Human beings
-
నిద్రారాక్షసం
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర లేకుండా రోజుల తరబడి గడపడం అసాధ్యం. బొందిలో ప్రాణం నిలిచి ఉండాలంటే, ఈ రెండూ తప్పనిసరి. తిండి, నిద్ర మనుషులకే కాదు, జంతువులకూ అవసరమే! జంతువులకు నిద్ర ముంచుకొచ్చినప్పుడు నిద్రపోవడమే తెలుసు గాని, నిద్ర గురించి ఆలోచించడం తెలీదు. మనం మనుషులం. జంతువులతో పోల్చుకుంటే జ్ఞానులం. ‘ఆహార నిద్రా భయ మైథునాని/ సామాన్య మేతత్పశుభిర్నరాణాం/ జ్ఞానం హి తేషా మధికో విశేషో/ జ్ఞానేన హీన్యా పశుభిస్సమానాః’ అని పూర్వకవి సంస్కృతంలో పలికాడు. ఆహార నిద్రా భయ మైథునాలు మనుషులకు, జంతువులకు సమానమే! మిగిలిన జంతు సమూహం నుంచి మనిషిని వేరు చేసే లక్షణం జ్ఞానం మాత్రమే! జ్ఞానమే గనుక లేకుంటే, మనుషులకు, జంతువులకు తేడా ఏమీ ఉండదు.అందువల్ల జంతువుల కంటే జ్ఞానులైన మనుషులకు నానా విషయాలలో అవసర పరిజ్ఞానమూ అనవసర పరిజ్ఞానమూ సహజ లక్షణం. అందులో భాగంగానే మనుషులకు నిద్ర గురించిన పరిజ్ఞానం ఉండటం అంతే సహజం. నిద్ర ఎప్పుడు రావడం సహజమో, ఎంతసేపు నిద్రపోవాలో, సుఖనిద్రకు ఎలాంటి పరిసరాలు, పరిస్థితులు అనుకూలిస్తాయో మనుషులకు బాగా తెలుసు. బహుశా, ఈ జ్ఞానభారం వల్లనే నిద్రలేమి సమస్యలు కూడా మనుషుల్లోనే ఎక్కువ. ‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు’ అని మనకో నానుడి ఉంది. కొంత వరకు ఆ మాట నిజమే కావచ్చు గాని, సర్వసుఖాలు అందుబాటులో ఉన్నా, కంటి నిండా కునుకు లేక తిప్పలు పడే మనుషులు ప్రపంచమంతటా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ‘నిద్ర మంచిది, మరణం మెరుగైనది; అయితే, అత్యుత్తమమైనదేదీ ఇంకా పుట్టలేదు’ అని జర్మన్ కవి, రచయిత హేన్రిక్ హేనీ అన్నాడు. మరణాన్ని మనవాళ్లు శాశ్వతనిద్రగా అభివర్ణిస్తారు. శాశ్వతనిద్రలోకి జారుకునేలోగా మనిషికి జీవనయాత్ర తప్పదు. జీవనయాత్ర సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్రతోనే మనశ్శరీరాలు జవజీవాలను పుంజుకుంటాయి. దైనందిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలకు సంసిద్ధమవుతాయి. రోజంతా పనిచేసి అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత అవసరం. ఈ రెండూ నిద్రతోనే దొరుకుతాయి. అయితే, సంక్లిష్టమయమైన ఆధునిక జీవనశైలి మనుషులను నిద్రకు దూరం చేస్తోంది. ‘కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది’ అన్నాడు మనసుకవి ఆత్రేయ. మనసుకు కుదురు లేనప్పుడు పట్టేది చెదురు మదురు నిద్రే! చెదురు మదురు నిద్రలో తీపికలలు కాదు, పీడకలలు వస్తాయి. ‘కంటికి నిద్రవచ్చునె? సుఖంబగునె రతికేళి? జిహ్వకున్/ వంటక మిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం/బంటునె? మానుషంబుగల యట్టి మనుష్యున కెట్టివానికిన్/ గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్’ అన్నాడు శ్రీనాథుడు. ఈ పద్యం ‘కాశీఖండం’లోనిది. ఇది వింధ్యుడి స్వగతం. వింధ్యుడికి సమ ఉజ్జీ మేరువు. సూర్యుడు మేరువు చుట్టూ ప్రదక్షిణంగా పయనిస్తాడు. దేవతలు మేరుపర్వతాన్నే గౌరవిస్తారు. మేరువు కన్నా తానేమీ తక్కువ కాకున్నా, తనకు దక్కని గౌరవం మేరువుకు దక్కడం పట్ల అసూయతో రగిలిపోయే వింధ్యుడి కంటికి కునుకు పట్టకపోవడం సహజమే కదా! పురాణాల్లో మేరువు, వింధ్య పర్వతాలే అయినా, శ్రీనాథుడు రాసిన ఈ పద్యం మాత్రం మానవ ప్రవృత్తులకు అద్దం పడుతుంది. నిద్రను కరవు చేసే అనేకానేక కారణాల్లో సమ ఉజ్జీ అయిన ప్రత్యర్థితో తలెత్తే స్పర్థ కూడా ఒకటి.నిద్ర పట్ల అవగాహన మనుషులకు ప్రాచీనకాలం నుంచి ఉండేది. నిద్రకు భంగం కలిగించే అంశాలు, ప్రశాంతమైన నిద్ర ఆవశ్యకతను నాటి మానవులు బాగానే గుర్తించారు. ప్రాచీన నాగరికతలలో నిద్రను దేవతగా ఆరాధించేవారు. కావ్య పురాణేతిహాసాల్లో నిద్ర ప్రస్తావన విరివిగా కనిపిస్తుంది. రామాయణంలో కుంభకర్ణుడి నిద్ర, ఊర్మిళాదేవి నిద్ర సుదీర్ఘకాల నిద్రలకు ఉదాహరణలు. ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించిన ఉదంతం కూడా రామాయణంలో ఉంది. అరణ్యవాస కాలంలోను, లంకలో రామరావణ యుద్ధకాలంలోను బల అతిబల విద్యలు లక్ష్మణుడికి బాగా అక్కరకు వచ్చాయి. అరణ్యవాసానికి వెళ్లినది మొదలుకొని, రావణ సంహారం తర్వాత శ్రీరామ పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు నిద్రపోలేదు. అంతకాలమూ అతడి అర్ధాంగి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. సరిగా రామ పట్టాభిషేకం జరుగుతుండగా, లక్ష్మణుడికి నిద్ర ముంచుకొచ్చి రెప్పలు మూతబడ్డాయి. అప్పుడు తన అవస్థకు తానే నవ్వుకున్నాడు లక్ష్మణుడు. పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన నవ్వును అక్కడ ఉన్న ప్రముఖుల్లో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారు. అదంతా వేరే కథ. పురాణాల ప్రకారం నిద్రకు దూరంగా ఎక్కువకాలం గడిపిన రికార్డు లక్ష్మణుడిదే! అయితే, నూయెన్ న్యోక్ మై కిమ్ అనే యాభయ్యేళ్ల వియత్నాం మహిళ గడచిన ముప్పయ్యేళ్లుగా కనీసం నిమిషమైనా నిద్రపోలేదట! ఇన్నాళ్లుగా నిద్రపోకున్నా, ఆమె ఆరోగ్యంగా ఉండటం చూసి వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఈ నిద్రలేని నీలాంబరి ఉదంతం ఒక నిద్రారాక్షసం. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
మనుషులకూ.. మూగ ప్రాణులకు ఒక ధర్మాచరణ ఉంది!
