Object
-
‘దూరదర్శన్లో వివాదాల చిత్రం ప్రసారమా?’
తిరువనంతపురం: భారతదేశ ప్రభుత్వ టీవీ ఛానెల్ దూరదర్శన్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ది కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రసారం చేయాలని డీడీ నేషనల్ నిర్ణయించడమే అందుకు కారణం. పలు వివాదాలకు కేరాఫ్గా నిలిచిన ది కేరళ స్టోరీ చిత్రాన్ని దూరదర్శన్ ఛానెల్లో ప్రసారం చేయడం సరికాదని కేరళ సీఎం పినరయి విజయన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా లోక్సభ ఎన్నికల వేళ ఈ చర్య మతపరమైన ఉద్రిక్తతలకు కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారయన. బీజేపీ, ఆరెస్సెస్లకు ప్రచార యంత్రంగా మారొద్దంటూ డీడీ నేషనల్కు హితవు పలికారాయన. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. The decision by @DDNational to broadcast the film 'Kerala Story', which incites polarisation, is highly condemnable. The national news broadcaster should not become a propaganda machine of the BJP-RSS combine and withdraw from screening a film that only seeks to exacerbate… — Pinarayi Vijayan (@pinarayivijayan) April 4, 2024 ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించేలా దూరదర్శన్ ఏర్పాట్లు చేసుకుంది. మరోవైపు సీపీఐ(ఎం) కూడా డీడీ చర్యను తప్పుబట్టింది. సెక్యులర్ రాష్ట్రంగా ఉన్న కేరళలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విమర్శలు గుప్పించింది. ‘‘ఈ సినిమా విడుదల సమయంలో కేరళలో నిరసనలు జరిగాయి. సెన్సార్ బోర్డు సైతం పది సీన్లకు కత్తెర విధించింది. అలాంటి చిత్రాన్ని జాతీయ ఛానెల్లో ప్రదర్శించాలని నిర్ణయించడం ముమ్మాటికీ రెచ్చ గొట్టే చర్య అని ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కిందటి ఏడాది ఈ చిత్రం విడుదలకాగా.. ఆ సమయంలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇక ఈ చిత్రాన్ని కేరళ థియేటర్లలో ప్రదర్శించకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అనధికార నిషేధంపై బీజేపీ కోర్టులను ఆశ్రయించింది. ఇక కోర్టు మాత్రం చిత్ర విడుదలను అడ్డుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా అభ్యంతరకరంగా ఉంటే సెన్సార్ బోర్డు కళ్లు మూసుకుని ఉండదు కదా అని ఆ సమయంలో చిత్ర రిలీజ్కు క్లియరెన్స్ ఇచ్చింది. -
బక్రీద్ వేళ మేకలను ఇంటికి తెచ్చాడని.. అపార్ట్మెంట్వాసుల ఆందోళన..
ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్మెంట్కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్మెంట్కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్మెంట్కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్మెంట్లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు. Uproar over goats in Mumbai Housing Society. (@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz — IndiaToday (@IndiaToday) June 28, 2023 దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్మెంట్లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్మెంట్లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది. ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
క్రీస్తు పూర్వం నుంచే పాత్రలపై పేరు చెక్కే పద్ధతి
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఉపయోగించే పాత్రలపై పేర్లు రాయించుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఆ వస్తువు కొన్నందుకు గుర్తుగా కొందరు రాయించుకుంటే, ఇతరులకు బహుమతిగా ఇచ్చేప్పుడు కొందరు రాయిస్తారు. ఇలా పాత్రలపై పేర్లు రాయించుకునే అలవాటు ఎప్పటినుంచి ఉందో తెలుసా..? క్రీ.పూ. నుంచే ఆ ఆనవాయితీ ఉందని తాజాగా లభించిన ఓ ఆధారం చెబుతోంది. 2 వేల ఏళ్ల క్రితం వినియోగించిన రాతి పాత్ర ఇటీవల వెలుగు చూసింది. దానిపై ప్రాకృత భాషలో చెక్కిన బ్రాహ్మీ లిపిని పరిశోధకులు గుర్తించారు. అది ఓ బౌద్ధ భిక్షుకి పేరుగా భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సమీపంలోని బొర్లామ్ గ్రామంలోని కవి మడివాళ్లయ్య మఠానికి చెందిన ఆది బసవేశ్వర దేవాలయం పరిసరాల్లోని ఓ మట్టి దిబ్బలో క్రీ.పూ.ఒకటో శతాబ్దికి చెందిన ఆ రాతి పాత్ర దొరికింది. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ సంస్థ (ప్రీహా) బృందం ఆ పాత్రను గుర్తించింది. బౌద్ధం జాడలు మరింత లోతుగా.. ఆ ప్రాంతంలో గతంలో బౌద్ధం జాడలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ పాత్ర కూడా బౌద్ధాన్ని అనుసరించిన వారు వినియోగించినదిగా ప్రాథమికంగా భావించారు. నిశితంగా పరిశీలించగా.. బ్రాహ్మీ లిపిలో రాసిన ప్రాకృత భాష అక్షరాలు కనిపించాయి. ‘హిమాబుహియ’ లేదా ‘హిమాబుధియా’ అన్న అక్షరాలుగా వాటిని గుర్తించారు. ప్రీహా బృంద ప్రతినిధులు డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్, బి.శంకర్రెడ్డి, చుక్కా నివేదిత, శాలినులు దీనిపై పరిశోధించినట్టు ప్రీహా ఓ ప్రకటనలో పేర్కొంది. హిమా అన్నది బౌద్ధ భిక్షుకి (మహిళ) పేరు అని బుధియ/బుహియ ఆమె ఇంటి పేరు అయి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. అది భిక్షా పాత్రేనన్నది వారి మాట. ఎపిగ్రఫిస్ట్ డాక్టర్ మునిరత్నం రెడ్డి ఆ అక్షరాలను పరిశీలించి.. ఆ లిపి పరిణామం ఆధారంగా అది క్రీ.పూ.ఒకటో శతాబ్దానికి చెందిందిగా చెప్పారు. లిపి తీరు ఆధారంగా ఆ రాతి పాత్ర కాలాన్ని గుర్తించారు. ఈ ప్రాంతం మంజీరా నదికి ఐదు కి.మీ. దూరంలో ఉంది. గతంలో ఇక్కడికి చేరువలోని మాల్తుమ్మెదలో ఒక బ్రాహ్మీ శాసనం, ఏడుపాయల పరిసరాల్లో నాలుగు బ్రాహ్మీ శాసనాలు దొరికాయని, మంజీరా పరివాహక ప్రాంతంలో మరింత పరిశోధిస్తే శాతవాహనుల చరిత్ర మాత్రమే కాకుండా తెలంగాణలో బౌద్ధం జాడలు మరింత లోతుగా తెలుస్తాయని ప్రీహా ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ రాతి పాత్రను గుర్తించటంలో స్థానిక మఠాధిపతి సోమాయప్ప సహకరించారని తెలిపారు. కామారెడ్డి జిల్లా బొర్లామ్లో వెలుగుచూసిన రాతి పాత్ర.. దానిపై ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపి అక్షరాలు -
వింత జీవి సంచారం.. టెన్షన్లో స్థానికులు!
