illegal migrants
-
పనామా నిర్బంధ కేంద్రంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ
పనామా సిటీ: భారతీయులు సహా సుమారు 300 మంది అక్రమ వలసదారుల్ని లాటిన్ అమెరికా దేశం పనామాలో ఉంచింది అమెరికా. అయితే.. నిర్బంధ కేంద్రంలో వాళ్లంతా దయనీయమైన స్థితిలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. తమకు సాయం అందించాలని కొందరు ఫ్లకార్డులను ప్రదర్శించడమే అందుకు కారణం. అయితే పనామాలో ఉన్న భారత రాయబార కార్యాలయం ఈ అంశంపై స్పందించింది.పనామా(Panama)లోని ఓ హోటల్లో వాళ్లంతా సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించింది. వాళ్లకు అవసరమైనవన్నీ ఇక్కడి అధికారులు అందిస్తున్నారని, వాళ్ల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం అని భారత ఎంబసీ ఎక్స్ ద్వారా తెలిపింది.Panamanian authorities have informed us that a group of Indians have reached Panama from US They are safe and secure at a Hotel with all essential facilitiesEmbassy team has obtained consular accessWe are working closely with the host Government to ensure their wellbeing pic.twitter.com/fdFT82YVhS— India in Panama, Nicaragua, Costa Rica (@IndiainPanama) February 20, 2025భారత్,ఇరాన్, నేపాల్,శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, చైనాకు చెందిన అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి పనామాకు తరలించారు అధికారులు. హోటల్ అయిన ఆ నిర్బంధ కేంద్రం చుట్టూ తుపాకులతో సిబ్బంది ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అదే టైంలో.. వలసదారుల్లో కొందరు సాయం కావాలని, తాము తమ దేశంలో సురక్షితంగా ఉండలేమంటూ హోటల్ అద్దాల గదుల నుంచి ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. ఆందోళన మొదలైంది.అయితే అక్రమ వలసదారుల్ని(Illegal Migrants) నేరుగా స్వస్థలాలకు పంపడంలో అమెరికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే పనామాను వారధిగా(ట్రాన్సిట్ కంట్రీ) ఉపయోగించుకుంటోంది. ఇక వలసదారుల ఆందోళనలను పనామా తోసిపుచ్చుతోంది. అమెరికాతో ఉన్న వలసదారుల ఒప్పందం మేరకు..వాళ్లను ఇక్కడ ఉంచాల్సి వచ్చిందని పనామా సెక్యూరిటీ మినిస్టర్ ఫ్రాంక్ అబ్రెగో వెల్లడించారు. వాళ్లకు సకాలంలో ఆహారం, మందులు..ఇతర సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారాయన. అయితే..వాళ్లలో చాలామంది హోటల్ దాటే ప్రయత్నాలు చేశారని, అందుకే కాపలా ఉంచాల్సి వచ్చిందని పేర్కొన్నారు.బుధవారం చైనాకు చెందిన ఓ మహిళ పారిపోయే ప్రయత్నంలో పట్టుబడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అక్రమ వలసదారుల్ని ఇక్కడి(పనామా) నుంచే స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారాయన.ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటిదాకా అమెరికా నుంచి భారత్కు 332 మంది అక్రమ వలసదారుల్ని పంపించి వేసింది. ఈ మేరకు మూడు దఫాలుగా అమృత్సర్లో అమెరికా యుద్ధ విమానం వలసదారుల్ని తీసుకొచ్చింది. -
ట్రంప్ దూకుడు.. మరో 119 మంది భారతీయులు వెనక్కి..
చండీగఢ్: అగ్ర రాజ్యం అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే భారత్కు చెందిన మరో 119 మంది అక్రమ వలసదారులు రెండు విమానాల్లో స్వదేశం చేరుకోనున్నారు. తొలి విమానం శనివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.భారత్కు చెందిన అక్రమ వలసదారులను తిరిగి పంపించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను స్వదేశానికి పంపనుంది. తొలి విమానం సీ 17 గ్లోబ్ మాస్టర్-3.. 119 మందితో శనివారం రాత్రి 10 గంటలకు అమృత్సర్లో దిగనుంది. రెండో విమానం ఆదివారం ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విమానంలో ఎంత మందిని పంపించనున్నారన్న విషయం వెల్లడి కాలేదు. ఇక, తొలి విమానంలో రానున్న 119 మంది భారత వలసదారుల్లో 67 మంది పంజాబ్కు చెందినవారు. మిగతా వారు హర్యానా (33), గుజరాత్ (8), ఉత్తర్ప్రదేశ్ (3), గోవా (2), మహారాష్ట్ర (2), రాజస్థాన్ (2), హిమాచల్ ప్రదేశ్(1), జమ్ము కశ్మీర్ (1)వాసులుగా గుర్తించారు.ఇక, గతవారం.. సైనిక విమానంలో అమెరికా 104 మంది అక్రమ వలసదారులను పంపిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి వస్తున్న విమానాలు అమృత్సర్ విమానాశ్రయంలోనే దిగుతున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో సీఎం మాన్ మాట్లాడుతూ..‘119 మంది అక్రమ వలసదారుల్లో 67 మంది పంజాబ్కు చెందిన వారని.. అందుకే అమృత్సర్లో విమానం ల్యాండ్ చేస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అలా అయితే.. మొదట వచ్చిన విమానం అహ్మదాబాద్లో ఎందుకు దిగలేదు?. ఇప్పుడు రెండో విమానం వస్తోంది. ఇది కూడా అమృత్సర్ విమానాశ్రయంలోనే దిగనుంది. అమృత్సర్నే ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారు. ఢిల్లీలో ఎందుకు దించడం లేదు. కేవలం పంజాబ్ ప్రతిష్ఠను దిగజార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోంది’ అంటూ ఆరోపణలు చేశారు. #WATCH | Amritsar | Punjab CM Bhagwant Mann says, "There is a conspiracy to defame Punjab and Punjabis... The first plane landed in Amritsar... Now, a second plane (carrying Indian citizens who allegedly illegally migrated to the US) will land in Amritsar... The MEA should tell… pic.twitter.com/dJfn6Abx0V— ANI (@ANI) February 15, 2025 -
140 కోట్ల భారతీయులకూ అది అవమానమే!
డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో, ద్వంద్వ నీతితో, మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ముడిపడ్డవే. విద్య, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను (Indians) అవమానకరంగా వెనక్కి పంపింది. వీళ్లంతా నేరస్తులు కాదు. ఆ దేశం అక్రమ వలసదార్ల వల్ల భారీ లాభాలు గడించింది. వలసదార్ల రంగు నలుపైనా, చట్టం అక్రమ వలసదార్లని చెప్పినా, వారి సాంకేతిక నైపుణ్యం అమెరికన్ కార్పొరేట్లకి అంటరానిది కాదు. ట్రంప్ సర్కార్ వచ్చాక మన వాళ్ళను క్రిమినల్స్లాగా వేటాడి నిర్బంధించింది. సంకెళ్ళతో అమెరికా సైనిక విమానాల్లో కుక్కి అమృతసర్లో దింపేసి వెళ్ళింది. అది ఆ 104 మందికే కాదు మొత్తం 140 కోట్ల భారతీయులకూ అవమానమే!అమెరికా (America) నుంచి భారత్కు చేరుకున్న వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వారి దీన గాథలు వింటే కడుపు తరుక్కు పోతుంది. ఏజంట్ల మాటలకు మోసపోయి లక్షలు చెల్లించి వెళ్లిన వీరు అమెరికా భూమిపై అడుగు పెట్టడానికి పడిన పాట్లు వర్ణనాతీతం. మైళ్ల కొద్దీ కాలినడక, చిన్నబోటులో ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించి అమెరికా గడ్డపై కాలు పెట్టడం, ఆ వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు చీకటి గదుల్లో బంధించడం... వీరి ప్రస్థానంలో మరపురాని ఘట్టాలు. అక్కడ వేలాది మంది పంజాబీ యువకులూ, పిల్లలూ కనిపించారనీ, అందరిదీ ఒకటే దుఃస్థితి అనీ తిరిగివచ్చిన వారు చెబుతున్నారు.ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే తప్ప అక్కడ జీవించే పరిస్థితి లేదు. అమెరికా పంపేందుకు ఇక్కడ బ్యాంకుల ద్వారా రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అప్పు చేసి ఇంకా కొంత మంది ఆస్తులు తాకట్టు పెట్టి విదేశాలకు పంపించారు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) పూర్తి చేసి ఏదో ఒక కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంతలో కొంత మిగుల్చుకుని తల్లిదండ్రులకు పంపేవారు. ఇక్కడి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఆ డబ్బులు జమచేస్తూ ఉంటారు. ఇదీ చదవండి: వెనక్కి పంపేస్తే నష్టమే!చదువు కోసం వెళ్లిన వారు కూడా ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు విద్యా సంస్థలు, యూనివర్సిటీ క్యాంపస్ల బయట చేయడానికి వీలు లేదన్న నిబంధనను గట్టిగా అమలు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు నెలకు రూ. 60 వేల నుంచి రూ. 80 వేల వరకూ పంపించాల్సి వస్తోంది.ఇదీ చదవండి: అమెరికాలో భగ్నస్వప్న గాథ! అట్లాంటా, ఒహాయో, క్యాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, డల్లాస్లలో తెలుగు విద్యార్థులు (Telugu Students) ఎక్కువగా ఉన్నారు. ఇది ఒక సమస్య అయితే ఓపీటీ పూర్తయిన తర్వాత ఏ ఉద్యోగం దొరక్క అమెరికాలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవించే వారిపై ట్రంప్ ప్రభుత్వం కక్షకట్టింది. అక్కడ ఒత్తిడిలో ఉన్న యువత ఫోన్లు ఎత్తకపోతే కన్నీరు మున్నీరుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. వారు ఏ ఆపదలో ఇరుక్కుపోయారో అనే ఆందోళన ఇందుకు కారణం. ఇది కేవలం భారతీయులకు, భారత దేశానికి చెందిన సమస్యే కాదు. ఎన్నో ప్రపంచ దేశాల సమస్య. అందుకే ట్రంప్ దుందుడుకు విధానాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా మానవత్వంతో వ్యవహరించాలి.– వెంకటేష్, పీడీఎస్యూ -
US Returns: ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.. సినిమాను తలపించే కథ!