నరజన్మకూ, మిగిలిన ప్రాణులకూ ఒక ప్రత్యేకమైన భేదం ఉంది. ఇతరప్రాణులకు ఒకే ధర్మం–పశుధర్మం. ఆకలి, నిద్ర, ప్రత్యుత్పత్తి.. అంతకుమించి వాటికి ధర్మం అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కానీ ఒక్క మనిషికి మాత్రం అత్యంత ప్రధానమైనది – ధర్మాచరణ. అయితే దీనిలో ఒక సంక్లిష్టత ఉంది. ఇదే ధర్మము.. అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ధర్మం నిరంతరం మారిపోతుంటుంది. భార్యముందు నిలబడితే–భర్త ధర్మం. తల్లి ముందు నిలబడితే–పుత్ర ధర్మం. సోదర ధర్మం... ఉద్యోగ ధర్మం.. అలా నిరంతరం మారిపోతుంటుంది. దేశాన్నిబట్టి, కాలాన్నిబట్టి మారిపోతుంది. ఉత్తర భారతదేశంలో చలి కారణం చేత వీలయినంతగా శరీరాన్ని కప్పుకుని పూజాదులు చేయడం అక్కడి ధర్మం. దక్షిణ భారతదేశంలో.. కేవలం ఉత్తరీయం పైన వేసుకుని అభిషేకాలు, పూజలు చేయడం ఇక్కడి ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. బ్రహ్మచారికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం, వానప్రస్థుకు, సన్యాసికి.. ఇలా ధర్మం మారుతుంటుంది. బ్రహ్మచారి ఏదీ కూడబెట్టకూడదు. విద్యార్థిగా గురువుగారు చెప్పింది శ్రద్ధగా విని మననం చేసుకోవడం ఒకటే ధర్మం. అదే గృహస్థాశ్రమంలో భోగం అనుభవించవచ్చు. భార్యాబిడ్దలతో సుఖసంతోషాలతో గడపవచ్చు. రేపటి అవసరాలకోసం సంపాదించి దాచుకోవచ్చు. వానప్రస్థు భార్యతో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఆత్మవిచారం చేస్తూ గడపవచ్చు. చిట్టచివరన అన్నీ పరిత్యజించి ఏకాకిగా వైరాగ్యంలో ఉండడం ధర్మం. అలా ధర్మం మారిపోతున్నా ఎక్కడికక్కడ ధర్మం నియమాలకు కట్టుబడి ఉంటుంది. అసలు ధర్మం లేకుండా ఉండడం, దానిని పాటించకుండా జీవించడం సాధ్యం కాదు. ధర్మాచరణతోనే మనుష్యప్రాణి ఉత్తమగతులు పొందగలడు. శాస్త్రం చెప్పినట్టుగా ధర్మాచరణ చేస్తూ శరీరం పతనమయిన తరువాత స్వర్గలోకం వెళ్ళవచ్చు. పుణ్యఫలితం అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుకోవచ్చు.‘నాకు శాస్త్రం మీద నమ్మకం లేదు. ఈ పుణ్యకర్మలు నేను చేయను. నాకు ఏది సంతోషం అనిపిస్తే, నా ఇంద్రియాలకు ఏది సుఖం అనిపిస్తే, నా మనసుకు ఏ భోగం అనుభవించాలనుకుంటే దానిని అనుభవిస్తూ శాస్త్రాన్ని పక్కనబెట్టి ప్రవర్తిస్తే.. ఆ పాటిదానికి నరజన్మ అవసరం లేదని తిర్యక్కుగా (వెన్నుపూసలేని జీవిగా) జన్మ లభిస్తుంది. అలా కాదు, నాకు పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు. నేను ఈ మంచిపని చేసి పుణ్యం కావాలనుకోవడం లేదు, నేను కేవలం భగవంతుడు చెప్పినట్లు బతకడం నాకు సంతోషం. నేను చేయవలసినివి కాబట్టి చేస్తున్నా.. దానినుంచి నేను ఏ ప్రయోజనమూ ఆశించడం లేదనుకున్నప్పుడు అది చిత్తశుద్ధిని సూచిస్తుంది. ఇది ఏదో ఒకనాడు భగవంతుని అనుగ్రహానికి కారణమయి, జ్ఞానాన్ని తద్వారా మోక్షాన్ని ఇస్తుంది. అంటే ధర్మాన్ని అనుష్ఠానం చేసి దేవతాపదవిని అధిష్టించగలడు. ధర్మాచరణను పక్కనబెట్టి పతనమమై తిర్కక్కు అయిపోగలడు. ఏ ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణచేసి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి ధర్మం కన్నా గొప్పది మరొకటి లేదు. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవి చదవండి: మీరెంత దూరం వెళ్లినా.. ఆ శబ్దం వెంటాడుతూనే ఉంటుందట! -
విశిష్టుడు, సర్వలోకహితుడైన "కృష్ణుడు" ధర్మపక్షపాతి
