ ఉన్న సంచులను తీసుకురావాలని సూచించారు. ఆటో డ్రైవర్ ఉదయం 7 గంటలకు వెళ్లగా అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో యజమానులకు సమాచారం ఇచ్చాడు. దీంతో యజమానులు భాస్కర్, సంతోష్ చేరుకుని చూడగా ఎవరూ లేకపోవడంతో పనిపై బయటకు వెళ్లారని భావించారు. మళ్లీ కాసేపటికి వెళ్లి చూడగా కూడా లేకపోవడంతో బీహార్ కార్మికులు ఉండే భవనం ఎక్కి చూడగా పక్కనే పాడుబడిన వ్యవసాయ బావిలో నాలుగు మృతదేహాలు తేలడాన్ని గమనించి గీసుకొండ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సాయంత్రం వరకు మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా ఆలం(40), కుమార్తె బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారు బబ్లూ మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు జూపల్లి శివరామయ్య, కిషన్, ఎస్లు రహీం, నాగరాజు పరిశీలించారు. క్లూస్టీం, డాగ్స్క్వార్డ్ను రప్పించి ఆధారాల కోసం అన్వేషించారు. మ«ధ్యాహ్నం 2నుంచి రాత్రి 8 గంటల వరకు గాలించినా ఏ ఆధారమూ లభించకపోవడంతో నలుగురు ఎలా మృతి చెంది ఉంటారనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయారు. 22 – 05 – 2020 : శుక్రవారం ఉదయం 7 గంటలకు బావి వద్దకు స్థానికులు వెళ్లి చూడగా ఓ మృతదేహం తేలుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మామునూరు ఏసీపీ శ్యాంసుందర్తో పాటు పోలీసు అధికారులు చేరుకుని సిబ్బందితో గాలించారు. దీంతో తొలుత మక్సూద్ ఆలం స్నేహితుడు, కరీమాబాద్కు చెందిన మహ్మద్ షకీల్(38) మృతదేహం బయటపడినా ఎవరూ గుర్తించలేదు. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్ సాయంతో తోడుతుండగా చొప్పున నాలుగు మృతదేహాలు లభించాయి. ఇందులో మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్, బీహార్ కార్మికుడు శ్రీరాంకుమార్షా, మక్సూద్ చిన్న కుమారుడు మహ్మద్ సుహేల్, బీహార్ కార్మికుడు శ్యాంకుమార్షా మృతదేహాలను వెలికితీసి వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. బార్దాన్ గోదాంలోని మక్సూద్ కుటుంబం నివాసం ఉండే రెండు గదులతో పాటు, బీహార్ కార్మికులు ఉండే డాబా పైగదులు, బావి పరిసర ప్రాంతాల్లో క్లూస్టీం ఆధారాల కోసం పలు నమూనాలు సేకరించింది. వండి తినకుండా మిగిలిపోయిన అన్నం, ఆకుకూర పప్పు, కూల్డ్రింక్స్ ఖాళీ బాటిళ్లను తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రవీందర్ సందర్శించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో మృతదేహాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్భాస్కర్, వరంగల్ అర్బన్, రూరల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, హరిత సందర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు మంత్రి దయాకర్రావు వెల్లడించారు. 23 – 05 – 2020 : శనివారం సంఘటనా స్థలానికి సెంట్రల్ విజిలెన్స్ అధికారుల బృందం, హైదరాబాద్ నుంచి ఫోరెన్సిక్ విభాగం అధికారులు చేరుకుని సాంకేతిక పరమైన అంశాలను పరిశీలించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు పలు కోణాల్లో పరిశోధనలు చేశారు. మృతదేహాల పోస్టుమార్టం నివేదికను పరిశీలించారు. ప్రాణాలతో ఉండగానే బావిలో పడేశారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కాల్డేటా ఆధారంగా సంజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని ఘటనాస్థలికి తీసుకుని వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. డీసీసీ వెంకటలక్ష్మి నేతృత్వంలో ఐదు గంటల పాటు పరిశీలన జరిపారు. ♦ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని, మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సీపీని ఆదేశించారు. ♦ రాత్రి తొమ్మిది మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. నీట మునిగాక మృతి చెందినట్లు ప్రాథమికంగా నివేదిక అందజేశారు. 24 – 05 – 2020 : ఆదివారం ♦ డీజీపీ కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పది మంది క్లూస్ టీం బృందాన్ని పంపించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సిటీ క్లూస్ టీంతో పాటు ట్రెయినీ ఐపీఎస్ అధికారులు యోగేశ్ గౌతం, అఖిలేష్, రీజినల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ భాస్కర్, పోలీస్ అధికారులు ఘటనా స్థలంలో మరిన్ని ఆధారాల కోసం అణువణువు అన్వేషించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అన్వేషణ సాగింది. ♦ సివిల్ పోలీస్ అధికారులతో పాటు టాస్క్ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీకోర్, సీసీఎస్ టీం, క్లూస్టీం, హైదరాబాద్ సిటీ క్లూస్టీం, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పలు కోణాల్లో కేసు మిస్టరీని ఛేదించడం కోసం కృషి చేశారు. 25 – 05 – 2020 : సోమవారం ♦ నిందితుడు సంజయ్కుమార్ను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు. ఆ తర్వాత హత్యల వెనుక ఉన్న కారణాలను సీపీ వెల్లడించారు. ఒక్కడే అంతా చేశాడా? గీసుకొండ సమీపంలోని గొర్రెకుంట వద్ద తొమ్మిది మందిని హత్య చేసిన ఘటనలో నిందితుడు ఒక్కడేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ ఒక్కడే తొమ్మిది మంది తినే ఆహారంలో నిద్రమాత్రలు కలపడం.. వారు మత్తులోకి జారుకున్నాక ఒక్కరొక్కరిని తీసుకొచ్చి బావిలో పడేయడం.. ఇదంతా తెల్లవారుజాము వరకు జరిగిందని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని చెబుతుండడంతో మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. పట్టించిన సీసీ కెమెరాలు తొమ్మిది మంది మృతదేహాలు బావిలో తేలిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేరే రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన వారు కావడం.. లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక తనువు చాలించారని తొలిరోజు ప్రచారం సాగింది. ఇంతలోనే వేరే కారణంగా ఉండొచ్చని తేలగా.. మరుసటి రోజు ఐదు మృతదేహాలు వెలుగు చూశాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ఆరు బందాలను ఏర్పాటు చేశారు. గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఈ పుటేజీల్లో సంజయ్ సైకిల్పై వరుసగా ఐదు రోజులుగా వచ్చినట్లు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా తొమ్మిది హత్యలు చేసిన తీరుతో పాటు వీటన్నింటికీ కారణమైన రఫీకా హత్య వివరాలు వెల్లడించాడు. అలాగే, మక్సూద్ కుటుంబం వాల్మార్ట్లో కొనుగోలు చేసిన వస్తువులు కూడా కొంత మేర పరిశోధనలో ఉపయోగపడినట్లు సమాచారం. -
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’హత్యల వెనుక దాగిన మరో మిస్టరీ బయటపడింది. నింది తుడు సంజయ్కుమార్ యాదవ్(24) సాగించిన 9 హత్యల కిరాతకానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. తాను చేసిన ఒక హత్య గురించి ఎక్కడ పోలీసులకు చెబుతారోనన్న భయంతోనే మిగిలిన వారిని అతను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పది హత్యలను నింది తుడు ఒకే రీతిలో అందరికీ నిద్రమాత్రలు ఇచ్చి వారు నిద్రలోకి జారుకున్నాకే చేయడం యావత్ రాష్ట్రాన్ని గగుర్పాటుకు గురిచేసింది. వరంగల్ నగర శివారు గీసుగొండ మండలంలోని గొర్రెకుంటలో ఓ వ్యవసాయ బావిలో 9 మంది హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 21న లభించిన నాలుగు, 22న లభించిన ఐదు మృతదేహాలు కలిపి తొమ్మిది మందిని నిందితుడు సంజయ్ హత్య చేసి బావిలో పడేశాడని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇందుకుగల కారణాన్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఒంటరి మహిళకు దగ్గరై... జీవనోపాధి కొసం ఆరేళ్ల క్రితం బిహార్ నుంచి వరంగల్ చేరుకున్న సంజయ్ కుమార్ యాదవ్ మిల్స్ కాలనీ ప్రాంతంలోని శాంతినగర్లోని గోనె సంచులు తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. 20 ఏళ్ల కిందటే పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి కరీమాబాద్లో స్థిరపడి పడి ఇదే కేంద్రంలో పని చేస్తున్న మహ్మద్ మక్సూద్ ఆలం (47) కుటుంబ సభ్యులతో అతనికి పరిచయమైంది. మక్సూద్తోపాటు ఇంట్లో ఆయన భార్య నిషా ఆలం(40), కూతురు బుష్రా ఖాతూన్ (20), కుమారులు మహ్మద్ షాబాజ్ ఆలం (19) మహ్మద్ సోహిల్ ఆలం (18), మనవడు (3), ఉండేవారు. ఆ పక్కనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా (37) ముగ్గురు పిల్లలతో ఉండేది. మక్సూద్ కుటుంబంతోపాటు రఫీకాతో కూడా సంజయ్కు పరిచయం ఏర్పడింది. రఫీకాకు డబ్బిస్తూ సంజయ్ ఆమె ఇంట్లోనే భోజనం చేసేవాడు. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉన్న రఫీకాకు నిందితుడు సంజయ్ మరింత దగ్గర కావడంతోపాటు కొద్ది రోజుల అనంతరం రఫీకాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అదే క్రమంలో గీసుగొండ మండలం జాన్పాక స్తంభంపల్లి ప్రాంతంలో రెండు గదుల ఇంటిని అద్దెకు తీసుకొని రఫీకా ఆమె ముగ్గురు పిల్లలతో కలసి నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నాడు. రఫీకా కూతురుపై కన్ను... రఫీకాతో సహజీవనం చేస్తున్న సంజయ్ ఇదే క్రమంలో యుక్త వయసుకు వచ్చిన రఫీకా కుమార్తెపై కన్నేసి.. ఆమెతో చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన రఫీకా.. సంజయ్తో పలుమార్లు గొడవ పడింది. అయినా సంజయ్ తన పద్ధతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా వ్యవహరిస్తుండంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో ఎలాగైనా రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్ తమ పెళ్లి విషయాన్ని బంధువులతో చెప్పేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్దామని రఫీకాను తీసుకొని మార్చి 6న విశాఖపట్నం వైపు వెళ్లే గరీబ్రథ్ రైల్లో వరంగల్ నుంచి బయలుదేరాడు. మార్గమధ్యలో మజ్జిగ ప్యాకెట్లు కొనుగోలు చేసి అప్పటికే తనతో తెచ్చుకున్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫీకాకు ఇచ్చాడు. కుట్రలో భాగంగానే రఫీకాతో కలసి రైలు పుట్బోర్డ్ వద్ద కూర్చొని మాట్లాడసాగాడు. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో రైలు ఏపీలోని నిడదవోలు సమీపంలోకి రాగానే తాను వేసుకున్న ప్రణాళిక ప్రకారం మత్తులో ఉన్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి రైల్లోంచి తోసివేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు నంబర్ 19/2020 ద్వారా నమోదు చేశారు. రఫీకా చనిపోయిందని నిర్ధారించుకున్నాక రాజమండ్రి స్టేషన్లో దిగి తిరిగి మరో రైల్లో సంజయ్ వరంగల్ చేరుకున్నాడు. రఫీకా పశ్చిమ బెంగాల్లోని తమ బంధువులు ఇంటికి వెళ్లినట్లు ఆమె పిల్లలను నమ్మించాడు. ఆ హత్యను కప్పిపుచ్చుకునేందుకే ‘గొర్రెకుంట’పథకం... కొద్ది రోజుల అనంతరం తన అక్క కుమార్తె రఫీకా బంధువుల ఇళ్లలో లేదని, రఫీకా ప్రస్తుతం ఎక్కడ ఉందో చెప్పాలని మక్సూద్ ఆలం భార్య నిషా ఆలం.. సంజయ్ను నిలదీయడంతోపాటు పోలీసులకు చెబుతానని బెదిరించసాగింది. దీంతో కంగుతున్న సంజయ్ పోలీసులకు చిక్కుతానని భయపడి మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను హత్య చేయాలని తొలుత నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళిక రూపొందించాడు. ప్రణాళికను అమలు పర్చడంలో భాగంగా ఈ నెల 16 నుంచి 20 వరకు మక్సూద్, ఆయన కుటుంబం పని చేస్తున్న గొర్రెకుంటలోని గోనెసంచుల తయారీ గోదాంకు రోజూ వచ్చివెళ్లాడు. అదే సమయంలో గోదాం పరిసరాలను కూడా పరిశీలించి రెక్కీ నిర్వహించాడు. చివరకు మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను చంపి గోదాం పక్కనేపున్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 20న మక్సూద్ ఆలం మొదటి కుమారుడైన షాబాజ్ ఆలం పుట్టిన రోజని తెలియడంతో అదేరోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈ నెల 18న సంజయ్ వరంగల్ చౌరస్తాలోని రెండు, మూడు మెడికల్ షాపుల్లో 60కిపైగా నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. ఈ నెల 20న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకొని మక్సూద్ కుటుంబంతో చాలా సేవు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా వున్న సమయంలో ఎవరికీ తెలియకుండా మొదట మక్సూద్ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. మక్సూద్ కుటుంబం ఉంటున్న ఇంటి పక్కనే ఉండే బిహార్ యువకులు శ్యాం, శ్రీరాంలు తాను వచ్చిన విషయాన్ని ఎవరికైనా చెబుతారేమోనని భయపడి వారు తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. దీంతో మక్సూద్, ఆయన భార్య నిషా ఆలం, కుమార్తె బుష్రా కాటూన్, కుమారులు షాబాజ్ ఆలం, సోహెల్ ఆలం, మూడేళ్ల మనుమడు... శ్యాం, శ్రీరాంలతోపాటు మక్సూద్ ఆహ్వానం మేరకు పుట్టినరోజు వేడుకకు వచ్చిన పశ్చిమ బెంగాల్వాసి మహమ్మద్ షకీల్ మత్తులోకి జారుకున్నారు. దీంతో ఆర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 5 గంటల మధ్య మత్తులో ఉన్న తొమ్మిది మందిని పాడుపడ్డ బావి వద్దకు ఒక్కరొక్కరినీ తీసుకెళ్లి పడేశాడు. అందరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక మక్సూద్ గది నుంచి వాల్మార్ట్ నుంచి తెచ్చిన కిరాణ సామానుతోపాటు వారి సెల్ఫోన్లు, షకీల్ పర్సు తీసుకొని తన ఇంటికి చేరుకున్నాడు. సీసీ ఫుటేజీ, వాల్మార్ట్ సరుకులే కీలకం... ఈ హత్యలపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేయగా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశాల మేరకు ఆరు ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. గోదాం, గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో స్తంభంపల్లిలోని సంజయ్ ఇంట్లో తనిఖీ చేయగా మక్సూద్ ఆలం ఇంట్లో మాయమైన వాల్మార్ట్ సరుకులు లభ్యమయ్యాయి. ఇలా కచ్చితమైన ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉన్న సంజయ్కుమార్ యాదవ్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సీపీ అభినందనలు ఈ కేసును ఛేదించడంలో శ్రమించిన వరంగల్ ఈస్ట్ జోన్ ఇన్చార్జి డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుగొండ, పర్వతగిరి ఇన్స్పెక్టర్లు శివరామయ్య, పుల్యాల కిషన్, టాస్క్ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్ టీం ఇన్స్పెక్టర్లు జనార్దన్రెడ్డి, నందిరాం నాయక్, రాఘవేందర్, రమేష్కుమార్లతోపాటు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ అభినందించారు. నిందితుడి వివరాలు సంజయ్ కుమార్ యాదవ్ (24) తండ్రి పేరు : పవన్రామ్, నుర్లపూర్ గ్రామం, బిగుసరాయ్ జిల్లా, బిహర్ రాష్ట్రం ప్రస్తుత నివాసం : స్తంభంపల్లి (జాన్పాక), గీసుగొండ మండలం, వరంగల్ రూరల్ జిల్లా మృతుల వివరాలు: 1. మహ్మద్ మక్సూద్ ఆలం (47), తండ్రిపేరు మక్పూల్, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 2. మహ్మద్ నిషా ఆలం (40), భర్తపేరు మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 3. మహ్మద్ బుష్రా ఖాటూన్ (20), మక్సూద్ ఆలం కూతురు, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 4. బిబ్లూ (03), మక్సూద్ ఆలం మనమడు 5. మహ్మద్ షాబాజ్ ఆలం(19), తండ్రి మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 6. మహ్మద్ సోహిల్ ఆలం(18), తండ్రి మక్సూద్ ఆలం, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ 7. మహ్మద్ షకీల్ (38), తండ్రి రోహిత్, శాంతినగర్, కరీమాబాద్, వరంగల్ అర్బన్ 8. శ్యాం కుమార్ షా (18), తండ్రి లక్ష్మన్ షా, మంజులావూర్, బిహార్ రాష్ట్రం 9. శ్రీరాం కుమార్ షా (21), తండ్రి రామేశ్వర్ షా, జగ్మొహర్, నమన్తవూర్ జిల్లా, బిహార్ -
సంచలన విషయాలను వెల్లడించిన వరంగల్ సీపీ
-
గొర్రెకుంట హత్య కేసులో సంచలన నిజాలు
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గీసుకొండ మండలం గొర్రెకుంట హత్య కేసులో నమ్మశక్యం కాని విషయాలు బయటపడ్డాయి. ఈ మేరకు పది మందిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడు బిహార్కు చెందిన సంజయ్ కుమార్ కృరత్వాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ మీడియా ముందు వెల్లడించారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సీపీ మాట్లాడారు. మక్సూద్ కుటుంబంతో పాటు మరో ఐదుగురిని మొత్తం పది మందిని సంజయ్ కుమార్ దారుణంగా హత్య చేశాడని వరంగల్ సీపీ నిర్ధారించారు. ఇది భయమా శాడిజమా అనేది అంతుపట్టకున్నా నిందితుడు మాత్రం ఒక హత్యనుంచి తప్పించుకోనేందుకు మరో తొమ్మిది హత్యలు చేసాడు కేసు వివరాలను సీపీ తెలియజేస్తూ.. ‘గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మక్సూద్ కుటుంబం కనిపించడం లేదని ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఫిర్యాదు మేరకు మే 21వ తేదీన కేసు నమోదు చేశాం. అదే రోజున సమీపంలోని బావిలో తొలుత (గురువారం) నాలుగు శవాలను బయటకు తీశాం. దానిలో మక్సూద్, భార్య, కూతురు, కుమారుడి శవాలు ఉన్నాయి. మరో రోజు (శుక్రవారం) అదే బావిలో మరో ఐదు శవాలు బయటపడ్డాయి. ఇది హత్య లేక ఆత్మాహత్య..? అని నిర్ధారించడానికి ఆరు టీంలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్ నుంచి క్లూ టీమ్ కూడా రప్పించాం. ఈ క్రమంలోనే కేసును చేధించాం. (గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..!) వివాహేతర సంబంధం.. కూతురిపై కన్ను మక్సూద్ కుటుంబం మొత్తం గోనె సంచీలు తయారుచేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లు. వీరికి బిహార్కు చెందిన సంజయ్ కుమార్ నాలుగేళ్ల కిత్రం పరిచయం అయ్యాడు. మక్సూద్ భార్య అక్క కూతూరు రఫీకా పశ్చిమ బెంగాల్ నుంచి తన కూతురుతో పాటు వచ్చి ఇక్కడే పని చేస్తోంది. దీంతో రఫీకాకు సంజయ్ కూమార్ యాదవ్తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అది వివాహేతర సంబంధంగా మారింది. వారిద్దరూ కలిసి సహజీవనం సాగించారు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెతో నిందితుడు చనువుగా ఉండడాన్ని ప్రయత్నించాడు. దీనిని గమనించిన రఫీకా, సంజయ్తో పలుమార్లు గోడవపడటం జరిగింది. అయిన కుడా సంజయ్ తన పద్దతి మార్చుకోకుండా మరింత సన్నిహితంగా వ్యవహరించాడు. తనను పెళ్ళి చెసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించడంతో, నిందితుడు రఫీకాను అడ్డు తోలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. (వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య) ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి రఫీకాను పెళ్లి చేసుకుంటా అని మార్చి 7న పశ్చిమ బెంగాల్ తీసుకుపోతా అని నమ్మించాడు. ఏడో తేదీన ఇద్దరూ గరీభ్రథ్ ఎక్స్ప్రెస్లో కోల్కత్తాకు బయలుదేరారు. అప్పటికే రఫీకా కూతూరుపై కన్నుపడంతో ఆమెను అంతం చేయాలని కుట్రపన్నాడు. దీనిలో భాగంగా ప్రయాణ సమయంలో మజ్జికలో నిద్రమాత్రలు ఇచ్చి.. తెల్లవారుజామున 3 గంటలకు చున్నీతో మెడకు బిగించి రఫీకాను రైలు నుంచి కిందకు తోశాడు. ఆంధ్రప్రదేశ్లోని నిడదోవులు ప్రాంతంలో రఫీకా మృత దేహాన్ని కూడా అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద కేసుగా అది నమోదు అయ్యింది. (చినిగిన వలస బతుకులు!) అన్నంలో నిద్రమాత్రలు కలిపి.. బావిలో ఆ తరువాత సంజయ్ను మక్సూద్ కుటుంబం సంజయ్ కుమార్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. రఫీకా ఎక్కడా అంటూ రోజూ నిలదీసేవారు. ఈ క్రమంలోనే వారిపై కక్ష పెట్టుకున్నాడు. బండారం బటయపడుతుందేమో అని వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 20 తేదీన దానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. అదే రోజున మక్సూద్ పెద్ద కుమారుడి పుట్టిన రోజు కావడంతో వారందరినీ హతమార్చాలని పథకం రచించాడు. హన్మకొండలో నిద్రమాత్రలు కొన్నాడు. అదే రోజు వాళ్లు వండుకున్న భోజనంలో, కూల్ డ్రింక్లో ఎవరికీ తెలియకుండా కలిపాడు. ఈ క్రమంలో మక్సూద్తో పాటు బిహార్కు చెందిన శ్రీరాం, శ్యాం కూడా ఉన్నారు. వారిద్దరూ బతికితే తన బండారం బయటపడుతుందని భావించి.. వారి ఆహారంలో కూడా నిద్రమాత్రలు కలిపాడు. నిద్ర మాత్రలు కలిపిన భోజనం తినడంతో రాత్రి 12కు లోపు వాళ్లంతా నిద్రలోకి జారుకున్నారు. ఆ తరువాత గోనె సంచిలో పెట్టి మక్సూద్ కుటుంబాన్ని బావిలో వేశాడు. అనంతరం ఇద్దరు బిహార్ యువకులను కూడా బావిలో తోశాడు. రాత్రి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ తతంగం జరిగింది. ఆ తరువాత సైకిల్పై సంజయ్ బయటకు వెళ్లిపోయాడు. నిందితుడు చేసింది చాలా ఘోరమైన చర్య. తప్పకుండా కఠిన చర్య పడేలా చూస్తాం.’ అని వరంగల్ సీపీ తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ‘క్లూ’స్ టీం
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట మృతుల ఘటన ఇంకా మిస్టరీగానే మిగిలింది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పోలీసులను శనివారం ఆదేశించగా, కేంద్ర హోంశాఖ సైతం ఈ ఘటనపై ఆరా తీసింది. ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే క్రమంలో ఆదివారం హైదరాబాద్ నుంచి డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ‘క్లూ’స్ టీంను పంపించారు. ఆదివారం ఉదయమే వరంగల్కు చేరుకున్న ‘క్లూ’స్ టీం మొదట ఎంజీఎంలో మృతదేహాల నుంచి, ఆ తర్వాత గొర్రెకుంటలో ఘటన ప్రదేశమైన బావి, పక్కనే వారు నివాసం ఉండే ఇళ్ల నుంచి ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కేసు విచారణ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. హైదరాబాద్ సిటీ ‘క్లూ’స్ టీం హై సెక్యూరిటీ మధ్య నేర స్థలంలో ఆధారాలు సేకరించింది. ఈ బృందంలో క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఫొటో, వీడియోగ్రాఫర్తో పాటు ఎక్స్ఫర్ట్స్ ఉన్నారు. పాడుపడిన వ్యవసాయ బావితో పాటు, మృతులు నివాసం ఉండే ఇండ్లను ఉదయమే పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న బృందం ‘క్రైం సీన్ డు నాట్ క్రాస్’ అన్న రిబ్బన్ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఫొటోగ్రఫీ, వీడియో కెమెరాల ద్వారా నేరస్థలంలో సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడ కనిపించిన భౌతిక ఆధారాలను సేకరించారు. అంతకు ముందు ఎంజీఎంలో మృతదేహాలపై ఫింగర్ప్రింట్లతో పాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను సేకరించినట్లు ఆసుపత్రివర్గాల ద్వారా తెలిసింది. -
కనిపించని సంజయ్కుమార్ భార్య..
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీప బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనపై మిస్టరీ వీడింది. అందరూ అనుమానిస్తున్నట్లుగానే బావిలో శవాలుగా తేలిన వారంతా హత్యకు గురైనట్లు తేలింది. ఈ మేరకు తానే హత్య చేశానని నిందితుడు, బీహార్కు చెందిన కార్మికుడు సంజయ్కుమార్ యాదవ్ ఆదివారం అంగీకరించినట్లు తెలిసింది. కుట్రపూరి తంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెకుంటలో మృతుల ఘటన మిస్టరీ వీడింది. ఈ హత్యలకు పాల్పడింది తానేనని బీహార్కు చెందిన కార్మికుడు సంజయ్కుమార్ యాదవ్ ఆదివారం అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఏడుగురిని చంపేయాలని భావించినా తర్వాత ఇద్దరు బీహారీలను సైతం మట్టుపెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇందుకు ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం వరంగల్ నగరంలో నాలుగైదు మెడికల్ షాపుల నుంచి నిద్రమాత్రలు కొనుగోలు చేసిన సంజయ్, హత్య చేసే రోజు కూల్డ్రింక్స్లో నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. నిద్రమాత్రల కారణంగా అపస్మారక స్థితికి చేరిన వారిని స్నేహితులతో కలిసి గోనే సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా హత్యలకు కారకుడు సంజయ్కుమార్ యాదవే అయినా.. అతని వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. హత్యలకు కారణం ఆర్థిక లావాదేవీలా? వివాహేతర సంబంధాలా? అన్న చర్చ జరుగుతుండగా, అయితే ఢిల్లీలో ఉన్న మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ ప్రమేయం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా సంజయ్కుమార్ యాదవ్తో పాటు మక్సూద్ ఆలం మరదలు, యాకూబ్, మంకుషా, ఆటోడ్రైవర్ మోహన్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమచారం. పూర్తి వివరాల కోసం వారిని విచారిస్తున్నట్లు తెలిసింది.(గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్.. ) స్తంభంపల్లి ఇంట్లో ఆధారాలే కీలకం.. సంజయ్కుమార్ యాదవ్ నివాసం ఉండే స్తంభంపల్లిలో అతడు నివాసం ఉండే ఇంట్లో లభ్యమైన ఆధారాలే పోలీసుల విచారణకు కీలకంగా మారినట్లు తెలిసింది. తొమ్మిది మంది మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు గొర్రెకుంట బావికి సమీపాన రాంచందర్ అనే వ్యక్తి ద్వారా లభ్యమైన రెండు సెల్ఫోన్లు దొరకడం.. ఆ సెల్ఫోన్లు మక్సూద్ ఆలం. ఆయన భార్య నిషా ఆలంలకు చెందినవి కావడం.. ఆ ఫోన్ల కాల్డేటా ఆధారంగా కూపీ లాగారు. అలాగే హత్య జరిగే కొద్ది గంటల ముందు(20న సాయంత్రం 7 గంటలకు) వెంకట్రామ థియేటర్ సమీపంలో యాకూబ్, డ్రైవర్ షకీల్, సంజయ్కుమార్ కలుసుకుని గొర్రెకుంటలో మక్సూద్ ఇంటికి వెళ్లడం, ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్కుమార్ మాత్రమే వెంకట్రామ థియేటర్ చౌరస్తా నుంచి ఇంటికి వెళ్లడం రికార్డయిన సీసీ ఫుటేజీలు పోలీసుల పరిశోధనకు ఉపకరించినట్లు సమాచారం. మక్సూద్ ఆలం వారం రోజుల క్రితం రంజాన్ పండుగ కోసం ఓ షాపింగ్ మాల్లో సుమారు రూ.25 వేల సామగ్రి ఖరీదు చేసినట్లు తెలిసింది. అయితే హత్యలు జరిగిన మరుసటి రోజు(21న) ఉదయం మక్సూద్ ఇంట్లో గ్యాస్ స్టవ్ తప్ప సిలిండర్తో సహా సామగ్రి పోలీసులకు కనిపించలేదు. ఆ సిలిండర్, సామగ్రి సంజయ్కుమార్ యాదవ్ ఇంట్లో కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఇదే సమయంలో ఆ ఇంట్లో అతని భార్య కనిపించకపోవడంతో సంజయ్ను వాకబు చేయగా, బీహార్కు వెళ్లినట్లు చెప్పినట్లు తెలిసింది. పోలీసులు బీహార్లో ఆయన భార్య బంధువులను కూడా ఫోన్లో వాకబు చేయగా, ఆమె అక్కడకు రాలేదని చెపినట్లు సమాచారం. ఏ రోజు ఏం జరిగింది.. తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏమిటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం(55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్(20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. మరుసటి రోజు శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం(18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బీహార్ వలస కార్మికులు శ్యాం కుమార్షా(21) శ్రీరాం కుమార్షా(26) కనిపించకుండా పోవడం, సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్ (30) అనే డ్రైవర్ మృదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్ పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ ఫుటేజీ, సెల్ఫోన్ కాల్డేటా, స్తంభంపల్లిలో నివాసం ఉంటున్న సంజయ్కుమార్ యాదవ్ ఇంట్లో దొరికిన ఆధారాలతో అనుమానితుడిగా విచారించడంతో గొర్రెకుంట గుట్టు రట్టయ్యింది. -
మత్తు మందిచ్చి.. బావిలో పడేసి..