Mohammed bin Salman
-
సౌదీ యువరాజుపై హత్యాయత్నం అంటూ కథనాలు
రియాద్: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్పై హత్యాయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలు అరబ్ మీడియా సంస్థలు సైతం ప్రచురించాయన్నది సదరు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మరోవైపు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.. ఆయన పేరు ఎక్స్ ఖాతాలోట్రెండింగ్లో కొనసాగుతోంది.కారు బాంబు ఉపయోగించి మహ్మద్ బిన్ సల్మాన్పై హత్యాయత్యానికి ప్రయత్నించగా ఆయన సురక్షితంగా బయటపడ్డారన్నది ఆ వైరల్ కథనాల సారాంశం. ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ కథనాలకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
సౌదీలో తొలి మద్యం దుకాణం
రియాద్: మద్యపాన నిషేధాన్ని పాటించే సౌదీ అరేబియాలో మొట్టమొదటి సారిగా ఆల్కాహాల్ విక్రయ కేంద్రం తెరుచుకోనుంది. ముస్లిమేతర దౌత్యవేత్తల వినియోగం కోసం ఈ మద్యం స్టోర్ను తెరవనున్నారు. సంబంధిత మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకున్న మద్యం ప్రియులు మాత్రమే అక్కడ మద్యం కొనుగోలుచేసేందుకు అర్హులు. సౌదీ అరేబియా విదేశాంగ శాఖ దీనిని అనుమతులు ఇస్తుంది. నెలవారీ కోటా పరిమితి ప్రకారమే వినియోగదారులకు మద్యాన్ని విక్రయిస్తారు. పర్యాటకం, వాణిజ్యం ఊపందుకునేందుకు వీలుగా రియాద్ నగరంలో మద్యం అమ్మకాలు పెరగాలన్న సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకే ఈ స్టోర్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. రియాద్లో వివిధ దేశాల ఎంబసీలు, రాయబార కార్యాలయాలకు నిలయమైన ప్రాంతంలో ఈ స్టోర్ను మరి కొద్ది వారాల్లో ప్రారంభించనున్నారు. -
వ్యూహాత్మక స్నేహబంధం
కొన్నిసార్లు అంతే... కీలక పరిణామాలన్నీ కొద్ది వ్యవధిలో జరిగిపోతుంటాయి. ఢిల్లీలో జీ20 సదస్సు ముగియగానే మరో ముఖ్యపరిణామం సంభవించింది. సోమవారం భారత ప్రధాని మోదీ, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ల సహ అధ్యక్షతన భారత – సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) తొలి శిఖరాగ్రస్థాయి సమావేశం జరిగింది. విస్తృత చర్చల అనంతరం రెండు దేశాలూ తమ వాణిజ్య, రక్షణ బంధాలను విస్తరించుకోవాలని నిర్ణయించాయి. భారత్లో ఒక రోజు పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజుతో జరిగిన ఈ కీలక నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావం చూపగలిగేది. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండు పెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య పెరుగుతున్న సహకారం మధ్యప్రాచ్య – హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు కీలకం. అందుకే, ఈ సమావేశం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జీ20లో కీలక ‘ఇండియా– మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవా’ (ఐఎంఈసీ) ప్రకటించిన వెనువెంటనే... ఆ నడవాలో భాగమయ్యే సౌదీతో భారత బంధాల విస్తరణ శుభపరిణామం. రెండు దేశాల మధ్య ఎస్పీసీ 2019 అక్టోబర్లో భారత ప్రధాని, రియాద్ పర్యటనలోనే ఏర్పాటైంది. బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత సౌదీ అలాంటి భాగస్వామ్యం కుదుర్చుకున్న నాలుగో దేశం ఇండియానే! సరిగ్గా ఏడాది క్రితం 2022 సెప్టెంబర్లో మన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సౌదీ వెళ్ళి, ఎస్పీసీ మంత్రిత్వ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. అప్పట్లోనే సౌదీలో మన రూపే కార్డ్ వినియోగం సహా అనేక అంశాలు ప్రధాన సహకార అంశాలుగా చర్చకు వచ్చాయి. సోమవారం రెండు దేశాల నేతల మధ్య చర్చలు అందుకు కొనసాగింపు. నిజానికి, కొన్నేళ్ళుగా భారత, సౌదీల బంధం బలపడుతోంది. విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలున్న రెండు దేశాలూ వాణిజ్యం నుంచి సాంస్కృతికం దాకా బాంధవ్యాలు పెట్టుకుంటున్నాయి. ద్వైపాక్షిక బంధాలు పటిష్ఠం కావాలంటే సాంస్కృతిక సంబంధాలు కీలకం. అందు లోనూ రెండు దేశాలూ అడుగులు వేశాయి. సౌదీలో పవిత్ర మక్కా నగరానికి మనదేశం నుంచే ఏటా వేల మంది హజ్ యాత్ర సాగిస్తుంటారు. భారత్ నుంచి ఏటా 1.75 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులకు అవకాశం కల్పిస్తూ, ఈ ఏడాది మొదట్లోనే సౌదీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక దేశం నుంచి చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఇంత భారీ సంఖ్యలో యాత్రికుల్ని అనుమతిస్తామంటూ సౌదీ కోటా ఇవ్వడం విశేషం. అలాగే, ఆ రాజ్యంలో అత్యధిక ప్రవాసుల సంఖ్య కూడా మనదే! 22 లక్షల మందికి పైగా భారతీయ ప్రవాసులు సౌదీలో ఉన్నారు. ఇవన్నీ భారత్, సౌదీలను మరింత సన్నిహితం చేస్తున్నాయి. ప్రవాసులంతా తమ దేశంలో భాగమేననీ, వారిని సొంత పౌరులలా కడుపులో పెట్టుకుంటామనీ సౌదీ యువరాజు తాజా పర్యటనలోనూ స్పష్టం చేయడం విశేషం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన రెండు దేశాలూ ప్రధానమైనవి. భారత్కు నాలుగో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీయే! ఇక, సౌదీకి రెండో అతి పెద్ద వాణిజ్య భాగస్వామి భారత్ అని 2022 లెక్క. మన ముడిచమురు దిగుమతుల్లో 18 శాతం పైగా అందిస్తున్నది ఈ అరబ్బు రాజ్యమే. కలసి ప్రగతి బాటలో సాగాలనే లక్ష్యంతో ఇరు దేశాలూ డిజిటల్ పేమెంట్స్, రక్షణ ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం లాంటి రంగాల్లోనూ వాణిజ్య అవకాశాలను అన్వేషిస్తూ వచ్చాయి. సౌదీ యువరాజు, భారత ప్రధాని సహా ఉన్నతస్థాయి వ్యక్తులు కొద్దికాలంగా జరుపు తున్న పర్యటనలు ఈ బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. దానికి తగ్గట్టే ఇరుదేశాలూ తమకు ఉమ్మడి అంశాలైన తీవ్రవాదంపై పోరు, ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారంపై దృష్టి సారిస్తున్నాయి. సోమవారం నాటి చర్చల్లో మహారాష్ట్ర తీరంలో నిర్మించనున్న 5 వేల కోట్ల డాలర్ల విలువైన వెస్ట్ కోస్ట్ రిఫైనరీ ప్రాజెక్ట్ను వేగవంతంగా అమలు చేయాలని ఇరుదేశాలూ నిర్ణయించాయి. అందుకు ఓ సంయుక్త సత్వర కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించాయి. ఇంధనం, రక్షణ, సెమీకండక్టర్, అంతరిక్ష రంగాల్లో ముమ్మర సహకారానికి వీలున్నట్టు గుర్తించాయి. డిజిటలీకరణ, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో సహకారాన్ని పెంచుకొనేందుకు 8 ఒప్పందాలపై సంతకాలూ చేశాయి. వాస్తవానికి, భారత్, సౌదీల మధ్య సత్సంబంధాల విస్తరణ కేవలం రెండు దేశాలకే కాక, మధ్యప్రాచ్యం – హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటికీ కీలకం. ఈ ప్రాంతంలో సుస్థిరత, ఆర్థికాభివృద్ధి, భద్రతకు తోడ్పడుతుంది. అందుకే భారత్ సైతం ఒకపక్క వ్యూహాత్మకంగా ఇజ్రాయి ల్తో బంధాన్ని పదిలంగా చూసుకుంటూనే, ఇతర అరబ్ దేశాలతో మాటామంతీ సాగిస్తోంది. సౌదీతో మన వ్యూహాత్మక ప్రయోజనాలూ అనేకం. చైనాను మినహాయిస్తే, పాకిస్తాన్పై ఒత్తిడి చేయగల ఏకైక దేశం సౌదీనే. అందువల్లే, పాక్తో దానికున్న సంబంధాలకు అతీతంగా మన దేశమూ అరబ్బు రాజ్యంతో బలమైన బంధం పెట్టుకుంటోంది. ఇటీవలే ఇరాన్తో శత్రుత్వానికి స్వస్తి పలికిన సౌదీ జొహాన్స్బర్గ్ సదస్సులో ‘బ్రిక్స్’లో సైతం సభ్యత్వం తీసుకుంది. ఆ పరిణామాల తర్వాత ప్రిన్స్ పర్యటనగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఫిబ్రవరిలో భారత్ సందర్శించిన సౌదీ ప్రిన్స్ ఇప్పుడు మళ్ళీ రావడం, ఈసారి భారత– జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పైనా దృష్టి పెట్టడానికి ఇరుపక్షాలూ అంగీకరించడం గమనించదగ్గవి. మొత్తానికి, ఈ బంధం వేగంగా పరిణతి చెందుతోంది. తగ్గట్టే మధ్యప్రాచ్యంపై భారత విధానమూ వివిధ రూపాలు తీసుకుంటోంది. సరికొత్త వ్యూహాత్మక కూటమికి పురుడుపోస్తోంది. సౌదీతో స్నేహంలో తాజా భేటీ మరో ముందడుగు. -
G20 Summit: అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్–సౌద్తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం.. ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్లో పర్యటించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి. -
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
ఎడారిలో స్మార్ట్ సిటీ... ఊహకందని మాయం ప్రపంచం...