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే (Donald Trump) అక్రమ వలస దారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం(USA).. పలువురు భారతీయుల్ని వెనక్కి పంపుతోంది. ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఎవరినీ ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విధంగానే పలువుర్ని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. ఇందులో భారతీయులు కూడా అధికంగానే ఉన్నారు. దీనిలో భాగంగా నిన్న (బుధవారం) ఓ విమానంలో 104 మంది వరకూ భారత్కు తిరిగి వచ్చారు. ఇందులో పంజాబ్ వారే అత్యధికంగా ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క గాథ.అమెరికా వెళితే జీవితం సెటిల్ అయిపోతుందనే భావనతో చాలామంది లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా అక్కడకు వెళ్లిన వారు.. అక్కడ ప్రభుత్వం తాజా చర్యలతో ఉసురుమంటూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో కొంతమందిని జాతీయ మీడియా పలకరించగా, ఒక్కొక్కరు ఒక్కో కథ చెబుతున్నారు. తాము అక్రమంగా(illegal immigrants) వెళ్లామా.. లేదా అన్న సంగతిని అంత సీరియస్గా తీసుకోకపోవడంతో వారు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ చేతులు దులుపుకున్న వైనమే మనకు వారి మాటల్లో కనిపిస్తోంది.పంజాబ్లోని వీర్పల్ గ్రామం నుంచి అక్రమంగా అమెరికాకు వలస వెళ్లిన సుఖ్జీత్ కౌర్ అనే 26 ఏళ్ల యువతి.. తన కాబోయే వాడిని పెళ్లి చేసుకోవడానికి దొడ్డిదారిన అమెరికాకు వెళ్లింది. అయితే ఆమె పెళ్లి జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆమెను అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. సుఖ్జీత్ తన చదువును పంజాబ్లోనే పూర్తి చేసుకున్నప్పటికీ తన భర్త కాబోయే వాడు అమెరికాలో ఉండటంతో అక్కడకు అక్రమంగా ప్రవేశించింది. ఒక ఏజెంట్కు లక్షల్లో డబ్బులు చెల్లించి అక్రమంగా అమెరికాలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె పెళ్లి కాకుండానే అమెరికాను వీడి స్వదేశానికి చేరుకుంది. సుఖ్జీత్ కౌర్ తండ్రి ఇటలీలో నివసిస్తుండగా, తల్లి, సోదరుడు పంజాబ్లోనే ఉంటున్నారు.అమృత్సర్ నివాసి అయిన అజయ్దీప్ సింగ్ది మరో కథ. 15 రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలస దారుల్నివెనక్కి పంపుతుందనే సమాచారం ఉన్నా అతను మాత్రం యూఎస్కు అక్రమంగా వలస వెళ్లాడు.. అయితే అజయ్దీప్ సింగ్ కూడా తిరిగి భారత్కు పంపబడ్డ జాబితాలో ఉండటంతో అతను తాత చరణ్జీత్ సింగ్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. తన మనవడ్ని వెనక్కి పంపడం కచ్చితంగా తప్పేనని అంటున్నాడు. ఈరోజుల్లోఅమెరికాకు వెళ్లాలని యువత అనుకోవడం తప్పా అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. అమెరికాకు వెళ్లాలనే యువత ఆలోచనల్లో తప్పేందముని అక్రమ వలస విధానాన్ని కూడా సమర్థించుఉంటున్నాడు.అమృత్సర్కు చెందిన దలీర్సింగ్ది మరో గాథ.. అతనొక బస్సు డ్రైవర్. అమెరికాకు వెళ్లి లక్షల్లో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఎలాగోలా రూ. 30 లక్షలు కూడబెట్టి ఒక ఏజెంట్ను పట్టుకుని అక్రమంగా యూఎస్కు వెళ్లిపోయాడు. అది కూడా నెలక్రితమే అతను అమెరికాకు చేరుకున్నాడు. అయితే 15 రోజుల క్రితం వరకూ ఫోన్ కాల్లో కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్న దలీర్ సింగ్.. ఆ తర్వాత నుంచి ఎటువంటి ఫోన్ రాలేదు. అయితే అతన్ని తిరిగి ఇండియాకు పంపుతున్నట్లు అమెరికా పోలీసుల నుంచి కాల్ రావడంతో దలీర్ సింగ్ గురించి తెలిసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.అక్షదీప్.. ఇతను కూడా అమెరికాకు అక్రమంగా వెళ్లి అడ్డంగా బుక్కైపోయాడు. అమెరికాలో చదువుల కోసం అతను చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అక్షదీప్ దుబాయ్కు వెళ్లిపోయాడు. అక్కడ ట్రక్ డ్రైవర్గా పని ేచేస్తున్నాడు అక్షదీప్,.అయితే అతను తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని అనుకున్నాడు. అందుకు తండ్రి స్వర్ణ్ సింగ్ సాయం కోరాడు. అందుకు తండ్రి సరే అన్నాడు. దానిలో భాగంగా తండ్రి స్వర్ణ్సింగ్ కు ఉన్న మూడు ఎకరాల భూమిని తాకట్టు పెట్టాడు. అయితే సుమారు రూ. 50 లక్షల నుంచి ూరూ. 60 లక్షల వరకూ ఖర్చు పెట్టాడు కుమారుడు అమెరికా పయనం కోసం. అయితే అమెరికాకు వెళ్లిన వాడు వెళ్లినట్లు తిరిగి వచ్చేశాడు అక్షదీప్ సింగ్.దీనిపై తండ్రి స్వర్ణ్ సింగ్ మాట్లాడుతూ.. కొడుకు క్షేమంగాతిరిగి ాభారత్కు వచ్చాడని, అదే సంతోషమని అంటున్నాడు. డబ్బులు అనేవి వస్తుంటాయి.. పోతుంటాయి అని, ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు.అక్రమ వలస దారులతో భారత్లో దిగిన తొలి విమానంఅవును.. సంకెళ్లు, గొలుసులతో బంధించే తీసుకొచ్చారు -
104 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
-
అక్రమ వలసదారులతో భారత్లో దిగిన తొలి విమానం