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 మరణాల వెనుకున్న మిస్టరీ వీడింది. వరంగల్ నగర శివారు గొర్రెకుంటలోని ఓ పాడుపడిన వ్యవసాయ బావిలో ఈ నెల 21, 22 తేదీల్లో 9 మృతదేహాలు బయటపడటం వెనుక జరిగింది సామూహిక హత్యలేనని తేలింది. మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానిస్తున్న సంజయ్కుమార్ యాదవ్ తన బిహార్ స్నేహితులతో కలసి వారిని హత్య చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని ప్రధాన నిందితుడు ఈ కేసు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచా రణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ నెల 20న రాత్రి ముందుగా కూల్డ్రింక్స్లో నిద్ర మాత్రలు ఇచ్చి వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నాక స్నేహితుల సాయంతో గోనెసంచుల్లో పెట్టి పాడుపడిన వ్యవసాయబావిలో పడేసినట్లు నింది తులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సంజయ్కుమార్కు ఎవరెవరు సహకరించారనేది ఇంకా తెలియాల్సి ఉండగా సంజయ్తోపాటు మిడిదొడ్డి యాకూబ్, మంకుషా, మక్సూద్ మరదలు, ఓ ఆటో డ్రైవర్ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మక్సూద్ కుమారుడు సోహిల్ ఆలం పుట్టినరోజు 10 రోజుల క్రితం జరగ్గా అదేరోజు 9 మంది హత్యకు నిందితులు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. గుట్టువిప్పిన పోస్టుమార్టం సంజయ్కుమార్, ఇతర నిందితులు సాగించిన సామూహిక హత్యాకాండను పోస్టుమార్టం నివేదికలు నిగ్గుతేల్చాయి. మరణించిన తొమ్మిది మందిలో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్ వెల్లడించారు. మిగతా ఇద్దరిని మాత్రం వారు చనిపోయాక నిందితులు బావిలో పడేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ హత్యల కోసం ఈ నెల 20న రాత్రి 7 గంటలకు సంజయ్కుమార్ యాదవ్ డ్రైవర్ షకీల్కు ఫోన్ చేసి వెంకట్రామ థియేటర్ చౌరస్తాకు రావాలని సూచించగా అతను యాకూబ్ పాషాతో కలసి గొర్రెకుంట గోనెసంచుల గోదాం వద్దకు వచ్చినట్లు సమాచారం. ఆ ముగ్గురు కలసి వెంకట్రామ థియేటర్ చౌరస్తా సమీపంలో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డవగా 21న ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్కుమార్ మాత్రమే తిరిగి వచ్చినట్లు రికార్డయినట్లు సమాచారం. అదే విధంగా గొర్రెకుంట బావికి కిలోమీటర్ దూరంలో లభ్యమైన సెల్ఫోన్ కాల్డేటా కూడా హంతకుడిని కనిపెట్టడంలో కీలకంగా మారినట్లు తెలిసింది. ఈ క్లూల ద్వారా కూడా పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు చెబుతున్నారు. కాగా, గొర్రెకుంటలో 9 మంది సామూహిక హత్యల వెనుక ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయా లేక వివాహేతర సంబంధాలా అనే విషయం తెలియాల్సి ఉంది. మహ్మద్ మక్సూద్ ఆలం గోనెసంచులు కుడుతూ జీవనం గడుపుతున్నా ఇటీవలే ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రంజాన్ సందర్భంగా ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు రూ. 25 వేల విలువైన సామగ్రి ఖరీదు చేసినట్లు సమాచారం. అలాగే భర్తతో విడిపోయిన మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్కు సంజయ్కుమార్ యాదవ్తో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. బుష్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు కూడా తెలిసింది. ఇంటి పైవాటాలో ఉంటున్న బిహార్కు చెందిన కార్మికులు శ్రీరాం, శ్యామ్లు వీరి గొడవలో జోక్యం చేసుకొని బుష్రాపై కన్నేసినట్లు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్కుమార్ పథకం ప్రకారం 9 మందిని హతమార్చినట్లు మరో ప్రచారం ఉంది. ఏదేమైనా నేడో, రేపో ఈ ఘటనపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. కాగా, హైదరాబాద్ సిటీ క్లూస్ టీం ఆదివారం గొర్రెకుంటలో పలు ఆధారాలను సేకరించింది. ఎంజీఎంలో ఉన్న 9 మృతదేహాలపై ఫింగర్ప్రింట్స్తోపాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను కూడా సేకరించినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది. -
వరంగల్ హత్యల కేసు: వీడిన మిస్టరీ
-
గొర్రెకుంట గుట్టు వీడింది: సంచలన నిజం
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. 9 మందిని తానే హత్య చేశానని కేసులో నిందితుడిగా ఉన్న బిహార్కు చెందిన సంజయ్ కుమార్ అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పట్లు సంజయ్ చెప్పాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే ఢిల్లీలో మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ డైరెక్షన్లోనే వారందరినీ దారుణంగా హత్య చేశానని సంజయ్ చెప్పడం కొసమెరుపు. ఇక మక్సూద్ భార్య, కూతురితో సంజయ్ వాట్సప్ చాటంగ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తొలుత ఇద్దరు బిహారీలను వదిలేద్దామని సంజయ్ భావించగా.. కేసు బయటకు వస్తే జైలుకు పోవాల్సి వస్తుందని వారిద్దరిని కూడా హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. ప్రస్తుతం సంజయ్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఘటన జరిగిన మూడు రోజుల్లోనే వరంగల్ పోలీసులు కేసును చేధించడం గమనార్హం. సంఘటన వివరాలు.. తొలుత గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డ విషయం తెలిసిందే. సాయిదత్త ట్రేడర్స్కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీశారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్ (20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు. (విషప్రయోగం చేసి చంపారనే అనుమానం?) శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్ వలస కార్మికులు శ్యాం కుమార్షా (21) శ్రీరాం కుమార్షా(26) కనిపించకుండా పోవడం,సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్(30) అనే డ్రైవర్ మృతదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్ పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే అనుమానితుడి భావిస్తున్న సంజయ్ కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కోణంలోనే తొలి నుంచి విచారించారు. పోలీసులు భావించిన విధంగానే వారు హత్యకు గురైయ్యారు. -
గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ
-
గొర్రెకుంట మృతుల కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తొమ్మిది మంది వలస కార్మికులది హత్యా.. ఆత్మహత్యా.. ఒకవేళ హత్యకు గురైతే చంపిందెవరు.. ఆత్మహత్యకు పాల్పడితే అందుకు కారణమేమిటి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఇద్దరు బీహార్ కార్మికులు, ఓ డ్రైవర్ సహా మొత్తం తొమ్మిది మంది మృతి వెనుక అసలు విషయమేమిటి... ఇలా అనేక సందేహాలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. అయితే బావిలో నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్లే వీరంతా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తేల్చారు. ఏడు మృతదేహాల్లో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ పాడుపడిన బావిలో తొమ్మిది మంది మృతి చెందిన దుర్ఘటనపై విచారణ ఇంకా కొలిక్కి రాని విషయం తెలిసిందే. పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన విధంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై ఏడు ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందాల(సిట్) పరిశోధన ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ ఘటన వరంగల్ పోలీసులకు సవాల్గా మారగా, త్వరలోనే ఆ తొమ్మిది మంది కార్మికుల మృతిపై మిస్టరీ వీడనుందని అంటున్నారు. పోలీసుల అదుపులో కీలక వ్యక్తులు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిపాటి పురోగతి సాధించారు. ఇప్పటికే మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాటూన్ ప్రియుడు యాకూబ్తో పాటు బీహార్కు చెందిన కార్మికులు సంజయ్ కుమార్ యాదవ్, మంకుషా లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వరంగల్కు చెందిన మరో ఇద్దరిని శనివారం పట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వరంగల్కు చెందిన ఆ ఇద్దరి వద్ద నుంచే మృతులలో ఇద్దరికి చెందిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండు సెల్ఫోన్లు తొమ్మది మంది మృతి చెందిన బావి సమీపంలో దొరికినట్లు ఆ ఇద్దరు వెల్లడించినట్లు తెలిసింది. సెల్ఫోన్లు చేజిక్కించుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. (చనిపోయారా.. చంపేశారా?) కాగా ఆ రెండు సెల్ఫోన్లలో ఒకటి మక్సూద్ ఆలంకు చెందినది కాగా, మరోటి ఆయన కూతురు బుష్రా ఖాతూన్గా ప్రచారం ఉంది. ఆ రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న ‘సిట్’, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఫోన్కాల్స్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 6 గంటల తరువాత మక్సూద్ వీరితో ఫోన్లో మాట్లాడాడు. పోలీసులు బీహారీ యువకులను సంఘటనా స్థలానికి తీసుకువచ్చి మరోసారి విచారణ చేపట్టారు. దీంతో ఈ కేసులో మంకుషా వాంగ్మూలం కీలకంగా మారింది. ఫోరెన్సిక్, నిఘావర్గాల ఆరా... గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై ఫోరెన్సిక్, కేంద్ర, రాష్ట్ర ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీశారు. తొమ్మిది మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రజామాలిక్ బృందం, వారి మృతికి కారణమైన బావిని పరిశీలించింది. బార్దాన్ సంచుల గోదాము, ఆ గోదాం ఆవరణలో వారు నివాసం ఉండే క్వార్టర్లను కూడా వారు పరిశీలించారు. పాడు పడిన వ్యవసాయ బావిలో తొమ్మిది మంది మృతదేహాలు తేలిన ఘటనపై నివేదిక పంపేందుకు కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాల అధికారులు సైతం సందర్శించారు. (గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...) సెంట్రల్ ఇంటలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ రీజనల్ ఇంటలిజెన్స్ అధికారులు వేర్వేరుగా పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ‘సిట్’ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అందులో ఇద్దరినీ శనివారం ఉదయం గొర్రెకుంటలోని 9 మంది మృతి చెందిన బావి వద్దకు తీసుకు వచ్చి పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్కుమార్ యాదవ్, మంకుషాలను సంఘటన వద్దకు తీసుకు వచ్చిన పోలీసులు ‘సీన్ రీ కన్స్ట్రక్షన్’ తరహాలో ఆరా తీశారు. కాగా పోలీసుల ఇన్వెస్టిగేషన్కు సెల్ఫోన్ సంభాషణలు, కాల్డేటా కీలకంగా మారాయి. ఫోన్ కాల్స్ వివరాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ మక్సూద్ తనయ బుష్రా ఖాతూన్, ఆమెతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తోన్న యాకూబ్ ఫోన్ కాల్స్తోపాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. -
ప్రాణాలతో వుండగానే బావిలో...