ఊహకందని మాయం ప్రపంచం వంటివి టీవీలోనూ లేదా కార్టూన్ ఛానల్స్లో చూస్తుంటాం. అందులో ఎగిరే కార్లు, ఆకాశంలోనే ఉండే ఎలివేటర్లు తదితర మాయలోకం కనిపిసిస్తుంది. ఐతే అదంతా గ్రాఫిక్స్ మాయాజాలమే తప్ప నిజజీవితంతో సాధ్యం కాదు. ఇది సాధ్యమే అంటూ చేసి చూపిస్తున్నారు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. వివరాల్లోకెళ్తే....సౌదీ అరేబియాలో పర్వత పర్యాటకాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఉద్దేశించిన ఒక ప్రాజెక్ట్ను చేపడుతున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 2017లోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఊహకందని ఒక సరి కొత్త ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని ఒక అద్భుతమైన సిటీ లా మారుస్తుందన్నారు. అంతేకాదు నియోమ్ అని పిలిచే ఒక అత్యద్భుతమైన హైటెక్ సిటీని రూపొందిస్తుంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మార్చే లక్ష్యంతో దాదాపు రూ.40 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తోంది. ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు ఎక్కువ అని చెబుతోంది. ఇది సౌదీలోని అకాబా గల్ఫ్, ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26 వేల కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్, ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు తదితరాలు ఆ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలు. అంతేకాదు ఇక్కడ ఆకాశంలో ఏదో విధంగా ఎగిరే ఎలివేటర్లు, అర్బన్ స్పేస్పోర్ట్, డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉన్న భవంతులు, ఫాల్కన్ రెక్కలు వికసించిన పువ్వులు తదితరాలు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్(సరళ రేలో విస్తరరించిన నగరం)ను కూడా ఏర్పాటు చేస్తోంది. దీనికోసం సుమారు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోంది. అంతేకాదు పురాతన ట్రాయ్ నగరం, దాదాపు రెండు మైళ్ల మానవ నిర్మిత సరస్సు, అత్యాధునిక సాంకేతికత కూడిన వర్టికల్ గ్రామం, వినోదం, అతిథి సౌకర్యాలతో అత్యంత విలాసంగా ఉంటుందని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మా పేర్కొన్నారు. 20030 నాటికి సుమారు 7 లక్షల మంది సందర్శకులను 7 వేల మంది శాశ్వత నివాసితులను ఆకర్షిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. His Royal Highness Mohammed bin Salman, Crown Prince and Chairman of the NEOM Company Board of Directors, has announced the establishment of #TROJENA – the new global destination for mountain tourism, part of #NEOM's plan to support and develop the tourism sector in the region. pic.twitter.com/ZNa4JsamKy — NEOM (@NEOM) March 3, 2022 (చదవండి: ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్) -
సౌదీ యువరాజుపై సంచలన ఆరోపణలు.. ప్రపంచానికే ముప్పు!
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి షాకింగ్ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు. అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు. అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది. BIG REVEAL: Saad Aljabri, a former top Saudi intelligence official has said that Crown Prince Mohammed bin Salman keeps a team of mercenaries to kidnap—and even kill—political dissenters. @ericgarland @Abukar_Arman @TrueFactsStated pic.twitter.com/BquD2mr1i5 — Colossus Diplomacy (@ColossusDiplo) July 12, 2022 -
మతిమరుపు బైడెన్పై స్పూఫ్ వీడియో.. నెట్టింట వైరల్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్, కమలా హారిస్లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు. అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIDEO: A prominent Saudi television network has racked up millions of views with a comedy sketch that openly mocks US President Joe Biden, an unusual move that further signals souring ties pic.twitter.com/GRrNXx7Bjo — AFP News Agency (@AFP) April 14, 2022 -
జో బైడెన్కు సౌదీ అరేబియా అధ్యక్షుడి వార్నింగ్
దుబాయ్: అమెరికా అధ్యక్షుడు బైడెన్కు సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ అంతరంగిక వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోరాదన్నారు. ‘అట్లాంటిక్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్.. ‘అమెరికా సొంత విషయాలపై అధ్యక్షుడు బైడెన్ మాట్లాడాలి. మాది సంపూర్ణ రాజరిక దేశం. నా గురించి బైడెన్ అపార్థం చేసుకున్నా పట్టించుకోను. అమెరికా గురించి మాకు అవసరం లేదు. వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ దేశంతో చిరకాల బంధాన్ని బలోపేతం చేసుకోవడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బైడెన్ వచ్చాక రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. చదవండి: (మసీదుపై ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి) -
సౌదీ యువరాజుకు పుతిన్ సందేశం!
Russian-Saudi partnership:ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణకు అడ్డుకట్టే వేసే నేపథ్యంలో ప్రపంచదేశాలు పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యన్ కరెన్సీ రూబుల్ రికార్డ స్థాయిలో పతనమైంది. మరోవైపు ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్పుతిన్ సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో సంభాషించారు. పాశ్చాత్య దేశాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నందున కీలకమైన బౌగోళిక రాజకీయ కూటమి గురించి నొక్కిచెప్పారు. ఉక్రెయిన్ పై దాడి కారణంగా రష్యాను ఆర్థికంగా ఒంటరి చేశాయి. కీలకమైన రష్యా బ్యాంకులు అంతర్జాతీయ లావాదేవీల నిర్వహించకుండా ఉండేలా తొలగించింది. దీంతో వ్యాపారులు చమురు రవాణాను నిర్వహించడానికి విముఖత చూపుతారు. ఈ మేరకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ఓపెక్ ప్లస్ బుధవారం జరిగిన సమావేశంలో తీవ్రతరం అవుతున్న ఈ సంక్షోభాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదని పుతిన్ అన్నారు. కార్టెల్ క్రూడ్ ధరలను తగ్గించడానికి ఉత్పత్తిని పెంచే దిశగా కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇది మాస్కో, రియాద్ల మధ్య ఉద్రిక్తతలను సృష్టించే అవకాశం ఉందన్నారు . అయినా ప్రపంచ ఇంధన సరఫరా సమస్యలను రాజకీయం చేయడం ఆమోదయోగ్యం కాదని కూడా పుతిన్ నొక్కిచెప్పారు. రష్యా సౌదీ భాగస్వామ్యంలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో సమగ్ర అభివృద్ధిపథంలోకి దూసుకుపోవాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: అదే గనుక పేలితే ఐరోపా అంతమే: జెలెన్ స్కీ) -
‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా!
గత కొన్ని దశాబ్దాలపాటు ఆంక్షల నడుమ జీవనం సాగించిన సౌదీ అరేబియా మహిళ లు.. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ నిర్ణయాలతో ఇతర దేశాల్లోని మహిళల వలే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో చేరుతూ తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. 2018 వరకు ఆంక్షల్లో ఉన్న... మహిళల డ్రైవింగ్, మగతోడు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడం, ఒంటరి ప్రయాణాలకు అవకాశం కల్పించడం, ఆర్మీలో చేరడానికి ఒప్పుకోవడం వంటి సంచలనాత్మక నిర్ణయాలతో అక్కడి మహిళలు సంకెళ్ల నుంచి బయటపడ్డట్టుగా భావిస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న సౌదీలో ఇటీవల మక్కా మసీదులో మహిళా భద్రతా సిబ్బందిని కూడా నియమించడం సంచలనం సృష్టించింది. మొన్నటిదాకా ప్రపంచంలోనే మహిళా ఉద్యోగుల శాతం అతి తక్కువగా ఉన్న సౌదీలో.. ప్రస్తుతం ఉద్యోగాలకోసం మహిళలు వేలల్లో పోటీ పడుతున్నారు. ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’ అంటూ నిబంధనలు సడలించడంతో వివిధ రంగాల్లో పనిచేసేందుకు అక్కడి మహిళలు అవకాశాల కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్స్ నడపడానికి మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. దాదాపు 30 వేలమంది పోటీపడ్డారు. ఈ ఏడాది జనవరి మొదట్లో సౌదీ రైల్వే పాలిటెక్నిక్ ప్రాజెక్ట్లో భాగంగా మహిళలు రైళ్లు నడిపేందుకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌదీలో అత్యంత పవిత్ర నగరాలైన మక్కా, మదీనా మధ్య రైలు సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోన్న స్పానిష్ సంస్థ మహిళా ట్రైన్ డ్రైవర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రకటనతో సౌదీ మహిళల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. 30 ఖాళీలకుగానూ 28 వేల దరఖాస్తులు వచ్చాయి. దీనిలో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు వేతనంతో కూడిన శిక్షణను ఇస్తారు. తరువాత మక్కా నుంచి మదీనా వరకు నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ లను నడుపుతారు. కొన్నేళ్లుగా అనేక పరిమితులు, ఆంక్షలతో ఇటువంటి అవకాశం, నోటిఫికేషన్ రావడం ఇదే మొదటిసారి కావడంతో వేలాదిమంది మహిళలు ట్రైన్ డైవర్లు అయ్యేందుకు పోటీ పడ్డారు. యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్ .. మహిళల అభ్యున్నతి, సాధికారతకు తీసుకుంటున్న నిర్ణయాలతో.. సౌదీలో కూడా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రైవేటు సెక్టార్లలో కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. హోటల్స్, ఫుడ్ ఇండస్ట్రీస్లో మహిళా ఉద్యోగుల సంఖ్యలో నలభై శాతం పెరుగుదల ఉండగా, ఉత్పాదక రంగంలో 14 శాతం, నిర్మాణ రంగంలో 9 శాతం వృద్ధి నమోదైంది. సౌదీ మహిళలకు ఇప్పటిదాకా టీచర్లుగా, హెల్త్ వర్కర్లుగా మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మిగతా రంగాల్లో మగవాళ్లకు మాత్రమే అనుమతి ఉండడంతో వారి ఉద్యోగపరిధి అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ ట్రైన్ డ్రైవర్ల నియామక స్ఫూర్తితో సౌదీలో మహిళల సారథ్యంలో రైళ్లు మరింత వేగంగా ముందుకు దూసుకుపోతాయని ఆకాంక్షిద్దాం. -