ప్రపంచంలో మానవ కంటికి కనిపించని ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో భూమి మీద చోటుచేసుకునే వింతలను చూసి నిజమేనా అని షాక్ అవుతుంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. టెక్సాస్లోని అమారిలో పట్టణంలో ఓ వింత జీవి ఫొటో అక్కడున్న వారిని కలవారపాటుకు గురిచేస్తోంది. టెక్సాస్లోని ఒక ‘జూ’లో మే 21వ తేదీన అర్ధరాత్రి 1:25 సమయంలో రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్లో వచ్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, దీన్ని సీరియస్గా తీసుకున్నట్టు జూ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు వివరణ ఇచ్చారు. What is it? Strange image caught on camera at Texas zoo. DETAILS >>> https://t.co/W3Xxgycw5Y pic.twitter.com/o9gGAk61kY — WFTV Channel 9 (@WFTV) June 9, 2022 ఇది కూడా చదవండి: సర్పంతో మహిళ సహజీవనం.. ఆమె సమాధానం విని ఊరంతా సైలెంట్! -
ఆకాశంలో వింత.. అంతు చిక్కని రహస్యం!
Mysterious flying object hangs above Pak city: విశాల విశ్వంలో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చేసిన అంతరిక్షి పరిశోధనల్లో చాలా వరకు అంతు చిక్కని రహస్యలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా ఆ రహస్యాలను చేధించే ప్రయత్నంలో తలామునకలవుతునే ఉన్నారు. కానీ ఇప్పటికి అంతుబట్టిన చిదంబర రహస్యంలా గగనంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. అచ్చం అలానే ఒక వింతైన అద్భుతం ఆకాశంలో కనిపించింది. ఈ ఘటన ఇస్లామాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇస్లామాబాద్కి చెందిన ఒక గ్రహాంతర జౌత్సాహికుడు అర్స్లాన్ వార్రైచ్ ఆకాశలో ఎగురుతున్న రాయిని చూశాడు. అతను తన డ్రోన్లను ల్యాండ్ చేయబోతున్నప్నుడు ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. చూసేందుకు నల్లటి గుండ్రపు రాయిలా ఉందని కెమెరాలో జూమ్ చేసి చూస్తే ఒక ఉబ్బెత్తిన త్రిభుజాకారంలో ఉందని చెప్పాడు. అంతేకాదు ఆకాశంలో ఈ వింత రెండు గంటలకు పైనే కనువిందు చేసిందని అన్నాడు. ఈ మేరకు అతను ఆ వింతైన వస్తువు ఆకాశంలో వేలాడిదీసినట్టుగా ఉన్న దానిని రకరకాల యాంగిల్స్లో వీడియో రికార్డు చేశాడు. అంతేకాదు వార్రైచ్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: సైకిల్ రైడర్ల పై ఘోరంగా దాడి చేసిన ఎద్దు!) -
మునుపెన్నడూ చూడని వింత.. ఏలియన్ల పనికాదట! మరి..
ఖగోళంలో మునుపెన్నడూ చూడని వింత ఒకటి పరిశోధకుల కంట పడింది. స్పేస్లో కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని పాలపుంతలో దీనిని రీసెర్చర్లు గుర్తించారు. ప్రతి 18.18 నిమిషాలకు ఓ రేడియో తరంగాన్ని అది భూమికి పంపిస్తోందని అంటున్నారు స్పేస్ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. డిగ్రీ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఓ స్టూడెంట్ మొదట దానిని గుర్తించినట్లు తెలుస్తోంది. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మర్కిసన్ వైడ్ ఫీల్డ్ అర్రేలో టెలిస్కోప్ సాయంతో ఆ వింతను గుర్తించగా.. ‘అల్ట్రా లాంగ్ పీరియడ్ మాగ్నెటార్’గా దానికి పేరు పెట్టారు. ఆ వింత వస్తువేంటన్నది తేల్చే పనిలో ఉన్నారు నటాషా హర్లీ వాకర్ అనే భౌతికశాస్త్రవేత్త. భూమికి 4 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ వింత.. కాంతిమంతంగా ఉందని, దాని అయస్కాంత క్షేత్రం అత్యంత ప్రబలంగా ఉందని గుర్తించారు. ఎప్పటి నుంచో అది పాలపుంతలో ఉండి ఉండవచ్చునని, అయితే, ఇప్పటిదాకా ఎవరూ గుర్తించలేకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మొదట ఆ సిగ్నళ్లు ఏలియన్స్ పనేనని అనుకున్నారట నటాషా. కానీ, అంతా విశ్లేషించాక ఆ మిస్టరీ వస్తువు నుంచి వస్తున్న సిగ్నళ్లు రకరకాల తరంగదైర్ఘ్యాలతో ఉన్నాయని నటాషా చెప్పారు. కాబట్టి అవి కృత్రిమ సిగ్నల్స్ అయి ఉండే అవకాశమే లేదని, సహజంగా వస్తున్నవేనని ఒక అంచనాకి వచ్చారు. బహుశా న్యూట్రాన్ స్టార్గా భావిస్తున్న ఆ వింత వస్తువును.. భారీ నక్షత్రం బద్ధలు కావడం వల్ల ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నక్షత్రాల పుట్టుకపై జరుగుతున్న అధ్యయనానికి ఈ పరిశోధన ఎంతో సాయం చేసినట్లు అవుతుంది. చదవండి: ఏడేళ్ల కిందట గతి తప్పిన ఎలన్ మస్క్ రాకెట్.. ఇప్పుడు చంద్రుడి మీదకు రయ్! -
ఏంటా వింత వస్తువు?!