-
గొర్రెకుంట: ప్రాణాలతో వుండగానే బావిలో...
సాక్షి ప్రతినిధి, వరంగల్: తీవ్ర కలకలం రేపిన వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సంఘటనపై అసలేం జరిగిందనే దానిపై కేంద్ర హోం శాఖ శనివారం ఆరా తీసినట్లు సమాచారం. వ్యవసాయ బావిలో తొమ్మిది మృతదేహాలు తేలిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు శనివారం గొర్రెకుంటలోని బావిని పరిశీలించారు. కాగా, తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వాళ్లంతా ప్రాణాలతో ఉండగానే బావిలో పడినట్లు ప్రాథమిక నివేదికలో తేల్చారు. వాళ్లంతట వాళ్లే కావాలని బావిలోకి దూకారా.. లేదంటే మత్తు, విషం లాంటిది ప్రయోగించి బతికి ఉండగానే బావిలో పడేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) పోలీసుల అదుపులో ముగ్గురు.. ఈ కేసులో మూడు రోజులు గడిచినా పురోగతి లేదు. ఈ నేపథ్యంలో పలు కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసు ప్రత్యేక బృందాలు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు బావిలో శవమై తేలిన బుష్రా ఖాతూన్ ప్రియుడు యాకూబ్ కాగా, మరో ఇద్దరు బిహార్కు చెందిన కార్మికులు. యాకూబ్ను శుక్రవారమే అదుపులోకి తీసుకోగా, శనివారం సంజయ్ కుమార్ యాదవ్, మంకుషాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలకు రెండు సెల్ఫోన్లు దొరికినట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి మక్సూద్ది కాగా, మరొకటి బుష్రా ఖాతూన్దిగా చెబుతున్నారు. ఆ రెండు ఫోన్ల కాల్డేటా వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. (చనిపోయారా.. చంపేశారా?) గొర్రెకుంటలో సీన్ రీ కన్స్ట్రక్షన్ ముగ్గురు ఆనుమానితులు అదుపులోకి తీసుకుని రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు, శనివారం ఉదయం గొర్రెకుంటలోని బావి వద్ద పలు కోణాల్లో పరిశోధన జరిపారు. సంజయ్కుమార్ యాదవ్, మంకుషాను సంఘటన వద్దకు తీసుకువచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో పరిశీలించారు. మొదటి అంతస్తులోని మరణించిన ఇద్దరు బిహారీల గదిని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటలక్ష్మి నేతృత్వంలో పోలీసు బృందాలు పరిశీలించాయి. బంగ్లా మీది నుంచి ఎవరైనా బలవంతంగా బావిలో పడేయడం సాధ్యమేనా అన్న కోణంలో విచారణ జరిపారు. సుమారు గంట పాటు గొర్రెకుంటలో పరిశీలన చేశారు. (గీసుకొండ ఘటనపై పలు అనుమానాలు) పకడ్బందీగా దర్యాప్తు చేయండి: హోంమంత్రి వరంగల్ జిల్లాలోని గొర్రెకుంట ఘటనపై పకడ్బందీగా దర్యాప్తు జరపాలని వరంగల్ పొలీసు కమిషనర్ వి.రవీందర్ను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. సెల్ఫోన్ సంభాషణలే కీలకం ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్ల వారంతా చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఎంజీఎం మార్చురీ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ రజామాలిక్ పేర్కొన్నారు. బావిలోనే తుది శ్వాస విడిచారని, అయినా వారి విస్రాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని, వారిపై ఫుడ్ పాయిజన్ జరిగిందా.. లేదా అనేది తేలాలంటే ఫోరెన్సిక్ నివేదిక రావాలని తెలిపారు. నలుగురు మృతుల ఒంటిపై గాయాలు ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసుల పరిశోధనకు సెల్ఫోన్ సంభాషణలు, కాల్డేటా కీలకంగా మారాయి. బుష్రా ఖాతూన్, ఆమెతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న యాకూబ్ ఫోన్ కాల్స్తో పాటు ఇతరులతో మక్సూద్ ఏం మాట్లాడాడనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. మృతుల్లో ఏడుగురి సెల్ ఫోన్లు కనిపించకపోవడంతో వాటి కోసం గాలిస్తున్నారు. మార్చురీలోనే మృతదేహాలు తొమ్మిది మృతదేహాలు కూడా శనివారం రాత్రి వరకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను ఫ్రీజర్లలో భద్రపరిచారు. శనివారం ఉదయం మృతదేహాలను ఖననం చేస్తారని భావించారు. కానీ మక్సూద్ బంధుమిత్రులు పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నారనే సమాచారంతో మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, కేసు ఓ కొలిక్కి వచ్చేవరకు మృతదేహాలను భద్రపరచనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
గీసుకొండ ఘటన: పోస్ట్మార్టం నివేదిక
సాక్షి, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో వెలుగుచూసిన తొమ్మిది మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయింది. వరంగల్ ఎంజీఎంలో వైద్యులు శనివారం పోస్ట్మార్టం చేసి, ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. ఆ తొమ్మిదిమంది నీటిలో మునిగే చనిపోయినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడి అయింది. అలాగే బావిలో పడినప్పుడు ఎనిమిదిమంది శరీరాలపై గాయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించి, నమునాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. కాగా సాయిదత్త ట్రేడర్స్కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరందరికీ మత్తు ఇచ్చారా? లేక విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (గీసుకొండ బావిలో 9 మృత దేహాలు) -
పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంటలోని పాడు పడిన బావిలో సమాధి అయిన వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు పరిశోధనలో నిమగ్నమయ్యారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలంతో పాటు భార్య, కుమార్తె, మనవడు గురువారం బావిలో తేలగా ఆయన ఇద్దరు కుమారులతో పాటు మరో ముగ్గురి మృతదేహాలు శుక్రవారం బయటపడ్డాయి. దీంతో తొమ్మిది మంది మరణంపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరైనా హత్య చేశారా? వారే ఆత్మహత్య చేసుకున్నారా? అన్న చిక్కుముడిని విప్పడం కోసం విచారిస్తున్నారు. వరంగల్ పోలీసులకు సవాల్గా మారిన ఈ అంతుచిక్కని మరణాలపై అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, ఇద్దరు ఏసీపీల సారథ్యంలో ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ శుక్రవారం రాత్రి 11 గంటల వరకు ప్రత్యేక బృందాలు(సిట్), ఐటీ కోర్, ‘క్లూస్ టీంలతో సమావేశమయ్యారు.(చనిపోయారా.. చంపేశారా?) నంబర్లు గుట్టు విప్పేనా.. బావిలో తేలిన తొమ్మిది మంది మృతి మిస్టరీ చేధించేందుకు పోలీసులు అన్ని దారుల్లో విచారణ తీవ్రతరం చేశా రు. ఈ కేసులో మహ్మద్ మక్సూద్ ఆలంకు సన్నిహితుడైన డ్రైవర్ షకీల్ అహ్మద్, మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్తో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తున్న మిద్దెపాక యాకూబ్ కీలకంగా మారారు. అయితే ఈ ఘ టనలో షకీల్ మృతి చెందగా, ఆయన సెల్ఫోన్పై పోలీ సులు దృష్టి సారించారు. ఈనెల 20 రాత్రి 7.30 గంటలకు షకీల్ భార్య తాహెరా బేగంతో షకీల్ ఫోన్లో మాట్లాడాడు. ‘మక్సూద్ అన్న అర్జెంట్గా రమ్మంటే వ చ్చిన.. రాత్రి 10 గంటల వరకు వస్తాను’ అని చెప్పిన షకీ ల్ ఆ తర్వాత మరుసటి రోజు వరకు మాట్లాడలేదు. శుక్రవారం తేలిన ఐదు శవాల్లో షకీల్ కూడా శవమై తేలాడు. దీంతో ఆయన సెల్ నంబర్లు 62814 25573, 98754 34986 కాల్డేటా సేకరిస్తున్నట్లు తెలిసింది. అలాగే బు ష్రా ఖాతూన్ ప్రియుడిగా అనుమానం ఉన్న మిద్దెపాక యాకూబ్ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫోన్(99514 88705)ను స్వాధీనం చేసుకుని కాల్డేటా సేకరణలో నిమగ్నమయ్యారు. ఇక బీహా ర్కే చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి, ఇక్కడే పనిచేసే సంజయ్కుమార్ యాదవ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఫోన్(76448 36969) నుంచి మృతుల ఫోన్లకు పలుమార్లు ఫోన్ వచ్చాయని తేలడంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసువర్గాల సమాచారం.