ఈ డజన్ కొత్త విజన్
మిలిటరీ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె హజ్ యాత్రికులకు సూచనలు ఇస్తుంది. ఎవరికైనా సందేహాలు ఉంటే ఓపికగా తీరుస్తుంది. నడవడానికి ఇబ్బంది పడుతున్నవారికి సహాయపడుతుంది. సైనిక దుస్తుల్లో కనిపించే గంభీరత్వం మాట ఎలా ఉన్నా, ఆమె మాత్రం పక్కింటి ఆత్మీయనేస్తం లానే కనిపిస్తుంది. పవిత్ర మక్కా, మదీనాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా సైనికుల చిత్రాలు ఒక చారిత్రక మార్పుకు సూచనగా నిలిచాయి. ఎందుకీ మార్పు? సౌదీ యువరాజు మహ్మద్బిన్ సల్మాన్ (ఎంబీఎస్) విజన్ 2030 ప్రణాళిక రూపొందించాడు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీని ప్రధాన లక్ష్యం. అది జరగాలంటే ప్రధాన స్రవంతికి దగ్గరవ్వాలి. ఇందులో భాగంగా సంప్రదాయ విధానం నుంచి కాస్త పక్కకు వచ్చే ప్రయత్నం చేస్తుంది సౌదీ ప్రభుత్వం. మహిళలు సైన్యంలో చురుకైన పాత్ర నిర్వహించడమనేది ఈ మార్పుకు సంకేతంలా నిలుస్తుంది. సైన్యంలో పనిచేయాలనేది మోనా చిన్నప్పటి కల. అయితే పెరిగి పెద్దవుతున్న క్రమంలో అది కలకే పరిమితమనే కఠిన వాస్తవం తెలిసింది. ఆ కఠిన వాస్తవం కరిగిపోయి మోనా సైన్యంలో చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ‘నాన్నలాగే సైన్యంలో పనిచేయాలనిది నా కోరిక. అది నెరవేరినందుకు చాలా గర్వంగా ఉంది. పవిత్రభూమిలో విధులు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది మోనా. మక్కా, మదీనాలలో సైనిక విధులు నిర్వహిస్తున్న పన్నెండు మంది మహిళలలో మోనా ఒకరు. కాబా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సమర్ సైకాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘సైన్యంలో పనిచేయాలనుకుంటున్నాను’ అని తన మనసులో మాటను ఒకరోజు కుటుంబసభ్యులకు చెప్పింది. వారు సంతోషించారు. ప్రోత్సహించారు. తల్లిదండ్రుల మానసిక దృక్కోణంలో వచ్చిన కీలక మార్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. ‘ఇదొక ఉద్యోగం అనుకోవడం లేదు. పవిత్ర బాధ్యతగా భావిస్తున్నాను’ అంటుంది సమర్. 2019లోనే సైన్యంలోకి మహిళలు రావడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. సోల్జర్ నుంచి సార్జెంట్ వరకు వివిధ హోదాల్లో మహిళలు పనిచేడానికి దారి పడింది. ‘మహిళలను సైన్యంలోకి తీసుకోవాలా? వద్దా? అనేది గత 30 సంవత్సరాలుగా రగులుతున్న వివాదస్పద అంశం. ఏది ఏమైనా సైన్యంలోకి మహిళల రాక అనేది అందరూ స్వాగతించాల్సిన విషయం’ అంటున్నారు ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్ హలహ్. ఇక షాపింగ్ మాల్స్లో మహిళలు క్యాషియర్లుగా కనిపించడం సాధారణ దృశమైంది. మినిస్టర్ ఆఫ్ జస్టిస్లో పబ్లిక్ నోటరీలుగా వందమంది మహిళలను నియమించారు. త్వరలో మహిళా జడ్జీల నియామకానికి సన్నాహాలు చేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే వివిధ రంగాలలో మహిళలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. మహిళలపై పరిమితులు విధించే సంరక్షణ విధానానికి చెల్లుచీటి ఇచ్చింది ప్రభుత్వం. మహిళలు డ్రైవింగ్ చేయడంపై ఉన్న నిషేధాన్ని కూడా పక్కన పెట్టింది. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలో మరెన్ని మార్పులు జరగనున్నాయో వేచిచూద్దాం. -
ఖషోగి హత్య వెనుక సౌదీ యువరాజు హస్తం
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్టు జమాల్ ఖషోగి హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని తేలడంతో సౌదీపై అమెరికా ఆంక్షలు విధించింది. సౌదీ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని బైడెన్ ప్రభుత్వం శుక్రవారం నిషేధించింది. సౌదీ యువరాజుని ఆంక్షల నుంచి మినహాయించింది. ఖషోగిపై అక్కసు పెంచుకున్న సౌదీ యువరాజు ఆయనను సజీవంగా బంధించడం లేదంటే చంపేయండి అంటూ తన అనుచరులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా అమెరికా ఇంటలిజెన్స్ తన నివేదికలో వివరించింది. సౌదీ యువరాజు అనుమతితోనే జర్నలిస్టు ఖషోగిని హత్య చేసినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక నివేదిక సమర్పించడంతో బైడెన్ సర్కార్ చర్యలకు దిగింది. ట్రంప్ హయాంలో వివిధ దేశాలతో క్షీణించిన సంబంధాలను పునరుద్ధరించి ప్రపంచంలో అమెరికాని తిరిగి అగ్రగామిగా నిలబెడతామని బైడెన్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అందుకే ఆంక్షల నుంచి యువరాజుని మినహాయించింది. ‘అధ్యక్షుడు బైడెన్ సంబంధాలు పూర్తిగా తెగిపోవాలని భావించడం లేదు. మళ్లీ ఎప్పటికైనా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనాలని ఆశిస్తున్నారు. అయితే మానవ హక్కులకు భంగం వాటిల్లుతూ ఉంటే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోరు’అని బైడెన్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు వెల్లడించారు. -
సౌదీ పౌరుల వీసా బ్యాన్ చేసిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా పౌరుడైన జర్నలిస్టు జమాల్ ఖషోగి హత్య కేసులో సౌదీ అరేబియాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశ పౌరులకు వీసా నిషేదిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే ఖషోగిని చంపించింది యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అని ఆరోపించిన అమెరికా.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఆంక్షలను మాత్రమే విధించించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సౌదీ అరేబియాకు చేయూతనిచ్చారని, అది ఏమాత్రం శ్రేయస్కరం కాదని అమెరికా నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ చర్యలతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్న క్రమంలో తాజా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఆంక్షలు విధించారు. ఇక 76 మంది సౌదీ పౌరులకు అమెరికా ప్రభుత్వం వీసాను నిషేధించింది. జర్నలిస్టులు, ప్రభుత్వంపై అసమ్మతి తెలియజేస్తూ వారిపై దాడులకు తెగబడే వారికి ఆంక్షలు విధించేలా అమెరికా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ విధానాల ప్రకారమే 76 మందిపై అగ్రరాజ్యం వీసాను నిషేధించింది. అంతేగాక వారి కుటుంబ సభ్యుల్లో ఎంపిక చేసిన వారికే వీసా ఆంక్షలు వర్తిస్తాయి ప్రకటనలో పేర్కొంది. విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ సరిహద్దుల్లో భద్రతకే పెద్ద పీట వేస్తామని, ప్రభుత్వ అసమ్మతి గళం వినిపించే వారిపై దాడులను సహించబోమని అన్నారు. అలాంటి ద్వేషాన్ని తమ గడ్డపైకి రానివ్వబోమని తేల్చి చెప్పారు. మరోవైపు తమ పరిశీలనలో ఉండే సౌదీ అరేబియా, ఇతర దేశాలపై మానవ హక్కుల నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టు జమాల్ ఖషోగిని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ చంపించాడంటూ అమెరికా ఆరోపించింది. శుక్రవారం నివేదికను విడుదల చేస్తూ.. 2018 అక్టోబర్ 2న ఖషోగిని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్కు పిలిపించి ముక్కలుముక్కలుగా నరికి చంపినట్లు అమెరికా తన నివేదికలో పేర్కొంది. ఇప్పటిదాకా ఖషోగి మృతదేహం కూడా లభించలేదని వెల్లడించింది. అమెరికా పౌరుడైన ఖషోగి.. సౌదీ యువరాజు అవినీతిని బయటపెట్టాడని, అందుకే ఆయన్ను యువరాజు చంపించారని ఆమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఖషోగ్గి హత్య: అమెరికా సంచలన ఆరోపణలు
వాషింగ్టన్ : సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య జరిగినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. 2018లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని సౌదీ కౌన్సులేట్లో ఖషోగ్గి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆ దారుణంపై అమెరికా ప్రభుత్వం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఖషోగ్గిని బంధించండి లేదా హత్య చేయాలంటూ ప్రిన్స్ సల్మాన్ ఆదేశించినట్లు ఆ నివేదికలో తెలిపింది. ప్రిన్స్ అనుమతి లేకుండా.. ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద దారుణం చోటు చేసుకోవడం అసంభవం అని నివేదికలో పేర్కొన్నది. అయితే అమెరికా నేరుగా సౌదీ రాజుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. నివేదికను వెల్లడించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం సౌదీపై డజన్ల సంఖ్యలో ఆంక్షలను ప్రకటించింది. అయితే అమెరికా రిలీజ్ చేసిన నివేదికను సౌదీ అరేబియా కొట్టిపారేసింది. అదో నెగటివ్, తప్పుడు రిపోర్ట్ అని పేర్కొన్నది. జర్నలిస్టు ఖషోగ్గి మర్డర్ కేసులో తన పాత్రలేదని సౌదీ రాజు మహ్మద్ తెలిపారు. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టుగా పేరుగాంచిన వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ ఖషోగ్గి హత్య 2018, అక్టోబర్ 2న జరిగింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖషోగ్గి తన మ్యారేజ్ పేపర్స్ కోసం కాన్సులేట్ భవనంలోకి వెళ్లాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో కొన్ని పాశ్చాత్య దేశాలు, సీఐఏ ఖషోగ్గి హత్య వెనక సౌదీ రాజు ప్రమేయం ఉందని ఆరోపించాయి. అయితే వీటిని సౌదీ ప్రభుత్వం కొట్టి పారేసింది. ఈ క్రమంలో ఖషోగ్గి మర్డర్ ఆపరేషన్కు ప్రిన్స్ సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రుజువు చేసేందుకు మూడు కారణాలను అమెరికా నివేదిక పేర్కొన్నది. చదవండి: సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం? ‘ఓవెన్ వెలిగించమన్నారు.. చుట్టూ మాంసం ముక్కలు’ -
సౌదీ రాజుపై కోర్టులో దావా, కారణం?