కృష్ణుడు పుట్టినరోజును కృష్ణజన్మాష్టమి, గోకులాష్టమి అని పిలుస్తారు. దేవకి, వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి, అష్టమితిధి రోజు పుట్టినట్లుగా పురాణాలు,ఇతిహాసాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కృష్ణభక్తులంతా వేడుకలు జరుపుకొనే విశిష్టమైన రోజు కృష్ణాష్టమి. 'భగవద్గీత' ద్వారా లోకానికి గొప్ప ఉపదేశం చేసిన మూలంగా కృష్ణుడిని 'జగద్గురువు'గా భావిస్తారు, కృష్ణం వందే జగద్గురుమ్... అంటూ పూజిస్తారు. శ్రీకృష్ణుడి లీలలు అనంతం. అవన్నీ ఆనందదాయకం, జ్ఞానప్రదాయకం. మానవ జీవన క్రమంలో సుఖవంతంగా, జయప్రదంగా జీవించాలంటే కృష్ణతత్త్వాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని పెద్దలు చెబుతారు. నర-నారాయణ (అర్జునుడు-కృష్ణుడు) సంవాదంలో నరునికి బోధించినట్లుగా కనిపించే 'భగవద్గీత' నరలోకం మొత్తానికి నారాయణుడు (కృష్ణుడు) చేసిన జ్ఞానబోధగా భావించాలని పండితులు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనిషి మరణించినప్పుడు తల దగ్గర పెట్టి వినిపించే విషాదగీతం కాదు భగవద్గీత. మానవులకు కర్తవ్య బోధ చేస్తూ కార్యోన్ముఖులను చేసే 'విజయగీత'. వ్యక్తిత్వ వికాసానికి ఇంతకు మించిన ఉద్గ్రంథం ఇంకొకటి లేదని ప్రపంచ మేధావులంతా ఏకమై చెప్పారు. అందుకే, 'గీత' భారతీయ భాషలతో పాటు అనేక అంతర్జాతీయ భాషలలో అనువాదమైంది. అది చదివిన పిమ్మట అనేక దేశాలవారు కృష్ణతత్త్వం వెంట పరుగులు తీస్తున్నారు. భారతదేశానికి తరలి వస్తున్నారు. ధర్మం, వృత్తిధర్మం, స్వధర్మం వైపు నడవండని గీతాచార్యుడైన కృష్ణుడు చెప్పాడు. స్వధర్మం ఏంటో తెలుసుకోవడంలోనే జ్ఞాన వికాసం దాగివుంది. తెలుసుకున్న తర్వాత ఆచరించడంలో వివేకం దాగివుంటుంది. ఈ మనోయోగం పట్టాలంటే భగవద్గీతను చదివి తీరాల్సిందే. కౌరవ-పాండవ యుద్ధంలో కృష్ణుడు పాండవుల వైపు నిలుచున్నాడు. అది అధర్మానికి - ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం కాబట్టి వివేకవంతుడు, విశిష్టుడు, సర్వలోకహితుడైన కృష్ణుడు ధర్మపక్షపాతిగా పాండవుల వైపే నిల్చొని, వారికి విజయం కలిగించాడు. అధర్ములకు అపజయాన్ని చూపించి గుణపాఠం నేర్పాడు. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని తలుచుకోవడం, కొలుచుకోవడమంటే? కృష్ణతత్త్వాన్ని తెలుసుకోవడమే. కృష్ణతత్త్వం తెలియాలంటే జయదేవుడు రచించిన అష్టపదులు, లీలాశుకుడి 'శ్రీకృష్ణ కర్ణామృతం', నారాయణతీర్ధుడి తరంగాలు చదివి, అనుభవించండని మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య తెలియజేశారు. 'జగదాష్టమి'గా గుజరాతీయులు కృష్ణజన్మాష్టమిని విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ప్రపంచంలోని భక్తులంతా నాట్యం, నాటకం (రూపకం),ఉపాసన,ఉపవాసాలు మొదలైన వివిధ మార్గాల్లో తమ భక్తిని చాటుకుంటారు. ఇది తరతరాల నుంచి వైభవంగా సాగుతున్న సంప్రదాయం. ఉట్టికొట్టడం గొప్ప ఆసక్తిగా సాగే క్రీడ. మన తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుని పక్కనే రజితమూర్తిగా శ్రీకృష్ణుడు విరాజిల్లుతుంటాడు. వెయ్యేళ్ళపై నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడి బాల్యక్రీడలకు సంబంధించిన విశేషాలు ప్రతిస్పందించేలా తిరుమల మాడ వీధుల్లో పెద్ద కోలాహలం జరుగుతుంది. ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైందని తెలుస్తోంది.1545 నాటి శాసనాల ఆధారంగా ఈ వివరాలు తెలుస్తున్నాయి.తాళ్లపాకవారే ఈ వేడుకలను ఏర్పాటు చేసినట్లు చెప్పుకుంటారు. శ్రీకృష్ణుడు గొప్ప రాజనీతి చతురుడు.ఎంతటి చతురుడో అంతటి రసికుడు.ఎంతటి రసికుడో అంతటి అప్తజన రక్షకుడు. సౌందర్యవిలాసుడు, విలక్షణ వాగ్భూషణుడు. అందుకే "నల్లనివాడు, పద్మ నయనంబులవాడు, కృపారసంబు పై చల్లెడివాడు" అన్నాడు మన పోతన్న. తనను నమ్ముకున్నవారిపై దయారసాన్ని గొప్పగా కురిపించే కరుణాసముద్రుడని భావం. కేవలం పాండవులపైనే కాదు, ధర్మమూర్తులందరిపైనా తన దయను విశేషంగా చూపించి విజయులను చేశాడు. కృష్ణుడిని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం కలిగినట్లే. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: భావోద్వేగాలను కట్టడి చేసే మహత్తరమైన శక్తి వాటికే ఉంది!) -
మనుషులే కాదు, ఇప్పుడు పక్షులు కూడా విడాకులు
-
అచ్చం మనుషుల్లా..పక్షలు కూడా విడాకులు తీసుకుంటున్నాయట!