న్యూఢిల్లీ: అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్లో ల్యాండ్ అయ్యింది. అయితే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు విమానంలో 205 మంది లేరు. టెక్సాస్ నుంచి వచ్చిన ఈ విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీళ్లతో పాటు అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా వచ్చారు. అక్రమ వలసదారులతో ఉన్న ఆ విమానం అమృత్సర్లో దిగినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీళ్లలో అత్యధికులు.. అమెరికా-మెక్సికో బార్డర్ వద్ద పట్టుబడినట్లు సమాచారం. భారత్ ఇప్పుడు వీళ్లనేం నేరస్థులుగా చూడదు. అయితే.. వాళ్ల గుర్తింపులను క్షుణ్ణంగా పరిశీలించాకే.. స్వస్థలాలకు తిరిగి పంపిస్తామని చెబుతున్నారు.గడువు ముగిసినా, ఎటువంటి అధికార పత్రాలు లేకుండా తమ భూభాగంలో ఉంటున్న వలసదారుల్ని తిరిగి వాళ్ల వాళ్ల దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ట్రంప్(Trump) ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి బ్యాచ్ కింద.. వీళ్లను అమెరికా సీ-17 సైనిక విమానం తీసుకొచ్చింది. వీళ్లలో 30 మంది పంజాబ్కు చెందినవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో భారత అక్రమ వలసదారులు(Indian Illegal Immigrants).. ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. ఈ లెక్కన మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా అలా ఉంటోంది భారతీయులే!. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ సమయంలో ట్రంప్తో ఆయన ఈ అంశంపైనా చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ట్రంప్ ఈ చర్యను భారత్ గతంలోనే స్వాగతించింది. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలో ఏమూల ఉన్నా అక్రమ వలసదారులను తాము వెనక్కి పిలిపించుకుంటామని విదేశాంగ మంత్రి జై శంకర్(Jai Sankar) స్పష్టం చేశారు. అయితే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అర్థిక వ్యవస్థకు దోహదపడుతున్న వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వకుండా.. ఇలా వెనక్కి పంపించేయడం సరికాదని అంటున్నారాయన. ఈ విషయంపై జై శంకర్తో ఆయన చర్చించనున్నట్లు తెలిపారు. -
భారత అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం
వాషింగ్టన్: అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే కార్యక్రమం అమెరికాలో నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా.. 205 మంది భారతీయులతో కూడిన మిలిటరీ విమానం బయల్దేరినట్లు తెలుస్తోంది. మరో 24 గంటల్లో విమానం భారత్కు చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు ఢిల్లీ వర్గాల సమన్వయం కూడా ఉన్నట్లు సమాచారం.ఇంతకు ముందు.. వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అయితే భారత్ విషయంలో మాత్రం ఇదే తొలి అడుగు. వచ్చే వారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైనా చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు ఏడున్నర లక్షల మంది దాకా ఉన్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత అత్యధికంగా ఉంది భారతీయులే. వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో సుమారు 18 వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడి ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వైట్హౌజ్లో అడుగుపెట్టిన వెంటనే అమెరికా భూభూగంలో ఉన్న అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే తీరతానని ట్రంప్ ప్రతినబూనారు. అలాంటి వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. ఇదే అంశంపై ట్రంప్ గతంలో మోదీతోనూ ఫోన్లో మాట్లాడారు. ఆ టైంలో ‘‘సరైన చర్యలు తీసుకుంటాం’’ అని భారత ప్రధాని తనతో అన్నారని ట్రంప్ తమ చర్చల సారాంశాన్ని వివరించారు. -
అక్రమ వలసదారులకు ఇక నరకమే: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికాకు వచ్చే అక్రమ వలసదారుల్ని గ్రహాంతరవాసులతో పోలుస్తున్నారు. వాళ్లను తిరిగి స్వదేశాలకు పంపే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటిదాకా.. వారం వ్యవధిలో 7,300 మందిని వెనక్కి పంపించేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారాయన.అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించే ప్రసక్తి లేదని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. అక్రమ వలసదారులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకుని తరలించేందుకు అవసరమైన ‘లేకెన్ రిలే’ చట్టం అక్కడి చట్టసభల ఆమోదం పొందిన తెలిసిందే. ఆ ఫైల్పై ట్రంప్ తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అమెరికా పౌరులకు ముప్పు కలిగించే క్రిమినల్స్ను విడిచిపెట్టం. దేశం నుంచి పంపించేస్తాం. అయితే కొందరు అత్యంత క్రూరులు ఉంటారు. వారిని స్వదేశాలకు పంపిస్తే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వాళ్లను నరకంలాంటి గ్వాంటనామో జైలుకు తరలిస్తాం. సుమారు 30 వేల మంది కోసం అక్కడ బెడ్లు సిద్ధం చేయించే ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తా అని అన్నారాయన.క్యూబాలోని గ్వాంటనామో బేలో ఉందీ జైలు. నావల్ స్టేషన్ గ్వాంటనామో బే(NSGB) పరిధిలో ఉందీ అమెరికా మిలిటరీ ప్రిజన్. భూమ్మీది నరకంగా ఈ జైలును అభివర్ణింటారు. ఉగ్రవాదుల బంధీఖానాగా దీనికి పేరుంది. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత 2012లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ జైలును ప్రారంభించారు. 9/11 దాడుల్లో పాల్గొన్నవాళ్లను అమెరికా ఇక్కడ నిర్భంధించింది. ఇక్కడి ఖైదీలను మానసికంగా, శారీకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. జనవరి 2025 నాటికి.. ఈ జైల్లో 48 దేశాలకు చెందిన 780 మందిని బంధీలుగా ఉంచారు. అయితే.. 756 మందిని వెనక్కి పంపించేశారు. కస్టడీలో 9 మంది చనిపోయారు. ఇంకా 15 మంది మాత్రమే అక్కడ ఉన్నారు. -
Illegal Immigrants: ఎవరేమన్నా.. ఐ డోంట్ కేర్!