(గీసుకొండ బావిలో 9 మృత దేహాలు) వారి సెల్ఫోన్లు ఎక్కడ? గొర్రెకుంట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మందిలో ఏడుగురి సెల్ఫోన్ల ఆచూకీ దొరకలేదు. మృతుల వివరాలు వెల్లడించిన సందర్భంగా పోలీసులు ఫోన్ నంబర్లు ప్రకటించారు. అయితే మహ్మద్ మక్సూద్ ఆలం (99639 84070), ఆయన భార్య నిషా ఆలం(93470 15241), కూతురు బుషారా కాటూన్(93470 15241), కుమారులు షాబాజ్ ఆలం(62818 23765), సోహిల్ ఆలం(93983 41581), బీహార్కు చెందిన శ్రీరాంకుమార్షా(83078 96729), శ్యాంకుమార్షా(95289 07640) సెల్ఫోన్ల ఆచూకీ దొరకలేదు. మృతదేహాలను వెలికి తీసిన తర్వాత సెల్ఫోన్ల కోసం బావి నుంచి నీరంతా తోడినా ఫలితం కానరాలేదు. ఈనెల 20న రాత్రి 8గంటల వరకు షకీల్ ఫోన్ మాత్రమే పనిచేయగా, మిగతా వారి ఫోన్లు స్విచ్ఛాప్ అయినట్లు సమాచారం. మిస్టరీగా మారిన ఈ ఘటనలో సెల్ఫోన్లు కీలకం కాగా, ఆ దిశలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా మక్సూద్ కూతురు బుషారా కాటూన్ ఫోన్(93470 15241) కాల్డేటా సేకరణలో పోలీసులు నిమగ్నం కాగా, త్వరలోనే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నీట మునిగాకే తొమ్మిది మంది మృతి ఎంజీఎంలో తొమ్మిది మృతదేహాలకు శుక్రవారం రాత్రి 9.30 గంటలకు పోస్టుమార్టం ముగిసింది. అందరూ సజీ వంగానే బావిలో మునిగినట్లు.. ఆ తర్వాత మృతి చెందారని ప్రాథమికంగా వైద్యనిపుణులు నిర్ధారించారు. అలాగే, మూడేళ్ల బాబు మినహా ఎనిమిది మంది శరీరా లపై బావిలో పడినప్పుడు గీరుకుపోయినట్లు గాయాలున్నట్లు వెల్లడించారు. ఇక మృతదేహాల నుంచి సేకరించిన శాంపిళ్ల(మిశ్రా)ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపించారు. ఆ నివేదిక వస్తే తప్ప విష ప్రయోగం జరిగిందా లేదా ఎవరైనా కొట్టి నెట్టేశారా లేదా వాళ్లే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనేది తేలనుంది. ఇదిలా ఉండగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక వారి బంధువులకు సమాచారం ఇచ్చామని వరంగల్ తహసీల్దార్ ఇక్భాల్ తెలిపారు. షకీల్ భార్య, పిల్లలు వరంగల్లోనే ఉండగా, పశ్చిమబెంగాల్, బీహార్లోని మిగతా మృతుల బంధువులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. తొమ్మిది మృతదేహాలకు వరంగల్లో అంత్యక్రియలు జరిపించనున్నట్లు ఇక్బాల్ వెల్లడించారు. ప్రత్యేక బృందాలు అనుమానాస్పదంగా మరణించిన తొమ్మిది మందికి సంబంధించి కేసు విచారణకు ప్రత్యేక పోలీస్ బందాలను ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ శుక్రవారం ప్రకటించారు. ఎలా మృతి చెందారనే విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేసును పరిష్కరించడం కోసం అన్నికోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు సీపీ వెల్లడించారు. ఒక్కటొక్కటిగా తేలిన మృతదేహాలు సాక్షి, వరంగల్ రూరల్ / గీసుకొండ : బావిలో నుంచి ఒక్కో మృతదేహం పైకి తేలుతూ వచ్చింది... దీంతో అసలు ఎన్ని మృతదేహాలు ఉన్నాయనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలోని బావిలో గురువారం నాలుగు మృతదేహాలు బయట పడిన విష యం విదితమే.. వీరు ఎలా మృతి చెందారనే విషయంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే శుక్రవారం మళ్లీ ఐదుగురి మృతదేహాలు తేలడంతో కలకలం రేగింది. పోలీసుల అదుపులో యాకూబ్ మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్కు దగ్గరి మిత్రుడైన మిద్దేపాక యాకుబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీమాబాద్లో ఉంటున్న సమయంలో బుష్రా ఖాతూన్తో ఆయనకు బాగా పరిచయం ఉండేదని సమాచారం. బుష్రా ఖాతున్ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారించగా ఎక్కువ ఫోన్లు యాకుబ్కు వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో గురువారం రాత్రే యాకుబ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మక్సూద్ కుటుంబంతో ఇంకా ఎవరెవరికి పరిచయం ఉంది, బంధువులు ఎక్కడ ఉన్నారు.... ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా....అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం సాయిదత్తా ట్రేడర్స్కు తాను వెళ్లిన సమయంలో అందరూ బాగానే కనిపించారని యాకూబ్ చెప్పాడని తెలిసింది. ఈనెల 25న మళ్లీ కరీమాబాద్కు.... లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఇంతకాలం గొర్రెకుంటలో ఉంటున్న మక్సూద్ కుటుంబం తిరిగి పాత నివాసమైన కరీమాబాద్కు ఈనెల 25న వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం కరీమాబాద్లో అద్దెకు ఉంటున్న నివాస యజమానికి వచ్చి చెప్పడమే కాకుండా గదిని శుభ్రం చేశారని సమాచారం. మక్సూద్ కుమార్తె బుష్రా ఖాతున్ విషయంలో బీహార్ యువకులు శ్రీరాం, శ్యాంకు ఘర్షణ జరుగుతుండడంతో త్వరగా కరీమాబాద్కు మకాం మార్చాలని భావించినట్లు తెలుస్తోంది. ఇంతలోనే కుటుంబంలోని అందరూ మృతదేహాలుగా తేలారు. బృందాలుగా వీడిపోయి విచారణ పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి ఘటనపై విచారణ చేపడుతున్నారు. ఘటన జరిగిన సమీపంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిశీలిస్తూ పుటేజీలు సేకరిస్తున్నారు. ట్రేడర్స్కు సమీపంలోనే కాకుండా కరీమాబాద్లో మక్సూద్ ఇంటి సమీపంలోని వారి నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇక ఇద్దరు బీహార్ వలస కార్మికులు నివాసముండే గదులతో పాటు మక్సూద్ కుటుంబం నివాసం ఉండే గదుల్లో నిపుణులు వేలిముద్రలను సేకరించారు. అలాగే వండిన భోజనం, తినకుండా ప్లేట్లలో వదిలివేసిన అన్నం, ఆకుకూర పప్పు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. నీటిని తోడిన డీఆర్ఎఫ్ సాయిదత్తా ట్రేడర్స్కు పక్కనే ఉన్న పాత బావిలో నీరు మొత్తాన్ని మోటార్ల సహాయంతో గ్రేటర్ వరంగల్ డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తోడారు. సుమారు 60ఫీట్ల లోతు ఉన్న బావి లో ఉన్న నీటిని మొత్తం తోడారు. ఏమైనా ఆధారాలు, సెల్ ఫోన్లు లభిస్తాయోమోనని పోలీసులు పరిశీలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ మృతదేహాలు తేలిన బావిని నగర పోలీస్ కమిషనర్ రవీందర్ పరిశీలించారు. ఈ మేరకు పోలీసు అధికారులతో ఆరా తీశారు. ఇంకా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్రావు, డీసీసీ, బీజేపీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, కొండేటి శ్రీధర్, ఆర్డీఓ మహేందర్జీతో పాటు నల్లెల్ల రాజయ్య, ల్యాదల్ల బాలు, సుంకరి శివ తదితరులు వివరాలు తెలుసుకోగా స్థానికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
చనిపోయారా.. చంపేశారా?
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. సాయిదత్త ట్రేడర్స్కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్ మక్సూద్ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్ (20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా మక్సూద్, అతడి భార్య, కూతురు, మనవడితో పాటు ఇద్దరు కుమారులు షాబాజ్ ఆలం, సోహిల్ ఆలంలు వరంగల్ కరీమాబాద్ ప్రాంతం నుంచి వచ్చి 2 నెలలుగా గోదాంలోని గదుల్లోనే ఉంటున్నారు. మక్సూద్, అతడి భార్య గోదాంలో గోనె సంచులు కుట్టే పనిచేస్తుండగా వారి కుమారుల్లో ఒకరు వరంగల్లోనే పాలిటెక్నిక్, మరొకరు ఇంటర్, కూతురు ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్నారు. వారి కుటుంబం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి 20 ఏళ్ల కింద వరంగల్కు వలస వచ్చింది. శుక్రవారం మక్సూద్ కుమారులైన షాబాజ్ ఆలం(19), సోహిల్ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్ వలస కార్మికులు శ్యాం కుమార్షా (21) శ్రీరాం కుమార్షా(26) కనిపించకుండా పోవడం,సెల్ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్(30) అనే డ్రైవర్ మృతదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్ పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. బుష్రా చుట్టూ దర్యాప్తు వీరందరినీ ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కాస్త స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, బావి వద్ద బట్టలు పిండిన మూటలు లభించాయి. బుధవారమే మక్సూద్ మనవడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలోనే బిహార్ యువకులు.. స్థానిక యువకుల మధ్య గొడవ జరిగిందని చెబుతున్నారు. వీరి ఇంటిపై ఉంటున్న శ్రీరాం, శ్యామ్ వీరి గొడవలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ గొడవతోనే వీరిపై విషప్రయోగం జరిగిందా.. అని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను కూడా విచారిస్తున్నారు. యాకూబ్ పాషా అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మక్సూద్ కూతురితో యాకూబ్ పాషాకు వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. పాఠశాల వయసు నుంచే వీరికి పరిచయం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఘటన అతడి పనే అయి ఉంటే.. అంత మందిని ఒక్కడే చంపలేడని.. మరింకొందరి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, మక్సూద్కు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని గోదాం యజమాని చెబుతున్నారు. మక్సూద్, నిషా, బుష్రా ఖాతున్ శవాల గుట్టలా గొర్రెకుంట బావి.. ఒక్కొక్కటిగా తేలుతున్న శవాలతో.. గొర్రెకుంటలోని బావి శవాల గుట్టను తలపించింది. రెండో రోజు శుక్రవారం స్థానిక గొర్రెకుంటవాసులు ఉదయం 7 గంటలకు బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఓ శవం తేలి ఉండటాన్ని గమనించి పోలీసులకు తెలిపారు. దీంతో వరంగల్ పోలీసు కమిషనర్ వి.రవీందర్, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు శివరామయ్య, పుల్యాల కిషన్, ఎస్ఐలు అబ్దుల్ రహీం, నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తొలుత మక్సూద్కు సన్నిహితుడైన మహ్మద్ షకీల్ మృతదేహం తేలింది. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్తో తోడిస్తుండటంతో మక్సూద్ పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం, శ్రీరాం కుమార్షా, తర్వాత మక్సూద్ చిన్న కుమారుడు సోహిల్ ఆలం, చివరగా శ్యాం కుమార్షా మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి క్లూస్ టీం.. పోలీసులు, వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్కు చెందిన డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సర్వీసెస్, మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి అంబులెన్స్లో ఎక్కించారు. కాగా, బావిలో శవాలై తేలిన ఇద్దరు బిహార్ వలస కార్మికులు ఉండే డాబా పైగదులతో పాటు మక్సూద్ కుటుంబం నివాసం ఉండే మెయిన్ గేటు లోపలి వైపు ఉన్న గదుల్లో నిపుణులు వేలి ముద్రలను సేకరించారు. అలాగే వండిన భోజనం, తినకుండా ప్లేట్లలో వదిలేసిన ఆహారపదార్థాలను పరీక్షల నిమిత్తం సేకరించారు. శ్యామ్, శ్రీరామ్ నివాసం ఉండే గదిలో మిగిలిపోయిన భోజన పదార్థాలు నీళ్లలో మునిగాకే మృతి తొమ్మిది మృతదేహాలకు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మొదలైన పోస్టుమార్టం రాత్రి 9.30 గంటలకు పూర్తయింది. పోస్టు మార్టంపై వైద్యులు ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. మృతులందరూ నీళ్లలో మునిగాకే చనిపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక మృతుల్లో మూడేళ్ల బాలుడు మినహా మిగిలిన 8 మంది శరీరాలపై బావిలో పడినప్పుడు రాళ్లు, ఇతరత్రా గీరుకుపోయిన గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక విషాహారం తీసుకున్నారా లేదా అనేది తేల్చేందుకు మృతదేహాల నుంచి సేకరించిన ‘మిశ్రా’ను హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. విషప్రయోగం జరిగిందా..? ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను బట్టి వీరిపై విష ప్రయోగం జరిగిందని పోలీసులు అభిప్రాయానికి వచ్చారని సమాచారం. సాధారణంగా బావిలో తేలిన మృతదేహాల పరిస్థితిని బట్టి అది ప్రమాదమా..? మరణించాక పడేశారా? అన్న విషయంలో ఘటనా స్థలంలోనే ప్రాథమిక అంచనాకు వస్తారు. అయితే ఇక్కడ బావిలో తేలిన మృతదేహాల పరిస్థితి చూసిన పలువురు పోలీసులు వీరిపై విష ప్రయోగం జరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే బుధవారం రాత్రి 9 గంటల వరకు మక్సూద్ కుటుంబసభ్యులు మెలకువతోనే ఉన్నారన్న పక్కా సమాచారం పోలీసుల వద్ద ఉంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది ఆ 12 గంటలే కీలకం.. బుధవారం మక్సూద్ కుటుంబసభ్యులతో పాటు, పక్క గదిలో ఉండే ఇద్దరు బిహార్ యువకుల శరీరంలోకి ఆహారం లేదా ఫ్రూట్ జ్యూస్ ద్వారా విషం చేరి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ విషప్రయోగం జరిగి ఉంటే వారు వెంటనే చనిపోయి ఉండరు. పైగా వారి మృతదేహాలను బావి వద్దకు తీసుకెళ్లి పడేసేందుకు అర్ధరాత్రి వరకు ఆగి ఉంటారు. అంటే బుధవారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలు దాటాకే పడేసే అవకాశముంది. సాధారణంగా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాత శరీరంలో కాఠిన్యత మొదలవుతుంది. ఫలితంగా గ్యాస్లు ఏర్పడతాయి. దీంతో శరీరం 20 నుంచి 24 గంటల్లో పైకి తేలుతుంది. ఇది శరీరంలో ఉన్న కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఆడవారు, చిన్నపిల్లల దేహంలో గ్యాస్లు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి వీరి శవాలు ముందే నీటిపై తేలుతాయి. అయితే బయటే ప్రాణాలు పోయిన దేహాలు మాత్రం పైకి తేలేందుకు 12 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఐదుగురు బతికే ఉన్నారా? మొదటిరోజు బయటికి వచ్చిన మక్సూద్, అతడి భార్య, కూతురు, మనవడు మృతదేహాలు ఈ కారణాల వల్లే ముందుగా పైకి తేలాయని భావిస్తున్నారు. అలాగే శుక్రవారం పైకి తేలిన ఐదు మృతదేహాల్లో అందరికీ ముక్కు వద్ద నురగ ఉంది. అంటే వీరిని బావిలో పడేసే సరికి కొన ఊపిరితో ఉండి ఉంటారని భావిస్తున్నారు. బావిలో పడ్డాకే చనిపోయి ఉంటే ఊపిరితిత్తుల్లోకి, మధ్య చెవి వరకు నీరు చేరుతుంది. శరీరంలో డయాటమ్స్ (శైవలాలు) చేరతాయి. అదే మరణించిన తర్వాత పడేస్తే.. ఇవేమీ కనబడవు. విస్రా (శరీరంపై విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలిపే టెస్టు)లో విషప్రయోగంపైనా స్పష్టత వస్తుంది. మృతుల్లోనే హంతకుడూ ఉన్నాడా? ఈ కేసులో పోలీసులు మరో ఆసక్తికర కోణంలోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులు ఎక్కడి నుంచో రారు. పరిచయస్తులే దారుణాలకు ఒడిగడతారు. ఇలాంటి నరమేధాల అనంతరం భయంతో వారు కూడా ఆత్మహత్యకు పాల్పడుతారు. ఒకవేళ అదే నిజమైతే.. చివరగా పైకి తేలిన మృతదేహం హంతకుడిదే అయి ఉండొచ్చని కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బావిలో 9 మృతదేహాలు: హత్యా.. ఆత్మహత్యా?
-
గీసుకొండ ఘటనపై పలు అనుమానాలు
సాక్షి, వరంగల్ : జిల్లాలోని గీసుకొండ బావి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మక్సూద్ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా బలవంతంగా వారిని బావిలో తోశారా అనేది పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. అయితే తొలుత బావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కాగా శుక్రవారం ఉదయం మరో ఐదు మృతదేహాలు బయటపడటం తీవ్ర కలకలం రేపుతోంది. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యా.. ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసుల విచారణ సాగుతోంది. ఇప్పటి వరకు తేలిసిన వివరాల ప్రకారం బయటపడిన 9 మృతదేహాల్లో ఆరుగురు మక్సూద్ కుటుంబసభ్యులే కాగా.. మిగిలిన ముగ్గురు ఎవరనేది మిస్టరీగా మారింది. (చినిగిన వలస బతుకులు!) స్థానికుల సమాచారం ప్రకారం ఇటీవల ఎం.డీ.మక్సూద్ ఆలం మనవడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మక్సూద్ కూతురు బుష్రా ఖాతూన్ విషయంలో బిహార్ యువకులు, స్థానికుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అయితే గురువారం రాత్రి నుంచి బిహార్కు చెందిన శ్రీరాం, శ్యాం నుంచి కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మక్సూద్ కూతురితో వీరికి ఏమైనా సంబంధం ఉందా..? ఘటనకు వివాహేతర సంబంధం కారణమా? పుట్టినరోజు వేడుకలో జరిగిన గొడవలే కారణమా? ఇతర కుటుంబ కలహాలు కారణమా? కనిపించకుండా పోయిన ఇద్దరు బిహార్ వ్యక్తులు ఎక్కడా? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (బాలికను గర్భవతి చేసిన 70ఏళ్ల వృద్ధుడు) ఈ క్రమంలోనే యాకూబ్పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల విచారిస్తున్నారు. శ్యాం, రాంలు వీరందరిని హత్య చేసి ఉంటారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. ఇదిలావుండగా వీరందరిపై విషప్రయోగం జరిగినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై సీపీ రవీందర్ మాట్లాడుతూ.. పారిపోయిన ఇద్దరు బిహార్ వ్యక్తుల కోసం గాలింపు చేస్తున్నామని తెలిపారు. ఘటనపై పలు అనుమానాలున్నాయని, విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల వివరాలు.. 1)మాసూద్ అలం (50) 2)నిషా అలం భార్య (45) 3)బూస్రా అలం (22) (కూతురు) 4)3 సంవత్సరాల బాబు 5)శబాజ్ అలం (21) కొడుకు 6)సోహిల్ అలం (20) కొడుకు 7) షకీల్ (40) డ్రైవర్ 8) శ్రీరామ్ (35) తోటి కార్మికుడు 9) శ్యామ్ (40) తోటి కార్మికుడు -
గీసుకొండ బావిలో 9 మృత దేహాలు
సాక్షి, వరంగల్: ఒక బావిలో ఏకంగా తొమ్మిది మృతదేహాలు కనిపించడం జిల్లాలో సంచలనంగా మారింది. గురువారం నాలుగు మృతదేహాలు లభించగా, శుక్రవారం మరో ఐదు మృతదేహాలు నీట తేలాయి. దీంతో వరంగల్ జిల్లా గీసుకొండ మండటం గొర్రెకుంటలోని బావిలో లభ్యమైన మొత్తం మృతుల సంఖ్య 9కి చేరుకుంది. తీవ్ర అనుమానాస్పదంగా మారిన ఈ సంఘటనపై జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. మృతిచెందిన వారిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగతా వారిలో ఇద్దరు బిహార్, ఒకరు పశ్చిమ బెంగాల్కు చెందిన డ్రైవర్గా గుర్తించారు. పొట్టకూటి కోసం ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన కుటుంబం. గత ఇరవై ఏళ్లుగా వరంగల్ కరీమాబాద్లో నివాసముంటూ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో గన్నీ సంచుల గోదాంలో (బార్దాన్) పనిచేస్తున్నట్టు తేలింది. ఈ దంపతులతో పాటు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉండేవారు. గురువారం తొలుత నాలుగు మృత దేహాలు లభించినప్పుడు హత్యలుగా భావించారు. అయితే, ఈరోజుతో లభించిన మొత్తం 9 మృతదేహాలపైనా ఎక్కడా గాయాలు లేకపోవడం మిస్టరీగా మారింది. ఆత్మహత్యలకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో పనిచేసే చోటకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో కుటుంబ పెద్ద మక్సూద్తో పాటు మిగతా సభ్యులు ఉన్నారు. తండ్రితో పాటు ఆయన భార్య, కుమార్తె, మనవడు విగత జీవులుగా కనిపించడంతో ఎవరైనా హత్య చేశారన్న అనుమానాలు తలెత్తాయి. మృతుల్లో మక్సూద్ (50) తో పాటు ఆయన భార్య నిషా (45), బుషారా ఖాతూన్ ((20), మూడేళ్ల మనవడు బేబీ షకీల్, కుమారుడు షాబాజ్ అలం (22), సోహైల్ అలం, బీహార్కు చెందిన శ్రీరాంగా గుర్తించారు. బావి నుంచి బయటకు తీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో యాకూబ్ పాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసుల విచారిస్తున్నారు. ఇలావుండగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వరంగల్ సీపీ రవీందర్, మేయర్ ప్రకాశరావు, కలెక్టర్ హరిత తదితరులు పర్యటించి పరిశీలించారు. వీరంతా గొర్రెకుంట ప్రాంతంలోని ఒక గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. గత డిసెంబర్ నుంచి వీరు అక్కడ పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా మారడం, నెలన్నర నుంచి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. భర్తతో విడిపోయిన బుస్రా కూడా తన మూడేల్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితో పాటే బీహార్కు చెందిన శ్రీరాం, శ్యాం అనేవారిద్దరు కూడా గోదాంలో పనిచేస్తున్నారు. -