మనుషులకు ఏం తీసిపోం అన్నట్లుగా పకులు కూడా బిహేవ్ చేస్తున్నాయి. ఔను అవి కూడా మనుషుల మాదిరి విడాకులు తీసుకుంటున్నాయట. అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందని పరిశోధకులు అంటున్నారు. అవి విడాకులు తీసుకునేందుకు దారితీసిన పరిస్థితులను చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. అసలేం జరిగిందంటే..మనుషుల్లాగే పక్షలు కూడా తమ భాగస్వాములకు విడాకులు ఇస్తున్నట్లు పరిశోధకులు వివిధ జాతి పక్షులపై జరిపిన అధ్యయనాల్లో తేలిందట. ఈ మేరకు చైనా, జర్మనీకి చెందిన పరిశోధకులు దాదాపు 232 పక్షి జాతులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 90 శాతం కంటే ఎక్కువ పక్షి జాతులు సాధారణంగా ఒకే సహచరుడితో సంతానోత్పత్తి కాలం వరకు ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఐతే కొన్ని పక్షలు మాత్రం తమ సహచరుడు జీవించి ఉన్నప్పటికీ తదుపరి సంతానోత్పత్తి సీజన్లలో కొత్త భాగస్వామిని వెతుకుంటున్నాయని చెబుతున్నారు. ఈ ప్రవర్తనను 'విడాకులుగా' సూచించారు పరిశోధకులు. దీనికి ప్రధాన కారణం 'వలసలు' అని అన్నారు. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ పరిశోధకుడు డాక్టర్ జిటాన్ సాంగ్ మాట్లాడుతూ..సంతానోత్పత్తి కాలంలో పుట్టిన పక్షలు బాధ్యతలను మగపక్షులు చూడటంతో.. ఆడపక్షులు తదుపరి సంతానం కోసం వేరేవాటితో జత కట్టేందుకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. అలాగే సుదీర్ఘ దూరాలకు వలస వెళ్లినప్పుడూ తమ పాత భాగస్వామి కోసం వేచి ఉండకుండా కొత్త భాగస్వామితో జత కట్టేందుకు మొగ్గు చూపుతున్నట్లు గమనించారు. ఎక్కువ వలసలు వెళ్తున్న పక్షల జాతుల్లోనే ఈ విడాకుల రేటు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. పునరుత్పత్తి లేదా వలసల కారణంగా అవి విడిపోతున్నాయని, కొత్త భాగస్వాములను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో కొన్ని పక్షులు మాత్రం తమ పాత భాగస్వామితో ఉండటం లేదా అవి లేనట్లయితే ఒంటరిగా ఉండిపోవటం జరుతుందని అన్నారు. దీనంతటికి కారణం మనిషేనని, అందువల్లే అవి మన మాదిరిగా విడిపోతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. తన స్వార్థ కోసం అభివృద్ధి పేరుతో చెట్లు నరకడం, వాటికి ఆవాసం లేకుండా చేయడం తదితర కారణాల రీత్యా అవి వలస బాటపట్టడంతో..పక్షలుకు కూడా ఆ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. (చదవండి: తెలుసా! గోళ్ల ఆకారాన్ని బట్టి మీరెలాంటి వారో చెప్పేయొచ్చు!) -
మొత్తానికి ఈజీ డైటింగ్ టెక్నిక్: ఈ వీడియో చూస్తే
సాక్షి, ముంబై: కొండలా పెరిగిన శరారీన్ని, బాన లాంటి పొట్టను తగ్గించుకోవడం అంత వీజీ కాదు. డైటింగ్లూ, జిమ్లూ అంటూ కసరత్తు చేయడం, ఎక్కడో ఒక చోట్ ఫెయిల్ అవ్వడం మనం చూస్తుంటాం. కొంతమందేమో ఎంత కడుపుమాడ్చుకున్నా.. వ్యాయామం చేస్తున్నా..ఒళ్లు మాత్రం తగ్గడం లేదంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే చక్కటి ప్రణాళిక, దానికి మించిన నిబద్ధత, ఒక్కోసారి మంచి ట్రైనర్ ఉండటం చాలా అవసరం. అలాగే వైద్యపరంగా ఎందుకు లావు అవుతున్నామనే విశ్లేషణ కూడా అంతే అవసరం. ఈ క్రమంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. మొత్తానికి ఈజీ డైటింగ్ని మార్గాన్ని కనుగొన్నారు అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఇలా చేస్తే.. మీరు కచ్చితంగా స్లిమ్ అవడం ఖాయం అంటూ నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. Finally found a way to make dieting easier …..😀😀 pic.twitter.com/CzY6jvil8V — Harsh Goenka (@hvgoenka) June 26, 2022 -
సౌండ్స్ ఆపండ్రా బాబు!
పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వాహనాలు తయారు చేసుకుంటూ పోతూ.. భూమిని కాలుష్యం చేస్తున్నాం. అధిక మొత్తంలో కార్బన ఉద్గారాలు విడుదలవ్వడం వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమేకాకుండా వాతావరణాన్ని సమస్థితిలో ఉంచే సముద్రాలను ప్రభావితం చేస్తున్నాము. మనుషులు చేసే వివిధ రకాల పనుల వల్ల విడుదలయ్యే శబ్దాలతో సముద్రపు గర్భంలోనే గాక ఉపరితలంలో సహజసిద్ధంగా వినిపించే ధ్వనులు కూడా మార్పులకు లోనవుతున్నాయి. దీనివల్ల సముద్ర జీవుల మనుగడ ప్రమాదం లో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిమాణంలో చిన్నగా ఉండే రొయ్యల నుంచి భారీ శరీరం కలిగిన తిమింగలాలపైన కూడా వీటి ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శబ్దాలు నీటి అడుగుభాగంలో చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి. చేపలకు తాము నివసించే వాతావరణాన్ని కనుగొనడానికి కాంతి కంటే ధ్వని బాగా ఉపయోగపడుతుందని కెనడాలోని విక్టోరియా యూనివర్సిటీ పర్యావరణ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ చెప్పారు. నీటిలో కాంతి చెల్లాచెదురుగా ప్రయాణిస్తుంది. కానీ ధ్వని గాలిలోకంటే నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. అందువల్ల.. నీటిలో జీవించే జలచరాలు శబ్దాల ద్వారానే ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి. చాలా రకాల చేపలు ఆహారం దొరికే మంచి ప్రదేశాలను గుర్తించడానికి, వేటాడే జంతువులను గుర్తించడానికి సంతానోత్పత్తివంటి అనేక విషయాలకు ధ్వని మీద ఆధారపడతాయి. సముద్రాల్లో ఏర్పడే షిప్పుల ట్రాíఫిక్ జామ్, చేపలు పట్టేందుకు వాడే మోటార్ వలలు, సముద్ర గర్భంలో ఉన్న ముడి చమురును, గ్యాస్ను వెలికితీసేందుకు చేసే డ్రిల్లింగ్ సౌండ్స్, సముద్రంలో చేపట్టే నిర్మాణ పనుల్లో పాల్గొనే మనుషులు చేసే శబ్దాల వల్ల చేపలు ఒకదానికి ఒకటి మాట్లాడుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నీటి అడుగుభాగంలో మైక్రోఫోన్స్ను ఉపయోగించి షిప్పుల నుంచి వెలువడే శబ్దాల వల్ల చేపలు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలో ఉన్న కీలక షిప్పింగ్ కారిడార్స్లో ఎర్రసముద్రం ఒకటి. ఈ సముద్రం మీదుగా∙అనేక షిప్పులు ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాలకు ప్రయాణిస్తుంటాయి. వీటినుంచి వెలువడే శబ్దాలను తట్టుకోలేక అక్కడ నివసించే చేపలు, కొన్ని అకశేరుకాలు ప్రశాంతమైన వాతావర ణాన్ని వెతుక్కుని తమ ఆవాసాలను మార్చుకుంటున్నాయి. దీంతో 1970 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ జీవించే జలచరాల సంఖ్య సగానికి పైగా తగ్గింది. కొన్ని జీవులు అయితే తమ సొంతస్వరాలను మర్చిపోయాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్ర శబ్దాల్లో ఏర్పడే మార్పులు.. వాతావరణ మార్పులు, గాలుల దిశలు మారడం, తరంగాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడడం, మంచు ద్రవీభవన వంటి భౌతిక ప్రక్రియలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. భూమిమీద ఉన్న ప్రతిజీవి మనుగడ సక్రమం గా ఉన్నప్పుడే మనవుని మనుగడ సాధ్యమవుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
ఆ తొమ్మిది మంది ఎక్కడ?
యేసుప్రభువు ఒకసారి సమరయ ప్రాంతం మీదుగా యెరూషలేముకు వెళ్తుండగా, పది మంది కుష్టు రోగులు ఎదురై, తమను కరుణించమంటూ దూరం నుండే కేకలు వేశారు. ఆ కాలంలో కుష్టు చాలా భయంకరమైన వ్యాధి..కుష్టు వ్యాధిగ్రస్థులు కుటుంబ, సామాజిక బహిష్కరణకు గురై జీవచ్ఛవాల్లాగా ఉరికి దూరంగా నిర్జన స్థలాల్లో బతికేవారు. మామూలు మనుషులు ఎదురైతే కుష్టు రోగులు దూరం నుండే మాట్లాడాలి. అలాంటి ఆ పదిమంది కుష్టురోగుల మీద ప్రభువు జాలి పడి, వారి వ్యాధి బాగు చేసి, వెళ్లి యాజకులకు చూపించుకొమ్మని చెబితే, వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్తుండగా బాగుపడ్డారని బైబిల్ చెబుతోంది( లూకా 17:14). అయితే కొద్ది సేపటికి ఆ పది మందిలో అస్పృశ్యుడు, సమరయుడైన ఒకడు తిరిగొచ్చి ప్రభువుకు సాగిలపడి కృతజ్ఞత వెలిబుచ్చగా,’ శుద్ధులైన మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ?’ అని ప్రభువు ప్రశ్నించాడు. సమరయులను యూదులు ముట్టుకోరు, వారితో సాంగత్యం అసలే చేయరు. అయితే సామాజిక బహిష్కరణకు గురైన తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులుగా అంతకాలం యూదులైన 9 మంది, సమరయుడైన ఆ వ్యక్తి కలిసే జీవించారు. కానీ ప్రభువు కృపతో శుద్ధులై యాజకులను కలిసేందుకు వెళ్తున్నపుడు బహుశా వారిలో వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. సమరయుడైన ఆ వ్యక్తి అంటరానివాడని, పైగా అతనికి ఆలయప్రవేశం కూడా నిషిద్ధమని యూదులైన తొమ్మండుగురికి గుర్తుకొచ్చి అతన్ని వెలివేస్తే, అతను వెనక్కొచ్చి ప్రభువు పాదాలనాశ్రయించాడు. విచిత్రమేమిటంటే, కుష్టువ్యాధి వారిని కలిపితే, స్వస్థత విడదీసింది. కాకపోతే సమరయుడికి దాని వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ తొమ్మండుగురికి శారీరక స్వస్థత, ఆలయ ప్రవేశం మాత్రమే దొరికింది. కాని స్వస్థత పొంది తిరిగొచ్చిన సమరయుడికి, ఆలయంలో ఆరాధనలందుకునే దేవుడే యేసుప్రభువుగా, రక్షకుడుగా దొరికాడు, ఆయన మాత్రమే ఇచ్చే పరలోక రాజ్యంతో కూడిన శాశ్వతజీవం కూడా సమృద్ధిగా దొరికింది. ఆ తొమ్మిది మంది కుష్టువ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు, కాని కృతజ్ఞతతో తిరిగొచ్చిన సమరయుడు ప్రభువు సహవాసంలో గొప్ప విశ్వాసి అయ్యాడు. ఆ తర్వాత అపొస్తలుడై ప్రభువు సువార్త ప్రకటించి వందలాది ఆత్మలు సంపాదించి హత సాక్షి కూడా అయ్యాడని చరిత్ర చెబుతోంది. కుష్టు నయమైనా దాని కన్నా భయంకరమైన ‘కృతజ్ఞతారాహిత్యం’ అనే వ్యాధి నుండి మాత్రం ఆ తొమ్మండుగురికీ విముక్తి దొరకలేదు. ‘ఆ తొమ్మండుగురు ఎక్కడ?’ అన్న తన ప్రశ్నకు, ‘ఇంకెక్కడ? కుష్టు నయమై కూడా వాళ్ళు నరకంలో ఉన్నారు’ అన్నదే జవాబని ప్రభువుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసుప్రభువిచ్చే స్వస్థత పొందడం వేరు, యేసుప్రభువునే రక్షకుడుగా పొందడం వేరు. పరలోకరాజ్యార్హత తో కూడిన ఆ ధన్యత, పదిమందిలో అంటరాని వాడు, అన్యుడైన సమరయుడికి ఒక్కడికే దొరికింది. లంకె బిందెలు దొరికితే, వాటిలోని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాది విలువైన సామాగ్రినంతా పారేసి, కేవలం ఖాళీ ఇత్తడి బిందెల్ని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు ఆ తొమ్మిది మంది కాగా, ఐశ్వర్యంతో సహా లంకె బిందెల్ని తీసుకెళ్లిన వాడు ఆ అన్యుడు, సమరయుడు !! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
నిలబడే ఉన్నారా!?
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (స) ఏదో పని మీద బజార్ వెళుతున్నారు. అంతలో ఒక వ్యక్తి కనబడి, ‘ఓ ప్రవక్త (స) మీతో కాస్త పని ఉంది ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను’ అని వెళ్లాడు.‘‘అలాగే తొందరగా రా’’ అని ప్రవక్త అక్కడే నిలబడ్డారు.వెళ్ళిన వ్యక్తి ఆ విషయం మరచిపోయాడు.ఇచ్చిన మాట ప్రకారం ప్రవక్త (స) చాలా సేపు అలాగే నిరీక్షిస్తూ నిలబడ్డారు. చాలాసేపటికి మళ్ళీ ఆ వ్యక్తి అటుగా వచ్చి, ‘‘అయ్యో! మీరు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నారా? క్షమించండి. నేను ఈ విషయం మరిచే పోయాను’’‘‘ఇచ్చిన మాట తప్పితే శిక్ష ఏమిటో తెలుస్తే, నువ్వు కూడా ఎన్ని రోజులైనా ఇలాగే నిలబడి ఉంటావు తెలుసా?’’ అన్నారు. ‘‘మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. ప్రమాణ భంగానికి పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టడం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వడం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యడం. ఈ స్తోమత లేనివారు మూడు రోజులపాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి.’(ఖురాన్:5:89)మనిషి సంఘజీవి. సమాజంలో ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోతే మనుషులు నమ్మకంతో సత్సంబంధాలు కలిగి జీవించడం కష్టం. అందుకే మాట ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వాలని, వాగ్దానం చేసే ముందు ‘ఇన్షాల్లహ్’ అంటే అల్లాహ్ తలిస్తే అని అనాలని ప్రవక్త (స) తెలిపారు.నిజమే కదా. ఏ క్షణాన మృత్యువు కౌగిట్లోకి ఒదిగిపోతామో మనకు తెలియదు. మాట ఇచ్చి, నెరవేర్చకుండా మరణిస్తే? రేపు పరలోకంలో పట్టుబడిపోతాం. జవాబు దారితనాన్ని పటిష్టం చేసుకోవడానికే కదా ఈ రమజాన్లో కఠోర ఉపవాస దీక్ష పాటిస్తున్నాం. కనుక వాగ్దానం చేసి మరచిపోకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలి. –షేక్ అబ్దుల్ బాసిత్ -
మానవుల్లానే ఉంటాయట..!
న్యూఢిల్లీ : ఏలియన్లు ఎలా ఉంటాయి?. ఈ ప్రశ్న తట్టగానే గుర్తొచ్చేది.. హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్లుగా చూపించిన చిత్రాలు. కానీ, నిజానికి ఏలియన్లు అలా వికృత రూపాల్లో ఉండవట. ఏలియన్లకు మనిషికి దగ్గర పోలిక ఉంటుందని ఆక్స్ఫర్డ్ పరిశోధన చెబుతోంది. హాలీవుడ్ సినిమాలు, ఫిక్షన్ సాహిత్యం తదితరాలు ఏలియన్లు మనుషులను పోలి ఉండవని చెప్పడం ప్రజల్లో అది పాతుకుపోయిందని పేర్కొంది. ఏలియన్ల గురించి ఆక్స్ఫర్డ్ చేసిన ఈ శోధనకు సంబంధించిన వివరాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రోబయాలజీలో ప్రచురితమయ్యాయి. మనిషి రూపరేఖలు కాలగమనంలో ఎలా మారుతూ వచ్చాయో.. అచ్చం అలానే ఏలియన్లు కూడా రూపాంతరం చెందాయని పరిశోధన వెల్లడించింది. ఏలియన్ల గురించి ఊహాజనితంగా చెప్పడం కంటే ప్రాక్టికల్గా చెప్పడం చాలా కష్టమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అందుకే భూమి వాతావరణం నుంచే తమ వెతుకులాటను ఆరంభించామని చెప్పారు. ఇప్పటివరకూ థియరిటికల్గా ఉన్న అంశాల( ఏలియన్లకు డీఎన్ఏ ఉండదు, అవి నైట్రోజన్ను పీల్చుకుంటాయి.)ను బేస్గా చేసుకున్నామని తెలిపారు. ఏలియన్లు రెండు కాళ్లతోనో నడుస్తాయా?. వాటికి ఆకుపచ్చని కళ్లు ఉంటాయా? అనే ప్రశ్నలకు తమ వద్ద ఇంకా సమాధానం లేదని చెప్పారు. కానీ, మనిషిని పోలిన అంశాలు వాటిలో ఉన్నాయని కచ్చితంగా చెప్పగలమని అన్నారు. -
బొమ్మలు... కాదు భామలు!
అందం ఇనుమడించడం కోసం సినీతారలు, సెలబ్రిటీలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవటం సర్వసాధారణమై పోయింది. సహజ సిద్ధమైన శరీరాకృతిని భిన్నంగా తీర్చి దిద్దుకుని ప్రత్యేకాకర్షణగా నిలిచేందుకు తాపత్రయ పడుతుంటారు. మనదేశంలో హీరోయిన్లు అందం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించడం సర్వ సాధారణమైపోయింది. కొందరు ముక్కు, మరికొందరు పెదాలకు ఇలా శరీరభాగాలకు సర్జరీ చేయించుకొని అందాలను ఆరబోస్తున్నారు. అయితే సర్జరీ అవసరం లేకుండానే బార్బీ బొమ్మల్లా కనిపిస్తున్నారు వివిధ దేశాల్లోని కొందరు అమ్మాయిలు. అదెలాగో చూద్దాం. సహజ శరీరాకృతిని, ముఖ వర్చస్సును మార్చుకుని బార్బీల్లా కనిపించేందుకు కొందరు యువతులు తీవ్రంగానే కృషి చేస్తున్నారు. ఉక్రెయిన్ కు చెందిన ష్పాజినా అనే యువతి ప్లాస్టిక్ సర్జరీ లేకుండానే బార్బీ బొమ్మలా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అందుకు కేవలం బరువు తగ్గి, మేకప్ వేసుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తోందట. సన్నని తీగలాంటి శరీరం, బొమ్మలాంటి ఆకృతిలో ఏకంగా తన స్వరూపాన్నే మర్చేసుకొని కదిలే బార్బీలా మారిపోయింది. సర్జరీల్లేకుండానే ప్లాస్టిక్ డాల్స్ లా మారిన ఆరుగురు అమ్మాయిల్లో మరొక యువతి లక్యానోవా. ఉక్రెయిన్ కు చెందిన ఆమె అసలు ఏమాత్రం సర్జరీ జోలికి పోకుండానే బార్బీలా మారింది. కేవలం మేకప్ తో పాటు, కలర్ లెన్స్ వాడుతూ తన రూపాన్నే మార్చేసుకొందట ఆ బార్బీ గాల్. అలాగే రష్యన్ బార్బీగా పిలిపించుకుంటున్న అంజెలికా కెనోవా కనీసం ఆపరేటింగ్ రూమ్ దరిదాపులకు కూడ వెళ్ళకుండానే ప్లాస్టిక్ బొమ్మలా దర్శనిమిస్తోందట. ఉక్రెయిన్ కు చెందిన పదహారేళ్ళ లోలితా రిచి, పదమూడేళ్ళ అలినా కోవలేవ్సాయ కూడా శస్త్ర చికిత్సల్లేకుండానే కదిలే బార్బీ బొమ్మల్లా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక బ్రిటిష్ వీనస్ పలెర్మో అయితే తన బొమ్మలాంటి లక్షణాలతో జపాన్ లోని జనాన్ని ముగ్ధులను చేస్తోందట. -
ప్లీజ్ వర్రీ... బీ హెల్దీ...
కలత.. దిగులు.. వ్యాకులత.. చింత.. సాదాసీదా పామర భాషలో చెప్పాలంటే వర్రీ... ఎవరికి లేవండీ వర్రీస్..? పెతోడికీ సవాలచ్చ వర్రీస్ ఉంటాయి... వర్రీలు మనుషులకు కాకుండా, మానూ మాకులకు ఉంటాయా..? అని ప్రశ్నిస్తారా..? అయితే, ఓకే! ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా కాస్త స్థాయీ భేదాలతో మనుషులందరికీ చింతలు ఉంటాయి. పాలుతాగే పసితనంలో పెద్దగా తెలియదు గానీ, బడికి వెళ్లడం ప్రారంభించిన చిన్నారులు మొదలుకొని, కాటికి కాళ్లు చాపుకున్న పండు ముసలివాళ్లకు సైతం ఏదో ఒక చింత ఉండనే ఉంటుంది. చితి.. చచ్చాకనే మనిషిని దహిస్తుంది. చింత బతికుండగానే మనిషిని కాల్చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. నిరంతర చింతాక్రాంతులకు షడ్రసోపేత భోజనమైననూ రుచించదు. హంసతూలికా తల్పమునైననూ నిద్రపట్టదు. ఏ పనియందూ మనసు లగ్నము కాదు. వేళ మీరిన తర్వాత ఎప్పటికో కలత నిద్ర పట్టినా, పీడకలలు పీడిస్తాయి. జీవితంలో ఇలాంటి స్థితి ఎక్కువకాలం కొనసాగడం ఆరోగ్యానికే కాదు, దీర్ఘకాలికంగా చూసుకుంటే ఆయుర్దాయానికీ మంచిది కాదు. అలాగని, ఏదీ పట్టించుకోకుండా, చీకూ చింతాలేని ధిలాసా కులాసా జీవితం గడిపితే, అది అస్సలు మంచిది కాదు. అందువల్ల మరీ వర్రీ కాకుండా, వర్రీస్ గురించి కొంచెం తెలుసుకోండి... చింతా పురాణం.. ‘బతుకంతా చింతే జీవికి..’ అనే కీర్తనలో పురందరదాసు లోకంలోని చింతలన్నింటినీ ఏకరువు పెట్టాడు. ‘మదిలో చింతలు మైలలు మణుగులు..’ అంటూ చింతా భారాన్ని తూకం వేశాడు అన్నమయ్య. పురాణాల్లో చింతాక్రాంతులు చాలామందే ఉన్నారు. వారిలో మచ్చుకు కొందరి గురించి చెప్పుకుందాం.. కురుక్షేత్రంలో కౌరవ, పాండవ సైన్యాలు రెండు వైపులా మోహరించి ఉన్న తరుణాన సోదరులను, బంధువులను చంపడానికా ఈ యుద్ధం చేయడం అంటూ అర్జునుడు చింతాక్రాంతుడవుతాడు. తన రథానికి సారథ్యం వహిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడు గీతోపదేశం చేసిన తర్వాత యుద్ధోన్ముఖుడవుతాడు. యుద్ధం మొదలవక ముందు అర్జునుడు చింతాక్రాంతుడైతే, యుద్ధం మొదలయ్యాక ధృతరాష్ట్రుడు చింతాక్రాంతుడవుతాడు. సంజయుడి ద్వారా ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలను తెలుసుకుంటూ, యుద్ధభూమిలో ఒక్కొక్కరుగా మరణిస్తున్న తన కొడుకుల దుస్థితిని తలచుకుంటూ వగచి వగచి విలపిస్తాడు. యుద్ధానికి ముందే చింతించిన అర్జునుడు విజేతగా నిలిస్తే, యుద్ధం మొదలయ్యాక చింతించిన ధృతరాష్ట్రుడు వంశనాశనాన్ని చవిచూశాడు. వర్రీస్ ఆర్ వెరీ కామన్.. రాజకీయాల్లో తిరుగుతున్న పెతోడూ దేస్సేవ చేసేయాలని తెగ వర్రీ అయిపోతుంటాడు. దేశాన్ని యమ బీభత్సంగా ఎలా అభివృద్ధి చేయాలా అని ప్రభుత్వాలు, వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకుని ఎలా అధికారంలోకి రావాలా అని ప్రతిపక్షాలు వర్రీ అయిపోతుంటాయి. రిలీజు కాబోయే సినిమా కలెక్షన్ల గురించి నిర్మాతలు, బయ్యర్లు వర్రీ అయిపోతుంటారు. తమ అభిమాన హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్టవుతాయా, ఫట్టవుతాయా అనే ఆలోచనతో వీరాభిమానులు వర్రీ అయిపోతుంటారు. రాబోయే పరీక్షలను తలచుకుని విద్యార్థులు, చదువుసంధ్యలు పూర్తయ్యాక వాళ్ల భవిష్యత్తు ఎలా తగలడుతుందా అని తల్లిదండ్రులు ఓ.. తెగ వర్రీ అయిపోతుంటారు. తమ వంక కనీసం కన్నెత్తి చూడనైనా చూడని అమ్మాయిల గురించి అబ్బాయిలు, అదే పనిగా తమను ఓరచూపులు చూసే అబ్బాయిల గురించి అమ్మాయిలు మరీ మరీ వర్రీ అవుతుంటారు. ధరల దూకుడు గురించి, పెరగని జీతభత్యాల గురించి ఉద్యోగులు వర్రీ అవుతుంటారు. ఆఫీసులో అడుగుపెట్టాక బాసు మూడ్ ఎప్పుడెలా ఉంటుందోననే వర్రీ కూడా సగటు ఉద్యోగులను పీడిస్తుంటుంది. ఆఫీసు నుంచి ఇంటికెళ్లాక ఇంటావిడ సాధింపుల నుంచి విముక్తి ఎప్పుడు దొరుకుతుందిరా భగవంతుడా అని కుటుంబరావులు వర్రీ అవుతుంటారు. ఇంటాయన బుద్ధిగా ఇంటికొచ్చి షాపింగుకు తీసుకెళతాడా, లేకపోతే ఆఫీసు నుంచి ఏకంగా మందు పార్టీకి చెక్కేస్తాడా అని గృహిణీమణులు వర్రీ అవుతుంటారు. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఏం తినాలా అనే దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయాక బెడ్పైకి వెళ్లేలోగా ఏమేం చేయాలా అనే విషయాల గురించి చాలామందికి చాలా రకాల వర్రీస్ ఉంటాయి. నిగనిగలాడే కేశసంపదతో అలరారే మాడు పలచబడటం గురించి, సింహేంద్రమధ్యమంలాంటి నాజూకైన నడుము నానాటికీ పూర్ణకుంభాకారం దాల్చుతుండటం గురించి, శరీరంలో పేరుకుపోతున్న చక్కెర గురించి, నిత్యావసరాల ధరలకు మించిన వేగంతో ఎగసిపడుతున్న రక్తపోటు గురించి, సిలిండర్లో ఉండాల్సిన గ్యాస్ కడుపులో గడబిడ చేస్తుండటం గురించి మాజీ యువకులు చాలా తెగ వర్రీ అవుతుంటారు. ఇలాంటి వర్రీస్ గురించి ఎన్నయినా చెప్పవచ్చు. ఎవరైనా వీటి జాబితాను తయారు చేస్తే, అది కచ్చితంగా కొండవీటి చాంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ఒకసారి ఒకే వర్రీ బాధిస్తుందనుకోవద్దు. కాలం ఖర్మం కలసిరాకపోతే ఒకేసారి నానా వర్రీస్ చుట్టాల్లా చుట్టుముట్టొచ్చు. ఇలాంటి వర్రీస్లో ఒకటో, రెండో.. ముప్పయిరెండో వర్రీస్ మీకూ ఉండే ఉంటాయి. ఇలాంటి వర్రీస్ ఉన్నందుకు బాధపడటం మాని, కొంచెం ఆనందించండి. అలాగని, ధిలాసాగా ఉండకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలపై కొంచెం కొంచెం వర్రీ అవుతూ ఉండండి. ఎందుకంటారా..? అయితే, చిత్తగించండి.. చిగురంత చింత మంచిదే.. చింత.. అనగా, తింత్రిణీఫలము అలియాస్ చింతపండు కాదిక్కడ. అయినా, ప్రస్తావన వచ్చింది గనుక కొంచెం చెప్పుకుందాం. మోతాదుగా చింతపండు వాడితే వంటకాలకు రుచి అబ్బుతుంది. వంటకాలకు రుచినిచ్చే చింతపండు సంగతి సరే, మరి నిద్రపట్టకుండా చేసే చింత.. అదే, వర్రీ సంగతేమిటంటారా..? కర్రీకి చింతపండులాగానే, మనిషనే వాడికి జీవితంలో వర్రీస్ కూడా మంచివేనని శాస్త్రవేత్తలు సెలవిస్తున్నారు. ఆషామాషీగా వాళ్లు ఈ మాట చెప్పడం లేదు. పాపం, వర్రీ గురించి తెగ వర్రీ అవుతూ బోలెడన్ని పరిశోధనలు కూడా చేశారు. ఇంట్లో బిందెలు అడుగంటిన వేళ కొళాయిలో నీళ్లు రానందుకు, టీవీలో అభిమాన సీరియల్ చూస్తున్నప్పుడు చెప్పాపెట్టకుండా కరెంటు సరఫరా నిలిచిపోయినందుకు, పిల్లాడు చెప్పిన మాట వినకుండా హఠం చేసినందుకు, రెయిన్కోటు లేకుండా బయలుదేరిన వేళ ట్రాఫిక్ నడిమధ్యలో ఉన్నప్పుడు భోరున వర్షం కురిసినందుకు.. ఇలాంటి చిన్న చిన్న కారణాలకు సైతం మీరు వర్రీ అవుతుంటారా..? మరేం ఫర్వాలేదు. కచ్చితంగా మీరు చాలా తెలివైన వాళ్లు! మీ ఐక్యూ ఐన్స్టీన్కు కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. చిన్నా చితకా విషయాలకు కూడా తెగ వర్రీ అయ్యే అలవాటున్న వాళ్లకు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని న్యూయార్క్లోని సనీ డౌన్స్టేట్ మెడికల్ సెంటర్కు చెందిన మానసిక వైద్య నిపుణుడు ప్రొఫెసర్ జెరెమీ కోప్లాన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఒక తాజా పరిశోధనలో నిగ్గు తేల్చింది. వర్రీ అయ్యే లక్షణం వల్లనే ప్రమాదాలను నివారించుకోగల తెలివితేటలు మనుషుల్లో అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తల ఉవాచ. వర్రీ అయ్యే లక్షణం ఉన్నవాళ్లు ప్రమాదాలకు, ఉపద్రవాలకు ఎలాంటి అవకాశం లేకుండా, ప్రణాళికాబద్ధంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారని వారు చెబుతున్నారు. వర్రీ అయ్యే లక్షణానికి, తెలివితేటలకు అవినాభావ అనులోమానుపాత సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని వివరిస్తున్నారు. అందువల్ల మీ మీ భూత భవిష్యత్ వర్తమాన సమస్యలన్నింటిపైనా బేఫికర్గా వర్రీ అవ్వండి.. ఈ పాడు జీవితం కాస్తంతైనా సార్థకం కావాలంటే, చిగురంత చింత ఉండాల్సిందే! - సాక్షి ఫ్యామిలీ వర్రీస్.. ఫ్లాష్బ్యాక్.. నిరంతరం వర్రీ కావడాన్ని ఇదివరకు ఒక రుగ్మతగానే పరిగణించేవారు. వయసు మళ్లడం వల్ల తలెత్తే నానా లక్షణాల్లో వర్రీకావడం కూడా ఒకటి అని శతాబ్దం కిందట వైద్యనిపుణులు సైతం చెప్పేవాళ్లు. ‘వర్రీ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్’ అని హేడన్ బ్రౌన్ అనే వైద్య నిపుణుడు 1900 సంవత్సరంలో ఓ పుస్తకాన్ని రాస్తే, అమెరికన్ మానసిక వైద్య నిపుణుడు విలియమ్ ఎస్ సాడ్లర్ 1914లో ‘వర్రీ అండ్ నెర్వస్నెస్’ అనే పుస్తకం రాశాడు. అంటే, వర్రీస్ని కాకపోయినా, వర్రీ అయ్యే లక్షణాన్ని సమూలంగా నిర్మూలించడాన్నే అప్పటి వైద్య నిపుణులు తమ తక్షణ కర్తవ్యంగా తలచారు. ఆ దిశగానే వారు కృషి చేశారు. మనుషుల్లో వర్రీ అయ్యే లక్షణాన్ని ఎలా రూపుమాపాలా అంటూ వారంతా తెగ వర్రీ అయ్యేవారు. పాపం.. అమాయకులు. వర్రీస్ వల్ల కలిగే మేలును అప్పట్లో గుర్తించలేకపోయారు వాళ్లు. -
ఖమ్మం జిల్లాలో నరబలులు?