వాషింగ్టన్: అక్రమ వలసవాదుల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారం రోజుల్లోనే సుమారు మూడున్నర వేల మందిని అరెస్ట్ చేసి వెనక్కి పంపించారు(డిపోర్టేషన్). అందులో ఈ రెండ్రోజుల్లోనే రెండు వేలమందిపై చర్యలు తీసుకోవడం గమనార్హం. దీంతో.. సరైన పత్రాల్లేకుండా అమెరికాలో ఉంటున్న లక్షల మంది వణికిపోతున్నారు. అయితే..అయితే.. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపే క్రమంలో అక్కడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. పలు నగరాల్లో ఇళ్లలోకి, ప్రార్థనాస్థలాల్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ వలసదారుల్ని గొలుసులతో కట్టడంతోపాటు చేతులకు బేడీలు వేసి అమానవీయంగా సైనిక విమానం ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పైగా ఆ విమానంలో తాగునీరు లాంటి కనీస వసతులు కూడా కల్పించడం లేదనే ఆరోపణలొచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని మధ్య, దక్షిణ అమెరికా దేశాలు ఖండిస్తున్నాయి.మరోవైపు.. ఎఫ్ 1 వీసాల ఆధారంగా వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వణికిపోతున్నారు. యూనివర్సిటీలతో, తమ కోర్సులతో సంబంధం లేకుండా.. ఖర్చుల కోసం పార్ట్టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఏదిఏమైనా.. ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ చర్యలు ముందుకు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. సరైన పత్రాల్లేకుండా దేశంలోకి దొడ్డిదారిన ప్రవేశించి నివాసముంటున్న వారిని పెద్దఎత్తున విమానాల ద్వారా స్వదేశాలకు తిప్పి పంపే చర్యలు కొనసాగుతాయన్నారు. అయితే.. ఆ విమానాల్ని తమ భూభాగంలోకి అనుమతించేది లేదని బెదిరిస్తున్న దేశాలపై ఆంక్షల కొరడా ఝళిపించి మరీ ట్రంప్ దారికి తెచ్చుకుంటుండడం గమనార్హం.సరిహద్దున ఉన్న మెక్సికోతోపాటు బ్రెజిల్, కొలంబియా, గ్వాటెమాలా, హోండూరస్, ఎల్సాల్వడార్ వంటి దేశాలుఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్నాయి. అయితే..ఇప్పుడు వెనక్కి వచ్చిన వారికి సౌకర్యాలను కల్పించలేక తలలు పట్టుకుంటున్నాయి. -
అమెరికాలో అక్రమ వలసదారులు అరెస్ట్.. భారత్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అక్రమ వలసదారులు అగ్ర రాజ్యం అమెరికాను వీడుతున్నారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే నేరస్థులైన అక్రమ వలసదారులను టార్గెట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. Just as he promised, President Trump is sending a strong message to the world: those who enter the United States illegally will face serious consequences. pic.twitter.com/yqgtF1RX6K— The White House (@WhiteHouse) January 24, 2025ఇక, ఈ వివరాలను శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో.. ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకూ 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు అని వెల్లడించారు.ఈ నేపథ్యంలో భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని స్పష్టం చేసింది. అయితే, వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకువస్తామని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. -
ట్రంప్ టెన్షన్.. 1500 మంది అక్రమ వలసదారుల కొత్త వ్యూహం!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కుర్చీ ఎక్కేలోగా వలసదారులు అమెరికా చేరుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు 1500 మంది అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టే నాటికి అక్రమ వలసదారులు అమెరికాలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మెక్సికన్ సిటీ తపచులా నుంచి దాదాపు 1500 మంది వలసదారులు అమెరికాకు బయలుదేరినట్టు కథనాలు వెలువడ్డాయి. సరిహద్దుల వెంట 2600 కిలోమీటర్లు నడక మార్గంలో ప్రయాణించి అమెరికా చేరుకోవాలని వారు ప్రణాళిక చేసుకున్నారు. అయితే, ఎలాగైనా అమెరికా చేరుకుని ట్రంప్ అధికారంలోకి రాక ముందే అక్కడ ఆశ్రయం పొందాలనేది తమ ప్రణాళిక సదరు వలస బృందంలోని ఓ వ్యక్తి చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇదిలా ఉండగా.. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను దేశంలోకి రాకుండా అరికడతానని, అమెరికాలో ఉన్నవారిని పంపించి వేస్తానని ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే లోపే అమెరికాలో అడుగుపెట్టాలని శరణార్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత పలువురు అక్రమ వలసదారులు ఇప్పటికే అమెరికాను విడిచివెళ్లినట్టు సమాచారం. Tapachula: This morning, Nov. 20th, another caravan departed southern Mexico. This is the sixth caravan to leave Chiapas since Claudia Sheinbaum's presidency; five have left from Tapachula and one from Tuxtla Gutiérrez with the intention of reaching central Mexico. “Fear,… pic.twitter.com/Y9W98aIQIY— Auden B. Cabello (@CabelloAuden) November 20, 2024 -
మణిపూర్లో వలసదారుల జల్లెడ కార్యక్రమం పొడిగింపు
ఇంఫాల్: మణిపూర్లో అల్లర్లు తగ్గుముఖం పట్టి అక్కడ పరిస్తితి ఇప్పుడిప్పుడే యధాస్థితికి చేరుకుంటోంది. అంతకుముందు మయన్మార్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారిని లెక్కించాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుండటంతో కేంద్రం ఆ గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించింది. మణిపూర్ అల్లర్లకు మయన్మార్ నుంచి వలస వచ్చిన వారు కూడా కారణమై ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ వాసులను లెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్ర హోంశాఖ.మణిపూర్తో పాటు మిజోరాంలో కూడా ఈ వలసదారులను లెక్కించమని కోరిన మిజోరాం దానిని తిరస్కరించింది. అలా చేస్తే అక్కడి వారిపై వివక్ష చూపించినట్లవుతుందని మిజోరాం అభిప్రాయపడింది. మే 29న కేంద్ర హోంశాఖ అక్రమ వలసదారులను బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించాలని సెప్టెంబర్ 30 లోపే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ అంతకుముందు తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ వాసులు సాధారణంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తుంటారని అందుకే వారి గణన చేపట్టామన్నారు. ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) వారిచే శిక్షణ తీసుకున్న ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కూడా అల్లర్లకు మయన్మార్ వాసులే కారణమని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని సీఎం బైరెన్ సింగ్ ప్రకటించారు. ఇది కూడా చదవండి: సీబీఐ క్లీన్చిట్ ఇస్తే రాజీనామా చేస్తారా? కేజ్రీవాల్ సవాల్! -
రెండు రోజుల్లో మణిపూర్లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు..