వాషింగ్టన్: రెండు సంవత్సరాల క్రితం ఇస్తాంబుల్లో జరిగిన దారుణ హత్యకు నష్టపరిహారం కోరుతూ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కాబోయే భార్య సెంగిజ్ సౌదీ అరేబియా యువరాజు, ఇతర అధికారులపై మంగళవారం అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమెరికా రచయిత జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాశాడు.దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖషగ్గీని హత్య చేయించాడని అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్ళిన ఖషోగ్గి అక్టోబరు 2, 2018న హత్యకు గురయ్యాడు. అమెరికాకు మిత్రపక్షంగా ఉన్న సౌదీ ఆరేబియా తొలుత ఖషోగ్గి హత్యలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. తరువాత పలు పొంతనలేని వ్యాఖ్యలు చేసినా చివరికి ఇస్తాంబుల్లోని దౌత్య కార్యాలయంలో సౌదీ ఏజెంట్ల బృందం ఖషోగ్గిని హత్య చేసినట్లు అంగీకరించింది. దీనిపై విచారణ చేసిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ కూడా మహ్మద్ బిన్ సల్మాన్ ఖషోగ్గి హత్యకు ఆదేశించారని నివేదిక ఇచ్చింది. ఈ హత్యతో తమకు అపార నష్టం వాటిల్లిందని అతనికి కాబోయే భార్య అమెరికా కోర్టులో కేసు వేసింది. ఖషోగ్గి డీఏడబ్ల్యూఎన్ అనే సంస్థను స్థాపించాడని అతను మరణించిన కారణంగా దాని కార్యకలాపాలు దెబ్బతిన్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. ఖషోగ్గిని క్రూరంగా హింసించి హత్య చేశారని ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని షాక్కు గురిచేసిందని దావాలో తెలిపారు. అరబ్లో ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఖషోగ్గి ప్రయత్నించారని, ప్లాన్ ప్రకారమే ఆయనను హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని వారు కోర్టుకు తెలిపారు. చదవండి: మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా -
ఆస్పత్రిలో చేరిన సౌదీ రాజు
రియాద్: సౌదీ అరేబియా రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్(84) ఆస్పత్రిలో చేరారు. పిత్తాశయం వాపుతో బాధపడుతున్న ఆయన రాజధాని రియాద్లోని ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక వార్తా సంస్థ సోమవారం వెల్లడించింది. రాజు సల్మాన్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు డిప్యూటీ ప్రీమియర్గా బాధ్యతలు చేపట్టారు. 50 సంవత్సరాలకు పైగా రియాద్ ప్రాంతానికి గవర్నర్గా పని చేశారు. 2012లో యువరాజుగా, 2015లో సౌదీ రాజుగా రాజ్యాధికారం చేపట్టారు. అయితే 2016లో ఆయన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్ను యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ సౌదీకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. దేశంలో అనేక సంస్కరణలకు కారణమయ్యారు. అలాగే 2017లో సౌదీ రాజు కుటుంబాన్ని నిర్బంధించి వివాదాస్పద నాయకుడిగానూ ముద్ర వేసుకున్నారు. జర్నలిస్ట్ ఖషోగ్గీని హత్య చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. (మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా) -
మా నాన్న హంతకులను క్షమిస్తున్నాం: సలా
రియాద్: తమ తండ్రిని హతమార్చిన వారిని క్షమిస్తున్నామని దివంగత సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ కుమారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు.. ‘‘అమరుడైన జమాల్ ఖషోగ్గీ కుమారులమైన మేము.. మా నాన్నను హత్య చేసిన వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటన చేస్తున్నాం’’ అని ఖషోగ్గీ కుమారుడు సలా ఖషోగ్గీ ట్వీట్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలపై అతడు స్పష్టతనివ్వలేదు. కాగా అమెరికా- సౌదీల పౌరసత్వం కలిగి ఉన్న ఖషోగ్గీ కుమారుడు పెద్ద కొడుకు సలా జమాల్ ఖషోగ్గీ ప్రస్తుతం సౌదీలో నివసిస్తున్నాడు. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసిన ఖషోగ్గీ.. 2018 అక్టోబరులో టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. దీంతో అంతర్జాతీయ సమాజం సౌదీ యువరాజుపై తీవ్ర విమర్శలు గుప్పించింది.(ఖషోగ్గీ సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!) ఈ నేపథ్యంలో అమెరికా సైతం ఖషోగ్గీ హత్యోందంతానికి సంబంధించిన నిజాలు వెలికితీసేందుకు తమ గూఢాచార సంస్థ (సెంట్రల్ ఇంటలిజిన్స్ ఏజెన్సీ)ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలో రియాద్ నుంచి వచ్చిన 15 మంది ఏజెంట్లు ఖషోగ్గీని హతమార్చారని టర్కీ ఆరోపించింది. ఖషోగ్గీ అనుమానాస్పద మృతి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపడంతో.. అతడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. ఈ క్రమంలో అనేక పరిణామాల అనంతరం ఈ కేసులో సౌదీ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించగా.. ముగ్గురు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించనున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.(ఖషోగ్గీ కేసులో ఐదుగురికి మరణశిక్ష) ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థ మీద తనకు పూర్తి విశ్వాసం ఉందన్న సలా.. దోషులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తాజాగా దోషులకు క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్యర్యపరిచాడు. కాగా ఇస్తాంబుల్కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురయ్యారు. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది. -
ఇకపై అక్కడ కొరడా దెబ్బలు ఉండవు..
రియాద్: కట్టుబాట్లకు మారుపేరైన ఎడారి దేశం సౌదీ అరేబియాలో గత కొంతకాలంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణల్లో మహిళల పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడంతో పాటుగా.. తొలిసారిగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో సౌదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన పౌరులను కొరడా దెబ్బలు కొట్టే సంప్రదాయానికి స్వస్తి పలికినట్లు సమాచారం. ఇందుకు ప్రత్యామ్నాయంగా సదరు పౌరులకు నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష లేదా జరిమానా విధించడం లేదా రెండూ అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సౌదీ సుప్రీంకోర్టు జనరల్ కమిషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అనుసరించి మానవ హక్కుల సంస్కరణలను ప్రవేశపెడుతున్నాం’’అని సదరు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంపై మానవ హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఈ సంస్కరణ ఎన్నో ఏళ్ల క్రితమే చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డాయి. ఈ విషయం గురించి సౌదీ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవాద్ అల్వాద్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్నిరోజులుగా రాజ్యంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. హ్యూమన్ రైట్స్ అజెండాలో సరికొత్త ముందడుగు ఇది’’అని వ్యాఖ్యానించారు. -
సౌదీ రాజుకు వ్యతిరేకంగా కుట్ర
రియాద్: సౌదీ అరేబియా రాజును గద్దె దింపేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై అధికారులు ముగ్గురు యువరాజులను అరెస్ట్ చేశారు. రాజు సల్మాన్ తమ్ముడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, దగ్గరి బంధువు మహమ్మద్ బిన్ నయేఫ్లు ఇందులో ఉన్నట్లు అమెరికా మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. శుక్రవారం ఉదయం యువరాజులు ముగ్గురిని వారి ఇళ్ల నుంచి అరెస్ట్ చేసినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు సల్మాన్తోపాటు ఆయన కొడుకు మహ్మద్ బిన్ సల్మాన్లను గద్దె దింపేందుకు కుట్ర పన్నినట్లు వీరిపై న్యాయస్థానంలో అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలు రుజువైతే నిందితులకు జీవితకాల ఖైదు లేదంటే మరణ శిక్ష పడే అవకాశం ఉంది. నయేఫ్తోపాటు ఆయన తమ్ముడు నవాఫ్ బిన్ నయేఫ్ కూడా అరెస్ట్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. -
వివాదాస్పద వీడియో.. విమర్శలు!
రియాద్ : సౌదీ అరేబియా భద్రతా సంస్థ(ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ) విడుదల చేసిన ఓ ప్రమోషనల్ వీడియో వివాదాస్పదంగా మారింది. ఫెమినిజం, స్వలింగసంపర్కం, ఎథిజం(నాస్తికత్వం) అనేవి తీవ్ర వాద భావాలంటూ భద్రతా సంస్థ పేర్కొనడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇలాంటి తీవ్రవాద భావాలు, వంకర బుద్ధి ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. మాతృదేశ విధానాలకు వ్యతిరేకంగా ఏం చేసినా అది తీవ్రవాదంగానే పరిగణింపబడుతుంది అనే వాయిస్ ఓవర్తో సాగిన వీడియోలో ఫెమినిజం, స్వలింగ సంపర్కం, ఎథిజాన్ని తీవ్రవాద భావనలుగా అభివర్ణించింది. కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నవయుగ సౌదీ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని చెబుతూనే ఇలాంటి వీడియోలు విడుదల చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సౌదీ రాచరికం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా విజన్ 2030 కార్యక్రమంలో భాగంగా సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం.. మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించడం, అదే విధంగా విదేశీ టూరిస్టులకు వీసా జారీ చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. తమ దేశ పర్యటనకు వచ్చే విదేశీ మహిళలు, పురుషులు సంయుక్తంగా హోటల్ గదుల్లో బస చేయవచ్చంటూ సరికొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పరిచయం లేని అమ్మాయి, అబ్బాయి కలిసి బయటికి వస్తే బహిరంగంగానే కఠిన శిక్షలు అమలుచేసే ఎడారి దేశం.. పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటోందనే వాదనలు వినిపించాయి. ఇక తాజా వీడియోతో మరోసారి మహిళలు, నాస్తికుల పట్ల సౌదీ నిజమైన వైఖరేంటో అర్థమైందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇరాన్పై సౌదీ రాజు సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసి రాకపోతే మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు చేరే అవకాశముందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే చమురు ధరలు మన జీవితకాలంలో చూడని అనూహ్య రీతిలో పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్ టీవీ ఛానల్లో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో మహమ్మద్ బిన్ సల్మాన్ కార్యక్రమం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో ప్రపంచం కఠిన చర్యలు తీసుకోనిపక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని మహమ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ముఖ్యంగా సైనిక చర్యకంటే..రాజకీయపరమైన, శాంతియుత పరిష్కారమే మంచిదని తాము భావిస్తున్నామంటూ ప్రకంపనలు రేపారు. ఇరాన్తో యుద్ధం చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఇది ప్రపంచ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంతో శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు విఘాతం కలుగుతుందని, తద్వారా ఇంధన ధరలు జీవితంలో మునుపెన్నడూ చూడనంత గరిష్ఠ స్థాయికి చేరే ప్రమాదం ఉంటుందని వ్యాఖ్యానించారు. సౌదీలో ఆయిల్ రిఫైరీపై ఈ నెల 14న జరిగిన క్షిపణి దాడులు ఇరాన్ చర్యేనని సౌదీ ఆరోపిస్తోంది. మరోవైపు సౌదీలోని ఆయిల్ రిఫైనరీపై జరిగిన డ్రోన్ దాడుల వెనుక ఇరాన్ ప్రమేయమున్నట్లు సౌదీ అరేబియాతో పాటు అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఇరాన్ తమ ప్రమేయం లేదని ఇరాన్ కొట్టిపారేసింది. కాగా ఏడాది క్రితం జరిగిన వాషింగ్టన్ పోస్టు కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యలో తన ప్రమేయం లేదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్పష్టంచేశారు. అయితే సౌదీ రాజ్యాధినేతగా ఖషోగ్గి హత్యకు తాను పూర్తి బాధ్యతవహిస్తున్నట్లు స్పష్టంచేశారు. సౌదీ అరేబియాలోని ఆయిల్ రిఫైనరీపై క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఖషోగ్గీ హత్య; పూర్తి బాధ్యత నాదే!
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఖషోగ్గీ హత్యకు గురైన కారణంగా పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఖషోగ్గీని చంపింది ఎవరైనా తానే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహ్మద్ బిన్ పాలను విమర్శిస్తూ కథనాలు రాసే సౌదీ అరేబియా జాతీయుడు జమాల్ ఖషోగ్గీ... గతేడాది అక్టోబరు 2న టర్కీలో దారుణ హత్యకు గురైన విషయం విదితమే. సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ అదృశ్యమవడంతో సౌదీ యువరాజే పథకం ప్రకారం అతడిని అంతమొందించాడనే విమర్శలు వెల్లువెత్తాయి. యువరాజు ఆదేశాలతో ప్రత్యేక విమానంలో టర్కీకి వెళ్లిన 11 మంది బృందం అతడిని హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సైతం సౌదీ యువరాజును తప్పుబట్టింది. ఖషోగ్గీ విషయంలో సౌదీ అధికారులు క్లిష్ట సమస్యలు ఎదుర్కోబోతున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించడంతో మధ్య ప్రాచ్య రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మొదటి వర్ధంతి సమీపిస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన వార్తా సంస్థ పీబీఎస్ మహ్మద్ బిన్ను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మహ్మద్ బిన్ మాట్లాడుతూ...‘ మా దేశంలో 20 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. అందులో 3 మిలియన్ల మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారు. నా దగ్గర ఎంతో మంది మంత్రులు, అధికారులు పనిచేస్తారు. నన్ను అడగకుండానే నా ప్రత్యేక విమానాలను వారు తీసుకువెళ్లే అధికారం కలిగి ఉంటారు. పైగా ఖషోగ్గీ హత్య నా హయాంలో జరిగిన కారణంగా బాధ్యత నాదే అని పేర్కొన్నారు. కాగా ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. గతేడాది అక్టోబరులో తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తడంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ విమర్శలు గుప్పించింది. -
ఖషోగ్గీ హత్య; ఆధారాలు దొరికాయి!
జెనీవా : జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉన్నట్లుగా తనకు ఆధారాలు దొరికాయని యూఎన్ హక్కుల కార్యకర్త ఆగ్నస్ కాలామర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో సౌదీ రాజు, అధికారులకు వ్యతిరేకంగా ఆధారాలు లభించినందున వారిపై అంతర్జాతీయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం. అయితే కొన్ని ఆధారాలు మాత్రం లభించాయి. సరైన పద్ధతిలో విచారణ జరిపినట్లైతే నిజాలన్నీ బయటకు వస్తాయి. నేరం చేసిన వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారి గురించి కూడా బయటపడతుంది. సౌదీ యువరాజుకు ఉన్న అధికారాల పట్ల ఖషోగ్గికి పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆయన అంటే కాస్త భయం కూడా ఉండేది. ఖషోగ్గీ హత్య కేసును విచారించడంలో సౌదీ, టర్కీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయి. క్రైమ్సీన్లో ఆధారాలన్నీ మాయమయ్యాయి. దీన్ని బట్టి ఈ కేసు పట్ల ఇరు ప్రభుత్వాలకు ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది’ అని ఆమె తన నివేదిక(ఆర్బిటరీ ఎగ్జిక్యూషన్)లో పేర్కొన్నారు. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఇక కొంతకాలం క్రితం ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో సౌదీ ప్రభుత్వం డబ్బు అందజేసినట్లు వాషింగ్టన్ పోస్టు నివేదించింది. ఈ క్రమంలో ఖషోగ్గీ కేసును నీరుగార్చేందుకే ఆయన సంతానానికి రాజు కానుకలు ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. -
వారికి ఖరీదైన ఇళ్లు, పెద్దమొత్తంలో డబ్బు!
వాషింగ్టన్ : ఇస్తాంబుల్లోని సౌదీ రాయబార కార్యాలయంలో అత్యంత దారుణంగా హత్యకు గురైన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ సహాయం అందజేసిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసినట్లు పేర్కొంది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు.. నెలకు పది వేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసి అమెరికా వెళ్లి పోవాలనుకుంటున్నారని కథనం ప్రచురించింది. ఇక ఇస్తాంబుల్కు చెందిన పీహెచ్డీ స్కాలర్ హేటీస్ సెనీజ్ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఇది వరకే ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య ద్వారా ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వీరిలో ముగ్గురికి అమెరికా పౌరసత్వం ఉంది.(మా నాన్నే మాకు నిరంతర ప్రేరణ) కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. ఈ క్రమంలో ఆయన సంతానానికి సౌదీ యువరాజు భారీ ఎత్తున సహాయం అందించడం గమనార్హం. -
పథకం ప్రకారమే కొలిమి రూపొందించారు!
ఖతార్ : అమెరికాలో జర్నలిస్టుగా పని చేసిన సౌదీ జాతీయుడు జమాల్ ఖషొగ్గీని అత్యంత దారుణంగా హతమార్చారని ఖతార్కు చెందిన న్యూస్ ఏజెన్సీ ఆల్ జజీరా పేర్కొంది. ఖషోగ్గీ హత్య జరిగిన తర్వాత అతడి శవాన్ని ముక్కలు చేసి.. సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంటికి తరలించారని వెల్లడించింది. అనంతరం అక్కడ ఉన్న భారీ కొలిమిలో వేసి మండించినట్లు తమ విచారణలో తేలిందని తెలిపింది. ఈ విషయం గురించి కొలిమిని నిర్మించిన వ్యక్తి మాట్లాడుతూ.. వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతా సామర్థ్యం కలిగిన కొలిమి రూపొందించాలని సౌదీ కాన్సుల్ తనను ఆదేశించినట్లు అతడు చెప్పాడని ఆల్ జరీరా పేర్కొంది. అంతేకాకుండా సౌదీ కాన్సుల్ ఆఫీస్ గోడలపై ఖషోగ్గీ రక్తపు మరకలు కూడా ఉన్నాయని తెలిపింది. దీంతో ఖషోగ్గీ హత్యోదంతం మరోసారి చర్చనీయాంశమైంది. కాగా సౌదీకి చెందిన జమాల్ ఖషోగ్గీ... సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబరు 2న ఆయన హత్యకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనతో సౌదీ యువరాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. అయితే ఈ హత్యకు సంబంధించిన మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడలేదు. -
బుద్ధి చూపించుకున్న పాక్
ఇస్లామాబాద్: తమ దేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినవారికి శాలువా కప్పి సన్మానం చేయడమో.. లేక ఆకర్షణీయమైన బహుమతులివ్వడమో, జ్ఞాపికలు అందించడమో చేస్తుంటారు నాయకులు. అయితే ఇచ్చే ఆ బహుమానంలో వారి అభిమతం, ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ నాయకులు వారి దేశానికి వచ్చిన అతిథిక ఓ బహుమానం ఇచ్చి వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నారు. భారత్ పర్యటన కంటే ముందు సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాక్కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి ఎంపీలు సల్మాన్కు ఓ తుపాకీని బహుకరించారు. బంగారు పూతతో తయారైన ఈ గన్ జర్మనీ ఇంజనీర్లు ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారు. (ఆధారాలు ఉంటే భారత్కే మద్దతు : సౌదీ మంత్రి) హెక్లర్ అండ్ కోచ్ ఎంపీ5 సబ్మెషీన్ గన్ను సల్మాన్కు పాక్ ఎంపీలు కానుకగా ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నడుస్తోంది. ‘అతిథులకు ఏ పువ్వో, స్వీటో ఇవ్వకుండా తుపాకీ ఇచ్చారంటే వీళ్లు తీవ్రవాదులకంటే డేంజర్’అంటూ పలువురు విమర్శిస్తున్నారు. హింసను ప్రేరేపించే పాక్ అసలు ఉద్దేశం బయటపడిందని పేర్కొంటున్నారు. శాంతి అనేది పాక్ డీఎన్ఏలోనే లేదని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. అతిథికి తుపాకీ కానుకగా ఇవ్వడంతో పాక్ తన బుద్ధి చూపించుకుందని విమర్శిస్తున్నారు. (భారత్కు తగు జవాబివ్వండి) దీనిపై అరబ్ దేశాల్లోనూ ఆందోళన వక్తం అవుతున్నాయి. ఇటీవల సౌదీ జర్నలిస్టు ఖషోగ్గిని ప్రిన్స్ సల్మానే చంపించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో తుపాకీ బహుమతిగా ఇచ్చి మరింత ఆజ్యం పోస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలేదని బాహాటంగా పాక్ ప్రకటిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం తీవ్రవాదులను పెంచి పోషిస్తుందన్న విషయం జగమెరిగిన సత్యం. పుల్వామా ఉగ్రదాడికి తమకు సంబంధం లేదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా ప్రకటించి.. భారత్పై దాడి చేయండి అంటూ భద్రత బలగాలకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇక పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై యావత్ దేశం ఉగ్రవాద ప్రేరేపిత పాక్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (ఆ సాహసం భారత్ చేస్తుందా?: గంగూలీ) -
యువరాజు గారి పర్యటన
చతుష్షష్టి శాస్త్రాల్లో ద్యూతం(జూదం) ఉందిగానీ... దూత్యం(దౌత్యం) లేదు. కానీ వర్తమాన ప్రపంచ రాజకీయాల్లో రెండింటికీ పెద్ద తేడా లేదు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మన దేశంలోనూ, అంతకుముందు పాకిస్తాన్లోనూ జరిపిన పర్యటనలు, విడుదల చేసిన సంయుక్త ప్రకటనలనూ గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం ఏ దేశాన్నీ ‘మీరు ఎటువైపు?’ అని ప్రశ్నించడం సాధ్యపడదు. ఉన్నంతలో సర్దుకుపోతూ, లౌక్యంగా మాట్లాడుతూ గరిష్టంగా ప్రయోజనాలు రాబట్టుకోవడం ఒక్కటే మిగిలింది. మన దేశంలో బిన్ సల్మాన్ పర్యటన సందర్భంగా ఇంధనం, ఖనిజాలు, వ్యవసాయం, మౌలిక సదు పాయాలు, పెట్రో కెమికల్స్, చమురుశుద్ధి, విద్య, తయారంగం తదితరాల్లో సౌదీ పెట్టుబడులు పెట్టడానికి అవగాహన కుదిరింది. ఈ పెట్టుబడుల విలువ 10,000 కోట్ల డాలర్లు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్యా ఉన్న వ్యూహాత్మక సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి కూడా అంగీకారం కుదిరింది. అలాగే ముస్లింలకు అత్యంత పవిత్రమైన హజ్ యాత్రకు ఇప్పుడున్న కోటాను మరో 25,000కు పెంచి 2 లక్షలమంది యాత్రీకులను అనుమతించేందుకు సౌదీ అరే బియా సమ్మతించింది. ఉగ్రవాదంపై సమష్టి సమరం చేయడానికి భారత్కూ, దాని పొరుగు దేశాలకూ తమ పూర్తి సహకారం అందజేస్తామని ఈ సందర్భంగా సల్మాన్ ప్రకటించారు. ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. సల్మాన్ నేరుగా పాక్ పర్యటన ముగించుకుని మన దేశం రాలేదు. అటునుంచి స్వదేశానికెళ్లి ఆపై న్యూఢిల్లీ పర్యటనకొచ్చారు. పుల్వామా దాడి నేపథ్యమే ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. ఉగ్రవాదం, దానిపై పోరాటం అనేవి ఇప్పుడు అంతర్జాతీయ పరిభాషలో అమూర్తమైనవిగా మారాయి. తన సొంత గడ్డపై 2001లో ఉగ్రవాదులు జంట టవర్లు కూల్చేసి వందలమందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఉగ్రవాదంపై అమెరికా ఏకంగా యుద్ధమే ప్రకటించింది. ప్రపంచంలో ఏమూల ఉగ్రవాది ఉన్నా వెంటాడి, వేటాడి మట్టుబెడతామని అప్పట్లో హెచ్చరించింది. కానీ ఇన్నేళ్ల దాని ఆచరణ గమనిస్తే ఆ పేరిట వివిధ దేశాల్లో అది సాగించిన మారణకాండ, దురాక్రమణ వంటివి మాత్రమే కనబడతాయి. లక్షలమంది అమాయక పౌరుల ప్రాణాలు పోయాయి, అంచనా కట్టలేనంత విధ్వంసం జరిగింది. పైపెచ్చు సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి అది చేసిన విఫలయత్నం ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) అనే అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థ పుట్టుకు రావడానికి కారణమైంది. మన దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద దాడుల వెనక పాకిస్తాన్ ఉన్నదని తెలిసినా ఆ దేశానికి అమెరికా ఏనాడూ సైనిక సాయాన్ని, ఆర్థిక సాయాన్ని నిలిపేయలేదు. అదే సమయంలో ‘ఉగ్రవాదంపై యుద్ధం’ నామస్మరణ విడనాడలేదు. సౌదీ అరేబియా అమెరికా మిత్ర దేశం గనుక ఈ లక్షణాలను అది పుణికిపుచ్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యువరాజు బిన్ సల్మాన్ పాకిస్తాన్ పర్యటనపై కాస్త అనిశ్చితి నెలకొన్నా చివరికది సజావుగా సాగింది. కాకపోతే ఆయన పర్యటన ఒక రోజు వాయిదా పడింది. సోమ, మంగళవారాల్లో యధావిధిగా రెండురోజుల పర్యటన పూర్తయింది. ఆ సందర్భంగా పాకిస్తాన్తో 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడుల ఒప్పం దాలు కుదిరాయి. మన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందంతో పోలిస్తే అది చాలా చాలా తక్కువ మొత్తమని కొందరు సంబరపడుతున్నారు. దాని సంగతలా ఉంచి ఉగ్రవాదంపై పాకిస్తాన్–సౌదీలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన చాలా ఆసక్తిదాయకంగా అనిపిస్తుంది. ‘ఇరుపక్షాలూ తీవ్రవాదంపై, ఉగ్రవాదంపై పోరాటాన్ని కొనసాగిస్తాయ’ని ఆ ప్రకటన పునరుద్ఘాటించింది. అయితే ఐక్యరాజ్యసమితి లిస్టింగ్ విధానాన్ని రాజకీయం చేసే పద్ధతులను విడనాడాల్సిన అవసరం ఉన్నదని రెండు పక్షాలూ అభిప్రాయపడు తున్నట్టు ఆ ప్రకటన చెప్పింది. ఏమిటా ‘లిస్టింగ్ విధానం’? ఐక్యరాజ్యసమితి ఆమధ్య ప్రపంచ ఉగ్రవాదుల జాబితాను రూపొందించింది. ఎవరైనా ఒక వ్యక్తి సాగిస్తున్న ప్రమాదరకమైన కార్య కలాపాలను ఏ దేశమైనా సమితి దృష్టికి తీసుకొస్తే భద్రతామండలిలో ఏకాభిప్రాయంతో తీర్మానం చేయడం ద్వారా ఆ వ్యక్తి పేరును ఆ ఉగ్రజాబితాలో చేరుస్తారు. మసూద్ అజర్ను అందులో చేర్పిం చడానికి మన దేశం కొన్నేళ్లుగా నానా కష్టాలూ పడుతోంది. కానీ చైనా అడ్డుపుల్ల వేయడంతో ఎప్ప టికప్పుడు అది ఆగిపోతోంది. ఈమధ్య పుల్వామా దాడి జరిగాక సైతం ‘మసూద్ అజర్పై సందే హాతీతమైన సాక్ష్యాలు అందజేస్తే అతగాడి పేరును ఉగ్ర జాబితాలో చేర్చడానికి సహకరిస్తామ’ని చైనా చెప్పింది. పుల్వామా దాడి తమ నిర్వాకమేనని మసూద్ అజర్ జబ్బలు చరుచుకోవడం దానికి వినబడలేదనుకోవాలి! మంగళవారం విడుదలైన పాకిస్తాన్–సౌదీల సంయుక్త ప్రకటన సైతం ఆ రాగమే అందుకుంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రజాబితాను ‘రాజకీయం’ చేయొద్దని అది సుద్దులు పలి కింది. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్తోపాటు దానిపై సంతకం చేసిన సల్మానే మన దేశం వచ్చి ప్రధాని నరేంద్రమోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేయడం, అందులో రెండు దేశాలూ ఐక్యరాజ్యసమితి ఉగ్రజాబితా అవసరాన్ని నొక్కివక్కాణించడం గమనించిన వారెవరైనా విస్మయపడతారు. కానీ వర్తమాన ప్రపంచంలో దౌత్యం అనే పదానికి అర్ధం మారిపోయింది. స్థల కాలాలను బట్టి దేశాధినేతల అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఇతర అంశాల సంగతలా ఉంచి కనీసం ఉగ్రవాదం వంటి మహమ్మారి విషయంలోనైనా ఏ దేశం వాస్తవ వైఖరేమిటో ఎవరూ చెప్పగలిగే స్థితి లేదు. ఇది విచారించదగ్గ విషయం. కాకపోతే పుల్వామా దాడిని ఇరు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని సంయుక్త ప్రకటన తెలిపింది. మొత్తానికి సౌదీతో సంబంధాల విష యమై అతిగా ఆశించకూడదని సల్మాన్ పర్యటన తేటతెల్లం చేసింది. అదే సమయంలో మన వైఖరిని అంగీకరింపజేయడానికి నిరంతరం ప్రయత్నించడం తప్పనిసరి. -
ఎవిడెన్స్ ఉంటే భారత్కే సపోర్టు...
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి జైషే మహ్మద్కు వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించినట్లైతే భారత్కు తాము తప్పకుండా అండగా ఉంటామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఆదిల్ ఆల్ జుబేర్ వ్యాఖ్యానించారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హేయమైన దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ఉపేక్షిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ గురించి అడుగగా... అతడి గురించి సాక్ష్యాధారాలు అందించినట్లైతే ఐరాసలో భారత్కు మద్దతు పలుకుతామని తెలిపారు. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు సౌదీ సహాయ పడుతుందని స్పష్టం చేశారు. ఐరాసలో రాజకీయాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని సౌదీ- పాకిస్తాన్ సంయుక్త ప్రకటన చేసిందని.. అయితే దానిని మసూద్ అజర్కు అన్వయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమకు భారత్- పాకిస్తాన్.. ఇరు దేశాల పట్ల నమ్మకం ఉందని, శాంతియుతంగా చర్చలు జరపడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. (‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్ఐ ఉంది’ ) వారిని శిక్షించాల్సిందే.. ‘ఉగ్రవాదులను గుర్తించే అంశం పట్ల మాకు స్పష్టమైన విధానాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని, ఉగ్ర సంస్థలకు నాయకత్వం వహించే వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. శిక్ష విధించాల్సిందే. అయితే అందుకు సరైన ఆధారాలు సంపాదించాల్సిన ఆవశ్యకత ఉంది. అపుడే బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు అరికట్టవచ్చు’ అని ఆదిల్ అల్-జుబేర్ పేర్కొన్నారు. భారత్తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న భారత్కు అండగా నిలుస్తామని వ్యాఖ్యానించారు.(ఉగ్రవాదం ఉమ్మడి సమస్య) కాగా పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పొగుడుతూ.. ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించేందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఒప్పందం కుదర్చుకున్నారు. అనంతరం బుధవారం భారత్లో పర్యటించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్.. పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే ప్రధాని మోదీతో పలు చర్చలు జరిపారు. ఈ మేరకు భారత్లో సుమారు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సల్మాన్తో పాటు భారత్ వచ్చిన బృందంలో ఒకరైన సౌదీ విదేశాంగ మంత్రి పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావించడం విశేషం. అయితే ఆయన కూడా పాకిస్తాన్లాగే ఆధారాలు ఉంటే అంటూ ముక్తాయించడం వెనుక పరోక్షంగా తమ విధానమేమిటో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.(‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’ ) -
వ్యూహాత్మకంగా భారత్కు సౌదీ కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి సౌభ్రాతృత్వాల పరిరక్షణకు భారత్, సౌదీ అరేబియా కట్టుబడి ఉన్నాయని ప్రదాని మోదీ తెలిపారు. ముష్కరుల కిరాతకానికి పుల్వామా ఆత్మాహుతి దాడి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. యావత్ ప్రపంచానికి పెను సవాల్గా మారిన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో భేటీ తర్వాత నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు. భారత్ వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ కీలకదేశమని.. తమ బంధం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారత్కు మద్దతు ప్రకటించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. కాగా, భారత ఆర్థిక వ్యవస్థపై అపార విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. సౌదీ అరేబియా దేశంలో 100 బిలియన్ డాలర్లు (రూ. 7 లక్షల కోట్లకుపైగా) భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఇంధన వనరులు, రీఫైనింగ్, పెట్రో కెమికల్స్, మౌలిక వసతులు, వ్యవసాయం, తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెడుతామని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించగా.. ప్రధాని మోదీ ఆయన ప్రకటనను స్వాగతించారు. -
‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తమకు ఎల్లప్పుడూ ప్రియమైన దేశమేనని సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వ్యాఖ్యానించారు. త్వరలోనే పాకిస్తాన్ ఆర్థికంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వంటి నాయకులతో పలు కీలక అంశాల్లో భాగస్వామ్యమయ్యేందుకు తమ దేశం ఎదురుచూస్తోందంటూ పాక్ ప్రధానిని కొనియాడారు. సౌదీ- పాక్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు సల్మాన్ ప్రస్తుతం పాక్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రో కెమికల్, క్రీడా రంగాలు, సౌదీ దిగుమతులు, పవర్ జనరేషన్ ప్రాజెక్టులు, సంప్రదాయ వనరుల అభివృద్ధి వంటి సుమారు 20 బిలియన్ డాలర్ల మొత్తానికి సంబంధించిన పలు ఎంఓయూలపై ఇరు దేశాధినేతలు సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయంలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘ నేను యువరాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత తూర్పులో ఇదే నా మొదటి పర్యటన. నేను సందర్శించిన మొదటి దేశం పాకిస్తాన్. పాక్ మాకు అత్యంత ముఖ్యమైన దేశం. వారితో భవిష్యత్తులో మేము మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ప్రస్తుతం ఓ గొప్ప వ్యక్తి నేతృత్వంలో పాక్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వారితో ఆర్థిక, రాజకీయ సంబంధాలు మేము కోరుకుంటున్నాం. మా ప్రాంతంపై మాకు నమ్మకం ఉంది. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం అంటూ ఇమ్రాన్ ఖాన్ను ఆకాశానికి ఎత్తేశారు. అదే విధంగా తమ దేశంలో ఖైదీలుగా ఉన్న 2107 మంది పాక్ పౌరులను జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. ఇందుకు స్పందనగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘ అత్యవసర సమయంలో మమ్మల్ని ఆదుకుంటున్న స్నేహితుడు సౌదీ అని వ్యాఖ్యానించాడు. తమ దేశ హజ్ యాత్రికుల ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించాలని సల్మాన్ను కోరారు. అదే విధంగా రియాద్ నుంచి బీజింగ్ చేరుకునేందుకు చైనా- పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపెక్)ను ఉపయోగించుకోవాలని విఙ్ఞప్తి చేశారు.(జైషే చీఫ్పై మారని చైనా తీరు) కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ పాక్ను విమర్శిస్తుండగా సౌదీ యువరాజు ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జైషే మహ్మద్ చీఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు నిరాకరించి చైనా పరోక్షంగా.. పాక్కు మద్దతు తెలుపుతుండగా ప్రస్తుతం సౌదీ కూడా అందుకు తోడైనట్లు కన్పిస్తోంది. ఇక భారత్- పాకిస్తాన్ల మధ్య వివాదానికి కారణమైన సీపెక్ గురించి ఇమ్రాన్ మాట్లాడి.. భారత్ పట్ల చైనా, పాకిస్తాన్లు వైఖరి ఏంటనే విషయాన్ని చెప్పకనే చెప్పారని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య
వాషింగ్టన్: సౌదీఅరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతోనే వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖషోగ్గీని సౌదీ అధికారులు హత్యచేశారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) తెలిపింది. సల్మాన్కు తెలియకుండా లేదా అతని ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటన జరిగే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఈ మేరకు సీఐఏను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యువరాజు సల్మాన్ నిర్ణయాలపై విమర్శనాత్మక కథనాలు రాసిన ఖషోగ్గీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్లి అదృశ్యమయ్యారు. సల్మాన్ ఆదేశాలతోనే ఖషోగ్గీ హత్య జరిగిందని సీఐఏ చెప్పడం అమెరికా–సౌదీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఖషోగ్గీ హత్య; సౌదీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!?