కూరపర్తివారిపల్లె పంచాయతీ లచ్చాయకుంట సమీపంలో బ్యాటరీ, సిగ్నల్ డిటెక్టర్, గొడుగు, బెలూన్లతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరం శుక్రవారం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటమోహన్ అక్కడకు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాతావరణ అధ్యయనానికి పరిశోధకులు గాల్లోకి బెలూన్ సాయంతో దీన్ని పంపి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్థారణకొచ్చారు. దీనిగురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. – ఎర్రావారిపాళెం(చిత్తూరు జిల్లా) -
భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు
ముంబై: భార్య టీ ఇవ్వడానికి నిరాకరించడం తనపై దాడికి ఉసిగొల్పడంగా భావించలేమని, భార్యని ఒక పశువులా చూడడం తగదని, ఆమె ఒక పశువు లేదా, ఒక వస్తువు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. టీ ఇవ్వలేదన్న కారణంతో తన భార్యపై దాడికి పాల్పడిన 35 ఏళ్ళ సంతోష్ అట్కర్కి 2016లో స్థానిక పంధార్పూర్ కోర్టు విధించిన 10 ఏళ్ళ జైలు శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. ‘‘వివాహం సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యమని’’అని జస్టిస్ రేవతి మోహిత్ డేరె జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. పితృస్వామ్య భావజాలం, స్త్రీ పురుషుడి ఆస్తి అనే అభిప్రాయం సమాజంలో పాతుకుపోయి ఉంది. ఇదే భావన పురుషుడు తన భార్యను పశువుగా భావించేలా చేస్తోంది అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరగడానికి ముందు సంతోష్అట్కర్, అతని భార్య మధ్య కొంతకాలంగావిభేదాలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన రోజు డిసెంబర్ 2013న భర్తకి టీ చేసి పెట్టకుండా అట్కర్ భార్య బయటకు వెళ్లబోయింది. అంతే సదరు భర్త సుత్తితో ఆమె తలపై మోదడంతో తలకి బలమైన దెబ్బతగిలి, తీవ్ర రక్తస్రావమైంది. ఆమెను తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్ళకుండా, నేరం జరిగిన ప్రాంతాన్ని శుభ్రపరిచి, ఆమెకు స్నానం చేయించి, అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్ళాడు భర్త. వారం రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన అట్కర్ భార్య ఆ తరువాత మరణించింది. అయితే భార్య టీ ఇవ్వకుండా తన భర్తను హింసకు ఉసిగొల్పిందని అట్కర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనను హైకోర్టు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు, స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఇలాంటి కేసులు లింగ వివక్షను, అసమానతలను ప్రతిబింబిస్తున్నాయని జస్టిస్ మోహిత్ డేరె అభిప్రాయపడ్డారు. సామాజిక పరిస్థితులు కూడా మహిళలను భర్తకు లొంగివుండేలా చేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఇటువంటి కేసుల్లో పురుషులు భార్యలను తమ వ్యక్తిగత ఆస్తిగా భావిస్తూంటారని, భర్తలు ఏం చెపితే భార్యలు అదిచేసి తీరాలన్న భావనలో మునిగిపోయి ఉంటారని కోర్టు వ్యాఖ్యానించింది. తన తండ్రి, తల్లిని కొట్టడం, ఆ తరువాత ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడం వీరి కుమార్తె చూసిందని కోర్టు తెలిపింది. చదవండి: స్వలింగ వివాహం: షాకిచ్చిన కేంద్రం ఆరవై ఏళ్ల వయస్సులో ఇదేం పాడుపని..! -
పోలవరం పనులపై ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం
-
చెత్త చేష్టలు అడ్డుకున్నందుకు చితక్కొట్టారు
ముజఫర్ నగర్: తమ ఆకతాయి చేష్టలను అడ్డుకున్నాడని ముగ్గురు వ్యక్తులు కలసి ఓ ట్రావెలింగ్ ఏజెన్సీ యజమానిని కొట్టిపడేశారు. ఓ ట్రావెలింగ్ ఏజెన్సీని నడుపుతున్న హుస్సేన్ అహ్మద్ తన ఏజెన్సీలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలపై ముగ్గురు యువకులు ఈవ్ టీజింగ్కు పాల్పడటం గమనించాడు. అలాంటి చేష్టలు తప్పని వారిని మందలించి వదిలేశాడు. కానీ, అతడి మాటలను పెడచెవినపెట్టిన యువకులు హుస్సేన్ ఏజెన్సీ వద్దకు వచ్చి తొలుత రాళ్లు రువ్వారు. అనంతరం అతడిపై అమాంతం దాడి చేసి పిడిగుద్దులు గుప్పించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి యువకులను అరెస్టు చేశారు. -
మా వాళ్లు లేరా ?
శంషాబాద్ దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరుపై అభ్యంతరం యథాతథస్థితి కొనసాగించాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం విడిపోయినా వారి పేర్లేనా.. చర్చ ఎన్టీఆర్ గురించి కాదు.. పక్క రాష్ర్టం వారి పేరుపైనే తెలంగాణలో పీవీ, కొమురం భీం వంటి వారెందరో ఉన్నారన్న కేసీఆర్ తీర్మానానికి కాంగ్రెస్, ఎంఐఎం, వైఎస్సార్సీపీ, వామపక్షాల మద్దతు టీడీపీ వ్యతిరేకత.. సవరణలు కోరిన బీజేపీ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటన.. విపక్షాల తీవ్ర నిరసన సోమవారానికి సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానించింది. ఈ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న దేశీయ టెర్మినల్ను వేరు చేస్తూ ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ శాసనసభ విచారం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తపరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుని యథాతథస్థితిని కొనసాగించాలని సభ విజ్ఞప్తి చేస్తోంది’ అని తీర్మానాన్ని కేసీఆర్ చదివి వినిపించారు. ‘ఎన్టీఆర్ పేరును పెట్టడంపై ఇక్కడ చర్చ జరగడం లేదు. పక్క రాష్ట్రం వారి పేరు పెట్టడంపైనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ను అగౌరవ పరచాలనే ఉద్దేశం మాకు లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఈ సందర్భంగా సభలో ప్రదర్శించారు. కేంద్రంతో తమకు ఘర్షణ వైఖరి లేదని, ఇది తమ విజ్ఞప్తి మాత్రమేనని, విపక్షాలు దీన్ని వివాదం చేయొద్దని సీఎం కోరారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించగా బీజేపీ మాత్రం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఇక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఎన్టీఆర్ పేరుపై సభలో దుమారం ఉదయం సభ ప్రారంభం కాగానే శంషాబాద్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై అధికార, విపక్షాల వాదనలతో సభ అట్టుడికింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కాంగ్రెస్ పట్టుబట్టగా.. దీనికి అధికార పార్టీ కూడా మద్దతు పలికింది. మరోవైపు టీడీపీ, బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో కాంగ్రెస్ సభ్యులు అడ్డుతగిలారు. ఎన్టీఆర్ పేరు విషయంలో తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించిన తర్వాతే మిగతా అంశాలకు వెళ్లాలని పట్టుబట్టారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో పేరు అవసరం లేదని, రెండు రన్వేలు ఉన్న చోటనే రెండు పేర్లు పెడతారని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సీమాంధ్రకు చెందిన నేతల పేర్లు అక్కడే పెట్టుకోవాలన్నారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని దుయ్యబట్టారు. సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తిరిగి సభ ప్రారంభం కాగానే.. ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశ పెడతారని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే సీఎం లేచి తీర్మానం చదువబోతుండగా.. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు కల్పించుకొని దేనిపై తీర్మానం చేస్తారో ముందుగా చెప్పాలన్నారు. అంతకుముందున్న ఎన్టీఆర్ పేరును తీసేశారన్నారు. ‘మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరుతో ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయాలని మా నాయకుడు చంద్రబాబు లేఖ రాశారు.. మీరు రాశారా?’ అని దయాకర్రావు ప్రశ్నించడంతో సీఎం జోక్యం చేసుకున్నారు. ‘ఢిల్లీలో పీవీ ఘాట్ ఏర్పాటు చేసి, ఆయన విగ్రహం పెట్టాలని సీఎంగా నేనే లే ఖ రాశా. మీరు చెప్పేది చెప్పండి.. ఆరోపణ లెందుకు? బట్టకాల్చి మీద వేయడం ఎందుకు?’ అని ఎర్రబెల్లి వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మరణానికి కారకులెవరు?: అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కల్పించుకుంటూ.. ‘మహానుభావుడైన ఎన్టీఆర్ పేరు ఉంచాలని దయాకర్రావు అంటున్నారు. కానీ, ఆయన ఓ విషయం మరిచిపోయారు. ఆ మహా నాయకుడు ఎందుకు చనిపోయారు? ఎవరు అందుకు బాధ్యులు? ఆయన మరణానికి కారకులు ఎవరు? తమ ప్రచారం కోసం ఆ మహానుభావుని పేరు వాడుకుంటున్నారు. పేరు మార్చాలనుకున్నపుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో చర్చించి కొన్ని పేర్లను పంపిస్తుంది. అందులోని ఏైదె నా పేరు పెట్టాలి. కానీ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే పేరు ఖరారు చేయడం తీవ్రమైన విషయం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం వచ్చిం దని సంతోషంగా ఉన్న సమయంలో పక్క రాష్ట్ర సీఎం తెలంగాణను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల మనోభావాల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవాలని సీపీఎం నేత సున్నం రాజయ్య చెప్పారు. తెలంగాణ ఇప్పటికే ఎన్నో సమస్యల్లో ఉంటే అగ్నిలో ఆజ్యం పోసినట్లు కేంద్రం వ్యవహరించడం సరికాదని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ అన్నారు. పీవీ, కొమురం భీం పేర్ల ప్రస్తావన ఈ క్రమంలోనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తాము బలపరుస్తున్నామని ప్రతిపక్ష నేత జానారెడ్డి చెప్పారు. పీవీ నరసింహారావు, కొమురం భీం పేర్లు పెట్టాలని తీర్మానంలో పొందుపర్చాలని బీజేపీ పక్ష నేత లక్ష్మణ్ సవరణలు ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘కేసీఆర్, జానారెడ్డి ఎన్టీఆర్ వద్దే రాజకీయాలు నేర్చుకున్నారు. గతంలో అన్ని పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లే పెట్టారు. పీవీ, కొమురం భీం వంటి వారి పేర్లు ఎందుకు పెట్టలేదు. ప్రాంతీయ సెంటిమెంట్ ఉన్నందున వారి పేర్లు పెట్టాలని కేంద్రానికి సూచించాలి’ అని పేర్కొన్నారు. తీర్మానంపై టీడీపీ సభ్యులు కూడా అభ్యంతరం తెలిపారు. ‘దేశీయ టెర్మినల్కు గతంలో ఎన్టీఆర్ పేరు ఉంది. గత ప్రభుత్వం కావాలనే ఆ పేరును తొలగించింది. ఇప్పుడు అంతర్జాతీయ టెర్మినల్కు రాజీవ్గాంధీ పేరే ఉంది. ఎన్టీఆర్, రాజీవ్లు వేరే రాష్ట్రాలకు చెందిన వారు. తీసేయాల్సి వస్తే ఆ ఇద్దరి పేర్లు తీసేయాలి. అంతర్జాతీయ విమానాశ్రయానికి పీవీ పేరు, దేశీయ టెర్మినల్కు మరో పేరు పెట్టాలి. కేంద్రానికి వ్యతిరేకంగా ఉండకుండా తీర్మానాన్ని సవరించాలి’ అని ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. శంషాబాద్ టెర్మినల్కు బాబా షరీఫుద్దీన్ పేరు పెట్టాలని అక్బరుద్దీన్ సూచించారు. ‘గతంలో అక్కడ షరీపుద్దీన్ హజ్రత్ దర్గా ఉండేది. అవన్నీ వక్ఫ్ భూములు. అందుకే ఆ పేరును పరిశీలించాలి’ అని కోరారు. పేరు మార్చాల్సి వస్తే కొమురం భీం పేరు పెట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. దీంతో ఇది ఏకగ్రీవం కాదని అడ్డుపడుతూ బీజేపీ, టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. ఇది సాంస్కృతిక దాడి: కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు శాసనసభలో వివిధ పక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆవేశంగా మాట్లాడారు. ‘దీన్ని తెలంగాణ ప్రజలు అసహజ చర్యగా భావిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశం. ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు తెలంగాణపై సాంస్కృతిక దాడి జరిగింది. ఇప్పుడిప్పుడే స్వయం పాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయంలో ఎయిర్పోర్టు పేరుపై నిర్ణయం తెలంగాణపై రాయి విసిరినట్లుగా ఉంది. తమ అస్తిత్వం..అస్తిత్వ చిహ్నాలపై దాడి జరిగిందనే బాధ ప్రజల్లో బలంగా ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజీవ్గాంధీ పేరిట ఉంది. అక్కడి దేశీయ టెర్మినల్కు మరో పేరు పెట్టాలనుకుంటే తెలంగాణలో ఎంతో మంది మహానుభావులున్నారు. దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ, గిరిజన నాయకుడు కొమురం భీం, సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, షేక్ బందగీ... వీళ్లందరి పేర్లు లేవా? దక్షిణ భారతం నుంచి ఇద్దరే ప్రధానులయ్యారు. దేవెగౌడ, పీవీ నరసింహరావు. మన ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ పీవీ పేరు పెట్టమని అడుగుదాం. అలా కాదని ఆంధ్రా నాయకుల పేర్లు పెట్టడం తెలంగాణను కించపరిచే విధంగా ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ గురించి చర్చ కాదు. ఆయన మహానుభావుడు. ఆయనను అగౌరవ పరిచే దురుద్దేశం మాకు లేదు. కాని రాష్ట్రం విడిపోయాక కూడా వారి పేర్లే పెట్టాలా? తెలంగాణ మహానుభావులే లేరా? ఇక్కడి వారి పేరు పెడితే ఏంటి? లేదంటే యథాతథంగా ఉంచండి. ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో విమానాశ్రయాలున్నాయి. ఆ నాలుగింటికీ ఎన్టీఆర్ పేరు పెట్టండి’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరుపై మండలిలోనూ రగడ సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానశ్రయం లో దేశీయ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శాసన మండలి దద్దరిల్లింది. దీనిపై అధికార, విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ తన స్థానంలో కూర్చొంటున్న సమయంలోనే.. సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. విమానాశ్రయానికి రాజీవ్గాంధీ పేరును కొనసాగించాలని, ఎన్డీయే నిరంకుశ వైఖరి నశించాలంటూ నినదించారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ మండలి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాక ఈ అంశంపై చర్చిద్దామని చైర్మన్ నచ్చజెప్పినా సభ్యులు వినకపోవడంతో సభ ను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంత్రి హరీశ్రావు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉన్న డొమెస్టిక్ టెర్మినల్ను వేరుచేస్తూ, దానికి ఎన్టీ రామారావు పేరు పెట్టడంపై శాసనమండలి విచారం వ్యకం చేస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానానికి మూజువాణి ఓటుతో శాసన మండలి ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ నిర్ణయాన్నే అమలు చేశాం పౌర విమానయానశాఖ మంత్రి అశోక్గజపతి రాజు సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్లోని ఎయిర్పోర్టులో ఇంటర్నేషనల్ టర్మినల్కు రాజీవ్గాంధీపేరు, డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెడుతూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్నే తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని, కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు శుక్రవారం స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో భేటీ అనంతరం ఆయన నార్త్బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. 1999 లోనే డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరును పెట్టారని ఆయన గుర్తు చేశారు. శంషాబాద్కు ఎయిర్పోర్టు తరలినప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదన్నారు. తెలుగువారంతా అభిమానించే ఎన్టీరామారావును ఒక ప్రాంతానికి పరిమితం చేయ డం తగదన్నారు. ఎన్టీఆర్, కేసీఆర్, తాను ఇలా అంతా ఒక ప్రాంతానికే పరిమితం కాదని అంతా భారతీయులమేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోకుండా నే కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయని ప్రశ్నించగా, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వమూ పేరు ప్రతిపాదించవచన్నారు.వాటిని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సైతం ఎన్టీఆర్పై అభిమానంతో తన కుమారుడికి రామారావు పేరు పెట్టారని ఆయన గుర్తుచేశారు. -
ఆవిష్కరణలపై హక్కులకు.. పేటెంట్ అటార్నీ
ఏదైనా కొత్త వస్తువును/ సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టగానే దానిపై సర్వ హక్కులు, గుర్తింపు పొందాలంటే వెంటనే చేయాల్సిన పని.. పేటెంట్ రైట్స్ సొంతం చేసుకోవడం. ఇందుకోసం పేటెంట్ అటార్నీని సంప్రదించాలి. క్లయింట్ల తరఫున న్యాయస్థానంలో పోరాడి, పేటెంట్ హక్కులు సాధించి పెట్టే బాధ్యత పేటెంట్ అటార్నీదే. మన దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం లభిస్తుండడంతో ప్రతిరోజూ వివిధ నూతన ఆవిష్కరణలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేటెంట్ ప్రొఫెషనల్స్కు డిమాండ్ పెరుగుతోంది. పేటెంట్లపై జనంలో అవగాహన అధికమవుతోంది. భారత్లో పేటెంట్ రంగం ఎమర్జింగ్ కెరీర్. ఇందులో అభివృద్ధికి లెక్కలేనన్ని అవకాశాలున్నాయి. దీన్ని కెరీర్గా మార్చుకుంటే ఉపాధి అవకాశాలకు, ఆకర్షణీయమైన ఆదాయాలకు ఢోకా లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. కార్పొరేట్ సంస్థల్లో కొలువులు సైన్స్, న్యాయశాస్త్రం.. పూర్తిగా భిన్నమైన సబ్జెక్ట్లు. కానీ, ఈ రెండింటిని అభ్యసించినవారు అద్భుతమైన కెరీర్ను సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా? పేటెంట్ రంగంలోనే అది సాధ్యం. వ్యక్తులు లేదా సంస్థలు తమ పరిశోధన ద్వారా కనిపెట్టిన వస్తువుకు ఒక ప్రాంత/దేశ పరిధిలో ప్రభుత్వ గుర్తింపు, చట్టపరంగా రక్షణ కావాలంటే దానిపై పేటెంట్ హక్కులు పొందాలి. ఈ హక్కులను సాధించేది పేటెంట్ అటార్నీలే. సాధారణంగా పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. వ్యాజ్యాలు దాఖలవుతుంటాయి. ఆ వస్తువును తామే రూపొందించామంటూ ఇతరులు కోర్టుకెక్కే అవకాశాలుంటాయి. పేటెంట్ అటార్నీలు న్యాయపరంగా వీటిని పరిష్కరించి, పేటెంట్ను సాధించాల్సి ఉంటుంది. సదరు ఆవిష్కరణ తమ క్లయింట్ సొంతమంటూ ఆధారాలతో సహా రుజువు చేయాలి. ఇందుకు న్యాయ శాస్త్రంతోపాటు సబ్జెక్ట్ పరిజ్ఞానం కూడా ఉండాలి. పేటెంట్ అనేది మన దేశంలో డిమాండింగ్ ప్రొఫెషన్ అని నిపుణులు చెబుతున్నారు. భారత్లో నూతన వస్తువులు/ఆవిష్కరణలకు మేధో సంపత్తి హక్కులు(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) కూడా పొందడం క్రమంగా పెరుగుతోంది. ఇందుకోసం పేటెంట్ అటార్నీలను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు పేటెంట్ నిపుణులను నియమించుకుంటున్నాయి. సొంతంగా అటార్నీగా పనిచేసుకొనే వీలుంది. ఈ రంగంలో జీతభత్యాలు అధికంగానే అందుతాయి. కావాల్సిన నైపుణ్యాలు: అన్ని రంగాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. సమాచారాన్ని సరిగ్గా విశ్లేషించే నేర్పు ఉండాలి. అనలిటికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఏదైనా కొత్త ఆవిష్కరణను మరింత మెరుగుపర్చగల సృజనాత్మకత ప్రధానం. ఇన్వెన్షన్, డిజైన్, సాఫ్ట్వేర్లలో నైపుణ్యం ఉండాలి. వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, ఒత్తిళ్లను తట్టుకొని పనిచేయాలి. అర్హతలు: పేటెంట్ అటార్నీగా స్థిరపడాలనుకుంటే మెకానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సాఫ్ట్వేర్.. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులతో కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేయాలి. మాస్టర్స్ డిగ్రీ ఉంటే ఇంకా మంచిది. అనంతరం ఇంటలెక్చువల్ పేటెంట్ రైట్స్లో డిప్లొమా కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేస్తే న్యాయ సేవా సంస్థల్లో పేటెంట్ డిపార్ట్మెంట్లో ట్రైనీగా చేరేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదిపాటు పనిచేసి, పేటెంట్ ఏజెంట్స్ ఎగ్జామ్ రాయాలి. ఇందులో అర్హత సాధిస్తే పేటెంట్ ప్రొఫెషనల్గా వృత్తిలో అడుగుపెట్టొచ్చు. వేతనాలు: పేటెంట్ ప్రొఫెషనల్ ట్రైనీకి ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. కొంత అనుభవంతో రెగ్యులర్ ఉద్యోగిగా మారిన తర్వాత నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు అందుకోవచ్చు. వృత్తిలో మూడు నాలుగేళ్ల అనుభవం సంపాదిస్తే నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్ వెబ్సైట్: http://nalsar.ac.in/ ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్ వెబ్సైట్: http://iips.nmims.edu/ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటటెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్-నాగపూర్ వెబ్సైట్: www.ipindia.nic.in/niipm/ అకాడమీ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా వెబ్సైట్: www.academyipl.com -
దేశ సమగ్రతకే ఇది ముప్పు
‘ఫాస్ట్’పై టీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్ట్’ వంటి పథకం దేశ సమగ్రతకే ముప్పు అని రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి ఉత్తర్వులు దేశంలో వేర్పాటువాదానికి దారితీస్తాయంటూ తెలంగాణ సర్కారుపై మండిపడింది. అసలు ఈ విషయంలో ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే వస్తే మీకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ నివాసముంటున్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామంటూ... ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ పేరిట తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీవో కూడా జారీ అయింది. దీనిని సవాలు చేస్తూ.. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ‘‘భారతదేశం ఒక్కటే. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఈ దేశ పౌరులే. పేద విద్యార్థులకు (ఎస్సీ, ఎస్సీ, బీసీల)కు ఆర్థిక సాయం చేస్తున్నామంటే మేం అర్థం చేసుకోగలం. తెలంగాణ విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే ప్రభుత్వం ఎందుకు ‘ఫాస్ట్’ జీవోను తీసుకువచ్చింది..? దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఎందుకు వర్తింపజేయడం లేదు. ఎందుకీ వివక్ష..? తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.,’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. వివక్ష చూపుతున్నారు..: పిటిషనర్లు తొలుత పితాని సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ... నివాస ప్రాంతం ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష చూపే విధంగా ‘ఫాస్ట్’ జీవో ఉందని ధర్మాసనానికి నివేదించారు. జూన్ 2 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందని, హైదరాబాద్లో తెలంగాణేతర విద్యార్థులు వేలాది మంది విద్యను అభ్యసిస్తున్నారని... ‘ఫాస్ట్’ జీవో వల్ల వారంతా నష్టపోతారని విన్నవించుకున్నారు. ఇంకా అమలు చేయలేదు..: ప్రభుత్వం పిటిషనర్ల వాదనపై తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘ఫాస్ట్’ జీవో జారీ చేసినప్పటికీ, దానిని ఇప్పటివరకూ అమలు చేయలేదని కోర్టుకు తెలిపారు. ‘ఫాస్ట్’ జీవో వల్ల పిటిషనర్లకు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు. అందువల్ల ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని, వాటిని కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. అది రాజ్యాంగ విరుద్ధం..: ధర్మాసనం ఏజీ వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘‘మీరు జారీ చేసిన ‘ఫాస్ట్’ జీవో జాతీయ సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఉందా..? మీరు ఈ జీవోను ఎలా సమర్థించుకుంటారు? ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎంత మాత్రం అభినందనీయంగా లేదు. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారు..? మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుంది..?’’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వివక్ష చూపొద్దు.. ‘‘మనం సమైక్య రాజ్యంలో ఉన్నాం. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా..? సమైక్య రాజ్యంలో వివక్షకు తావు లేవు. స్థానికత ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. విధానం ఏదైనా సరే అది జాతి సమగ్రతను, సమైక్య స్ఫూర్తిని పెంపొందించేదిగా ఉండాలి. ఇటువంటి వివక్షాపూరిత విధానాలను మనం అడ్డుకోకుంటే... దుష్టశక్తులు ప్రవేశించి మన రాజ్యాంగ, సమైక్య స్ఫూర్తిని నాశనం చేస్తాయి. ప్రభుత్వాలు విధానాల రూపకల్పన చేసే ముందు జాతి సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుత వ్యవహారంలో జాతి సమగ్రత లోపించినట్లు కనిపిస్తోంది..’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫాస్ట్’ జీవో అమలుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, తాము ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఓ వర్గం విద్యార్థులకే ప్రయోజనాలను వర్తింప చేస్తూ జారీ చేసిన ఆ జీవోను ఎలా సమర్థించుకుంటారో వివరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
తెప్పను నెత్తిన పెట్టుకుని పోతామా?
బౌద్ధవాణి కొందరు తమకి ఉపయోగపడిన వస్తువు మీద అతి మమకారం పెంచుకుని, అది తమకే చెందాలనీ, దానిపై తమకు ఎంత ప్రేమ ఉందో నలుగురికీ తెలియజెప్పాలని తెగ ఆరాటపడిపోతుంటారు. అలాగే బుద్ధుని కాలంలో కూడా తాము నమ్మే సిద్ధాంతమే గొప్పదని, సర్వకాల సర్వావస్థలకూ అదే పనికొస్తుందని మూఢంగా నమ్మేవారు ఉండేవారు. తామే గొప్ప వారమనీ, తమ ధర్మమే గొప్పదని అహంకారంతో గడిపేవారు. అలాంటి వాళ్లు బౌద్ధ సంఘాలలో కూడా ఉండేవారు. ఈ విషయాన్ని గ్రహించిన బుద్ధుడు ఒకనాడు వారిని పిలిపించి, ‘‘భిక్షులారా! ఒక నదికి వరద వచ్చింది. మనం అవతలి ఒడ్డుకు చేరాలి. కాబట్టి కర్రలు, గడ్డీ ఉపయోగించి ఒక తెప్పను తయారు చేస్తాం. దాని సాయంతో అవతలి ఒడ్డుకు చేరుతాం. చేరాక, ఈ తెప్ప నాకు సాయపడింది అని చెప్పి దాన్ని నెత్తిన పెట్టుకుని పోతామా? అలా పోవడం కంటే దాన్ని అక్కడే ఉంచి లంగరు వేస్తే, మరొకరు దాని సాయంతో నదిని దాటుతారు. అలా ఎందరికో ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడేదాని పట్ల అతి మమకారంతో దాన్ని మోసుకుపోతే... ఇతరులకూ ఉపయోగపడదూ, మనకూ భారమైపోతుంది. ఏ వస్తువైనా, ఏ ధర్మమైనా అంతే. చివరికి నేను చెప్పే ధర్మం అయినా ఇంతే. దుఃఖం అనే వరదను దాటడానికే నా ధర్మం. నా ధర్మం తెప్పలాంటిది. మనం కూడా అంతే. మనం సాయం చెయ్యాలి. సహాయం పొందిన వారికి భారం కాకూడదు’’ అని చెప్పాడు. ఈ బోధతో వారిలోని అహంకారం నశించిపోయింది. - బొర్రా గోవర్ధన్ -
ద్వేషం మనసుని బలహీనం చేస్తుంది
ధ్యాన భావనలు మనసు నిండా ద్వేషం నింపుకున్న వ్యక్తి ఎన్నటికీ విశ్రాంతిగా గానీ, ప్రశాంతంగా గానీ ఉండలేడు. మనలో ద్వేష భావం ఉన్నదంటే, ఎవరో చేస్తున్న తప్పుకు మనం శిక్ష అనుభవిస్తున్నామని! ఎవరైనా ఒక వ్యక్తి గానీ, ఏదైనా ఒక వస్తువు గానీ మనకు అశాంతిని కలుగజేస్తే, ముందు మనకు కలిగేది చిరాకు లేదా కోపం. ఈ చిరాకు, కోపం నిముషంలోనే ద్వేషంగా మారుతుంది. అయితే ఆ చిరాకు లేదా కోపం కాసేపే ఉంటుంది కానీ, వాటి నుంచి పుట్టిన ద్వేషం మాత్రం శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చుంటుంది మనసులో. అలా ఎందరి మీదో, ఎన్ని వస్తువుల మీదో, ఎన్ని పరిస్థితుల మీదో మనం ద్వేషం పెంచుకుంటూ పోతే మన మనసు పూర్తిగా దెబ్బతింటుంది. ఇక ఎన్నటికీ దాని ఆరోగ్యం బాగుండదు. అంటే మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. అందువల్ల సాధకులుగా మనం ద్వేషాన్ని చిన్న సమస్యగా తీసి పారేయకూడదు. అది ఒక తీవ్రమైన, శాశ్వతమైన సమస్య. దాన్ని ప్రత్యేకంగా ఒక పట్టుపట్టాలి. అది కూడా చాలాకాలం పాటు. లేకపోతే ద్వేషం ఎన్నటికీ పోదు. ఏదో ఆషామాషీగా తీసిపారేయకూడదు. అతి ముఖ్యమైన అంశంగా చేసుకోవాలి. అసలు ద్వేషం ఎందుకు కలుగుతుంది? నాకు అశాంతి కానీ, అవస్థ గానీ కలిగితే తట్టుకోలేను కాబట్టి. అంటే మనసు బలహీనంగా ఉన్నట్టన్నమాట. బలహీనమైన మనసు ప్రతి చిన్నదానికీ రుసరుసలాడుతుంది. ద్వేషాన్ని పెంచుతుంది. ఈ ద్వేషాన్ని దరిచేరనీయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం మనసును దృఢపరచుకోవడం. శరీరానికి దెబ్బ తగిలితే ఏం చేస్తాం? చికిత్స చేస్తాం. అది బాధాకరంగా ఉండొచ్చు. అంతమాత్రాన శరీరాన్ని ద్వేషించము. అలాగే కొంతమందితో కఠినంగా వ్యవహరించాల్సి రావచ్చు. అందరినీ ఒకేలాగ చూడలేకపోవచ్చు. కానీ వాళ్ల మీద ద్వేషం పెంచుకోకుండా జాగ్రత్త పడాలి నేను. అంతేకాదు, వాళ్లు బాగుండాలని కోరుకోవాలి. వాళ్ల ఉన్నతి కోసం, పరిణతి కోసం దేవుని ప్రార్థించాలి. నా మనసు దృఢంగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. ప్రార్థన ద్వారా, నాకు నేను సూచనలు ఇచ్చుకోవడం ద్వారా నేను నా మనసుని దృఢపరచుకోగలను. ప్రతి ప్రార్థన ముగిశాక నేను మరింత దృఢం అయినట్లు భావిస్తాను. నేను మరింత దృఢంగా ఉన్నానని నాకు నేను చెప్పుకుంటాను. దేవుని కృప వల్ల, నేను మానసికంగా దృఢంగా ఉన్నాను. ప్రపంచంలో ఎవరినీ ద్వేషించను. కేవలం నాకు హాని చేయడమే తన జీవిత ధ్యేయంగా భావించే, నా అత్యంత భయంకరమైన శత్రువుని సైతం ద్వేషించను. ఆ శత్రువు పరిణతి చెందనందుకు అతని మీద జాలి పడతాను. అతని ఉన్నతి కోసం కూడా దేవుని ప్రార్థిస్తాను. అతని వల్ల నేను అవస్థ పడినప్పటికీ నేను అతన్ని ద్వేషించాలనేం లేదు. అతన్ని నేను ప్రేమించలేకపోవచ్చు. అలా ప్రేమించగలగడానికి మరింత శక్తి కావాలి కానీ, ముందుగా ద్వేషాన్నయితే మనసులోకి రానీయకూడదు. ఎప్పుడైతే మనసులో ద్వేషానికి చోటులేదో, అప్పుడు ప్రేమించడానికి అవకాశాలు మెరుగవుతాయి. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ) -
ఎస్సీ సిట్టింగ్ లపై కొర్రీ
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలతోపాటు, ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టిక్కెట్లు ఖరారు చేసినట్టే. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు పంపింది. 23 మంది ఎస్సీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి స్థానాల్లో కొత్త వారిని నిలపాలని టీపీసీసీ ప్రతిపాదించిందించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల సిట్టింగ్లతో పాటు ఇతర పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నందున ఆఖరు నిమిషపు మార్పులు చేర్పులకూ అక్కడక్కడ ఆస్కారం లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రాథమికంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కరి పేరు నుంచి పది, పన్నెండు పేర్ల వరకు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక జాబితాను రూపొందించి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి సమర్పించింది. టీపీసీసీ పంపిన జాబితాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను శాసనసభతోపాటు, పార్లమెంట్ అభ్యర్థులుగానూ సిఫారసు చేశారు.అయితే, టీపీసీసీ పంపిన జాబితాలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ (ఎస్సీ) పేరు గల్లంతయింది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, తెలంగాణ జేఏసీ నాయకుల పేర్లు కూడా ఈ జాబితాలో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీలో లేనివారు, ఇతర పార్టీల్లో ఇంకా కొనసాగుతున్న నాయకుల పేర్లనూ ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల దరఖాస్తులను కొద్దిరోజులుగా తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు పరిశీలించారు. ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీల ప్రతిపాదనలతోపాటు గాంధీభవన్కు నేరుగా దరఖాస్తు చేసుకున్న నేతల పేర్లనూ కలిపి క్రోడీకరించారు. వాటిలో అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ దామోదర రాజనరసింహలు ప్రత్యేకంగా సమావేశమై షార్ట్లిస్ట్ చేసి కమిటీకి సమర్పించారు.