ఇంఫాల్: మణిపూర్లో అల్లర్లు మొదలై రెండు నెలలకు పైబడుతోంది. ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితి చక్కబడుతోంది. మెల్లిగా జనజీవనం కూడా యధాస్థితికి చేరుకుంటోంది. అంతలోనే మయన్మార్ నుండి 700 కు పైగా వలసదారులు మణిపూర్లో అడుగుపెట్టారు. రాష్ట్ర సరిహద్దు చుట్టూ వేల సంఖ్యలో అస్సాం రైఫిల్స్ ను కాపలా పెట్టినా సరైన డాక్యుమెంట్లు లేకుండా అంతమంది రాష్ట్రంలోకి ఎలా ప్రవేశించారన్నదే ప్రభుత్వాన్ని తొలిచేస్తున్న ప్రధాన ప్రశ్న. మే 3 నుండి మణిపూర్లో జరిగిన హింసాకాండకు యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఈశాన్య రాష్ట్రాల్లో నివసించే రెండు జాతుల మధ్య వైరుధ్యం కారణంగా చెలరేగిన అల్లర్లు సుమారు 150 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఎన్నో ఇళ్ళు దగ్ధమయ్యాయి. ఏ వీధిని చూసిన సగం కాలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. 40 వేలకు పైగా రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయారు. ఒకపక్క ప్రాణాలను చేత బట్టుకుని మణిపూర్ వాసులు వలస పోతుంటే పక్క దేశం నుండి అగ్నిగుండంలా ఉన్న రాష్ట్రంలోకి వలసలు వస్తున్నారు. హోంశాఖ తెలిపిన విసరాల ప్రకారం జులై 22, 23 లోనే మయన్మార్ నుండి 718 మంది వలసవచ్చారు. వీరంతా ఎవరనేది మణిపూర్ ప్రభుత్వానికి ఎదురవుతున్న మొదటి ప్రశ్న. బ్రతుకు తెరువు కోసమే వచ్చారా లేక ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించడానికి వచ్చారా? అన్నదానిపై స్పష్టత లేదు. వారు ఆయుధాలు ఏవైనా వెంట తెచ్చుకున్నారా అన్న సమాచారం కూడా హోంశాఖ వద్ద లేదు. సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా దళాలు ఉన్నప్పటికీ వారి వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అన్నది పరిశీలించకుండానే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
అక్రమ వలసలకు చెక్.. ఐరోపా దేశాలు-ట్యునీషియా మధ్య ఒప్పందం
మిలన్: ఆఫ్రికా దేశాల నుడి ఐరోపా దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర ఐరోపా దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలోనే ఇటీవల కొన్ని పడవలు సముద్ర మధ్యలో బోల్తాపడి ఎందరో వలసదారులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా - ట్యునీషియా ఈ ఒప్పందానికి తెరతీశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఆదివారం రోమ్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించగా ఐరోపా దేశాల ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వలసదారులు అక్రమంగా చొరబడకుండా వారికి చట్టబద్ధమైన ప్రవేశం కల్పించడంపైనా, ఆయా దేశాల్లో ఉపాధి కల్పించే విషయంపైనా చర్చలు సాగాయి. ఐరోపా దేశాలు-ట్యునీషియా ఒప్పంద సమావేశంలో మొత్తం 27 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సరిహద్దు భద్రత పటిష్టం చేసి వలసలను తగ్గించడమే అజెండాగా సమావేశంలో లిబియా, సిప్రస్, యూఏఈ, ట్యునీషియా దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అత్యధిక వలసదారులు ఈ దేశాల నుండే వస్తున్నారని, ఇకపై ఈ దేశాల నుండి అక్రమ వలసలు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు యూఏఈ అక్రమ వలసల నియంత్రణ కోసం పాటుపడే సంస్థలకు 100 మిలియన్ డాలర్లు సాయమందించనున్నట్లు ప్రకటించింది. ఇదే వేదికగా ఆఫ్రికా ఉత్తర దేశాలకు ఆర్ధిక ఊతాన్నిచ్చేనందుకు 27 దేశాల వారు కలిపి 1.1 బిలియన్ డాలర్లు కూడగట్టడానికి సంకల్పించారు. ఈ సందర్బంగా ఇటలీ ప్రధాని మెలోని మాట్లాడుతూ.. ఐరోపా దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరించడం తప్ప మరో ప్రయోజనం లేదన్నారు. వారు వలసదారులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని అన్నారు. మనం కఠినంగా ఉంటే క్రిమినల్స్ కు చెక్ పెట్టి వలసారులను ఆర్ధిక ప్రగతికి దోహద పడవచ్చని తెలిపారు. ఇది కూడా చదవండి: అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్ -
కోర్టుకు హాజరు కావాలంటూ.. చనిపోయిన వ్యక్తికి నోటీసులు!!
సాక్షి అస్సాం(సిల్చార్): కొన్ని సంఘటనలను చూస్తే మన వ్యవస్థలోని లోపాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. సామాన్యుడిని ఇష్టానుసారమో లేదంటే నిర్లక్ష్యపూరిత వైఖరితోనో కేసులు పెట్టి.. ఇబ్బంది పెట్టడమే కాకుండా అధికారులు సైతం చిక్కుల్లో పడుతుంటారు. అచ్చం అలాంటి ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయి ఆరేళ్లైంది. ఇప్పుడు అతను తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నోటీసులు పంపారు. వివరాల్లోకెళ్తే.... అస్సాంలోని సిల్చార్ గ్రామానికి వచ్చి నివాసం ఉన్న శ్యామ్ చరణ్ దాస్ పై అక్రమ వలసదారునిగా కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అయితే ఆ వ్యక్తి మే 6, 2016న 74 ఏళ్ల వయసులో చనిపోయాడు. అతని మరణం తర్వాత కుటుంబ సభ్యులు అస్సాం ప్రభుత్వం జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. అస్సాం కోర్టు దాస్ మరణాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 23, 2016న కేసు ముగించేసింది కూడా. పైగా న్యాయమూర్తి నాటి కోర్టు ఉత్తర్వుల్లో ఇలా రాశారు... ‘‘సుదన్ రామ్ దాస్ కుమారుడైన చరణ్ దాస్ కుటుంబ సభ్యులు మే 06, 2016న సిల్చార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించారు. తాలిగ్రామ్ ఉదర్బాండ్ నివాసి అయిన అనుమానాస్సద ఓటరు అయిన దాస్ రికార్డుల ప్రకారం అతని తండ్రి సుధన్ రామ్ దాస్ పేరు 1965 నుంచి 1970 ఓటర్ల జాబితాలో ఉంది కావున కేసును కొట్టివేస్తున్నాం’’ అని జడ్డీ పేర్కొన్నారు. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో అక్రమ వలసదారునిగా అనుమానంతో సరిహద్దు పోలీసులు చరణ్ దాస్ పై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో కాచర్ జిల్లాలోని ఫారిన్ట్రిబ్యునల్ (ఎఫ్టీ-3) ప్రకారం అతని పై కేసు నమోదైందని మార్చి 15న నోటీసులు జారీ చేసింది. పైగా తన భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు మార్చి 30న హాజరుకావల్సిందిగా స్పష్టం చేసింది. విశేషం ఏంటంటే.. ఏ కోర్టు అయితే కేసును కోట్టేసిందో మళ్లీ ఆ కోర్టే నోటీసులు జారీ చేసింది. పైగా ఆ నోటీసులో చరణ్ దాస్ ప్రతిస్పందించడంలో విఫలమైనప్పుడు, ట్రిబ్యునల్ రిఫరెన్స్ ఎక్స్పార్టీగా నిర్ణయించి అతనిపై తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొంది. అయితే దాస్ భార్య సులేఖా దాస్ కూడా ఎక్స్-పార్టీ ఆర్డర్లో తన భారతీయ గుర్తింపును కోల్పోయింది. ఏప్రిల్ 2018లో విదేశీయుల కోసం ఉద్దేశించిన డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఏప్రిల్ 2020లో బెయిల్పై విడుదలైంది. అయితే మార్చి 16న, ఉదర్బాండ్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసు అధికారుల బృందం తాలిగ్రామ్ గ్రామంలోని సులేఖా దాస్ ఇంటికి చేరుకుని, మృతుడికి వ్యతిరేకంగా కొత్త నోటీసును కుటుంబ సభ్యులకు అందజేసింది. చరణ్ దాస్ కుమార్తె, బేబీ దాస్ మాట్లాడుతూ.. “మా తండ్రిని అర్ధ దశాబ్దం క్రితమే కోల్పోయాం. అయితే అతను జీవించి ఉన్నాడని కోర్టు అంటోంది. మా నాన్నగారి దగ్గర తన గుర్తింపును రుజువు చేసేందుకు తగిన పత్రాలు ఉన్నప్పటికీ, ఆయన బతికున్నప్పుడు మేము కోర్టు చుట్టూ తిరిగాం. ఇప్పుడు, అతని మరణం తర్వాత మేము అతని తరపున కోర్టుకు హాజరు కావాలి. ఎలా ప్రతిస్పందించాలో నాకు తెలియడం లేదు" అని అన్నారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సామాజిక కార్యకర్త కమల్ చక్రవర్తి బేబీ దాస్కు తమ మద్దతును అందించారు. మార్చి 30న కోర్టు ముందు డాక్యుమెంట్లు సమర్పించడంలో వారు ఆమెకు సహాయం చేయనున్నారు. ఏదీఏమైన మన వ్యవస్థ లోపాలు తేటతెల్లమవుతున్నాయి. పోలీసుల ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరారు. అంటే డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం పోలీసులు నిందితుడి ఇంటికి కూడా వెళ్లలేదని అర్థమవుతోంది. (చదవండి: కన్నతల్లి నిర్వాకం... పసికందుని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి) -
అల్లకల్లోల అఫ్గాన్: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ
అంకార: తాలిబన్ల దురాక్రమణ అనంతరం అఫ్గనిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఆ దేశ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రోడ్డు, వాయు మార్గాలను దిగ్భంధించినప్పటికీ సామాన్య పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్ నుంచి ఇరాన్ మీదుగా తమ దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేందుకు టర్కీ దేశం ఓ భారీ గోడను నిర్మిస్తోంది. ఇరాన్ సరిహద్దులో 295 కిమీ మేర గోడను నిర్మిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డొగాన్ తాజాగా వెల్లడించారు. VIDEO: Turkey is building a wall along its border with Iran to prevent a new influx of refugees, mainly from Afghanistan as the Taliban take over the country. For now, a 5km section is under construction but Turkey is aiming to build a 295km-long wall on its Iranian border pic.twitter.com/YJAZgUOEGa — AFP News Agency (@AFP) August 17, 2021 ఈ గోడ నిర్మాణంలో సింహ భాగం ఇదివరకే పూర్తైనట్లు ఆయన ప్రకటించారు. గత కొంతకాలంగా ఇరాన్ గుండా తమ దేశంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయని, వారి వల్ల తమ దేశం సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ గోడ నిర్మాణం ద్వారా అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. సరిహద్దు ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశ భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. కాగా, అఫ్గాన్లో అంతర్యుద్ధం కారణంగా ప్రతి రోజు వేల సంఖ్యలో ఆ దేశ పౌరులు తూర్పూ సరిహద్దుల (ఇరాన్) గుండా టర్కీలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు టర్కీలో ఇప్పటికీ రెండు లక్షల మంది సిరియన్లు మరో ఆరు లక్షల మంది అఫ్గాన్లు శరణార్దులుగా ఉన్నారు. చదవండి: అఫ్గన్లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది! -
‘2024 నాటికి వారిని దేశం నుంచి పంపిస్తాం’
చండీగఢ్: అస్సాంలో ఎన్ఆర్సీని విజయవంతంగా అమలు చేసిన బీజేపీ.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అమిత్ షా ఎన్ఆర్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గెంటేస్తామని తెలిపారు. హరియాణా కథియాల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ.. ‘ఆర్టికల్ 370ని రద్దు చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అది మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మెండుగా ఉంది. 2024లో మరోసారి ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం. కానీ ఆ లోపే బీజేపీ ప్రభుత్వం దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని దేశం నుంచి పంపించి వేస్తుంది. దాదాపు 70 ఏళ్లుగా ఈ అక్రమ వలసదారులు మన ప్రజలకు అందుతున్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ.. ధైర్యంగా ఉంటున్నారు. బీజేపీ, మోదీ ప్రజలకు మాట ఇచ్చారు. ఇక మీదట ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండబోరు’ అన్నారు. అలానే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు అమిత్ షా. ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అక్రమ వలసదారుల గెంటివేత వంటివి దేశానికి మేలు చేసే అంశాలని.. కానీ అవి కాంగ్రెస్కు రుచించడం లేదని అమిత్ షా మండిపడ్డారు. (చదవండి: దేశమంతటా పౌర రిజిస్టర్) -
భారత్లో ఓ కొరియా వాసి ఆవేదన
లక్నో : భారతదేశ సంస్కృతి , సంప్రదాయాలు నచ్చి, ఇక్కడే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న కొరియా వాసికి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 15 లోపు దేశం విడిచి పోవాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఆయన తన డాక్యుమెంట్లో భారతీయ పౌరుడిగా పేర్కొనడమే. కానీ తానేమీ తప్పు చేయలేదని, భాష సరిగ్గా తెలియక పోవడం వల్ల అధికారులే ఈ తప్పుకు ఒడిగట్టారని, తాను ఈ తప్పు సరిదిద్దుకోవడానికి చాలా కాలం నుంచే ప్రయత్నిస్తున్నానని కొరియా వాసి చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొరియా వ్యక్తి బియ్యుంగ్ కిల్ కొన్నేళ్ల క్రితం భారత్కు వచ్చాడు. కొంతకాలం పాటు చెన్నైలో పనిచేశాడు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. ఇక ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. లక్నోను తన వ్యాపార ప్రదేశంగా ఎంచుకున్నాడు. దీనికోసం 2012లో బిజినెస్ వీసా కూడా పొందాడు. బారాబంకి జిల్లా ఫతేపుర్ మండలంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొరియా వాసిని అధికారులు, భారతీయ పౌరుడిగా పేర్కొన్నారు. ఒక కొరియా వాసిని భారతీయ పౌరుడిగా ఎలా నమోదుచేస్తారంటూ.. ఈ భూమిని అతను అక్రమంగా పొందాడని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు బారాబంకి ఎస్పీ అనిల్ కుమార్ సింగ్ నోటీసులు జారీచేశారు. అయితే అది అక్కడ పనిచేసే సిబ్బంది వల్ల జరిగిన తప్పిదమని, భాష తెలియక వారు అలాచేశారని కొరియా వాసి చెబుతున్నాడు. దాన్ని సరిదిద్దడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. కొరియా వాసి తాను కొన్న ఆ ప్రాపర్టీలో పాఠశాలను నిర్మించాడు. తన సంపదంతా ధారపోసి దాన్ని ఏర్పాటుచేశాడు. కానీ ఆ భూమి ఇప్పుడు ఇరకాటంలో పడింది. స్కూల్ నిర్మించిన ఆ ప్రాపర్టీలోనే కొరియా వాసి, ప్రధాన మంత్రి కౌశల్య యోజనలో భాగమైన స్కిల్ ఇండియా తరగతులు నిర్వహించాలని బియ్యుంగ్ కిల్ నిర్ణయించాడు. వెంటనే అక్కడి యువకులకు అనేక రంగాల్లో శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు. దీని ద్వారా భారత్లో నైపుణ్యాలను పెంపొందించాలనే అతని ఆశయాన్ని సాకారం చేసుకుంటున్నాడు. యువతకు రిటైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో శిక్షణనిస్తున్నాడు. అయితే అధికారులు తప్పుగా చేసిన నమోదు వల్ల కొరియా వాసికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా అతన్ని దేశం విడిచి వెళ్లమని నోటీసులే అందాయి. ''నాకు ఇండియా అంటే ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి కలలను నిజం చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి యువత స్వతంత్రంగా బతికేలా వారికి శిక్షణ ఇవ్వాలనేది నాకు ఇష్టం. ఇక్కడ కమ్యూనికేషన్ వల్ల నాకు చాలా కష్టాలు వచ్చాయి. నా తరపునుంచి ఆలోచించకుండా, నా వాదన వినకుండా నాకు ఎలా నోటీసులు ఇస్తారు? ఇక్కడి న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వాదన వినిపించుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది'' అని బియ్యుంగ్ ఓ ఆంగ్ల ఛానెల్కు తెలిపారు. 2015 నుంచి బియ్యుంగ్తో కలిసి పనిచేస్తున్న మనోజ్వర్మ మాట్లాడుతూ... ''సిబ్బంది ఎవరో తప్పుగా టైప్ చేసి ఉంటారు. తరువాత మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని సరిదిద్దలేదు. మేము లాయర్ను కలిస్తే.. నోటీసులు వచ్చే వరకు చూడండి అన్నారు. లోకల్ ఛానల్ బియ్యుంగ్ని కొరియన్ గూఢచారి అని ప్రచారం చేస్తోంది. ఇది చాలా బాధాకరం. అతను భారత యువత కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మన కోసం ఇంత చేస్తే మనం ఆయనకు ఇచ్చేది ఇదేనా?'' అని ప్రశ్నించారు. జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేశ్ తివారి ఈ విషయంపై స్పందిస్తూ.. బియ్యుంగ్ అక్కడి యువతకు శిక్షణనిస్తూ, ఎంతో మంచి పేరు సంపాదించారు. అతని కేసు వివరాలు, సర్టిఫికేట్లను పరిశీలించమని ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. -
కర్ణాటకకు బంగ్లాదేశీయుల బెడద
బెలగావి: కర్ణాటకలో అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి స్థిరపడిన వారు 283మంది ఉన్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరెవ్వరూ కూడా చట్టపరమైన అనుమతులు తీసుకోలేదని చెప్పింది. వారందరిని తిరిగి పంపించే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని రాష్ట్ర హోంమంత్రి జీ పరమేశ్వర మంగళవారం రాష్ట్ర శాసన సభలో తెలిపారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం బంగ్లాదేశీయులు వందల్లో కాదని వేలమంది ఉన్నారని అంటున్నారు. తమ రాష్ట్రంలో మొత్తం 748మంది బంగ్లాదేశీయులు ఉన్నారని, వారిలో 283మంది ఫారినర్స్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఉన్నారని, వారిని గుర్తించి తరిమేసే ప్రక్రియ ప్రారంభమైందని పరమేశ్వర పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామీణ, పట్టణ, జిల్లా, నగరాల స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశామని, వారంతా అక్రమంగా ఉంటున్నవారిని పట్టుకుని పంపించేస్తారని చెప్పారు. అక్రమ వలసదారులకు ప్రభుత్వం అండగా ఉంటోందంటూ ప్రతిపక్షం చేసిన ఆరోపణలు కొట్టి పారేసింది. ఇలాంటివారితోనే అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఆ విషయం ప్రభుత్వానికి తెలుసని, అందుకే తాము సీరియస్ ఉన్నామని వెల్లడించింది.