వాషింగ్టన్ : వాషింగ్టన్ పోస్టు కాలమిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసులో సౌదీ అరేబియాకు ఉచ్చు బిగుస్తున్నట్లుగానే కన్పిస్తోంది. ఖషోగ్గీని హత్య చేయించింది సౌదీ అరేబియానే అనేందుకు తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ హత్య కేసు విచారణలో భాగంగా సేకరించిన ఆడియో క్లిప్పులను అమెరికా గూఢాచార సంస్థ డైరెక్టర్(సీఐఏ) గినా హాస్పెల్కు అందించినట్లుగా సమాచారం. ట్రంప్ క్యాబినెట్లో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న గినా ప్రస్తుతం టర్కీలో రహస్యంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆడియో క్లిప్పులను విన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సౌదీకి చెక్ పెట్టి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అమెరికా ఖషోగ్గీ ఉదంతాన్ని వాడుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. మధ్య ప్రాచ్య రాజకీయాల్లో సౌదీ కీలక శక్తిగా ఎదిగేందుకు తోడ్పడిన ట్రంప్... ఖషోగ్గీ మృతిపై మొదట సౌదీ అరేబియాపై తమకు అనుమానాలు లేవన్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో సౌదీ అధికారులు అత్యంత క్లిష్ట సమస్యలను ఎదుర్కోబోతున్నారంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఖషోగ్గీ హత్య కుట్రలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది సౌదీల వీసాలను కూడా అమెరికా రద్దు చేసింది. ఈ విషయం గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మాట్లాడుతూ.. ‘ఇవి చాలా చిన్న విషయాలు. నేరస్తులు ఎవరైనా సరే జవాబుదారీగా ఉండాల్సిందే. అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు మేము వెనుకాడబోం’ అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఖషోగ్గీ హత్యోదంతం గురించి సీఐఏ మాజీ అధికారి మాట్లాడుతూ.. ’ ప్రస్తుతం బాల్ వాషింగ్టన్ కోర్టులో ఉంది. ప్రజలతో పాటు కాంగ్రెస్ కూడా గినా మాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే.. సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సౌదీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఖషోగ్గీ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. అయితే ప్రధాన కుట్రదారుడు సల్మానే అయినపుడు విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని నమ్మడం చాలా హాస్యాస్పదమైన విషయమని టర్కీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. -
ఖషోగ్గీ హత్య; స్పందించిన సౌదీ యువరాజు
రియాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్యపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఎట్టకేలకు స్పందించారు. ఖషోగ్గీ హత్యను అత్యంత క్రూరమైన చర్యగా సల్మాన్ అభివర్ణించారు. ఇటువంటి హేయమైన నేరాలను ఎవరూ కూడా సమర్థించరంటూ వ్యాఖ్యానించారు. ఖషోగ్గీ హత్య సౌదీలందరినీ ఎంతగానో బాధించిందన్నారు. బుధవారం రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ మాట్లాడుతూ.. ఖషోగ్గీ హంతకులను పట్టుకునేందుకు సౌదీ అరేబియా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో టర్కీ తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఖషోగ్గీ మరణం టర్కీ- సౌదీ సంబంధాల మధ్య అడ్డుగోడగా నిలుస్తుందని తాను భావించడం లేదన్నారు. నేరస్తులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, చివరికి న్యాయమే గెలిచి తీరుతుందంటూ వ్యాఖ్యానించారు. కాగా సౌదీ జాతీయుడైన ఖషోగ్గీ అమెరికాలో ఉంటూ సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అనుసరిస్తున్న విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్ట్లో కథనాలు రాసేవారు. ఈ నెల 2న తన వ్యక్తిగత పనిపై ఖషోగ్గీ టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ ఎంబసీలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. ఖషోగ్గీని ఎంబసీలోనే చంపేశారని టర్కీ ఆరోపించింది. అయితే ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. అయితే, తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు ఖషోగ్గీని మహమ్మద్ బిన్ సల్మాన్ చంపించాడని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఖషోగ్గీ హత్య గురించి అంతర్జాతీయ సమాజం నుంచి.. ముఖ్యంగా తనకు ఇన్నాళ్లుగా అనుకూలంగా మాట్లాడుతూ వస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఒత్తిడి వస్తోన్న నేపథ్యంలోనే సల్మాన్ స్పందించక తప్పలేదు. ఖషోగ్గీ మరణం వెనుక సల్మాన్ ఉన్నారంటూ ట్రంప్ అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
సౌదీలో మొదలవనున్న సినిమా యుగం
రియాద్ : అరబ్ రాజ్యంలో పెను మార్పులు రానున్నాయి. సౌదీ అరేబియాలో సినిమా యుగం మొదలవనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సౌదీ ప్రజలు థియేటర్లలో సినిమాను చూడనున్నారు. దీనికి సంబంధించి ఆడియో విజువల్ మీడియా కమిషన్(ఏఎమ్సీ) రియాద్లోని ఓ థియేటర్కు లైసెన్స్ ఇచ్చింది. ఈ నెల 18న ఓ సినిమా ఈ థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటివరకూ సౌదీలో శాటిలైట్, డీవీడీలు, వీడియోల ద్వారా మాత్రమే సినిమాలను వీక్షించేవాళ్లు. చమురు విలువ తగ్గడంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 2014 నుంచి కొన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణల్లో భాగంగా సౌదీ ప్రభుత్వం వినోదానికి పెద్ద పీట వేసింది. దీనిలో భాగంగా వచ్చే దశాబ్ద కాలంలో 64 బిలియన్ల డాలర్ల(యూఎస్) పెట్టుబడులతో సౌదీలో థియేటర్లు, ఫిల్మ్ ఫెస్టివల్స్, పార్కులు, టూరిస్టు హబ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కాగా థియేటర్లు ఏర్పాటయ్యాక తొలి దక్షిణ భారతీయ చిత్రం రజనీకాంత్ నటించిన 'రోబో 2.ఓ' అక్కడ విడుదల కానుంది. 1970 ప్రాంతంలో సౌదీలో సినిమాలు ఆడేవి. ఇస్లాం మతానికి, సంస్కృతికి భంగం వాటిల్లుతుందనే కారణంగా 1980లో సినిమా హాళ్లపై నిషేధం విధించారు. గతేడాది ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే. -
సౌదీ రాజుగా బిన్ సల్మాన్కు పట్టాభిషేకం!?
రియద్ : వచ్చేవారంలో సౌదీ రాజుగా మహమ్మద్ బిన్ సల్మాన్ను పట్టాభిషేకం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌదీ రాజుగా వ్యవహరిస్తున్న కింగ్ సల్మాన్ పదవి నుంచి దిగిపోయి కుమారుడు, ప్రస్తుత యువరాజుగా వ్యవహరిస్తున్న మహమ్మద్ బిన్ సల్మాన్కు పట్టంకడుతున్నట్లు బ్రిటన్ న్యూస్ ఏజెన్సీలు ప్రకటించాయి. బ్రిటన్ న్యూస్ ఏజెన్సీల ప్రకారం.. వచ్చేవారంలో 81 ఏళ్ల కింగ్ సల్మాన్.. పదవి నుంచి దిగిపోయి కుమారుడికి సింహాసనాన్ని అప్పగించనున్నారు. అయితే సింహాసనాన్ని కుమారుడికి వదులుకున్నా.. ‘మసీదుల సంరక్షకుడు’ అనే హోదాతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టం కట్టే సంప్రదాయాన్ని కింగ్ సల్మాన్ పక్కనపెట్టారు. సౌదీ అరేబియాలో అధికారమార్పు గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీలో సుమారు 40 మంది రాజకుటుంబ సభ్యుల మూకుమ్మడి అరెస్ట్లు జరిగాయనే వాదన వినిపిస్తోంది. మమమ్మద్ బిన్ సల్మాన్ అధికారంలోకి వస్తే మధ్యప్రాచ్యంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశముందని నిపుణుల అంచనా వేస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్.. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్తో కలిసి పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. కాబోయో సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలపడం విశేషం. -
సౌదీలో దుస్సాహసం
సౌదీ అరేబియా రాజు సల్మాన్ కుమారుడు, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ దుస్సాహసానికి పూనుకున్నారు. ఏకకాలంలో ఇంటా, బయటా సమస్యలు సృష్టిస్తూ నిప్పుతో చెలగాటమాడుతున్నారు. నాలుగు రోజుల క్రితం తన బంధుగణంలో 11మంది యువరాజులనూ, నలుగురు మంత్రులనూ అవినీతి ఆరోపణల సాకుతో బంధించారు. రాజకుటుంబంతోనే సంబంధాలున్న మరికొందరు మాజీ మంత్రులను, వ్యాపారులను కూడా అరెస్టు చేశారు. ఇద్దరు యువరాజులు అను మానాస్పద స్థితిలో మరణించారు. వీరిలో ఒకరిని దుండగులు కాల్చిచంపారు. మరొకరు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇదంతా గమని స్తున్న మరో యువరాజు బతుకు జీవుడా అనుకుంటూ తన ప్రైవేటు విమానంలో ప్రత్యర్థి దేశమైన ఇరాన్కు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాడు. ఒకపక్క దేశంలో ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న యువరాజు సల్మాన్ పొరుగునున్న యెమెన్లో బాంబుల మోత మోగిస్తున్నాడు. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో మంగళవారం 50మంది మరణించారు. రియాద్ విమానాశ్రయం లక్ష్యంగా క్షిపణి దాడి జరగడంతో సౌదీ రెచ్చిపోయింది. దాదాపు రెండేళ్లనుంచి యెమెన్లో తిరుగుబాటుదార్లపై సౌదీ సంకీర్ణ దళాలు దాడులు చేస్తున్నా ఫలితం దక్కకపోగా 10,000మంది పౌరులు మరణించారు. 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అక్కడి పౌరులకు నిత్యావసర సరుకులు, ఔషధాలు అందకుండా సంకీర్ణ సేనలు అడ్డుకుంటున్నాయి. యెమెన్ తిరుగుబాటుదార్లకు ఇరాన్ మద్దతునిస్తున్నదని సౌదీ అరేబియా ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు చాలవన్నట్టు సౌదీ పర్యటనకొచ్చిన లెబనాన్ ప్రధాని సాద్ హరిరి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు అక్కడినుంచే ప్రకటించారు. రాజీనామా వెనక సౌదీ హస్తమున్నదని, తమ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడమే ఆ చర్య ఉద్దేశమని లెబనాన్ అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. లెబనాన్లో ఏడాది నుంచి ఎంతో విజయవంతంగా సాగుతున్న సంకీర్ణ ప్రభుత్వానికి హరిరి నేతృత్వంవహిస్తున్నారు. హరిరి ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీకి సౌదీ అండదండలున్నాయి. అయితే ఆ ప్రభుత్వంలో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లాతోసహా పలు పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. సౌదీ అరేబియాలోని అంతర్గత పరిణామాలనూ, ఇరుగుపొరుగుతో దాని ఘర్ష ణలనూ వేర్వేరుగా చూడలేం. అక్కడ ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేదు. ఉన్నది దాయాది కుటుంబస్వామ్యమే. అయితే పాలనలో పాలుపంచుకుంటున్న కుటుం బసభ్యుల మధ్య సమన్వయాన్ని సాధించి, వారికి మత నాయకులను కూడా జోడించి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని రూపొందించారు. కొన్ని దశాబ్దాలుగా అదే సాగుతోంది. ఇరాన్తో ఘర్షణలు తలెత్తకుండా, పశ్చి మాసియాలో అశాంతి చెలరేగకుండా ఇది తోడ్పడింది. కానీ 2015లో అధికారాన్ని చేజిక్కించుకున్న రాజు సల్మాన్ అబ్దుల్ అజీజ్ దీన్నంతటినీ తారుమారు చేసే ప్రయత్నాలు మొదలెట్టారు. తన కుమారుడు యువరాజు సల్మాన్ను ఆర్నెల్లక్రితం వారసుడిగా ప్రకటించి అప్పటికే అతని దగ్గరున్న రక్షణ శాఖకు తోడు ఆర్ధిక శాఖ కూడా కట్టబెట్టారు. ఆంతరంగిక భద్రతా వ్యవహారాలను చూస్తున్న సీనియర్ ఉప ప్రధాని మహమ్మద్ బిన్ నయీఫ్ అల్ సౌద్ను తప్పించారు. ఆయన ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నాడంటున్నారు. ఖతర్తో గత జూన్లో తెగదెంపులు చేసు కోవడాన్ని నయీఫ్ తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే ఆయనకు ఉద్వాసన పలికినట్టు అప్పట్లోనే కథనాలు వెలువడ్డాయి. పశ్చిమాసియాలో ఇరాన్ కాక తామే తిరుగులేని శక్తిగా ఎదగాలన్నది రాజు అజీజ్, యువరాజ్ సల్మాన్ల స్వప్నం. అయితే ఇరాన్తో కయ్యానికి దిగితే ఫలితం దక్కకపోగా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాజ కుటుంబంలోని ఇతరులు హెచ్చరిస్తున్నారు. ఏకాభిప్రాయ సాధనతోనే ముందడు గేయాల్సి ఉండటంతో అజీజ్, సల్మాన్లకు ఎటూ పాలుబోవడం లేదు. అందుకే అవినీతి ఆరోపణల సాకుతో అందరినీ అరెస్టు చేశారు. ఈ పరిణామాల నుంచి ప్రపంచం దృష్టి మళ్లించడం కోసం దేశంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు, మహి ళలకు కొన్ని హక్కులు కల్పిస్తున్నట్టు చూపుతున్నారు. అజీజ్, సల్మాన్ల ఎత్తులన్నీ చిత్తవుతున్నాయి. జిహాదీలను ఉపయోగించి సిరి యాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను పదవీభ్రష్టుణ్ణి చేయాలని చూస్తే ఆయన కాస్తా మరింత బలపడ్డారు. యెమెన్ను లొంగదీసుకోవాలనుకుంటే అది తారు మారైంది. ఇరాన్ అండదండలు పుష్కలంగా ఉన్న హౌతీ తిరుగుబాటుదార్లు కొరకరాని కొయ్యలుగా మారారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక సౌదీ రాజ కుటుంబంలో పొరపొచ్చాలు మరింత పెరిగాయి. అరెస్టయిన యువ రాజుల్లో ఒకడైన తలాల్ అల్ వలీద్ ఒకప్పుడు డోనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడు. 1,700 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ట్రంప్ వ్యాపారాలకు ఆర్ధికంగా సాయపడిన తలాల్... ఆయన అధ్యక్ష పదవికి పోటీపడటాన్ని గట్టిగా వ్యతిరేకించాడు. సౌదీ వ్యవహారాల్లో జోక్యాన్ని ఖండించాడు. అందుకే ట్రంప్ వెనకుండి ఈ అవినీతి వ్యతిరేకపోరాటాన్ని మొదలెట్టించారు. ఈ పరిణామాలన్నిటి వెనకున్న ఆంతర్యం తేటతెల్లమే. ఇరాన్ను చక్రబంధంలో బిగించి ఇజ్రాయెల్ సాయంతో పశ్చిమాసియాలో సౌదీ ఆధిపత్యాన్ని నెలకొల్పడం... దాని ద్వారా తాను లాభపడటం అమెరికా ఉద్దేశం. అయితే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మాజీ సీనియర్ అధికారి చెప్పినట్టు ఇరాన్ను లొంగదీసుకోవడం అసాధ్యం. భద్ర తామండలి ద్వారా అమెరికా దశాబ్దాలుగా అమలు చేయించిన ఆర్ధిక ఆంక్షలను తట్టుకుని అది నిలబడింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అది తిరుగులేని ఆర్ధిక శక్తి. దాని జోలికెళ్తే సౌదీ మాత్రమే కాదు... అమెరికా, ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. పశ్చిమాసియా తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ప్రపంచ దేశాలకూ నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ ప్రమాదకర పోకడలకు అమెరికా స్వస్తి పలకాలి. ఆ ప్రాంత దేశాలు కలిసికట్టుగా వాటి భవితవ్యాన్ని రూపొందించుకునే అవకాశా న్నివ్వాలి. -
మేనల్లుడిని పీకేసి.. కొడుకుకు పట్టం!
సౌదీ రాజు సల్మాన్ అనూహ్య నిర్ణయం రియాద్: సౌదీ అరేబియా రాజు సల్మాన్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు మహమ్మద్ బిన్ నయెఫ్ (57)ను అకస్మాత్తుగా యువరాజు పదవి నుంచి తొలగించి.. ఆ పదవిలో తన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్ను ప్రతిష్టించారు. సంప్రదాయ ఇస్లామిక్ రాజ్యమైన సౌదీలో యువ వారసులకు పట్టం కట్టడం ఇదే తొలిసారి. ఈ నియామకంతో నయెఫ్ను అధికారాలన్నీ తొలగించినట్టు అయింది. అదేవిధంగా 31 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్కు డిప్యూటీ ప్రధానమంత్రి పదవిని కూడా కేటాయిస్తున్నట్టు రాజు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం మహమ్మద్ బిన్ సల్మాన్ వద్ద ఉన్న రక్షణమంత్రిత్వ శాఖ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తారని వెల్లడించారు. 81 ఏళ్ల సల్మాన్ సౌదీ రాజుగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అంతర్గతంగా అధికారం కోసం కుటుంబవర్గపోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మేనల్లుడిని పక్కనబెట్టి.. తన కొడుకుకు పట్టాభిషిక్త యువరాజుగా సల్మాన్ అధికారికంగా పట్టం గట్టడం గమనార్హం. తద్వారా తన తర్వాత రాజు పదవిని చేపట్టేందుకు తన కొడుకుకు మార్గం సుగమం చేశారు. -
వారసుడిని మార్చిన సౌదీ రాజు
రియాద్: సౌదీ అరేబియా రాజు తన వారసుడిని మార్చేశారు. తన అంతర్గత వ్యవహారాల మంత్రి మహ్మద్ బిన్ నయీప్ను రాజుగా ప్రకటించి సొంతకుమారుడికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం రక్షణ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న తనకుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్ను నయీఫ్ తర్వాతి స్థానంలో చేర్చారు. ఇక నుంచి మహ్మద్ నయీఫ్ రాజుగా కొనసాగుతారని, తన కుమారుడు సల్మాన్ యువరాజుగా ఉంటారని, వీరి పాలనలో సౌదీ రాజ్యం ముందుకు వెళుతుందని ఆయన ప్రకటించారు. దీంతోపాటు ఆయన ఇప్పటి వరకు తన రాజ్యానికి సుదీర్ఘకాలంగా విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న సౌద్ అల్ ఫైజల్ను బాధ్యతలు తప్పించి వాషింగ్టన్కు రాయబారిగా పనిచేస్తున్న అదల్ అల్ జుబెయిర్కు ఆ బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు రాజుగా ఉన్న అబ్దుల్లా చనిపోవడంతో ఆయన సవతి సోదరుడైన సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్కు సౌదీ అరేబియా తదుపరి రాజుగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.