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, వరంగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని కోల్డ్ స్టోరేజ్కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడితో పాటు చిన్నారి ఉన్నారు. ఈ సంఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది.(కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం) బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ వలసకూలీలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి కూడా పోయే వీలు లేక వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే గీసుగొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురి మృతదేహలు గుర్తించారు. (తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు: ఐఎండీ హెచ్చరిక) -
పండుగకు వెళ్తూ పరలోకానికి
గీసుకొండ(పరకాల): వరంగల్ రూరల్ జిల్లా చెన్నారాపుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సింగారపు యాకోబు, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు అనిల్(35), అశోక్, ఇద్దరు కుమార్తెలు అరుణ, కరుణ ఉన్నారు. యాకోబు పెద్ద కుమారుడు అనిల్ కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ లేబర్కాలనీలో నివాసం ఉంటూ గొర్రెకుంటలోని కేకుల తయారీ కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అరుణకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె, కుమారుడు జల్లి గ్రామంలోనే ఉండగా.. మరో కూతురు గొర్రె సాత్విక(09) అనిల్ ఇంటిలోనే ఉంటూ ధర్మారంలోని ప్రైవేట్ పాఠశాలలో ఇటీవలే 3వ తరగతి పరీక్షలు రాసింది. ఈ క్రమంలో స్వగ్రామం జల్లిలో ఈస్టర్ పండుగ చేసుకోవడానికి సింగారపు అనిల్(35) శనివారం సాయంత్రం కవలలైన తన ఇద్దరు కూతుర్లు జాహ్నవి, జాస్నవి(జాస్విన్)(6)లతో పాటు చెల్లి అరుణ కూతురు సాత్వికను వెంటతీసుకుని బైక్పై బయలుదేరాడు. సాయంత్రం 4 గంటల సమయంలో గీసుకొండ మండలం వరంగల్–నర్సంపేట రహదారిలో కొమ్మాల ప్రాంతానికి చేరుకోగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అనిల్తో పాటు అతడి కూతురు జాస్విన్, చెల్లెలి కూతురు గొర్రె సాత్విక అక్కడే మృతి చెందారు. అనిల్ మరో కూతురు జాహ్నవి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉండగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. మద్యం మత్తులో కారు డ్రైవర్ కారు డ్రైవర్ మద్యం తాగి అతి వేగంగా నడపడంతో ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కారు ప్రమాద స్థలికి వచ్చే కొద్ది దూరంలో తాగిన ఖాళీ బీరు సీసాలను పంటచేలలోకి విసిరి వేసినట్లు చెబుతున్నారు. అలాగే కారు రోడ్డు సగం భాగం దాటి దూసుకు వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బైక్ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ కారు దిగటంతో అక్కడ గుమికూడిన వారు తాగి ప్రాణాలు తీసావంటూ అతడిని కొట్టినట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్జోన్ డీసీపీ నాగరాజు, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ సీఐ సంజీవరావు, ఎస్సై అబ్దుల్ రహీం సందర్శించి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రెండు కుటుంబాల్లో విషాదం చెన్నారావుపేట: ఒకే కుటుంబంలోని తండ్రీ కూతురుతోపటు తోబుట్టువు కూతురు మృత్యువాత పడడంతో జల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలియగానే కుటుంబాల సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అనిల్ భార్య సునీత 6 నెలల గర్భవతి కావడంతో ఆమె ఇంటి వద్దనే ఉంది. బంధువులు, కుటుంబ సభ్యులు జల్లి గ్రామంలోని ఇంటి వద్ద రోదిస్తున్న తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది. అరుణ కుమారుడు, కుమార్తె ఏం జరిగిందో తెలియని స్థితిలో అమాయకంగా దిక్కులు చూస్తుండ చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. -
‘మోడల్’ ఉపాధ్యాయుల డుమ్మా
ప్రిన్సిపాల్తో సహా 8 మంది విధులకు గైర్హాజరు ఈనెల 16 నుంచి బడికి రాని పంతుళ్లు ఆర్ఎంఎస్ఏ డిప్యూటీ ఈవో ఆకస్మిక తనిఖీ గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవితో పాటు, మరో ఏడుగురు ఉపాధ్యాయులు ఈ నెల 16 నుంచి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న వైనం బయటపడింది. రాష్రీ్టయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) డిప్యూటీ ఈవో తోట రవీందర్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో డుమ్మా వ్యవహారం వెలుగుచూపింది. ప్రిన్సిపాల్తో పాటు సీహెచ్. స్వప్న, జి.మనోహర్, కె.స్రవంతి, పి. దయాకర్రెడ్డి, ఎండీ. షరీఫ్, వై.శ్రీకాంత్ లీవులో ఉన్నారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు డిప్యూటీ ఈవో తన తనిఖీలో గుర్తించారు. పాఠశాలలో మొత్తం 18 మంది టీచర్లు ఉండగా వారిలో 8 మంది మూడు రోజులుగా విధులకు రావడం లేదు. రిజిస్టర్లో లీవు పెట్టినట్లు, హాజరు వేసుకున్నట్లు లేకుండా టీచర్ల పేర్ల ఎదురుగా ఆయా తేదీల్లో ఖాళీగా ఉందని గమనించారు. వీరితో పాటు ఎ.లావణ్యరెడ్డి పేరుతో హాజరు రిజిస్టర్లో రెండు పూటలా సంతకం చేసి ఉంది. ఆమె విధుల్లో లేకపోడంతో గమనించిన ఆయన విస్తుపోయారు. ప్రిన్సిపాల్గా విధులకు డుమ్మా కొట్టడమే కాకుండా ఇన్చార్జిగా బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. అలాగే పాఠశాలలోని మ«ధ్యాహ్న భోజనం, అడ్మిషన్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించిన డిప్యూటీ ఈవో అవికూడా సరిగా లేవని గుర్తించారు. ‘ఇది పాఠశాలా..గొడ్ల కొట్టమా, అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, టీచర్ల డుమ్మా వ్యవహారంపై ఆర్ఎంఎస్ఏ జాయింట్ డైరెక్టర్తో పాటు జిల్లాలోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు క్రమశిక్షణ చర్య నిమిత్తం నివేదిక సమర్పిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట ఎంఈవో సుజన్తేజ, సీఆర్పీ టి.వెంకటేశ్వర్లు ఉన్నారు. -
కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?
-
కేసీఆర్ గారూ పొలాలకు వెళ్లారా?
వరంగల్ : వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కొనసాగుతోంది. బుధవారం ఆయన గీసుకొండలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ...కేసీఆర్ సర్కార్పై నిప్పులు చెరిగారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 20 లక్షల 60వేల ఎకరాల భూములు పంచారని... అధికారంలోకి వచ్చాక ఎంత భూమిని పంపిణి చేశారనే విషయాన్ని కేసీఆర్ ను గట్టిగా నిలదీయాలని సూచించారు. కేసీఆర్ అధికారం చేపట్టి 18 నెలలు అవుతోందని, ఈ కాలంలో ఆయన ప్రజలకు పంచింది కేవలం 16వందల ఎకరాలు మాత్రమేనని వైఎస్ జగన్ అన్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయారన్నారు. ఇక పత్తికి కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతన్న ఆరుగాలం శ్రమించి పత్తి పండిస్తే... ఇవాళ మార్కెట్లో కొనే నాధుడే లేరన్నారు. అది బాగోలేదు...ఇది బాగోలేదంటూ రైతుల వద్ద నుంచి పత్తిని కొనడం లేదని, ఈ విషయం కేసీఆర్కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. పత్తి పండించేందుకు రైతులు పడుతున్న కష్టాలు చూడాలని..., ఒకసారి పత్తి పొలాలకు వస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. ప్రస్తుతం పత్తి క్వింటాల్ కి 4,100 వస్తుందని, అదే రాజశేఖరరెడ్డి హయాంలో రూ.6,700 వరకూ వచ్చిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కు ఓటు వేసి, ఆయన్ని గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. -
టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ : గీసుకొండలో ఉద్రిక్తత
వరంగల్: గీసుకొండలో టీఆర్ఎస్కు చెందిన రెండు వర్గాల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు వర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, పరకాల టిఆర్ఎస్ అభ్యర్థి ఎం.సహోదర్రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్ పార్టీలో చేరే సమయంలోనే తనకు పరకాల శాసనసభ స్థానం టికెట్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు పార్టీ వరంగల్ తూర్పు స్థానం కేటాయించింది. కొండా మురళి దంపతులను టిఆర్ఎస్లో చేర్చుకోవడం స్థానిక నాయకులకు, కార్యకర్తలకు ఇష్టంలేదు. దాంతో ఇక్కడ తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి.