Illegal relationship
-
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
భార్య నోటికి ఫెవిక్విక్ వేసిన భర్త..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో రాక్షసునిగా మారిన భర్త ఎవరూ ఊహించని పనిచేశాడు. ఆమె నోటికి ఫెవిక్విక్(Fevikwik)వేసి అతికించడంతో బాధితురాలు విలవిలలాడింది. ఈ సంఘటన నెలమంగల తాలూకా హారోక్యాతనహళ్లిలో చోటుచేసుకుంది. సిద్ధలింగయ్య, భార్య మంజుల దంపతులు ఉంటున్నారు. ఇద్దరికీ 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మంజుల గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనికి వెళ్తోంది. సిద్ధలింగయ్య ఆయుర్వేద ఔషధ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో అతడు తరచూ గొడవపడేవాడు. మంగళవారం అతని పైశాచికం శృతి మించింది. ఆమె పెదవులపై ఫెవిక్విక్ వేసి అతికించి పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మాదనాయకనహళ్లి పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు గమ్ను తొలగించారు. పోలీసులు సైకో భర్తని అరెస్టు చేశారు. -
ఫోన్ చేస్తే బిజీ వస్తోంది.. నీకు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం వుంది..
యశవంతపుర: వివాహిత అనుమానాస్పద మృతికేసు మిస్టరీ వీడింది. ఆమెను తానే హత్య చేసినట్లు ప్రియుడు మద్యం మత్తులో నిజాన్ని కక్కేశాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హరపనహళ్లి తాలూకా నిట్టూరుకు చెందిన వ్యక్తితో దావణగెరె తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన కవితకు వివాహమైంది. హరహరకు వెళ్లివస్తానంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఇంటినుంచి వెళ్లిన కవిత తిరిగి రాలేదు.పుట్టింటివారిని విచారించగా రాలేదని చెప్పారు. దీంతో హలవాగలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఒక పొలంలో మృతదేహం కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ప్రియుని సొంతూరుకు వెళ్లి.. ఇంటినుంచి వెళ్లిన కవిత తన ప్రియుడు సలీం మున్నాఖాన్తో కలిసి అతని సొంతూరు తెలగికి వెళ్లింది. అక్కడ నుంచి ఇద్దరూ కలిసి బైకులో కుంచూరి చెరువు వద్దకు వెళ్లారు. ఫోన్ చేస్తే బిజీ వస్తోంది.. నీవు మరో వ్యక్తితో ఆక్రమ సంబంధం పెట్టుకున్నవంటూ సలీం కవితను నిందించాడు. ఓ దశలో గొంతు పిసికి ఆమెను హత్య చేశాడు. అనంతరం పొలంలో మృతదేహాన్ని కాల్చివేశాడు. ఇటీవల తాగిన మత్తులో ఉన్న సలీం.. కవితను తానే చంపానని గొప్పలు చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడున్నవారు కవిత కుటుంబసభ్యులకు తెలపడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సలీంను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. -
వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని..
కౌడిపల్లి(నర్సాపూర్): మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన వ్యక్తి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడింది. పోలీసులు మూడురోజులలోనే మిస్టరీని ఛేదించారు. కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి మంగళవారం నర్సాపూర్ సీఐ షేక్ లాల్మదార్, ఎస్ఐ శివప్రసాద్రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కౌడిపల్లి మండలం పీర్లతండా పంచాయతీ కొయ్యగుండ తండాకు చెందిన కాట్రోత్ శ్రీను (28) భార్య దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను ఈనెల 18న రాత్రి పొలానికి వెళ్తున్నాని భార్యకు చెప్పి వెళ్లి ఉదయం శవమై కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. స్నేహితురాలు, మరో వ్యక్తి సాయం.. మృతుడి భార్య దేవికి తండాలో పలువురితో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో పలుమార్లు భార్యాభర్తలకు గొడవలు జరిగాయి. దీంతో దేవి తన భర్తను చంపాలని నిర్ణయించుకుంది. తండాకు చెందిన ఆమె స్నేహితురాలు రాణి (ఆలియాస్ నవీన)తో కలిసి పథకం వేసింది. దీని కోసం కొడుకు వరుసయ్యే పవన్కుమార్ను సాయం తీసుకుంది. సహకరిస్తే రైతుబీమా డబ్బులు రాగానే రూ.50 వేలు ఇస్తానని ఆశపెట్టింది. చెట్టుకు ఉరేసి... ఈనెల 18వ తేదీ ఉదయం దేవి, శ్రీను తమ ఇంటి వద్ద జామ చెట్టు విషయంలో పాలివారు కాట్రోత్ ధన్సింగ్, అతడి కుమార్లు సంతోష్, తులసీరాం గొడవ పడ్డారు. ఇదే అదునుగా భావించిన దేవి అదే రోజు రాత్రి పవన్కుమార్కు మద్యం ఇప్పించి శ్రీనుకు తాగించాలని చెప్పింది. ఇద్దరూ కలిసి పొలంలో మద్యం తాగారు. రాత్రి దేవి అక్కడికి చేరుకొని మత్తులో ఉన్న శ్రీనును వేప చెట్టుకు ఉరివేశారు. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పొలంలో పడేశారు. భర్త చనిపోయాడని పాలివారే చంపేశారని దేవి ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దేవి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి కాల్డేటా చెక్ చేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య, చంపేస్తే రైతుబీమా, ఎల్ఐసీ డబ్బులు వస్తాయన్న ఆశతో హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు శాంతి, శోభారాణి, భాగయ్య, శ్రీనివాసులు, పోచయ్యను డీఎస్పీ అభినందించి నగదు రివార్డ్ అందజేశారు. -
బావతో వివాహేతర సంబంధం.. దుబాయ్ నుంచి భర్త రావడంతో..
కరీంనగర్: కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్(30)ను అతని భార్యే తన ప్రియుడితో కలిసి చంపిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం కొడిమ్యాల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాశ్, మల్యాల సీఐ డి.రమణమూర్తి, ఎస్సై కె.వెంకట్రావ్ వెల్లడించారు. దేశాయిపేటకు చెందిన వేముల ప్రమీలకు కొడిమ్యాలవాసి బత్తుల శ్రీనుతో పదేల్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. ఉపాధి నిమిత్తం శ్రీను కొన్నేళ్లు దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో తనకు బావ వరుస అయిన దేశాయిపేటకు చెందిన సూర రాజేశ్తో ప్రమీల అక్రమ సంబంధం పెట్టుకుంది. శ్రీను దుబాయ్ నుంచి వచ్చాక కూడా దీన్ని కొనసాగించింది. ప్రమీల తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న సమయంలో భర్తకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది. ఈ విషయమై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. శ్రీను మద్యానికి బానిసయ్యాడు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని హత్య చేయాలని ప్రమీల, రాజేశ్తోపాటు ప్రమీల తల్లిదండ్రులు రాజవ్వ, రాజనర్సు పథకం వేశారు. దీర్ఘకాలిక వ్యాధికి రాజవ్వ వాడుతున్న ట్యాబ్లెట్లను ప్రమీల పొడిగా చేసింది. ఈ నెల 11న శ్రీను తాగే మద్యంలో కలిపింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన అతన్ని ప్రమీల, రాజేశ్లు టవల్తో గొంతు బిగించి, చంపారు. అనంతరం మృతదేహా న్ని చీరతో దూలానికి ఉరివేసి, పారిపోయారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శ్రీనును చంపింది అతని భార్య, ఆమె ప్రియుడు, తల్లిదండ్రులేనని తేల్చారు. ఆదివారం ఆ నలుగురిని అ రెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన టవల్, ట్యాబ్లెట్ షీట్లతోపాటు, బైక్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. -
రెండేళ్లుగా వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య
కాకినాడ లీగల్: పథకం ప్రకారం భర్తను హత్య చేసిన కేసులో భార్యకు, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.కమలాదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం పేపకాయలపాలేనికి చెందిన పేకేటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన వివాహితుడు కర్రి రాధాకృష్ణతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఆమెకు ఇష్టం లేకపోయినా 2019 మే 15 తేదీన పేకేటి సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన వారం రోజుల్లోనే సూర్యనారాయణను హతమార్చేందుకు భార్య నాగలక్ష్మి, ఆమె ప్రియుడు రాధాకృష్ణ పథకం వేశారు. ఇందులో భాగంగా 2019 మే 21వ తేదీన సూర్యనారాయణకు రాధాకృష్ణ ఫోన్ చేశాడు. సరదాగా బయటకు వెళదామంటూ పెనుగుదురు వద్దకు రమ్మన్నాడు. అక్కడి నుంచి పాతర్లగడ్డ మార్గంలోని çపంట పొలాల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ సూర్యనారాయణను కూర్చోబెట్టి వెంట తెచ్చుకున్న కత్తితో నరికి హత్య చేశాడు. హతుడి సోదరుడు సత్తిబాబు ఫిర్యాదు మేరకు అప్పటి కరప ఎస్సై జి.అప్పలరాజు ఈ హత్యపై కేసు నమోదు చేశారు. నాటి కాకినాడ రూరల్ సీఐ పి.ఈశ్వరుడు ఈ కేసు దర్యాప్తు చేశారు. కోర్టు విచారణలో నాగలక్ష్మి, రాధాకృష్ణలపై నేరం రుజువైంది. దీంతో హత్య చేసినందుకు గాను ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా, సాక్ష్యాన్ని తారుమారు చేసినందుకు గాను ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వై.ప్రశాంతి కుమారి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ.. ఏకాంతంగా ఉండగా..
సాక్షి, సిటీబ్యూరో/నాగోలు: నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసులో నిందితుడిగా ఉన్న కొలిపాక శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. హతురాలు అతడికి రెండో భార్య అని, ఆమె ప్రియుడితో గడపడానికి అంగీకరించినట్లు నటించి ఇద్దరినీ అంతం చేశాడని పోలీసులు తేల్చారు. ఏసీపీ కె.పురుషోత్తమ్రెడ్డితో కలిసి గురువారం డీసీపీ సన్ప్రీత్సింగ్ వివరాలు వెల్లడించారు. ఏడాది క్రితం నగరానికి వలసవచ్చి.. విజయవాడలోని పాయకాపురం సుందరయ్య కాలనీకి చెందిన కొలిపాక శ్రీనివాసరావు మొదటి భార్య ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం అనారోగ్యంతో చనిపోయింది. దీంతో సత్యవతి అలియాస్ జ్యోతిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. ఐదుగురు సంతానంలో ఇద్దరికి వివాహాలు కాగా... మిగిలిన ముగ్గురూ విజయవాడలో నానమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఏడాది క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీనివాసరావు తన భార్య జ్యోతితో కలిసి నగరానికి వలస వచ్చాడు. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న ఇతడు ఆరు నెలలు పార్శిగుట్టలో ఉండి ఆపై వారాసిగూడకు మారాడు. నామాలగుండులో ఉంటున్న సమయంలో బౌద్ధనగర్కు చెందిన యడ్ల యశ్వంత్ అలియాస్ బన్నీతో జ్యోతికి పరిచయం ఏర్పడింది. గతంలో బన్నీ క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. ఓ సందర్భంలో జ్యోతి అతడి క్యాబ్ బుక్ చేసుకోవడంతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సన్ప్రీత్సింగ్ వినకపోవడంతో ‘వదిలించుకోవాలని’... వారి మధ్య వివాహేతర సంబంధం విషయం కొన్నాళ్ల క్రితమే శ్రీనివాసరావుకు తెలిసింది. మందలించినప్పటికీ జ్యోతి తన ప్రవర్తన మార్చుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ తన ఇంట్లోనే ఏకాంతంగా గడుపుతున్నారని తెలిసి శ్రీనివాసరావు ఆవేశంతో రగిలిపోయాడు. మాట వినని జ్యోతితో పాటు ఆమెను లోబర్చుకున్న బన్నీని అంతం చేయాలని నిర్ణయించుకుని సరైన సమయం కోసం వేచి చూశాడు. తొలుత జ్యోతిని తీసుకుని విజయవాడకు కాపురం మారిస్తే పరిస్థితులు సద్దుమణుగుతాయని భావించాడు. ఇదే విషయం ఆమెకు చెప్పిన శ్రీనివాసరావు గత వారమే సామాన్లు పంపేశాడు. ఆదివారం బైక్పై ఇద్దరూ విజయవాడ వెళ్లాల్సి ఉంది. ఆ సందర్భంలో జ్యోతి ఆఖరుసారిగా బన్నీతో గడుపుతానంటూ శ్రీనివాసరావుతో చెప్పింది. ఇలాంటి సందర్బం కోసమే ఎదురు చూస్తున్న అతడు వెంటనే అంగీకరించి ఆమెతోనే బన్నీకి ఫోన్ చేయించి తన ఇంటికి రప్పించాడు. నగర శివార్లకు వెళ్లిన తర్వాత అనువైన ప్రాంతంలో ఇద్దరూ ఏకాంతంగా గడపాలని, ఆపై తాము విజయవాడ వెళ్లిపోతామని, నువ్వు వెనక్కు వచ్చేయమంటూ బన్నీకి చెప్పాడు. సుత్తితో కొట్టి, స్క్రూడ్రైవర్తో పొడిచి... దీంతో నామాలగుండు నుంచి శ్రీనివాసరావు, జ్యోతి ఒక వాహనంపై బన్నీ తన సోదరుడి వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో మద్యం, బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారు. అనంతరం ముగ్గురూ అబ్దుల్లాపూర్మెట్ మండలం, కొత్తగూడెం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల మధ్యలో శ్రీనివాసరావు మద్యం తాగుతుండగా... కాస్త దూరంలో జ్యోతి, బన్నీ ఏకాంతంగా గడుపుతున్నారు. ఇద్దరూ నగ్నంగా ఉన్న సమయంలో తన వాహనంలో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్లి వారిపై దాడి చేశాడు. తేరుకునే లోపే ఇద్దరి తలపై కొట్టాడు. ఆపై స్క్రూడ్రైవర్తో విచక్షణారహితంగా పొడిచాడు. సమీపంలో ఉన్న రాయితో బలంగా మోది చంపేశాడు. అక్కడ నుంచి జ్యోతి సెల్ఫోన్ తీసుకుని తన వాహనంపై విజయవాడకు వెళ్లిపోయాడు. మంగళవారం ఈ హత్యలు వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్మెట్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ వి.స్వామి, ఎస్సై డి.కరుణాకర్రెడ్డి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.అంజిరెడ్డి నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. ఇతడి నుంచి వాహనంతో పాటు హత్యకు వినియోగించిన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. -
అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ కొత్తగూడెం పరిధిలో జంట హత్యల కేసులో మరో విషయం వెలుగు చూసింది. జ్యోతి-యశ్వంత్ల వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలిసిందే. భార్య ప్రియుడైన యశ్వంత్తో పాటు భార్యను కూడా చంపాలనే తీవ్రంగా యత్నించినట్లు జ్యోతి భర్త శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. సుపారీ గ్యాంగ్ను సంప్రదించి యశ్వంత్ తో పాటు ఆమె ప్రియుడ్ని చంపించాడు భర్త శ్రీనివాస్. భార్య కళ్ల ముందే యశ్వంత్ను దారుణంగా హతమార్చిన భర్త.. అక్కడితో ఆగలేదు. తనను చంపొద్దని బతిమాలినా భార్య జ్యోతిని సైతం వదలకుండా హతమార్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఆపై శవాలను అక్కడే పడేసి సుపారీ గ్యాంగ్తో పాటు వెళ్లిపోయాడు. ఈ కేసుకు సంబంధించి.. శ్రీనివాస్తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గత కొంతకాలంగా యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. ఆ విషయం తెలిసి భరించలేక ఇలా ఇద్దరినీ హతమార్చాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధిత వార్త: యశ్వంత్-జ్యోతి వివాహేతర సంబంధం భరించలేక.. -
అబ్దుల్లాపూర్మెట్ జంట హత్యల కేసు: భర్త శ్రీనివాసే సూత్రధారి
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం సృష్టించగా.. ఈ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఊహించినట్లుగానే వివాహేతర సంబంధం ఈ హత్యకు ప్రధాన కారణంగా తేలింది. జ్యోతి భర్త శ్రీనివాసరావే నిందితుడిగా గుర్తించారు. జ్యోతితో యశ్వంత్కు గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం ఉండడంతో.. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్లు శ్రీనివాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్తో పాటు ఈ హత్యలో అతనికి నలుగురు సహకరించినట్లు సమాచారం. దీంతో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని వారాసిగూడ ప్రాంతానికి చెందిన యెడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్గా పని చేసేవాడు. అతడికి అదే ప్రాంతానికి చెందిన జ్యోతి(28)అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. కొత్తగూడెం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో వీళ్ల మృతదేహాలు నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. యశ్వంత్ తలపై బలమైన గాయం కాగా, జ్యోతి తలపై బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తులు ఉన్నాయి. వివాహేతర సంబంధమే వీరి హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఆ దిశగానే క్లూస్ లభించడం విశేషం. ఇదిలా ఉంటే.. హత్యకు గురైన మహిళతో యశ్వంత్కు పరిచయం ఉన్న విషయం తెలియదని యశ్వంత్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సంబంధిత వార్త: హైదరాబాద్ శివారులో నగ్నంగా మృతదేహాలు! -
పక్కింటి యువకుడితో భార్య చనువుగా ఉంటుందని..
ప్రకాశం (దర్శి టౌన్) : భార్యతో చనువుగా ఉంటున్న పక్కింటి యువకుడిని భర్త పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణంగా హత్య చేశారని దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. దర్శి మండలం వెంకటాచలంపల్లి పంచాయితీ పరధిలోని నడిమిపల్లెలో ఈనెల 7న జరిగిన యువకుని హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం దర్శి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి వెల్లడించారు. వివరాలు.. నడిమిపల్లె గ్రామానికి చెందిన పుప్పాల సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన బోనం బాలచెన్నయ్య భార్య శివకుమారితో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం బాలచెన్నయ్యకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలంటూ సత్యనారాయణను పలుమార్లు హెచ్చరించాడు. ఈ నెల 6వ తేదీ రాత్రి శివకుమారి, సత్యనారాయణ చనువుగా ఉండటాన్ని గమనించిన బాలచెన్నయ్య కోపోద్రిక్తుడయ్యాడు. సత్యనారాయణకు అడ్డుతొలగిస్తే తప్ప తన సంసారం బాగుపడదని నిర్ణయానికి వచ్చాడు. ఈ విషయాన్ని తన బంధువుల దృష్టికి తీసుకెళ్లి ఆవేదన చెందాడు. ఈనెల 7వ తేదీన సత్యనారాయణ తన కనకాంబరాల తోటకు వెళ్లి వస్తుండగా బాల చెన్నయ్య, అతని బంధువులు కలిసి కత్తి, గడ్డపార, బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. రోడ్డుపై పడిపోయిన సత్యనారాయణను బంధువులు గమనించి వైద్యశాలకు తీసుకెళ్లేలోగా మృతి చెందాడు. హతుని భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రÔóఖర్ కేసు నమోదు చేసి సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు బోనం బాలచెన్నయ్యతోపాటు అతనికి సహకరించిన బోనం చిన వీరయ్య, బోనం శివకుమారి, బోనం వెంకట లక్ష్మి, బోనం అంకమ్మ, పుప్పాల అంకమ్మ, పుప్పాల వెంకటేశ్వర్లు, పార్శపు హనుమంతును బుధవారం దర్శి సీఐ అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
పక్కా ప్లాన్తోనే హత్య చేశారు.. కారణం అదే!
సత్తెనపల్లి: హత్య కేసును సత్తెనపల్లి పోలీసులు ఛేదించారు. కడప జిల్లా మైదుకూరుకు చెందిన యల్లంపల్లి చాంద్బాషా ట్రావెల్స్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత ఏడాది భార్య, బిడ్డలను వదిలేసి సత్తెనపల్లిలో ఉంటూ తాపీ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సత్తెనపల్లి పట్టణంలోని గుంటూరు మేస్త్రీ బజారులో నివసిస్తున్న పైర్థల నాగమల్లేశ్వరితో సహజీవనం చేస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సహజీవనం చేస్తున్న చాంద్బాషాను అడ్డు తొలగించుకోవాలని నాగమల్లేశ్వరి పథకం పన్నింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న నాగమల్లేశ్వరితో పాటు రెంటచింతల గ్రామం దొమ్మరకాలనీకి చెందిన అన్నపురెడ్డి అమరయ్య అలియాస్ అమర్, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన తన్నీరు సుబ్బారావు ముగ్గురు కలిసి మద్యం సేవిద్దామని చాంద్బాషాను నమ్మించి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో స్టేడియంలోకి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు కలిసి చాంద్బాషాను గొంతునొక్కి, గుండెలపై, వీపుపై గుద్ది హతమార్చారు. ఈ నెల 4న చాంద్బాషా మృతదేహాన్ని స్థానికులు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చాంద్బాషాను హత్య చేసినట్లు గ్రహించిన పోలీసులు సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్రెడ్డి పర్యవేక్షణలో పట్టణ సీఐ యు.శోభన్బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు ప్రారంభించింది. నాగమల్లేశ్వరి పథకం ప్రకారం మరో ఇద్దరితో కలిసి హతమార్చినట్లుగా తేలడంతో ముగ్గురి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోవడం, మిగిలిన ఇద్దరు కూడా కనిపించకపోవడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 7న నాగమల్లేశ్వరి, అమరయ్యను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శోభన్ బాబు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ హత్య కేసు ఛేదించడంలో సహకరించిన ఎస్ఐ రఘుపతిరావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎం.గంగాధరరావు, కె.రామారావు, కానిస్టేబుళ్లను డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, సీఐ శోభన్బాబు అభినందించారు. చదవండి: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి..
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వివాహితతో పాటు యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజుల పాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె మరిది పరారయ్యాడు. కౌలంద పోలీసుల వివరాల మేరకు... నంజనగూడు తాలూకాకు చెందిన వివాహితకు కూలి పనులకు వెళ్తున్న సమయంలో విష్ణు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని.. మూడు రోజుల క్రితం విష్ణు యథావిధిగా వివాహిత ఇంటికి వచ్చాడు. అతను ఇంటిలోకి వెళ్లగానే బయటి నుంచి భర్త తలుపులు బిగించి గ్రామస్తులను పిలిచి వారిని బయటకు తీసుకువచ్చి కరెంట్ స్తంభానికి కట్టేశారు. మూడు రోజుల పాటు ఆహారం, నీరు ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేశాడు. కొందరు యువకులు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. పోలీసులు వచ్చి స్పృహ తప్పిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. -
రెండు కుటుంబాల్లో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): అక్రమ సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులకు దారి తీసింది. ఇందులో ఓ కుటుంబానికి చెందిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే.. ఆ రెండు కుటుంబాల్లోని భార్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమలాపురం పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన పలచోళ్ల సూర్య కొండలరావు, సంధ్యాకుమారి భార్యభర్తలు. సూర్య కొండలరావు ఎస్.యానంలోని చమురు సంస్థలో పెయింటర్గా పనిచేస్తున్నాడు. (చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి) వీరి కుటుంబం అమలాపురం రవణం మల్లయ్యవీధిలో కాపురం ఉంటోంది. ఇదే ప్రాంతంలో చెందిన గండు సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. తర్వాత భార్యభర్తలు సూర్యకొండలరావు, సంధ్యా కుమారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అక్రమ సంబంధం తెచ్చిన చిచ్చుతో మనస్తాపం చెందిన సుబ్బారావు భార్య నాగలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తర్వాత సూర్య కొండలరావు, సంధ్యాకుమారి దంపతులు సోమవారం సాయంత్రం అల్లవరం మండలం బోడసకుర్రు వంతెన వద్ద పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తక్షణమే స్థానికులు స్పందించి ఆ భార్యాభర్తలను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ భర్త సూర్య కొండలరావు బుధవారం ఉదయం మృతి చెందినట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. అతడి భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగానే ఉంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగలక్ష్మి కూడా అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సూర్యకొండలరావు ఆత్మహత్యకు, అతడి భార్య ఆత్యహత్యాయత్నానికి కారణమైన సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులతోపాటు రవణం సాయమ్మ అనే మహిళపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
భర్తను చంపడానికి ప్రియునితో కలిసి స్కెచ్
శిడ్లఘట్ట: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ అడ్డుగా ఉన్న భర్తను సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన ఘటనలో శిడ్లఘట్ట పట్టణ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పట్టణంలో నివాసం ఉంటున్న మేస్త్రి గోవిందప్ప, ఆయన భార్య సుమిత్ర భార్య భర్తలు. ఇదిలా ఉంటే ఈనెల 18న తెల్లవారుజామున గోవిందప్ప మారుతి నగర్లో ఇంటి ముందు నుంచి వెళ్తున్న సమయంలో అతడిని తుపాకీతో కాల్చారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సుమిత్రకు మునికృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు సుమిత్రతో పాటు ఆమె ప్రియుడు మునికృష్ణ, అదే గ్రామానికి చెందిన రామకృష్ణ, ప్రవీణ్, హరీశ్, చిన్నయను అరెస్ట్ చేశారు. -
యువకుడిని కొట్టి చంపిన ఏఆర్ కానిస్టేబుల్
ఆటోనగర్(విజయవాడతూర్పు): తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ మరో వ్యక్తితో కలిసి.. ఓ యువకుడిని కొట్టి చంపాడు. బుధవారం తెల్లవారుజామున విజయవాడ అయ్యప్పనగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన ముక్కు వెంకటేష్(23), ఏఆర్ కానిస్టేబుల్ నాగరాజు అయ్యప్పనగర్లో ఒకే ఇంట్లోని వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నారు. వెంకటేష్కు వివాహం కాలేదు. డిస్టెన్స్లో ఎంబీఏ చదువుతున్నాడు. తన భార్య, వెంకటేష్ కలివిడిగా ఉండటాన్ని నాగరాజు గమనించి ఇద్దరినీ పలుమార్లు హెచ్చరించాడు. బుధవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉండటాన్ని ఇంటి యజమాని రత్నసాయి చూశాడు. డ్యూటీలో ఉన్న నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం చెప్పాడు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన నాగరాజు, రత్నసాయి కలిసి వెంకటేష్పై రాడ్లతో దాడి చేశారు. కొన ఊపిరితో ఉన్న వెంకటేష్ను స్థానికులు 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు సీఐ రావి సురేష్రెడ్డి తెలిపారు. నాగరాజుతో పాటు, రత్నసాయి, ఆయన భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
పచ్చని కాపురంలో ‘అతడు’ రేపిన చిచ్చు
మామిడికుదురు: ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి నలుగురి ఆత్మహత్యకు కారణమైంది. అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు సహా ఆ దంపతులను సామూహిక ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించింది. చించినాడ బ్రిడ్జిపై నుంచి శుక్రవారం రాత్రి వశిష్ట గోదావరి నదిలో దూకినట్టుగా భావించిన నలుగురిలో ఆదివారం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటనలో మొగలికుదురుకు చెందిన కంచి సతీశ్ (32)తో పాటు అతని కుమార్తె ఇందు శ్రీదుర్గ (2) మృతదేహాలను వశిష్ట నదిలో గుర్తించారు. సతీశ్ భార్య సంధ్య (22)తో పాటు వారి కుమారుడు జస్వన్ (4) మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మొగలికుదురులో తాపీ పని చేసుకుంటూ జీవించే సతీష్ మరికాస్త సంపాదించుకొని తమ బతుకురాత మార్చుకోవాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో మెరుగైన ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఆ సమయంలో అతడి భార్య సంధ్యకు సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడటం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. దీనిపై పెద్దల సమక్షంలో పంచాయితీ అయ్యింది. కుల పెద్దల సమక్షంలో రాజీ యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్దలు పిల్లలు జస్వన్, శ్రీదుర్గలను మొగలికుదురులోనే ఉంచి, సంధ్యను ఆమె పుట్టిల్లయిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు పంపించినట్టు చెబుతున్నారు. విషయం తెలిసి మనస్తాపం చెందిన సతీష్ పది రోజుల కిందట సౌదీ నుంచి స్వగ్రామం వచ్చాడు. మద్యానికి బానిసైన అతడిని కుటుంబ పెద్దలు ఓదార్చారు. పిల్లలతో సహా కేశవదాసుపాలెంలోని అక్క ఇంటికి పంపించారని చెబుతున్నారు. ఈ విషయంపై తన భార్య సంధ్యను కలిసి మాట్లాడాలని సతీశ్ నిర్ణయించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రూరల్ మండలం వెలివలలోని పినమామ ఇంటి వద్ద ఆమె ఉంటోందని తెలుసుకుని.. కేశవదాసుపాలెం నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లాడు. అక్కడ రెండు రోజులు ఉన్నాడు. అనంతరం శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ పిల్లలతో కలిసి చించినాడ వంతెన పైకి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న సూసైడ్ నోట్ను, పిల్లల దుస్తులను, బైక్ను వంతెనపై వదిలేసి, గోదావరిలో దూకేశారని భావిస్తున్నారు. కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలు అవమానకరంగా ఉండటం, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే సతీశ్ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అతడి తండ్రి భగవాన్దాసు, తల్లి లక్ష్మి, బంధువులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. -
ప్రియుడితో కలిసి ప్లాన్; భర్తకు కాఫీలో విషం
మైసూరు: భర్తను చంపిన కేసులో భార్యను, ఆమె ప్రియున్ని మైసూరులో బన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు హత్యకు గురి కాగా, అతని భార్య ఉమా, ప్రియుడు అవినాశ్ పట్టుబడినవారు. వెంకటరాజు దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఆమెకు అవినాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. అడ్డు తొలగించుకోవాలని ఇటీవల భర్తకు కాఫీలో విషం కలిపి ఇచ్చారు, అతడు స్పృహ తప్పిన సమయంలో తలదిండుతో ఊపిరి ఆడకుండా చేసి చంపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డు చెప్పినందుకు భార్యను రాడ్డుతో దారుణంగా..
పాట్నా: బీహార్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని అడ్డుకున్నందుకు భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడో భర్త. బీహార్లోని నలంద జిల్లాలో లాహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్చంద్రపురి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ ధీరేంద్ర కుమార్తో సుమన్కు గత ఏడాది వివాహం జరిగింది. అయితే కుమార్ రూ.15 లక్షల కట్నం తీసుకురావాల్సిందిగా భార్య సుమన్ను బలవంతం చేశాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కుమార్పై భార్య వరకట్న వేధింపుల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి క్రమం తప్పకుండా ఆమెను తీసుకురావడంతో భార్య అడ్డుచెప్పింది. అంతే ఇదే అదునుగా భావించిన నిందితుడు భార్యపై ఇనుప రాడ్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సుమన్ అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట! ‘ఎక్స్టార్షన్’ గ్యాంగ్.. బ్లాక్మెయిల్ చేసి రూ. 89 లక్షలు -
వివాహేతర సంబంధం: పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య
సాక్షి, నిజామాబాద్: జక్రాన్పల్లి మండలం సికింద్రపూర్ గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పురుగుల మందు తాగి ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ముర్ మృతులను ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన చిత్తరి సాయి కుమార్(30), శైలజ(28) లుగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతులిద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు, శైలజ భర్త కొంతకాలం క్రితం మృతి చెందినట్లు సమాచారం. చదవండి: నవ వరుడి విషాదాంతం -
బిడ్డను బావిలో తోసి హత్య.. తల్లికి యావజ్జీవం
తిరువొత్తియూరు: సేలం సమీపంలో వివాహేతర సంబంధం కోసం కుమారుడిని హత్య చేసి అదృశ్యం అయ్యాడని నాటకమాడిన మహిళకు గురువారం సేలం మహిళా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సేలం సమీపంలోని అటయాపట్టి ఎస్.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్ (07), అఖిల్ (03). రెండవ కుమారుడు అఖిల్ను మైనావతి తన తల్లి ఇంటిలో విడిచిపెట్టింది. ఈ క్రమంలో గత 2018వ సంవత్సరం మార్చి 5వ తేదీ ఆడుకోవడానికి వెళ్లిన శశికుమార్ కనపడలేదని మైనావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆటయాంపట్టి సమీపంలో వున్న వ్యవసాయ బావిలో శశికుమార్ మృతి చెంది నీటిలో తేలుతూ వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేయగా మైనావతి వివాహేతర సంబంధం కోసం తన తనయుడిని బావిలోకి తోసి హత్య చేసి నాటకమాడినట్లు తెలిసింది. మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేసి అతనితో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి మైనావతిని, దేవరాజ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించి అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది. చదవండి: వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం -
వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం
టోక్యో: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నందుకు గాను ఆమె భర్తకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఓ మహిళను ఆదేశించింది. ఈ సంఘటన జపాన్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ వ్యక్తి(39) సదరు మహిల తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నదని.. ఇందుకు గాను ఆమె వద్ద నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా టోక్యో కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు, సదరు మహిళకు ఆన్లైన్ ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరద్దరు ఏకాంతంగా కలుసుకున్నారని.. ఆ సమయంలో శృంగారంలో పాల్గొన్నారని ఆరోపించాడు. అతడి వాదనలు విన్న కోర్టు ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు జరిమానా విధించింది. బాధితుడి భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు గాను అతడికి 1,10,000 యెన్ల(భారత కరెన్సీలో 70 వేల రూపాయలు) నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ.. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘అతడి భార్యకు, నాకు మధ్య జరిగినది చట్టరీత్యా నేరం కాదు. దాని వల్ల వారి వైవాహిక జీవితానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’ అని తెలిపింది. వైవాహిక జీవితంలో శాంతిని దెబ్బతీసే చర్యలను తప్పుగానే భావించాలని, పెళ్లయిన యువతితో లైంగిక సంబంధం పెట్టుకుని అశాంతి కలిగించినందుకు జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, కోర్టు తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. స్వలింగ సంపర్కాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్పు ఉందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. నచ్చిన వ్యక్తులు.. పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిస్తే తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓ కేసు సందర్భంగా కూడా టోక్యో హైకోర్టు ఇలాంటి తీర్పునే వెల్లడించింది. తన మహిళా భాగస్వామని మోసం చేసినందుకు గాను ఆమెకి పరిహారం చెల్లించాల్సిందిగా ఓ మహిళను ఆదేశించింది. ఈ జంట ఏడు సంవత్సరాలు కలిసి జీవించినట్లు సమాచారం. వారు యుఎస్ లో వివాహం చేసుకున్నారు మరియు పిల్లల్ని కనడం గురించి కూడా చర్చించారు. ఈ క్రమంలో భాగస్వామి తనను మోసిం చేసిందని మరొక యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు మహిళా భాగస్వామికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సదరు మహిళను ఆదేశించింది. చదవండి: బాడీగార్డ్తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్ -
కల్లు తాగి వెనక్కి, ఆమె ఒత్తిడి చేయడంతో...
కరీంనగర్ క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. 20 రోజుల కిందట ఇది జరగగా పోలీసు విచారణతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ వన్టౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్ర కారం.. మానుపాటి రాజయ్య(35) కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ రేకుర్తిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజయ్య ఈ నెల 5న పని ముగించుకొని తిరిగి ఇంటికి రాలేదని అతని భార్య లత ఠాణాలో ఫిర్యాదు చేసింది. పోలీసులు 7న మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ 16న మహబూబాబాద్ జిల్లా కురవి పోలీసులు గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని అన్ని ఠాణాలకు సమాచారం అందించారు. దీంతో ఇక్కడి పోలీసులు రాజయ్య కుటుంబీకులను అక్కడికి తీసుకెళ్లి చూపించగా మృతదేహం అతనిదేనని గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు ఆటోడ్రైవర్ ఎనగండుల బాబుపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్య లతతో తనకు వివాహేతర సంబంధం ఉందని చెప్పాడు. అతన్ని అడ్డు తొలగించాలని లత కోరడంతో బాబు ఈ నెల 5న రాజయ్యను కల్లు తాగుదామని తన స్వగ్రామం హుస్నాబాద్ మండలం మడదకు ఆటోలో తీసుకెళ్లాడు. కల్లు తాగాక చంపడం వీలుకాకపోవడంతో తిరిగి తీసుకువస్తున్నాడు. లత ఫోన్ చేసి, చంపేయాలని పట్టుబట్టింది. దీంతో బాబు ముంజంపల్లి కెనాల్ వద్దకు తీసుకువెళ్లి, రాజయ్యకు మళ్లీ కల్లు తాగించాడు. అతని మెడపై బలంగా కొట్టడంతో కిందపడ్డాడు. తర్వాత కెనాల్లోకి నెట్టేసి, బాబు ఇంటికి వెళ్లాడు. పోలీసుల విచారణలో నేరం చేసినట్లు లత, బాబు ఒప్పుకోవడంతో శుక్రవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ విజయ్కుమార్ తెలిపారు. చదవండి: ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది... 'మీ నాన్నలాగే నిన్ను కూడా చంపేస్తా' -
తల్లితో వివాహేతర సంబంధం.. బుద్ధి చెప్పేందుకు
ముంబై: తల్లితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కిడ్నాప్నకు యత్నించి పోలీసులకు చిక్కాడు మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల బాలుడు. నాగ్పూర్కి చెందిన బాలుడు మరో ఇద్దరు స్నేహితుల సాయంతో తన తల్లి ప్రియుడిని అపహరించి బైక్పై తీసుకెళ్లే క్రమంలో, బాధితుడు తప్పించుకోవడంతో విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్జీ హౌస్ చౌక్ ప్రాంతంలో నివాసముంటున్న బాలుడి తల్లి, ప్రదీప్ నందన్వర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై ఆమె, ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కలత చెందిన బాలుడు తన తల్లి ప్రియుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి నందన్వర్ కిడ్నాప్నకు కుట్ర పన్నాడు. (చదవండి: సవతి తల్లిపై నటుడి అత్యాచారం! ) ఈ క్రమంలో ముగ్గురు యువకులు కలిసి నందన్వర్ పని చేసే కార్యాలయం నుంచి అతన్ని అపహరించి బైక్పై తీసుకెళ్తుండగా, ఓ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనపడటంతో నందన్వర్ రన్నింగ్ బైక్ నుంచి దూకేశాడు. పోలీసులను గమనించిన యువకులు నందన్వర్ను వదిలేసి పరారయ్యారు. నిందితుల నుంచి తప్పించుకున్న నందన్వర్ బాలుడి తల్లికి సమాచారం చేరవేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం అంగీకరించారు. ఆ ముగ్గురు యువకులకు ఎటువంటి క్రిమినల్ రికార్డ్ లేదని పోలీసులు పేర్కొన్నారు. అయినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు -
‘నీ మరదల్ని చంపేశా.. వెళ్లి చూసుకోండి’
సాక్షి, అనంతపురం : నగరంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. అనుమానంతో ప్రియుడే ఆమెను కడతేర్చాడు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను వన్టౌన్ సీఐ ప్రతాప్రెడ్డి మీడియాకు వెల్లడించారు. నగరానికి చెందిన యశోద (32)కు రాణినగర్కు చెందిన శంకర్ అనే రాడ్బెండర్తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి తరుణ్తేజ్, యశ్వంత్ అనే కుమారులు ఉన్నారు. నాలుగేళ్ల అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న బుక్కరాయసముద్రం మసీదు కొట్టాలకు చెందిన ఆటో డ్రైవర్ మల్లికార్జునతో యశోదకు పరిచయం ఏర్పడి సహజీవనం చేశారు. రెండేళ్లుగా నగరంలోని అశోక్నగర్లో నివాసముంటున్నారు. యశోద కుమారులిద్దరినీ అక్క విజయలక్ష్మి కొత్తచెరువు హాస్టల్లో చేర్పించింది. చదవండి: ఏ తల్లిని కదలించినా కన్నీటీ ధారలే.. అనుమానంతోనే కడతేర్చాడు.. యశోద మరొకరితో చనువుగా ఉన్నట్లు మల్లికార్జునకు అనుమానం వచ్చింది. ఈ విషయమై మాటామాటా పెరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన మల్లికార్జున రాడ్తో తలపై బలంగా మోదడంతో తీవ్రంగా గాయపడిన యశోద కొద్దిసేపటికే మృతి చెందింది. అనంతరం మల్లికార్జున అక్కడి నుంచి పరారయ్యాడు. చదవండి: స్నేహితుడిని చంపి సూట్కేస్లో కుక్కి.. ‘చంపేశా..వెళ్లి చూసుకోండి’ ‘నీ మరదల్ని చంపేశా. వెళ్లి దాన్ని చూసుకోండి’ అంటూ యశోద బావ (అక్క విజయలక్ష్మి భర్త) సంజీవ్కుమార్కు ఆదివారం ఉదయం మల్లికార్జున ఫోన్ చేసి చెప్పాడు. దీంతో సంజీవ్కుమార్ దంపతులు హుటాహుటిన అశోక్నగర్కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఎంతసేపు పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే యశోద మృతి చెందింది. దీంతో అక్క విజయలక్ష్మి బోరున విలపించింది. తన చెల్లిని చంపి పిల్లలిద్దరినీ అనాథల్ని చేశాడంటూ మల్లికార్జునకు శాపనార్థాలు పెట్టింది. వన్టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
బాగా చదువుకో.. వెళ్తున్నా !
సాక్షి, మహానంది (కర్నూలు): ‘బాగా చదువుకో.. ఆరోగ్యం జాగ్రత్త.. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి’ అంటూ బిడ్డకు మంచి మాటలు చెప్పి వెనుదిరిగిన ఆ తల్లి కాసేపటికే అనంతలోకాలకు చేరుకుంది. టైర్ పంక్చర్ కావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిన ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషాదకర ఘటన మహానంది మండలం నందిపల్లె వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన నారాయణమ్మ, శ్రీను కుమార్తె లావణ్య పాణ్యం మండలం నెరవాడలోని గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కూతురిని చూసేందుకని ఉదయం బైక్పై వచ్చారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెనుదిరిగారు. మార్గంమధ్యలో నందిపల్లె సమీపంలోకి చేరుకోగానే బైకు టైరుకు మేకు గుచ్చుకుని పంక్చర్ అయింది. వెనుక కూర్చున్న నారాయణమ్మ ఒక్కసారిగా జారి కిందపడటంతో చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. హెడ్ కానిస్టేబుల్ విజయ్కుమార్, రోడ్ సేఫ్టీ సిబ్బంది రసూలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చదవండి: భూమి ఇస్తేనే.. తలకొరివి పెడతా..! అడ్డుగా ఉన్నాడనే కడతేర్చింది పట్నంబజారు(గుంటూరు): అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, ప్రియుడితో కలసి భర్తను కడతేర్చిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అరండల్పేట పోలీసుస్టేషన్ వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె. సుప్రజ, స్టేషన్ ఎస్హెచ్వో బత్తుల శ్రీనివాసరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజీవ్గాంధీనగర్లో నివాసం ఉండే పి.కె.మరియదాసు (40) మార్చుల్ పని చేస్తాడు. అతడికి 22 ఏళ్ల కిందట మరియమ్మతో వివాహం జరగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కొడుకు సుధాకర్ మిర్చి యార్డులో పని చేస్తున్నాడు. కుమార్తె వేమూరులో ఉంటుండగా మరియమ్మ అక్కడకు వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో పెరవలి గ్రామానికి చెందిన గుంటూరు అనిల్బాబు అనే ఆటోడ్రైవర్తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్దికాలానికి విషయం తెలుసుకున్న భర్త మరియదాసు భార్య మరియమ్మను హెచ్చరించడం ప్రారంభించారు. నిత్యం మద్యం తాగి వేధిస్తుండటంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలసి పథకం వేసింది. (చదవండి: డబ్బుల కోసం వేధించి.. గొంతు నులిమి చంపేశాడు) వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుప్రజ, ఎస్హెచ్వో శ్రీనివాసరావు ఈనెల 7వ తేదీ రాత్రి 1గంట సమయంలో కుమారుడు మిర్చి యార్డుకు పనికి వెళ్లిన తరువాత, అనిల్బాబు, మరియమ్మలు కలసి మరియదాసు గొంతుకు తాడును బలంగా బిగించి, రోకలి బండతో కొట్టి హత్య చేశారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తర్వాత కుమారుడు సుధాకర్కు ఫోన్ చేసి తండ్రి మరియదాసు ఫూటుగా మద్యం తాగి ఎక్కడో పడి గాయపడ్డాడని చెప్పి అక్కడ నుంచి పరారయ్యారు. సుధాకర్ బంధువులకు సమాచారాన్ని అందించాడు. అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు కాంతారావు విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కాగా హత్య జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం రాజీవ్గాం«దీనగర్కు చెందిన వలంటీర్ ద్వారా ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించి, పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లు, రోకలిబండ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
బాడీగార్డ్తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్
దుబాయ్: దుబాయ్ పాలకుడి భార్య ఆమె బాడీగార్డుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీని గురించి బయటకు వెళ్లడించకుండా ఉండటానికి అతడికి భారీ ఎత్తున నగదు.. ఖరీదైన బహుమతులు ఇచ్చిందనే వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మెయిల్ ఆన్లైన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆరవ భార్య హయా గత రెండేళ్లుగా బ్రిటీష్ బాడీగార్డు రస్సెల్ ఫ్లవర్స్తో అక్రమ సంబంధం నెరపుతుంది. దీని గురించి రహస్యంగా ఉంచడం కోసం అతడికి 1.2మిలియన్ డాలర్ల నగదు(రూ. 8,88,59,400)తోపాటు 12 వేల డాలర్ల విలువైన వాచ్, అరుదైన షాట్గాన్ ఇచ్చినట్లు మెయిల్ ఆన్లైన్ వెల్లడించింది. రస్సెల్ భార్య మాట్లాడుతూ.. ‘హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతలు ఇచ్చి లొంగదీసుకుంది.. తనని ఆమె దగ్గరే ఉంచుకుంది’ అని తెలిపింది. వీరిద్దరి బంధం గురించి తెలియడంతో రస్సెల్ భార్య ఎంతో బాధపడిందని.. వారి నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికేందుకు సిద్దమయ్యిందని మెయిల్ ఆన్లైన్ తెలిపింది. (ఫేస్మాస్క్లు చోరీ : సంచలన తీర్పు) ప్రిన్సెస్ హయా, ఆమె 70 ఏళ్ల మాజీ భర్త మధ్య హైకోర్టు విచారణ సందర్భంగా బాడీగార్డుతో ఆమెకున్న రహస్య సంబంధం వెలుగులోకి వచ్చింది. లండన్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్లో భాగంగా ఈ వివరాలు వెలువడ్డాయి. ప్రిన్సెస్ హయా తన మగ అంగరక్షకులలో ఒకరితో అక్రమ సంబంధం కలిగి ఉందని దీనిలో పేర్కొన్నారు. ప్రస్తుతం హయా తన ఇద్దరు పిల్లలతో వెస్ట్ లండన్లోని కెన్సింగ్టన్లో నివాసం ఉంటున్నారు. -
పట్టించిన టైలర్ లేబుల్.. రెండో ప్రియుడితో కలిసి..
యర్రగొండపాలెం (ప్రకాశం జిల్లా): ఓ హత్య కేసులో నలుగురు నిందితులను హతుడు ధరించి ఉన్న చొక్కా టైలర్ లేబుల్ పట్టించింది. ఈ కేసుకు సంబంధించి నిందితులను కేవలం 12 రోజుల్లో అరెస్టు చేసినట్లు మార్కాపురం డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గత నెల 26వ తేదీన పుల్లలచెరువు నుంచి గంగవరం వెళ్లే దారిలో 50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గుర్తుతెలియన వ్యక్తి హత్యకు గురైనట్లు సీఐ దేవప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సమయంలో అతడి చొక్కాపై ఉన్న టైలర్ లేబుల్ ఆధారంగా మృతుడిది గుంటూరు జిల్లా వినుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన వాడుగా గుర్తించారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. హతుడు వినుకొండ మండలం ఉప్పరపాలేనికి చెందిన తిరుమల శ్రీనుగా గుర్తించారు. శ్రీను గుంటూరు జిల్లా నరసరావుపేట, వినుకొండ, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, పుల్లలచెరువు ప్రాంతాల్లో తిరుగుతూ నైటీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అతడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. తన స్వగ్రామం ఉప్పరపాలెంలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అదే గ్రామానికి చెందిన గోళ్ల నాగార్జునతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీన్ని గ్రహించిన శ్రీను ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. శ్రీనును అడ్డు తొలగించుకోవాలని ఆమె మరో ప్రియుడు నాగార్జునతో కలిసి పథకం వేసింది. పథకంలో భాగంగా పుల్లలచెరువులో నైటీలు అమ్ముదామని ఆమె శ్రీనుతో చెప్పింది. గంజాయి తాగే అలవాటు ఉన్న శ్రీను.. ఆమెతో కలిసి గంగవరం రోడ్డులోని నిర్మానుష్య స్థలంలోకి వచ్చాడు. అక్కడ వేచి ఉన్న ఆమె రెండో ప్రియుడు నాగార్జున కర్రతో దాడి చేసి శ్రీనును తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెతో కలిసి టవల్తో అతని గొంతుకు ఉరి బిగించి హత్య చేశారు. గతంలో నిందితుడు నాగార్జున ఒక యువతిని మోసం చేశాడు. హతుడు అప్పట్లో బాధితురాలికి అండగా ఉన్నాడు. ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రియురాలి ప్రోత్సాహం కూడా ఉండటంతో శ్రీనును నాగార్జున హత్య చేశాడు. హత్యానంతరం నిందితుడు హతుడి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లాడు. తన తండ్రి అంజయ్యకు విషయం చెప్పి అది ఇచ్చాడు. ఆ గొలుసును అమ్మి పెట్టాలని ఆయన తమ సమీప బంధువు రావులపల్లి హనుమంతయ్యకు ఇచ్చాడు. మృతుడి బంగారు గొలుసు, హత్యకు ఉపయోగించిన కర్ర, నిందితుల సెల్ఫోన్లు, నాగార్జునకు చెందిన బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నాగార్జున, హతుడి ప్రియురాలు, అంజయ్య, హనుమంతయ్యలను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. తక్కువ సమయంలోనే హత్య కేసును ఛేదించిన సీఐ దేవప్రభాకర్, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, త్రిపురాంతకం ఎస్ఐలు వెంకటేశ్వరరావు, పి.ముక్కంటి, వి.హరిబాబు, హెడ్కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు అంజి, హుస్సేన్, రమేష్లను డీఎస్పీ అభినందించారు. -
పచ్చని సంసారంలో.. అక్రమ బంధం చిచ్చు
సాక్షి, బొమ్మనహళ్లి : వివాహేతర సంబంధం పచ్చని సంపారంలో చిచ్చురేపింది. అనైతిక సంబంధంపై ప్రశ్నించిన భార్యను హత్య చేసిన భర్త అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన నగరంలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోఉన్న కూడ్లు సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... ఏఎఫ్సీఎల్ లేఔట్లో బీహార్కు చెందిన మనీష్ కుమార్(38), సంధ్యా(33) దంపతులు రెండు సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చి ఎఫ్సీఎల్ లేఔట్లో నివాసం ఉంటున్నారు. మనీష్కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. (దూరమవుతామనే భయంతో.. ఆత్మహత్య) ఈ విషయం భార్యకు తెలియడంతో దంపతులు నిత్యం గొడవపడేవారు. తన భర్త వ్యవహారాన్ని సంధ్య తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కోపోద్రిక్తుడైన మనీష్ కుమార్ శుక్రవారం రాత్రికి భార్యను గొంతు పిసికి హత్య చేశాడు. విషయం బయటకి పొక్కకుండా జాగ్ర త్త పడ్డాడు. రెండు రోజులుగా కుమార్తె నుంచి ఫోన్ రాకపోవడంతో సంధ్య తల్లిదండ్రులు ఆదివారం నగరానికి వచ్చారు. వారు ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న మనీష్ కుమార్ మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంధ్య తల్లిదండ్రులు వచ్చి చూడగా ఇంట్లో సంధ్య మృతదేహం, బయట మనీష్కుమార్ మృతదేహం కనిపిం చాయి. పరప్పన అగ్రహార పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. (నాడు మోసం.. నేడు మౌనం! ) (బస్సులు నడుపుదామా? వద్దా? ) -
భర్త, పిల్లలు ఉన్నా ప్రియుడి మోజులో పడి..
సాక్షి, హసన్పర్తి(వరంగల్) : భర్త, పిల్లలు ఉన్నా ప్రియుడి మోజులో పడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రియురాలు, ఆమె బంధువులకు తోడు.. తన భార్య నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రియుడు ఏకంగా ఆమె ప్రాణాలు తీశాడు.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈహత్య హసన్పర్తి మండలం ముచ్చర్ల శివారులోని ఓ మొక్కజొన్న చేనులో ఆదివారం జరగగా.. మృతురాలిది వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సింగరాజుపల్లి. ఈ ఘటనకు సంబంధించి వివరాలను కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ యాదవ్ హసన్పర్తి పోలీస్స్టేషన్లో సోమవారం రాత్రి వెల్లడించారు. పెళ్లిలో పరిచయం.. ఆపై సంబంధం హసన్పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన కొయ్యడ చంటికి భార్యాపిల్లలు ఉండగా.. ఆటో నడుపుతూ జీవనం సాగి స్తున్నాడు. ఇక దామెర మండలం సింగరాజుపల్లికి చెందిన మంద రూప(32) తన భర్త, ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల క్రితం ఓ పెళ్లిలో చంటికి రూపతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో గొడవలు జరుగుతున్నాయి. అయితే పెద్దలు మందలించినా రూప ప్రవర్తనలో మార్పురాలేదు. ఏడాది క్రితం రూప పెంబర్తికి వచ్చి చంటితో గొడవ పడగా, స్థానికులు సర్దిపెచ్చి పంపించారు. అంతేకాకుండా చంటిని ఆయన భార్యతో పాటు రూప భర్త సురేందర్ కూడా తరచూ బెదిరించినా ఆయన తన సంబంధాన్ని వీడలేదు. హాస్టల్ నుంచి మొక్కజొన్న చేనుకు... రూప కుమార్తె బీమారంలో చదువుకుంటుండగా ఆదివారం మధ్యాహ్నం అక్కడకు వచ్చింది. తొలుత చంటికి ఫోన్ చేసి కేయూసీ క్రాస్ వద్దకు రమ్మని సూచించగా ఆయన ఆటో తీసుకుని వచ్చాడు. ఆటోలో రూపను ఎక్కించుకుని భీమారం సమీపంలోని గురుకుల పాఠశాల వద్దకు వెళ్లాక ఆమె చంటి సెల్ఫోన్, ఆటో తాళాలు తీసుకుని లోపలకు వెళ్లింది. అక్కడే చంటి మూడు గంటల పాటు నిరీక్షించగా.. ఓ పక్క భార్య, మరో పక్క రూప బంధువుల వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు రాత్రి 7.30గంటల ప్రాంతంలో వీరిద్దరు వివాహేతర సంబంధాన్ని కొనసాగించే ముచ్చర్ల శివారులోని మొక్కజొన్న చేను వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరగడంతో చంటి ఆటోలోని కర్రతో రూప తలపై బలంగా కొట్టగా ఆమె మృతి చెందింది. పోలీస్స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు ఆదివారం రాత్రి రూపను హత్య చేసి చంటి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. రాత్రంతా ఏం చేయాలో తెలియక ఆలోచించిన ఆయనకు ఏ మార్గం కనిపించలేదు. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారనే భయంతో సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నేరుగా వచ్చి హసన్పర్తి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో నిందితుడిని తీసుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అలాగే, రూప మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఏసీపీ రవీంద్రకుమార్‡ చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్రావు, ఎస్సై ఫ్రవీణ్, రవీందర్, హెడ్ కానిస్టేబుల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు భీమారంలో ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చచెప్పి వారిని పంపించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!
సాక్షి, కాగజ్నగర్(ఆదిలాబాద్) : తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటన దహెగాం మండలం రాళ్లగూడెం గ్రామంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. పోలీసులు తక్కువ సమయంలోనే కేసును చేధించి నిందితులను పట్టుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.లక్ష్మినర్సింహస్వామి, రూరల్ సీఐ అల్లం నరేందర్ వివరాలు వెల్లడించారు. రాళ్లగూడ గ్రామానికి చెందిన రౌతు బండు(38), భార్య కవిత. వీరికి ఏడేళ్ల కుమార్తె ఉంది. కవిత ఏడాదిగా కాగజ్నగర్ మండలం బురదగూడ గ్రామానికి చెందిన కొట్రంగి బిక్కుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని పథకం ప్రకారం బండును హత్య చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 17న రాత్రి బండు ఇంట్లో నిద్రిస్తుండగా కర్రతో తలపై దాడి చేసి హతమార్చారు. అనంతరం అనుమానం రాకుండా బిక్కు ద్విచక్రవాహనంపై మృతుడి శవాన్ని తీసుకెళ్లి బిబ్రా శివారులోని పత్తి చేనులో పడేశారు. సోమవారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. భార్య కవితను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. మృతుడి సోదరుడు రౌతు కొండయ్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై రఘుపతి, మహిళా హెడ్ కానిస్టేబుల్ సమీనా, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
సాక్షి, పులివెందుల(కడప) : వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాలు బలిగొంది. అయితే ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినా.. పోలీసుల దర్యాప్తుతో ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను పులివెందుల అర్బన్ సీఐ సీతారాంరెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పులివెందుల పట్టణం నగరిగుట్టకు చెందిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి రెండవ కుమారుడు కంచర్ల జయశేఖరరెడ్డి(21) జులై 7వ తేదీన ఇంట్లో ఉండగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదేనెల 10వ తేదీన తండ్రి చంద్రశేఖరరెడ్డి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో తన కుమారుడు కనిపించలేదని ఎస్ఐ శివప్రసాద్కు ఫిర్యాదు చేశారు. పులివెందుల అర్బన్ సీఐ సీతారాంరెడ్డి మృతుడి కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీష్కుమార్రెడ్డి పీఏగా వ్యవహరిస్తున్న సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన జక్కిరెడ్డి పెద్దిరెడ్డి హత్య చేసినట్లుగా గుర్తించారు. పెద్దిరెడ్డి గుంటూరుకు చెందిన తన స్నేహితులైన కనపర్తి శ్రీను, వెంకటేష్, జగదీష్ల సాయంతో జయశేఖరరెడ్డిని హత్య చేసినట్లు తెలిసింది. జులై 7వ తేదీన వీరు నలుగురు కలిసి జయశేఖరరెడ్డిని పులివెందుల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు పిలిపించుకుని అక్కడి నుంచి ఏపీ02ఏకే 8614 అనే నెంబర్ గల స్కార్పియో వాహనంలో జయశేఖరరెడ్డిని ఎక్కించుకుని సింహాద్రిపురం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్రెడ్డి గెస్ట్హౌస్కు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో మద్యంలో విషపు గుళికలు కలిపి జయశేఖరరెడ్డికి తాపించారు. అనంతరం జయశేఖరరెడ్డిని స్కార్పియో వాహనంలో ముద్దనూరు మండలంలోని శెట్టివారిపల్లె రైల్వే ట్రాక్పై పడుకోబెట్టి రైలు ప్రమాద సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల దర్యాప్తులో జయశేఖరరెడ్డిది హత్యగా తేలడంతో నిందితులు నలుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని సీఐ పేర్కొన్నారు. -
ముగ్గురు మహిళల ఆత్మహత్య
సాక్షి, మేడిపెల్లి(కరీంనగర్) : మేడిపెల్లి మండలం లింగంపేటకు చెందిన పల్లికొండ గీత ఊరాఫ్ తోపారపు గీత(32) యాసిడ్తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం.. లింగంపేటకు చెందిన తోపారపు లక్ష్మయ్య–గంగరాజుల కూతురు గీతను 13ఏళ్లక్రితం వేములవాడ మండలం హన్మాజీపేటకు చెందిన పల్లికొం డ గంగాధర్కిచ్చి వివాహం చేశారు. వీరికి ప్రణీత్, పల్లవి అనే ఇద్దరు పిల్లలున్నారు.గంగాధర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పల్లికొండ నర్సయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నెలరోజుల క్రితం గల్ఫ్నుంచి ఇంటికొచ్చిన గీత భర్త గంగాధర్కు విషయం తెలిసింది. దీంతో గీతను పుట్టినిల్లయిన లింగంపేటలో రెండ్రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్లాడు. తండ్రి లక్ష్మయ్య కూతురును నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. విషయం అందరికి తెలిసిందని, నర్సయ్య వద్దకు వెళ్తే.. దురుసుగా ప్రవర్తించాడని చెప్పింది. శుక్రవారం ఉదయం బాత్రూంలోకి వెళ్లి యాసిడ్తాగింది. సిరిసిల్ల ఆస్పత్రికి తరలించి... అక్కడినుంచి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందు తూ శనివారం చనిపోయింది. హెడ్ కానిస్టేబుల్ రవి గీత తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పల్లికొండ నర్సయ్యపై కేసు నమోదు చేశారు. గీతకు స్వగ్రామం హన్మాజీపేటలో అంత్యక్రియలు నిర్వహించారు. ఉరివేసుకొని వివాహిత.. మెట్పల్లి : పట్టణంలోని మఠంవాడకు చెందిన మౌనిక(23) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మౌనికకు ఎనిమిది సంవత్సరాల క్రితం మధుకర్తో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు ఉన్నారు. గత కొంతకాలంగా అనార్యోగంతో బాధపడుతున్న మౌనికకు పలు ఆసుపత్రిలో చికిత్స చేయించిన అది తగ్గలేదు.మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. చెరువులో దూకి వృద్ధురాలు.. కోరుట్ల : కోరుట్ల పట్టణంలోని భీమునిదుబ్బకు చెందిన శారద(70) జీవితంపై విరక్తితో శనివారం ఉదయం స్థానిక మద్దుల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం సమయంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం ధర్మపురి : ధర్మపురి మండలంరాయపట్నం గ్రామానికి చెందిన గటికె బుచ్చక్క(55) శనివారం సాయంత్రం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బుచ్చక్కకు పుట్టుకతోనే మాటలు రావు. వివాహకం కాలేదు. ఇంటివద్దే ఉంటోంది. వయసు పైబడిన కొద్ది జీవితంపై విరక్తి చెందింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పటించుకుంది. మంటలకు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలార్పారు. 50శాతం గాయాలపైన బుచ్చక్కను కుటుంబసభ్యులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతున్న భార్యను ..
టీ.నగర్: ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతున్న భార్యను కత్తితో నరికి చంపిన భర్త అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కోవిల్పట్టిలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి నటరాజ పురం అయిదో వీధికి చెందిన మారిముత్తు (29) ఆటో డ్రైవర్. ఇతని భార్య విమల (25). వీరికి కావ్య శ్రీవిద్య (4) అనే కుమార్తె ఉంది. అదే ప్రాంతంలో వెల్డింగ్ వర్క్షాప్లో పని చేస్తున్న కుమార్ (20)తో విమలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురు తరచుగా ఏకాంతంగా కలుసుకునేవారు. భార్య ప్రవర్తనను మారిముత్తు ఖండించాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ స్థితిలో వారం రోజుల కిందట నటరాజపురం అయిదో వీధి నుంచి పక్క వీధికి తన కాపురాన్ని మారిముత్తు మార్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మారిముత్తు కుటుంబంతో కలిసి నిద్రిస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బిడ్డ రోదించింది. ఆ సమయంలో మారిముత్తు లేచి భార్య కోసం చూడగా కనిపించలేదు. అదే సమయంలో అత్త ఇంటికి వెళ్లి విచారణ జరుపగా అక్కడికీ రాలేదని తెలిపారు. దీంతో అనుమానించిన మారిముత్తు వెంటనే తన పాత ఇంటికి వెళ్లాడు. అక్కడ విమల, కుమార్తో ఉల్లాసంగా గడుపుతూ కనిపించింది. దీంతో ఆగ్రహించిన మారిముత్తు అక్కడున్న ఇనుప పైప్ను తీసుకుని కుమార్పై దాడి చేశాడు. గాయపడిన కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి సమీపంలో లభించిన కత్తిని తీసుకుని విమలపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో విమల సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. తర్వాత చేతిలో కత్తితో పాటు మారిముత్తు కోవిల్ పట్టి వెస్ట్ పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడిందని హత్య: టీ.నగర్: సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడినందున ఆగ్రహంతో 19వ అంతస్తు నుంచి కిందకు తోసి భార్యను హతమార్చినట్టు అరెస్టయిన భర్త పోలీసులకు సోమవారం వాగ్మూలం ఇచ్చాడు. చెన్నై సమీపంలో గల తాలంబూర్లో 30 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన సంతోష్కుమార్ (28). అతని భార్య బీలాదేవి (22)తో సహా పలువురు పని చేస్తున్నారు. గత నెల 27వ తేదిన 19వ అంతస్తులో నేలను శుభ్రం చేస్తుండగా అక్కడినుంచి కిందపడి బీలాదేవి మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన తాలంబూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె భర్త వద్ద విచారణ జరిపారు. బీలాదేవి సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడడంతో అనుమానించి ఆమెను కిందకు తోసి, హత్య చేసినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపాడు. దీంతో సంతోష్కుమార్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి మంగళవారం జైల్లో నిర్బంధించారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను...
మహబూబ్నగర్ క్రైం: మహిళను చీర కొంగుతో బిగించి హత్యచేసిన సంఘటనకు సంబంధించిన కేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. సోమవారం సీఐ కిషన్ నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. నవాబ్పేట మండలం కన్మన్కాల్వ గ్రామానికి చెందిన భీమమ్మ(35) భర్త గతంలోనే వదిలేయడంతో కొన్నిరోజులుగా తంగెడపల్లికి చెందిన ముర్గని శ్రీనివాస్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భీమమ్మ ఇతరులతో తిరుగుతోందని శ్రీనివాస్కు అనుమానం రావడంతో అప్పటినుంచి ఆమె తరచూ డబ్బుల కోసం వేధిస్తుండేది. అయితే అది సహించని శ్రీనివాస్ ఆమెను తుదముట్టించాలని ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే ఈనెల 11న సాయంత్రం 5గంటల సమయంలో నవాబ్పేటలో ఉన్న బేకరి దగ్గర కలిశాడు. చీకటి పడిన తర్వాత భీమమ్మకు కల్లు తాగించి నవాబ్పేట సమీపంలోని నల్లరాళ్లగుట్ట వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమె గొంతుకు చీర కొంగు బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, తాళిబొట్టు, సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడటంతో మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టగా శ్రీనివాస్ను పిలిపించి విచారించారు. దీంతో తానే హత్యచేసినట్లు బయటపడింది. అతని వద్ద ఉన్న ఆభరణాలు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ ఎస్ఐ శివకుమార్, కానిస్టేబుళ్లు వెంకటయ్య, గొవింద్, శంకర్లను అభినందించారు. -
అనుమానిస్తోందని అంతం చేశాడు..!
హైదరాబాద్: క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అనుమానించిన భార్యను అంతమొందించాడు ఓ రిటైర్డ్ పోలీసు అధికారి. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని భాస్కర్రావు పేటకు చెందిన కె.ఎస్.ఆర్. ఆంజనేయరెడ్డి(61), లక్ష్మీ వినీల(51) దంపతులు. ఆంజనేయరెడ్డి ఏలూర్ రేంజ్లో వీఆర్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశా రు. రెండు నెలల క్రితం దంపతులు కొండాపూర్ గౌతమీ ఎన్క్లేవ్లో నివాసముండే కొడుకు శివమనోహర్రెడ్డి వద్దకు వచ్చారు. కొడుకు అత్తవారింటికి వెళ్లడంతో ఫ్లాట్లో ఆ దంపతులిద్దరే ఉన్నారు. సోమవారం తెల్లవారు జామున వినీలను ఆంజనేయరెడ్డి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. రక్తం కనిపించకుండా బెడ్రూమ్ శుభ్రం చేసి ఉదయం 5.30 గంటల సమయం లో మాదాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. అక్రమ సంబంధం.. డబ్బు వివాదమే కారణం ఆంజనేయరెడ్డి కొంతకాలం రైల్వేపోలీస్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో మరో మహిళతో చనువుగా ఉంటున్నావని లక్ష్మీవినీల తరచూ భర్తతో గొడవపడేది. రిటైర్మెంట్ అనంతరం వచ్చిన డబ్బులను బ్యాంక్లో డిపాజిట్ చేశారు. రూ.లక్షా ముప్పై వేల విషయంలో ఆంజనేయరెడ్డి చెప్పిన లెక్కలకు లక్ష్మీవినీల సంతృప్తి చెందలేదు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు ఆ డబ్బు ఇచ్చావని కొద్దిరోజులుగా గొడవ పడుతోంది. సోమవారం రాత్రి ఈ విషయమై మళ్లీ గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఛాతీ కింద భాగంలో 16 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త దాడి చేసే సమయంలో వినీల పెనుగులాడిన ఆనవాళ్లు ఉన్నాయి. ఏపీకి అప్పుడప్పుడు విమానంలో వెళ్లేవాడినని, ఈ క్రమంలో డబ్బు ఖర్చు అయిం దని చెప్పినా నమ్మకుండా మరో మహిళతో సం బంధముందని వేధించడంతోనే హత్య చేసినట్లు ఆంజనేయరెడ్డి పోలీసులకు తెలిపాడు. కొండాపూర్లో ఉండే కూతురు రామప్రవళిక, అల్లుడు హుటాహుటిన వచ్చి కన్నీళ్ల పర్యంతమయ్యారు. -
భార్యను చంపిన భర్త
గొల్లప్రోలు (పిఠాపురం): అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను భర్త కడతేర్చిన ఘటన చెందుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన టైలర్ గౌస్ తన భార్య షేక్ రాజాబీబీ (30ను శుక్రవారం రాత్రి హత్య చేశాడు. ప్రత్తిపాడు మండలం వాకపల్లి గ్రామానికి చెందిన ఆమెతో అతనికి 18 ఏళ్ల క్రితం వివాహమైంది. గత మూడేళ్లుగా వీరిద్దరూ తరచూ గొడవ పడుతున్నారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు. ఆరు నెలలుగా ఇద్దరి మధ్య వివాదం మరింత పెరిగింది. శుక్రవారం రాత్రి మాటామాటా పెరగడంతో భార్య పీకను తాడుతో బిగించి హత్య చేసి అతడు పరారయ్యాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు షీలార్ను ఇటీవల కాకినాడలోని ప్రభుత్వ హాస్టల్లో 6వ తరగతిలో చేర్పించారు. చిన్న కుమారుడు నాగూర్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలాన్ని పిఠాపురం సీఐ అప్పారావు, ఎస్సై బి.శివకృష్ణ పరిశీలించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కూతురిని కావాలనే అల్లుడు అన్యాయంగా చంపేశాడని మృతురాలి తల్లి షీలార్ ఆరోపించింది. మొదటి నుంచి ఆమెను వేధిస్తున్నాడని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని విలపించింది. తల్లి షీలార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ అప్పారావు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. -
రైలు కిందపడి ఇద్దరి బలవన్మరణం
మహబూబ్నగర్ క్రైం: ఆమెకు పెళ్లి అయ్యి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఆటోడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఆటోలో రోజు ప్రయాణం చేయడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధించి ఏర్పడింది. వీరి బాగోతం రెండు కుటుంబాల్లో తెలిసిందనే భయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ రాఘవేందర్ కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన వడ్డె సాయికుమార్(20) శాంతినగర్లోఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. శాంతినగర్కు చెందిన పద్మమ్మ(30) కూలీ పనుల కోసం రోజూ అతని ఆటోలో ప్రయాణం చేసేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధించి ఏర్పడింది. ఇటీవలే ఇద్దరు ఒకే దగ్గర ఉండగా పద్మమ్మ భర్త బంధువులు పట్టుకున్నారు. ఈ విషయం రెండు కుటుంబాల్లో తెలిసిందనే భయంతో ఈ నెల 28న ఇంట్లో నుంచి ఇద్దరూ పారిపోయి వచ్చి మహబూబ్నగర్లో ఒకరోజు ఉన్నారు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారుజామున రైలు కిం దపడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాలకు జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిస్సింగ్ కేసు నమోదు శాంతినగర్కు చెందిన వెంకటేష్తో పద్మమ్మకు 15 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి పదేళ్ల అమ్మాయి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. రోజు కూలీ పని చేసే పద్మమ్మ.కు ఆటో డ్రైవర్ అయిన సాయికుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడటంతో ఈ నెల 28న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో భర్త వెంకటేష్ శాంతినగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గాలించినా ఫలితం లేకుండాపోయింది సాయికుమార్ మేనమామ జంగయ్య వాళ్లు మహబూబ్నగర్లో ఉన్నట్లు సమాచారం తెలుసుకుని ఒకరోజు మొత్తం వాళ్ల కోసం గాలించారు. శుక్రవారం రాత్రి సైతం రైల్వేస్టేషన్లో పడుకున్నా వారి ఆచూకీ దొరకలేదు. మృతదేహాల దగ్గర దొరికిన సెల్ఫోన్తో రైల్వే పోలీసులు ఫోన్ చేయడంతో అతను జనరల్ ఆస్పత్రికి వచ్చి గుర్తించాడు. -
అమ్మ కాదు.. రాతి బొమ్మ!
హైదరాబాద్ : ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా..!’ అమ్మతనాన్ని, పేగుబంధాన్ని దారపుపోగులా తెంపేసే తల్లి తల్లే కాదంటూ ఓ సినీకవి పడ్డ ఆవేదన ఇదీ! తన అక్రమ సంబంధానికి అడ్డొస్తుందన్న కారణంతో కన్నబిడ్డను రాచిరంపాన పెట్టిన అలాంటి ఓ ‘రాతి బొమ్మ’కర్కశత్వం వెలుగుచూసింది. ప్రియుడి మోజులో పడి అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కాలుతున్న పెనంపై కూర్చోబెట్టింది. చిగురుటాకులాంటి పాప పెనంపై విలవిల్లాడిపోతున్నా ఆమె గుండె కరగలేదు. చివరికి ప్రియుడితో కలిసి పాపను వదిలించుకోవాలని చూసి పోలీసులకు చిక్కింది. ఇక మరో ఘటనలో 12 ఏళ్ల బాలికపై మారుతండ్రే పశువులా ప్రవర్తించాడు. ఈ రెండు ఉదంతాలు ఆదివారం హైదరాబాద్లోని ఎస్సార్నగర్, బంజారాహిల్స్ పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ప్రియుడు చెప్పాడని.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన లలితకు గతంలోనే వివాహమైంది. నాలుగేళ్ల కూతురు రూప ఉంది. ఇదే జిల్లాకు చెందిన వివాహితుడు ప్రకాశ్కు ముగ్గురు సంతానం. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో కొన్నాళ్ల క్రితం ఇరువురూ హైదరాబాద్కు పారిపోయి వచ్చారు. ప్రకాశ్ తన భార్యాపిల్లల్ని అక్కడే వదిలి రాగా... లలిత మాత్రం తన బిడ్డ రూపను వెంట తెచ్చుకుంది. వీరిద్దరూ ఎస్సార్నగర్లో ఉన్న వెస్ట్ శ్రీనివాస్నగర్లోని పద్మావతి బాయ్స్ హాస్టల్లో పనులకు చేరారు. నిర్వాహకులతో తాము భార్యాభర్తలమని, తమ వెంట ఉన్నది కన్నబిడ్డని నమ్మబలికారు. హాస్టల్లో లలిత వంట మనిషిగా పనిచేస్తుండగా.. ప్రకాశ్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. హాస్టల్లో ఉన్న ఓ చిన్న గదిలో ఇద్దరూ నివాసం ఉంటున్నారు. తాను తన భార్యతోపాటు పిల్లల్ని వదిలేసి వచ్చానని, నీవు కూడా రూపను వదిలించుకోవాలని కొన్ని రోజులుగా లలితపై ప్రకాశ్ ఒత్తిడి తెస్తున్నాడు. మొదట్లో వారించినా కొన్ని రోజుల తర్వాత.. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న బిడ్డను వదిలించుకోవాలని భావించింది లలిత. నేరుగా వదిలేస్తే ఇబ్బందని భావించిన లలిత, ప్రకాశ్లు.. బాలిక భయభ్రాంతులకు గురయ్యేలా చిత్రహింసలు పెట్టాలని భావించారు. ఈ క్రమంలోనే లలిత రెండ్రోజుల క్రితం మండుతున్న పొయ్యిపై ఉన్న పెనంపై చిన్నారని కూర్చోబెట్టింది. దీంతో బాలిక కాళ్లతోపాటు సున్నిత భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మే ఇలా అమానుషంగా ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ పాప విలవిల్లాడింది. వెక్కివెక్కి ఏడుస్తున్నా ఆ తల్లి గుండె కరగలేదు. గాయాలేంటని అడిగిన వారితో.. ప్రమాదవశాత్తు కాలిందని చెప్పి నమ్మించింది. చివరకు బాలికను పూర్తిగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాశ్తో కలసి పథకం వేసింది. శనివారం రాత్రి వీరిద్దరూ చిన్నారిని తీసుకుని నాంపల్లిలోని భరోసా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న సిబ్బందితో తమకు కాలిన గాయాలతో ఉన్న ఓ చిన్నారి దొరికిందని, అనాథగా భావించి అప్పగించడానికి తెచ్చామని చెప్పారు. దీంతో అక్కడి సిబ్బంది చైల్డ్లైన్ విభాగానికి సమాచారమిచ్చారు. ఆ విభాగం ఉన్నది గోపాలపురం ఠాణా పరిధిలో కావడంతో అక్కడకు పంపారు. చైల్డ్లైన్ అధికారులు వచ్చేలోపు గోపాలపురం పోలీసులు చిన్నారిని బుజ్జగించి మెల్లిగా వివరాలు ఆరా తీసే ప్రయత్నం చేశారు. దీంతో కన్నీరుమున్నీరైన ఆ పాపా తాను అనాథను కాదని, లలిత తన తల్లి అని చెప్పి రోదించింది. ఆమే తనను పెనంపై కూర్చోపెట్టడంతోనే గాయాలయ్యాయని చెప్పింది. దీంతో షాక్కు గురైన పోలీసులు... చిన్నారిని వదిలించుకోవడానికి లలిత, ప్రకాశ్ నాటకం ఆడినట్లు గుర్తించారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని చిన్నారితో సహా ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న చైల్డ్లైన్ అధికారి ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేశారు. లలిత, ప్రకాశ్లపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలికను యూసుఫ్గూడలోని శిశువిహార్కు తరలించి వైద్య చికిత్స చేయిస్తున్నారు. అక్కడి అధికారులే బాలిక సంరక్షణ బాధ్యతలు చేపట్టారని, అవసరమైతే అదనపు వైద్య సేవలు అందిస్తారని పోలీసులు చెప్పారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. వావి వరుసలు మరిచి.. వావి వరసలు మర్చిన ఓ సవతి తండ్రి.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్ నగర్లో నివాసం ఉంటున్న వ్యక్తి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తుంటాడు. భార్య ఉండగానే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూతురు (12)పై కొంతకాలంగా కన్నేశాడు. తరుచూ ఆ చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతూ నరకం చూపుతున్నాడు. తల్లితో పాటు ఎవరూ పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని చిన్నారి చుట్టుపక్కల వారికి తన గోడు చెప్పుకుంది. దీంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి షీ–టీమ్స్కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన షీ–టీమ్స్ సిబ్బంది బాలికను సవతి తండ్రి బారి నుంచి రక్షించి చైల్డ్లైన్ సిబ్బందికి అప్పగించారు. బాలికను చైల్డ్లైన్ అధికారులు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి జరిగిన ఘాతుకంపై ఫిర్యాదు చేశారు. చిన్నారి వద్ద వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. ఆమెను బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. బాలిక సవతి తండ్రిపై కేసు నమోదు చేశారు. -
వివాహిత ఆత్మహత్య
ఏలూరు అర్బన్ : భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపానికి గురైన భార్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబం««ధించి మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ నగరంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న కులుకుర్తి సత్యనారాయణ కుమార్తె దుర్గాభవానీకి ఏలూరు నగరానికి చెందిన దిమిలి శివకుమార్ అనే వ్యక్తితో 2013లో వివాహం జరిగింది. నాటి నుంచి దుర్గాభవానీ, శివకుమార్లు స్థానిక గ్జేవియర్నగర్ ఏటిగట్టు సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే శివకుమార్ కొంతకాలంగా పొరుగింట్లో ఉంటున్న మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇది గమనించిన దుర్గాభవానీ, శివకుమార్ను నిలదీసింది. దాంతో వారిద్దరూ తగవులు పడుతున్న నేపథ్యంలో కుమార్తె ద్వారా విషయం తెలుసుకున్న తండ్రి సత్యనారాయణ ఈ నెల 17న ఏలూరు వచ్చి అల్లుడిని అక్రమసంబంధం విషయంలో నిలదీశాడు. దాంతో అల్లుడు శివకుమార్ దుర్గాభవానీ గొడ్రాలని, పిల్లలు పుట్టలేదని ప్రియురాలిని విడిచి పెట్టేదిలేదని తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో శనివారం తన కూతురు దుర్గాభవానీ ఉరివేసుకుని మరణించిందని వార్త తెలియడంతో ఏలూరు వచ్చానని సత్యనారాయణ తెలిపారు. తన కూతురు మరణానికి భర్త వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పాటు ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడని తెలిసిందని ఈ కారణంతో మనస్తాపానికి గురైన తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. తన కుమార్తె మరణానికి పరోక్షంగా కారణమైన అల్లుడు శివకుమార్తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశాడు. -
సర్ ప్రైజ్ వీడియోతో పెళ్లి కూతురికి షాక్
సాక్షి : పెళ్లి కూతురిపై అనుమానంతో ఓ పెళ్లి కొడుకు చేసిన పని.. దానిని నిజమని నిరూపించింది. పెళ్లి వేదికలోనే ‘హాట్’ టాపిక్గా మారేలా ఓ వీడియో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అతగాడు. అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మొత్తం మారిపోయి.. రచ్చ మొదలైంది. సింగపూర్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్లితే... తొలుత వధూవరులు గతంలో కలిసి తిరిగిన దృశ్యాలతో ప్రారంభమైన వీడియో, ఒక్కసారిగా, ఆమె వేరేకరితో చనువుగా ఉన్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. ఆ వ్యక్తితో కలసి హోటల్ రూమ్ లోకి వెళ్లడం, ఆపై అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం అందులో స్పష్టంగా కనిపించింది. ఇంకేం పెళ్లి కూతురు అసలు స్వరూపం బయటపడటంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో అవమానభారంతో పెళ్లి కూతురు వేదికను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతను అజాక్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించాడు. జుహో అనే 42 ఏళ్ల మహిళా డిటెక్టివ్ ఈ కేసును టేకప్ చేసింది. ఆరు వారాలుగా పెళ్లి కూతురిని వెంబడిస్తూ ఆమె ప్రతీ కదలికలను పరిశీలిస్తూ.. వాటిని వీడియో రూపంలో భద్రపరచసాగింది. చివరకు ఆమె ఓ వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందన్నది ధృవీకరణ కావటంతో పెళ్లి కొడుకుకి తెలియజేసింది. అలా ఈ వ్యవహారం అంతా పబ్లిక్ అయిపోయిందన్న మాట. ఇంతకీ వారి వివరాలేంటీ? ఆ ఈ వివాహాన్ని వారు రద్దు చేసుకున్నారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరావటం లేదు. -
భార్యను హత్య చేసిన భర్త !
భర్త వివాహేతర సంబంధమే కారణం..? మైదుకూరు టౌన్ : వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను హత్యచేసి పిల్లలను అనాథలుగా మిగిల్చిన సంఘటన మైదుకూరు మండలం పు ల్లయ్యసత్రం గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు మండలం నడింపల్లె గ్రామానికి చెందిన కుమ్మరి రామకృష్ణ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగరాజుపాడు గ్రామానికి చెందిన కుమ్మరి సులోచన(29) తో 10 సంవత్సరాల కిందట వివాహమైంది. రామకృష్ణ వృత్తిరీత్యా ఆచారిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గత ఐదేళ్ల నుంచి పుల్లయ్య సత్రం గ్రామంలో సొంత ఇల్లు కట్టుకొని జీవనం సాగించేవాడు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా రామకృష్ణ ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తరచూ ఇంటిలో గొడవ పడుతుండేవాడు. ఇటీవల గ్రామంలో కూడా పెద్ద మనుషులతో పంచాయితీ కూడా జరిగింది. అయినా రామకృష్ణ పద్ధతి మార్చుకోకుండా వివాహేతర సంబంధం ఉన్న మహిళను ఇంటిలో తెచ్చిపెట్టుకోవాలని భార్య సులోచనతో గొడవ పడుతుండేవాడు. శుక్రవారం ఉదయం ఇంటిలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భార్యను హత్య చేసినట్లు అక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. భార్య మెడ, చేతి భాగంలో కత్తితో కోసినట్లు, ఈడ్చుకుంటూ వచ్చినట్లు ఆధారాలు ఉండటంతో హత్యచేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సులోచన తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సులోచనను ముమ్మాటికీ అల్లుడే చంపాడని సుబ్బరాయుడు మృతదేహంపై బోరున విలపించాడు. అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను చూసిన వాళ్లంతా కంటతడిపెట్టారు. సులోచన హత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలం పరిశీలించిన పోలీసులు మృతదేహంను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడని హత్య
♦ భర్తను చంపించిన భార్య ♦ ప్రియుడితో కలిసి పథక రచన ♦ కటకటాల్లోకి నిందితులు నిజామాబాద్ నిజాంసాగర్(జుక్కల్) : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిందో ఇల్లాలు. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పథకం పన్నిన ఆమెను కటకటాల వెనక్కి పంపించారు పోలీసులు. కేసు వివరాలను బాన్సువాడ రూరల్ సీఐ శ్రీనివాస్రావు, ఎస్సై అంతిరెడ్డి సోమవారం నిజాంసాగర్ ఠాణాలో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని మల్లూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నగేశ్ (36), భారతి దంపతులు. అదే గ్రామానికి చెందిన గూల దత్తుతో భారతికి మూడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. భార్యపై అనుమా నం వచ్చిన నగేశ్ పలుమార్లు మందలిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించాలని భారతి దత్తును ప్రేరేపించింది. ఈ నెల 6న నగేశ్ను తీసుకొని ఊర చెరువు కట్టపైకి తీసుకెళ్లిన దత్తు అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. నగేశ్ మద్యం మత్తులోకి జారుకోవడంతో దత్తు అతడ్ని చెరువులోకి నెట్టివేశాడు. కట్టపై ఉన్న మెట్లపై పడడంతో నగేశ్ తలకు, ముఖానికి దెబ్బలు తగిలి స్పృహ తప్పాడు. ఇదే అదనుగా భావించిన దత్తు అతడి గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని చెరువు లో పడేశాడు. భారతి ఎప్పటికప్పుడు ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ సూచనలు చేసింది. అనంతరం దత్తు అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, చెరువు కట్టపై నగేశ్ బైక్, చెప్పులు ఉండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. అప్పటికే, తన భర్త కన్పించడం లేదంటూ భారతి చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చింది. ఈ క్రమంలో భారతి, నగేశ్లపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే దత్తు పరారు కాగా, పోలీసులు అతడ్ని గాలించి పట్టుకున్నారు. విచాణరలో నగేశ్ను హత్య చేసినట్లు దత్తు ఒప్పుకోగా, భర్తను తానే హత్య చేయించినట్లు భారతి నేరాన్ని అంగీకరించింది. నిందితులపై హత్యనేరం కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఏఎస్సై గాంధీగౌడ్, కానిస్టేబుళ్లు గంగారాంనాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
భార్యను బండతో కొట్టి చంపిన భర్త గంపలగూడెం (తిరువూరు) : వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలోని పెనుగొలనులో సోమవారం జరిగింది. ఘటనపై మృతురాలి తల్లి దుబ్బాకు నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇనపనూరి లక్ష్మణ్ తన భార్య కమలకుమారి (27)ని పచ్చడిబండతో బలంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శివరామకృష్ణ సంఘటన వివరాలు తెలిపారు. విస్సన్నపేట మండల పుట్రేలకు చెందిన తన అక్క కుమార్తె కమలకుమారిని లక్ష్మణ్ పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అనుమానంతో లక్ష్మణ్ రోజూ తన భార్యను వేధించేవాడు. పెద్ద మనషులు మందలించినా మార్పు రాలేదు. వేధింపులు తాళలేక ఏడాది కిందట కుమారి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి తొమ్మిది నెలల కిందట పెనుగొలను వచ్చింది. కొన్నిరోజులుగా మళ్లీ తన కూతురుని వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో సోమవారం లక్ష్మణ్ అతని అన్న సర్వేశ్వరరావు సహకారంతో కమలకుమారిని హత్యచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ప్రేమపెళ్లి చేసుకొని... చంపేశాడు
► అక్రమ సంబంధం వల్లే భర్తచేతిలో మృతి చెందిన భార్య ► 14 నెలల క్రితం హత్యను ఛేదించిన పోలీసులు ► భర్తను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వైఎస్సార్ జిల్లా: 14 నెలల క్రితం హత్యచేసి చిత్రావతి నదిలో పూడ్చిన మేదరి చిన్ననాగమ్మ(28) మృతదేహాన్ని సోమవారం కొండాపురం ఎస్ఐ శివప్రసాద్రెడ్డి వెలుగులోకి తీశారు. ఇన్చార్జి తహశీల్దార్ సుబ్బరామయ్య సంఘటనా స్థలానికి చేరుకొని శవపేటికను బయటకు తీసి పంచనామ నిమిత్తం కడప రిమ్స్కు తరిలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం కొండాపురం ఏకలవ్య కాలనీకి చెందిన మేదరి నాగేష్ అలియాస్ నాగన్న, చిన్న నాగమ్మలు 2003లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భర్త నాగన్న వ్యాపారరీత్యా బయటకు వెళ్లినప్పుడు అదే కులానికి చెందిన వెంటేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై భార్య నాగమ్మను పలుసార్లు మందలించినా ఫలితం లేకపోవడంతో విసుగు నాగన్న భార్యను హత్య చేశాడు. అంతకు ముందు దీనిపై పెద్దల సమక్షంలో పంచాయతీ చేసినా నాగమ్మ తన తీరు మార్చుకోలేదు. చిత్రావతిలో పూడ్చి పెట్టారు: కొండాపురం నుంచి 20కిలో మీటర్ల దూరంలో ఉన్న చిత్రావతి నదిలోకి తీసుకెళ్లి భర్త నాగన్న, అతని తండ్రి సుబ్బన్న, తమ్ముడు రమేష్ కలిసి గొంతునులిమి నదిలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కొండాపురం సీఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కేసు ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిని వారి సిబ్బందిని సీఐ అభినందించారు. ప్రస్తుతం మరొక నిందితుడి కోసం గాలింపులు జరుగుతున్నాయని త్వరలోనే రిమాండ్కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
నయవంచకుడి అరెస్టు
♦ శారీరకంగా అనుభవిస్తూ.. నగ్న దృశ్యాల చిత్రీకరణ ♦ ఓ మహిళపై సహచరుడు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరణ ♦ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు అమలాపురం టౌన్ : వారిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను తరచూ శారీకంగా అనుభవిస్తూ... రహస్యంగా నగ్న దృశ్యాలు సెల్ఫోన్ వీడియోలో చిత్రీకరించి తన స్నేహితుల సెల్ఫోన్లకు పోస్టింగ్లు చేశాడు. ఈ అక్రమాలకు పాల్పడ్డ నిందితుడిని అమలాపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలేనికి చెందిన కారు డ్రైవర్ పలివెల వెంకట సూరిబాబు ఆ మోసానికి పాల్పడినట్టు అదే మండలం చిన్న తిళ్లకుప్ప గ్రామానికి చెందిన బాధితురాలైన 35 ఏళ్ల మహిళ తనకు జరిగిన అవమానాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతడిపై కేసు నమోదైంది. నిందితుడి సూరిబాబును పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్లు పట్టణ పోలీసు స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టి అతడు చేసిన నేరాన్ని వివరించారు. బాధిత మహిళ గతంలో ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ కొంత కాలం ఉంది. తర్వాత ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ముంబైలో కొన్నాళ్లు కాపురం చేసింది. ఇద్దరి మధ్య గొడవలు రావటతో భర్తను వదిలేసి తన ఇద్దరు మగ పిల్లలతో చిన్న తిళ్లకుప్పలో నివాసం ఉంటోంది. మోటారు సైకిల్పై ఆమె ఊరూరూ వెళ్లి చీరలను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూరిబాబు కారులో వస్త్రాల కొనుగోలుకు ద్వారపూడి, రాజమహేంద్రవరం వెళ్లేది. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధంలో సహచర్యం చేస్తున్నారు. ఆమెను సూరిబాబు కారులో తీసుకు వెళుతూ అమలాపురంలోని ఓ లాడ్జిలో, మురమళ్లలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో కొన్నిసార్లు బస చేశాడు. ఆ సమయంలో సూరిబాబు ఆమెను శారీకంగా అనుభవిస్తూ ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో వీడియో ద్వారా వారు కలుసుకున్న, నగ్న దృశ్యాలు చిత్రీకరించాడు. వీడియోలో తాను మాత్రం కనిపించకుండా కేవలం ఆమెను మాత్రమే చిత్రీకరించి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ నీలి దృశ్యాలతో ఉన్న వీడియోను సూరిబాబు తన సెల్ఫోన్ ద్వారా తన మిత్రుల సెల్ఫోన్లకు పంపించాడు. చివరకు ఆ వీడియో బాధితురాలు చూసి నిర్ఘాంతపోయింది. బెడ్ రూమ్లోని దృశ్యాలను అందరికీ బహిర్గతం చేస్తావా? అంటూ బాధితురాలు సూరిబాబును నిలదీసింది. నా ఇష్టం అందరికీ చూపిస్తాను...ఎక్కువగా మాట్లాడితే చంపేస్తానని సూరిబాబు బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మురమళ్ల, అమలాపురంలోని అతిథి గృహం, లాడ్జీలో సూరిబాబు ఆమెను నగ్నంగా వీడియో చిత్రీకరించినట్టు ఆధారాలు లభ్యం కావడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరచినట్టు డీఎస్పీ అంకయ్య వివరించారు. -
అక్రమ సంబంధ లేఖల కలకలం
► ఒక వృద్ధుడి నిర్బంధం ► నాలుగు కుటుంబాల వారు ఆందోళన, ఆత్మహత్యాయత్నం ► వృద్ధుడి అరెస్టుతో సద్దుమణిగిన వివాదం మండలంలోని రావులపాడులో గురువారం తెల్లవారుజామున ఒక వృద్ధుడు.. కొన్ని కుటుంబాల వారి మధ్య అక్రమ సంబంధాలు నడుస్తున్నాయంటూ విసిరిన కాగి తాలు స్థానిక ఎస్సీ పేటలో వెదజల్లడం కలకలం రేపింది. స్థానికులు అతడిని పట్టుకుని రామాలయంలో నిర్బం ధించారు. ఆ కుటుంబాల వారు తీవ్ర ఆవేదనకు గురై ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి కుదుటపడింది. రావులపాలెం (కొత్తపేట) : ఎస్సీ పేటకు చెందిన పమ్మి శ్రీను తదితర నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులకు అక్రమ సంబంధాలు నడుస్తున్నాయంటూ సుమారు ఆరు నెలలుగా అసభ్యకరంగా రాసిన లేఖలు పోస్టు ద్వారాను, రాత్రి ఇళ్ల వద్ద పడేస్తూ ఆ కుటుంబాలను గుర్తుతెలియని వ్యక్తులు మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికులు నిఘా పెట్టారు. గురువారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన వృద్ధుడు చిలుకూరి శ్రీరామమూర్తి మోటరు సైకిల్పై వచ్చి అసభ్యకరంగా రాసిన లేఖలను వెదజల్లుతుండగా పమ్మి శ్రీను తదితరులు పట్టుకున్నారు. దీంతో అతడిని రామాలయం వద్ద నిర్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ బి.పెద్దిరాజు, ఎస్సై సీహెచ్ విద్యాసాగర్ అక్కడికి చేరుకుని వృద్ధుడిని అప్పగించమని కోరారు. వృద్ధుడిని తీసుకువెళఙతే ఆత్మహత్య చేసుకుంటామని పలువురు ఒంటి కిరోసిన్ పోసుకుపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సర్పంచ్ నెక్కంటి వెంకన్న, పెచ్చెట్టి చిన్నారావు, గ్రామపెద్దలు, దళిత నాయకులతో సీఐ పెద్దిరాజు చర్చించారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతి, పొడగట్లపల్లికి చెందిన మరో వ్యక్తితో లేఖలు రాయించినట్టు వృద్ధుడు చెప్పాడు. కేసు నమోదు చేసి అందరినీ అరెస్టు చేస్తామని, బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేస్తామని సీఐ నచ్చజేప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. దీంతో వృద్ధుడిని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ వివాదం తెల్లవారు జామున మూడు గంటల నుంచి సాయంత్రం వరకూ కొనసాగింది -
'అత్తింటి వాళ్లే కలసి చంపేశారు'
-
మళ్లీ కలవాలంటే పెళ్లి చేసుకోవలసిందే!
లీగల్ కౌన్సెలింగ్ మా పెళ్లయి ఆరేళ్లైంది. మా ఆవిడకు నాపై చాలా అనుమానం. నా సంపాదనంతా మా అమ్మానాన్నలకు ఇస్తున్నానని, తన అవసరాలు పట్టించుకోనని అపోహలు. తనను నమ్మించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. నా జీతం స్లిప్స్ చూపించాను. మా అమ్మానాన్నల ఆస్తిపాస్తుల వివరాలు తెలియజేసి, వారికి నా డబ్బుతో అవసరం లేదని స్పష్టపరిచాను. అయినా తను కన్విన్స్ అవలేదు. చివరకు నా ఏటీఎం కార్డు కూడా తనకే ఇచ్చాను. ఇంకా ఆమె ప్రవర్తన మారలేదు. ఈసారి నాపై కొత్త ఆరోపణలు మొదలెట్టింది. నా కొలీగ్స్తో అక్రమ సంబంధాలు అంటగట్టి, నన్ను సతాయించడం ప్రారంభించింది. ఈ విషయం మా అత్తామామలకి చెప్పాను. మొదటినుంచి ఆమె స్వభావం అదేనని, కొంతకాలం ఓర్చుకోమనీ చెప్పారు. కనీసం నా ముఖం చూపించకుండా ఉంటే అయినా, తను మారుతుందేమో, నా ఉనికికి దూరమైతే రియలైజ్ అవుతుందేమోనని జుడీషియల్ సపరేషన్ కేస్ వేశాను. నాకు ఫేవర్గా ఆర్డర్ వచ్చింది. తనకు ఏ లోటూ లేకుండా స్వంత ఇంట్లోపూ ఉండే ఏర్పాటు చే సి, నేను అద్దె ఇంటికి మారాను. ఇది జరిగి రెండేళ్లు అయింది. అయినా మా ఆవిడ లో ఏమార్పూ రాలేదు. నా భవిష్యత్ మాటేమిటి? మాకు పిల్లలు కూడా లేరు. నన్నేం చేయమంటారు? - ఎం. సాంబశివరావు, తెనాలి కోర్టుద్వారా జ్యుడీషియల్ సపరేషన్ ఆర్డర్ పొందిన రెండేళ్ల వరకు కూడా మీ పరిస్థితులు చక్కబడనప్పుడు, ఆ కారణ ంగా మీరు విడాకులు మంజూరు చేయమని కోర్టును ఆశ్రయించవచ్చు. భార్యాభర్తలు పునరాలోచించుకోవడానికి కోర్టు ఇచ్చే అవకాశమే జ్యుడీషియల్ సపరేషన్. ఆ టైమ్లో ఒకరి లోటుపాట్లను ఒకరు ఆలోచించుకొని, సమస్యను పరిష్కరించుకుని, కాపురం చక్కదిద్దుకునే సమయం దొరుకుతుంది. తీరిగ్గా, ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మీ భార్య విషయం చూస్తే ఆమెలో ఏ మార్పూ లేదని తెలుస్తోంది. మరోసారి ఆమెతో మాట్లాడి చూడండి. ఆమె ససేమిరా అంటే మీకు విడాకులే మార్గం. మా పెళ్లయి రెండు సంవత్సరాలు. నా భర్త చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. నేను ఒక ఏడాదిపాటు చెన్నైలో అతనితో కలిసి ఉన్నాను. సంవత్సరం తర్వాత కుటుంబ పోషణకు తన ఆదాయం సరిపోవడం లేదని అప్పులున్నాయని నన్ను తన తల్లిదండ్రుల దగ్గర ఉండమని అడిగారు. మా అత్తామామలది మారుమూల పల్లెటూరు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. నా అవసరం వారికి లేదు. నేను మొదటినుండి సిటీలోనే ఉన్నాను. పైగా ఇటీవలే మా నాన్న చనిపోయారు. అమ్మ ఒంటరిదైంది. నేనే ఏకైక సంతానాన్ని. అందువల్ల అమ్మ దగ్గర ఉంటాను, లేదంటే చెన్నైలో ఏదైనా ఉద్యోగం చూసుకుని అతని ఆర్థికభారాన్ని తగ్గిస్తానన్నాను. అతను దేనికీ ఒప్పుకోలేదు. నన్ను బలవంతంగా మా అత్తగారింట్లో దింపి వెళ్లారు. నేను కొన్ని రోజులుండి, అత్తమామలకు చెప్పి అమ్మదగ్గరికి వచ్చాను. అతను ఇంతవరకు నన్ను చూడటానికి రాకపోగా, తరచు ఫోన్ చేసి, నాపై రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేస్తానని నన్ను తక్షణం అత్తగాంటికి వెళ్లమని వేధిస్తున్నాడు. నాకు భయంగా ఉంది. అసలు ఈ విషయమై చట్టం ఏమి చెబుతుందో వివరించగలరు. - సుమలత, ఆదోని మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తుంటే మీవారికి మీతో కాపురం చేసే ఉద్దేశ్యం లేదనిపిస్తోంది. దశలవారీగా మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నట్లున్నారు. అయితే, ఆయనకు తెలియని విషయమేమిటంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మీ వారికి వర్తించదు. భర్త లేకుండా అత్తగారింట్లో ఉండమని ఏ కోర్టూ ఆర్డర్ ఇవ్వదు. ఆ సెక్షన్ ఉద్దేశ్యం వేరు. సమేతుకమైన కారణం లేకుండా భర్త భార్యను విడిచి దూరంగా ఉన్నా, భార్య భర్తను విడిచి దూరంగా ఉన్నా ఈ కేసు వేసుకోవచ్చు. దీనినే కాపురం హక్కుల పునరుద్ధరణ కేసు అంటారు. మీ విషయంలో మీరు భర్తను వదిలి రాలేదు. ఆయనే మిమ్మల్ని వెళ్లమన్నారు. ఒకవేళ అతను కేసు వేస్తే మీరు లక్షణంగా అతని వద్దకు వెళ్లండి మీరు కూడా అదే కోరుకుంటున్నారు కదా! భర్త లేకుండా అత్తమామల దగ్గర దగ్గర ఉండమని ఎవరూ చెప్పరు. మా వివాహమైన సంవత్సరం తర్వాత మావారు తన కొలీగ్తో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను వేధించారు. తీవ్రమనస్థాపానికి లోనైన నేను విడాకులకు అప్లై చేశాను. కోర్టు నాకు విడాకులు మంజూరు చేసింది. ఇది జరిగి నాలుగేళ్లయింది. నేను తర్వాత వివాహ ప్రయత్నం చేయలేదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. నా మాజీ భర్త తన కొలీగ్తోనే సహజీవనం సాగిస్తున్నాడని, వారికి ఒక పాప కూడా ఉందని తెలిసింది. మొన్నీమధ్య అతను నన్ను కలిశాడు. తన కొలీగ్ ప్రవర్తన బాగోలేదని, ఆమెను వదిలేశానని, ఇక ఆమెతో తనకు ఏ సంబంధం లేదని, మరల నాతో కలిసి ఉంటానని ప్రాధేయపడుతున్నారు. నాకూ ఒక తోడు కావాలని ఉంది. మేం ఒకప్పుడు భార్యాభర్తల మే కదా! తన కొలీగ్ మెడలో అతను తాళి కట్టలేదు కదా! ఏం చేయమంటారు? సలహా ఇవ్వగలరు. - మేరీ, కర్నూలు అడల్టరీ గ్రౌండ్స్ మీద మీకు విడాకులు వచ్చాయి. అంతటితో ఆ బంధం చట్టబద్ధంగా రద్దయిపోయింది. తర్వాత మీ భర్త ఆ స్త్రీతో సహజీవనం చేశారు. సంతానం పొందారు. ఇప్పుడు ఆమె ప్రవర్తనను శంకించి మళ్లీ మీకు ఎర వేస్తున్నారు. మీతో మరల సంబంధం ఎలా కొనసాగిస్తారు? అలా అయితే ఈసారి మీ ఇద్దరిపై క్రిమినల్ కేసు వేసే అవకాశం మీ మాజీ భర్త సహజీవన భాగస్వామికి వస్తుంది. మీరు పునర్వివాహం చేసుకోలేదని, డబ్బు కూడబెట్టి ఉంటారని ఐడియా కావచ్చు. మీతో కొన్నాళ్లు పబ్బం గడుపుకొని మరలా మీ క్యారక్టర్ మంచిది కాదంటే ఏం చేస్తారు? చట్టబద్ధంగా విడిపోయిన భార్యాభర్తలు మరలా కలవాలంటే వివాహం చేసుకోవలసిందే. లేదంటే న్యాయపరమైన చిక్కులు రావచ్చు. -
ఇచ్చిన మాట
మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 33 తన భార్య బార్బరాకి కేన్సర్ అని తెలిసాక కూడా నెల్సన్ లియాన్తో అక్రమ సంబంధం కొనసాగించాడు. బార్బరా ఓ రోజు కోరింది. ‘‘నేను ఇంక జీవించేది మూడు నాలుగు నెలలే. దయచేసి రాత్రిళ్లు లేట్గా రాకండి.’’ ‘‘కానీ ఆఫీస్లో ఓ గంట ఎక్కువ పనిచేస్తే కాని ప్రమోషన్ రాదు. ఆఫీస్ నించి ప్రతీరోజు లేట్గా బయటికి వచ్చేది నేనే’’ చెప్పాడు. బార్బరాకి తన వివాహేతర సంబంధం గురించి ఎలాంటి అనుమానం కలిగేలా తను ప్రవర్తించడం లేదని నెల్సన్ విశ్వసించాడు. బార్బరా సంగతి అతనికి బాగా తెలుసు. పగ. పట్టుదల కల మనిషి. నిజం తెలిస్తే నానా యాగీ చేస్తుంది. అతనికి ఆమెతో ఆమె జీవితంలోని ఆఖరి వారాలు గడపాలనే ఉంది. కానీ లియాన్ మీద కలిగిన వ్యామోహం అతన్ని ఆమెకి దూరంగా ఉంచలేక పోతోంది. పైగా బార్బరా జుట్టు పూర్తిగా రాలిపోయి, మొహం, కళ్లు లోతుకి పోయి అందవికారంగా తయారైంది. ఐతే లియాన్కి మాత్రం తన భార్య కేన్సర్ గురించి చెప్పలేదు. చెప్తే ఆమె పోయేదాకా తన దగ్గరికి రానివ్వదనే భయం అతనిలో ఉంది. ‘‘ఈ శని ఆదివారాలు నేను ఆఫీస్ పనిమీద బయటికి వెళ్తున్నాను’’ నెల్సన్ శుక్రవారం ఆఫీస్ నించి ఫోన్ చేసి తన భార్యకి చెప్పాడు. ‘‘అదేమిటి? శనాదివారాలు ఆఫీస్ పనా?’’ బార్బరా ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ‘‘అవును. శని ఆదివారాలు సాధారణంగా ఆడిటర్స్ రారు కాబట్టి రీజెన్సీ హోటల్ మేనేజర్ కేష్ని స్వల్పకాల అప్పుకి తిప్పుతున్నాడని మా ఆడిట్ ఫర్మ్కి సమాచారం అందింది. న్యూయార్క్లోని ఆ హోటల్, ఇతర అలాంటి సంస్థలకి మా టీం తనిఖీకి వెళ్తోంది.’’ ‘‘ఇది శని ఆదివారాలే చేయాల్సిన పనన్నమాట.’’ ‘‘అవును. మొత్తం ముగ్గురం వెళ్తున్నాం.’’ ‘‘మిగిలిన వారి భార్యల సంగతి నాకు తెలియదు కానీ, నేను వెళ్లిపోయే లోగా మీరు నాతో గడిపే రోజులు లెక్కపెడుతున్నాను’’ బార్బరా బాధగా చెప్పింది. క్షణకాలం తర్వాత ఆడిట్ రద్దయిందని చెప్దామా అనిపించింది. కానీ కాలం గడిచి ‘ఆ తర్వాత’ వచ్చాక చెప్పబుద్ధి కాలేదు. లియాన్ ఈ వీకెండ్ గురించి అనేక కలలు కంటోంది. ఆమెని నిరాశపరచడం అతనికి ఇష్టం లేకపోయింది. ఆ శని ఆదివారాలు బఫెలో లోని ఓ మోటెల్లో వారిద్దరూ బస చేసారు. నేచర్ పార్క్లో లంచ్ చేసారు. నయాగరా జలపాతం మీద హాట్ ఎయిర్ బెలూన్లో, ఆ తర్వాత హెలికాఫ్టర్లో ఎగిరారు. రాత్రి ఓ ఖరీదైన రెస్ట్రెంట్లో వైన్ తాగి భోజనం చేసారు. హనీమూన్కి వచ్చిన దంపతులు ఎలా గడుపుతారో ఆ రెండు రోజులూ అలా గడిపారు. బార్బరా మరణిస్తే తనకి ఇన్సూరెన్స్ కంపెనీ నించి ఐదు లక్షల డాలర్లు వస్తాయనే ధీమాతో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసాడు. తిరిగి వచ్చాక బార్బరా ఇంట్లో లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిందని తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఆమె ఇంకాస్త నీరసంగా కనిపించింది. ‘‘ఇంకొక వారం మించకపోవచ్చు. ఇక్కడ ఉంచుతారా లేక ఇంటికి తీసుకువెళ్తారా అన్నది మీ ఇష్టం. ఇక్కడ ఉంటే, బాధ తెలియకుండా సమయానికి మందులు ఇవ్వగలం. ఇంటికి తీసుకెళ్తే బాధ భరించాల్సి ఉంటుంది’’ డాక్టర్ సూచించాడు. ఆ వారం రోజులు పాతిక వేల డాలర్ల పైనే ఖర్చు చేయడానికి అతని దగ్గర డబ్బు లేదు. లియాన్ మోజులో పడి అంతకి రెట్టింపు ఖర్చు చేసేసాడు. అప్పు కోసం ప్రయత్నించకుండా భార్యని ఇంటికి తీసుకెళ్లాడు. మరణానికి ముందు రోజు రాత్రి బార్బరా తన భర్తతో చెప్పింది. ‘‘నాదో కోరిక.’’ ‘‘ఏమిటది?’’ ‘‘మాట తప్పనని ప్రామిస్ చేస్తే చెప్తాను.’’ అతను ఒట్టు పెట్టాక చెప్పింది. ‘‘దయచేసి ఎన్నటికీ మన బేంక్లోని సేఫ్ డిపాజిట్ బాక్స్ తెరవకండి. ఎన్నటికీ. ఎందుకని కూడా అడక్కండి. ఇదే నేను కోరేది.’’ అతను మాట ఇచ్చాడు. మర్నాడు తెల్లవారుఝామున అతని చేతికి చల్లటి భార్య శరీరం తగలడంతో మెలకువ వచ్చింది. తెరవాలి. తెరవకూడదు. తను ఆ బాక్స్ని తెరవాలి. వద్దు. ఎట్టి పరిస్థితిలో తెరవద్దని బార్బరా ఆఖరి కోరిక కాబట్టి తెరవకపోతే బేంక్ వాళ్లు టైం దాటాక పగలకొట్టి అందులోవి వేలం వేస్తారు. కానీ అంతకుముందుగా ఓసారి తెరిచి చూస్తే? కానీ అది మాట తప్పినట్లుగా అవుతుంది. బార్బరాకి ఇచ్చిన ఆఖరి వాగ్దానాన్ని మన్నించాలని ఉంది. అతనికి దాన్ని తెరిచి చూడాలనే ఆసక్తీ ఉంది. అందులోని నల్ల పెట్టెలో ఏముందో తెలుసుకుంటే? ఆమె భూమికి ఆరడుగుల లోతున ఉంది. తను చూడకూడని సమాచారం బార్బరాకి ఏముంది? చివరికి దాన్ని తెరవాలనే నిశ్చయించుకున్నాడు. బేంక్కి తాళం చెవితో వెళ్లి సేఫ్ డిపాజిట్ బాక్స్ని తెరిచాడు. తన భార్య చేతి రాతలో ఓ కాగితం కనిపించింది. ‘‘మీరు మోసం చేస్తున్నారు. ఇందులోని నల్ల పెట్టెని మాత్రం తెరవకండి.’ స్మశానంలోంచి తన భార్య తనని సాధిస్తోందని అతనికి అనిపించింది. పెట్టె తెరిస్తే అందులోనిది విలువైనదయితే తను అమ్మచ్చేమో! కానీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము తనకి చాలదా? డబ్బు కోసం కాదు. వద్దన్న పని చేయాలని కూడా కాదు. ఆసక్తి. దాన్ని చంపుకోలేక ఆ నల్ల పెట్టెని అందుకుని తెరిచాడు. మూత గట్టిగా ఉండడంతో బలంగా తెరవాల్సి వచ్చింది. వెంటనే లోపల్నించి తెల్లటి పొడి అతని ఒంటి మీద పడింది. ఆశ్చర్చపోయాడు. బార్బరాకి డ్రగ్స్ అలవాటా? కొద్దిగా తీసుకుని వాసన చూసాడు. బార్బరా చేతి రాతతో ఆ పెట్టెలో మరో కాగితం కనిపించింది. డియరెస్ట్ డియరెస్ట్ నెల్సన్, లియాన్తో తిరిగి నువ్వు నా గుండెని బద్దలు కొట్టావు. ఇప్పుడు నా నమ్మకాన్ని కూడా వమ్ము చేసావు. ఇక నువ్వు జీవించవు.’ కాదు. ఇది కొకైన్ కాదు. బార్బరా తనని ఇంత పట్టుదలగా, ఇంత పగగా చంప... చంపగలుగు... (తారా అన్టైడ్ కథకి స్వేచ్ఛావాదం) -
అక్రమ సంబంధాలపై...సినిమా చేస్తా!
‘‘వైవాహిక జీవితం అనేది నమ్మకంతో ముడిపడింది. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉంటే ఆ బంధం బ్రహ్మాండంగా సాగుతుంది. ఆ సంగతలా ఉంచితే, జీవిత భాగస్వామిని మోసం చేస్తూ, కొంతమంది బతుకుతారు. అది తప్పు. భార్యను ఇంటికి పరిమితం చేసి, బయట ఇంకో అమ్మాయితో తిరుగుతారు. అలా బతకడం ఎందుకు? భార్యకు విడాకులిచ్చి, నిక్షేపంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా? అలాగే, భర్తను మోసం చేసే భార్యలూ లేకపోలేదు. కానీ, సమాజానికి భయపడి దొంగచాటు వ్యవహారాలు సాగించేస్తారు. నాకెప్పటికైనా అక్రమ సంబంధాల మీద సినిమా తీయాలని ఉంది. ప్రేమించడం తప్పు కాదు. కానీ, పెళ్లయిన తర్వాత జీవిత భాగస్వామిని ప్రేమించాలి. ఒకవేళ పెళ్లి కాకపోతే, వేరేవాళ్ల భర్తతో మాత్రం ప్రేమలో పడకూడదు. వేరేవాళ్ల భర్తలు, భార్యలు మనకెందుకు? అది తప్పు కదా!’’ - విద్యాబాలన్ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
హత్య కేసులో నిందితుడి అరెస్ట్ గుమ్మఘట్ట : వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎంతచెప్పినా విననందుకు కర్రతో బాది మట్టుపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం కళ్యాణదుర్గం డీఎస్పీ అనీల్పులిపాటి విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మఘట్టకు చెందిన కురుబ తిప్పేస్వామి(22) అనే యువకుడు గత నెల 29న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 5న గ్రామ సమీపాన చెరువులో మృతదేహం బయటపడింది. ఈ హత్యకు గల కారణాలను రాయదుర్గం సీఐ భాస్కర్రెడ్డి, గుమ్మఘట్ట ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం చాకచక్యంగా ఛేదించింది. గ్రామానికి చెందిన కురుబ రామాంజినేయులు హత్య చేశాడని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు దర్యాప్తులో నిందితుడు రామాంజినేయులు వివరాలు బయట పెట్టాడు. రామాంజనేయులు సొంత తమ్ముడి భార్యతో మృతుడు వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఏడాదిగా ఈ తంతు సాగుతూ వచ్చింది. ఇటీవల మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మాట వినలేదు. గత నెల 29న తన మరదలితో ఫోన్లో సంభాషిస్తున్న విషయాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. ఆ రాత్రికి వేరుశెనగ పొలానికి నీరు పెట్టేందుకు తిప్పేస్వామి ఒంటరిగా వెళ్లాడు. కాపుకాచి రాత్రి పది గంటలకు కర్రతో నెత్తిన చితకబాది చంపేశాడు. అనుమానం రాకుండా మృతుడి శవాన్ని సమీపాన ఉన్న చెరువు నీటిలో పడేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా తానే నిందితుడినని తేలడంతో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు కురుబ రామాంజినేయులును ఈ నెల 15న అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో స్టేషన్హౌస్ ఆఫీసర్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఉతికిన ఆ తెల్లచొక్కా...
బెస్ట్ కేస్ విజయవాడలో ఏఎస్పీగా చేరిన కొత్తలో నాకు అంతా కొత్తగానే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో వాతావరణం! మనుషులు అలవాటు పడటానికి సమయం పడుతుంది కదా! విజయవాడలోని నందిగామ గ్రామంలో 1975లో జరిగిన ఆ సంఘటన... నెల కూడా గుర్తుంది... సెప్టెంబర్. ఒకరోజు సాయంత్రం ఆరుగంటలకు ఓ ఇద్దరు కుర్రాళ్లు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అందులో ఒకతను ‘మా అమ్మను ఎవరో చంపేశారు’ అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే గుడిసెలో 45 ఏళ్ల మహిళ మృతదేహం రక్తపుమడుగులో పడివుంది. భర్త లేడు. ఒక్కడే కొడుకు. అతనికి పెళ్లయింది. ఎవరో ఆ మహిళని చెంబుతో తలమీద మోది చంపేశారు. వెంటనే జాగిలాలను రప్పించాను. అవి గుడిసెలో నుంచి బయటకి వచ్చి ఊళ్లోకి వెళ్లాయి. అక్కడ కొంతదూరం వెళ్లాక ఆగిపోయాయి. ఆ పరిసరాల్లోనే మృతురాలి కొడుకు స్నేహితుడి ఇల్లు ఉన్నట్టు అక్కడివారు చెప్పారు. జోస్యం కోసం... ‘‘నేను, నా భార్య, నా స్నేహితుడు, అతని భార్య... అందరం కలిసి సినిమాకి వెళ్లాం సార్. తిరిగొచ్చిచూస్తే అమ్మ ఇలా శవమై కనిపించింది’’ అంటూ బోరుమన్న పాతికేళ్ల కొడుకుని ఓదార్చి విచారణ మొదలుపెట్టాం. ముందుగా మృతురాలి వివరాలు సేకరించాం. ఆమె మంత్రతంత్రాలు తెలిసిన మహిళ. ఆ గ్రామం వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా ఆమె దగ్గరికి వచ్చేవారు. కడుపులో నొప్పి నుంచి మొదలుపెట్టి, తప్పిపోయిన పశువుల ఆచూకీ వరకు అన్నింటికీ ఆమెను సంప్రదించేవారు. ఆమె మంత్రమో, అంజనమో వేసి వాళ్లకు పరిష్కారాలు సూచిస్తుందన్నమాట. పల్లెటూళ్లలో ఇలాంటివారుండటం సహజమే కదా! రోజూ ఆమెను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఆమెకు ఎవరితోనైనా తగాదాలున్నాయోమోనని ఆరా తీస్తే అలాంటివేమీ లేవని తేలింది. గుడిసెలో అణువణువూ గాలించడం మొదలుపెట్టాం. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆమెపై దాడికి ఉపయోగించిన చెంబుపై వేలిముద్రలు కూడా దొరకలేదు. హంతకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కనిపించడం లేదని చెప్పాడు కొడుకు. ముఖ్యంగా తల్లి మెడలోని బంగారు గొలుసు! ఆ పెట్టె లోపల... గుడిసెలో ఒక మూలన చాలా పాత ఇనప్పెట్టె ఒకటి కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. తాళం గురించి అడిగితే మృతురాలి కొడుకు ‘ఏమో తెలియ’దంటూ అమాయకంగా మొహం పెట్టాడు. ఎందుకో అతని సమాధానం కరెక్టు కాదని అనిపించింది నాకు. లాభం లేదని పెట్టెని పగలగొట్టాం. అందులో ఏమీ లేదు. ఒక తెల్లని చొక్కాగుడ్డ ఉంది. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. విప్పి చూస్తే అక్కడక్కడా చిన్న చిన్న రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏంటి’వని అడిగితే ఆమె కొడుకు నాకు తెలియదంటాడు. అతని స్నేహితుణ్ణి పిలిచి అడిగినా అదే సమాధానం చెప్పాడు. హంతకుడు మాకోసం వదిలిన క్లూ మాత్రం అదేనని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దానిపైనే దృష్టి పెట్టాను. ఒక టీమ్ని ఆ ప్రాంతంలోని బట్టల షాపుల వివరాలు కనుక్కురమ్మని పంపాను. ఆ ఫొటో వెనక... ఆ ప్రాంతంలో మొత్తం మూడే మూడు బట్టల షాపులున్నాయి. వాళ్లకి ఈ క్లాత్ని చూపించాం. దాన్ని అమ్మిన షాపు దొరికింది. వారికి మృతురాలి కొడుకు ఫొటో చూపించగానే ‘ఇతనే సార్, నెలరోజుల కిందట వచ్చి పెళ్లి కోసమని నాలుగైదు షర్టు పీసులు కొనుక్కెళ్లాడు’ అని చెప్పారు. నా అనుమానం బలపడింది. తిరిగి గుడిసె దగ్గరికి వెళ్లి మరింత పరిశీలనగా చూస్తే దండెంపై ఆరేసి ఉన్న తెల్లచొక్కాకి అక్కడక్కడా ఆరెంజ్ రంగు మరకలున్నట్టు కనిపించింది. దాన్ని వెంటనే ఫొరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే చొక్కాపై రక్తపు మరకలు పడ్డట్టూ, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించినట్టూ చెప్పారు. విచారణలో భాగంగా మా జాగిలాలు వెళ్లిన అతని స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లి అంతా సోదా చేస్తే ఆ ఇంట్లో గోడకు తగిలించిన దేవుడి పటం వెనక మృతురాలి గొలుసు దొరికింది. ఇక దొరికిన సాక్ష్యాలు చాలని చెప్పి... మృతురాలి కొడుకుని స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తే విషయం బయటపడింది. కన్నతల్లిని తానే స్వయంగా హత్య చేసిన వైనం చెప్పుకొచ్చాడు. అక్రమ సంబంధం... ఎప్పుడూ వెంట తిరిగే తన స్నేహితుడికీ, తల్లికీ అక్రమ సంబంధం ఉన్నట్టు అప్పటికి నెలరోజుల క్రితం బయటపడింది. తన పెళ్లయితే తల్లి ప్రవర్తన మారుతుంది కదా అని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎలాంటి మార్పూ రాలేదు. స్నేహితుణ్ణి మందలించి అతణ్ణి కూడా పెళ్లిచేసుకోమని చెప్పి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఒకరోజు తల్లి ఇతని స్నేహితుడితో గొడవకు దిగింది. ‘నాతో నీకు సంబంధం ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు తెలియదా నాకున్న మంత్రశక్తుల గురించి. నిన్నూ, నీ భార్యనూ బూడిద చేసేస్తాను...’ అంటూ తల్లి... స్నేహితుడిపై విరుచుకు పడుతుండగా కొడుకు ఎదురుపడి తల్లిని నిలదీశాడు. దాంతో కొడుకుని కూడా అదేవిధంగా బెదిరించడం మొదలుపెట్టింది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు, అతని స్నేహితుడు ఒకరోజు సాయంత్రం ఆమెను హతమార్చారు. ఇదీ విషయం. చనిపోయిన వ్యక్తి మంత్రగత్తె కావడంవల్లనేమో తెల్లవారే సరికి గ్రామస్తులంతా ఆమె గుడిసెముందు, మా పోలీస్టేషన్ ముందు ఉండేవారు. ‘సార్, హంతకుడు దొరికాడా... దొరికాడా...’ అంటూ అడుగుతుండేవారు. అలాగని విచారణకు ఏమైనా సాయం చేస్తారా అంటే ఏమడిగినా తెలియదని చెప్పేవారు. తక్కువ సమయంలో... నాకేమో అక్కడి వాతావరణం కొత్త. పల్లె ప్రజల పద్ధతులు, నమ్మకాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇలాంటి కేసుని నాలుగురోజుల్లో విజయవంతంగా చేధించినందుకు మా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్ -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
చిట్యాల (గోపాలపురం), : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేసిన భర్త అనంతరం పోలీసులకు లొంగిపోయూడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన కలిదిండి పాటియ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. పాటియ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన పాటియ్య స్నేహితుడు, ఆటో డ్రై వర్ ఈడుగుబంటి శ్రీను(31) మూ డేళ్లుగా జ్యోతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం అనుమానం వచ్చిన పాటియ్య భార్యను కొట్టి పుట్టింటికి పంపేశాడు. అయితే 20 రోజుల క్రితం చిట్యాలలో ఉన్న భార్య దగ్గరకు వచ్చిన పాటియ్య అక్కడే ఉంటున్నాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా బయటకు వచ్చిన జ్యోతి ప్రియుడు శ్రీనుతో కలిసి ఆటోలో ఊరి బయటకు వెళ్లడాన్ని పాటియ్య గమనించాడు. ఊరి బయట భార్య, శ్రీను కలిసి ఉండటాన్ని చూసిన అతను తనతో తీసుకువచ్చిన ఇనుప రాడ్తో శ్రీను తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. జ్యోతి పారిపోవడంతో కొనఊపిరితో ఉన్న శ్రీనును ఆటోలో వేసుకుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకు వచ్చాడు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే శ్రీను మతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పాటియ్య పక్కనే ఉన్న పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు పాటియ్యకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇదిలావుండగా పథకం ప్రకారం తన భర్తను హత్యచేసినట్లు మృతుని భార్య ఆరోపిస్తోంది. జ్యోతి, ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చే స్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రాఘవ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.