స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శనివారం ఢిల్లీలో వార్రూంలో సమావేశమై రాజ్యసభ, లోక్సభ సభ్యులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలను సేకరించారు.రాత్రి 11 గంటలకు ఈ సమావేశం ముగిసింది.కాగా ఈ సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డీ.శ్రీధర్బాబు,మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హాజరు కాలేదు. దీంతో వారిని రేపు ఉదయం 11గంటలకు జరిగే సమావేశానికి ఆహ్వానించారు.వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాక జాబితాలోని పేర్లను వడబోసి రెండుమూడు రోజుల్లో ఒకే పేరుతో తుది జాబితాను రూపొందించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదానికి పంపుతారు. ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా, సీపీఐ,న్యూడెమోక్రసీ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందని ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఈ ప్రక్రియనంతా నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 23 మంది ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలపాలని టీపీసీసీ నివేదించినట్టు తెలిసింది. పొన్నాల,దామోదర,ఉత్తమ్కుమార్ రెడ్డిలు ఈమేరకు నివేదించినట్టు తెలిసింది. 2009 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించిన అధిష్టానం....ఈసారి తెలంగాణ, సీమాంధ్ర జాబితాలను వేర్వేరుగా రూపొందిస్తోంది. అయితే తొలుత తెలంగాణ జాబితాను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఒకేసారి 119 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారా? లేక దశల వారీగా వెల్లడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేరును నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ స్థానాలకు కూడా సిఫారసు చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేరును అంబర్పేటకు సూచించగా....సనత్నగర్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు పురూరవరెడ్డిని ప్రతిపాదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, పి.సుదర్శన్రెడ్డి పేర్లను పార్లమెంట్ అభ్యర్థులుగానూ సిఫారసు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు వైశాలి పేర్లను జనగాం అసెంబ్లీతోపాటు, భువనగిరి పార్లమెంట్కు ప్రతిపాదించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ డి.శ్రీధర్బాబు, మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, జానారెడ్డి సహా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒకే ఒక్క పేరును మాత్రమే ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి, తెలంగాణ రాజకీయ జేఏసీ కో-ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, వేములవాడ ఆది శ్రీనివాస్ తదితర నేతలు ఇంకా కాంగ్రెస్లో చేరనప్పటికీ వారిపేర్లను టీపీసీసీ సిఫారసు చేయడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదరరెడ్డి వంటి ప్రముఖ నాయకులంతా తమతోపాటు కుటుంబ సభ్యుల పేర్లను కూడా టీపీసీసీ జాబితాలో చేర్పించినప్పటికీ కాంగ్రెస్లో సుధీర్ఘకాలం పనిచేసి మరణించిన ఉప్పునూతల పురుషోత్తమ్రెడ్డి(చివరి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు) కుమారుడు ప్రవీణ్రెడ్డి పేరును మాత్రం విస్మరించారు. భువనగిరి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న ప్రవీణ్రెడ్డి టీపీసీసీ, ఏఐసీసీల చుట్టూ తిరుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా: సిర్పూర్: పి.రాజ్యలక్ష్మి, పి.రవీందర్రావు, కె.సురేఖ, జి.మాలతి, ఇస్మాయిల్ అహ్మద్ జుల్ఫికర్, సుల్తాన్ అహ్మద్, జి.రామయ్య, చెన్నూరు: డి.శ్రీనివాస్, విద్యావర్థిని, ఎం.మల్లయ్య, అజ్మీరా హరినాయక్, పాతి శ్రీనివాస్, సొతుకు సంజీవరావు, మామిడి నారాయణ, పి.సంజీవ్, టి.రాజేశ్కుమార్, బెల్లంపల్లి: చిలుములు శంకర్, సి.దుర్గాభవాని, కె.హేమలత, శ్రీదేవి, రాజేశ్వరరావు, రవికుమార్, డి.నర్సయ్య, మంచిర్యాల: అరవింద్రెడ్డి గడ్డం(సిట్టింగ్), కె.ప్రేంసాగర్రావు, డేగ శ్రీనివాస్, మెండె రాజమౌళి, ఆసిఫాబాద్: ఆత్రం సక్కు(సిట్టింగ్), రమేశ్, ఆడె రమేశ్, ఖానాపూర్: అజ్మీరా హరినాయక్, జాదవ్ మాణిక్రావు నాయక్, ఎల్.భక్షినాయక్, రామకృష్ణనాయక్, భూక్యారమేశ్, సి.హెచ్.భరత్, రామకృష్ణ జాదవ్, భరత్ చౌహన్, ఆదిలాబాద్: జి.సుజాత, భార్గవ్ దేశ్పాండే, సి.రాంచంద్రారెడ్డి, వై.నర్సింగరావు, ఎ.సంజీవ్రెడ్డి, సిరాజ్ అమీనా ఖాన్, బోథ్: జాదవ్ అనిల్, ఎ.మహేందర్, కె.కోటేశ్వర్, నరేశ్జాదవ్, ఆడె పంచపుల, నిర్మల్: ఎ.మహేశ్వర్రెడ్డి(సిట్టింగ్), టి.జగన్మోహన్రెడ్డి, ఎ.రాజేశ్వర్, ముధోల్: జి.విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్, జి.మురళీగౌడ్. నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్: కె.ఆర్.సురేశ్రెడ్డి, మహేష్గౌడ్, ఎ.బి.శ్రీనివాస్, బోధన్: పి.సుదర్శన్రెడ్డి(సిట్టింగ్), పాషా మొయినుద్దీన్. జుక్కల్: డి.రాజేశ్వరరావు, జి.గంగాధర్, అరుణతార, ఎస్.గంగారాం. బాన్సువాడ: శ్రీనివాస్గౌడ్, ఆర్.వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాల్రాజ్, ఎల్లారెడ్డి: ఆకుల శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, జమునా రాథోడ్, బి.జనార్దన్గౌడ్, టి.సుభాష్. కామారెడ్డి: షబ్బీర్అలీ, ఎడ్ల రాజిరెడ్డి, నిజామాబాద్ అర్బన్: డి.శ్రీనివాస్, తాహెర్బిన్, డి.సంజయ్, మహేశ్ గౌడ్, బి.మోహన్రెడ్డి. నిజామాబాద్ రూరల్ : డి.శ్రీనివాస్, ఆకుల లలిత, డి.సంజయ్, మహేశ్ గౌడ్. బాల్కొండ: ఇ.అనిల్(సిట్టింగ్), కె.ఆర్.సురేష్రెడ్డి, ప్రేమలతా అగర్వాల్. కరీంనగర్ జిల్లా: కోరుట్ల: డాక్టర్ జె.ఎన్.వెంకట్, కొమిరెడ్డి రాములు. జగిత్యాల: టి.జీవన్రెడ్డి, సుద్దాల దేవయ్య (ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే) ధర్మపురి: ఎ.లక్ష్మణ్కుమార్ రామగుండం: గంటా సత్యనారాయణరెడ్డి, జి.వెంకట్రామిరెడ్డి, జి.సత్యనారాయణ, హెచ్.వేణుగోపాల్రావు, సలీంపాషా, కౌశిక్ హరి, కోలేటి దామోదర్, గుర్రం శ్రీనివాస్రెడ్డి మంథని: డి.శ్రీధర్బాబు(సిట్టింగ్) పెద్దపల్లి: జి.ముకుందరెడ్డి, భానుప్రసాద్రావు, డాక్టర్ షెట్టి, బి.రాజమల్లు, ఇ.కొమరయ్య, దానయ్య, అనయ్య గౌడ్, దేవనంది ధర్మయ్య కరీంనగర్: సి.లక్ష్మీనరసింహరావు, బొమ్మ వెంకన్న, వి.జగపతిరావు, వి.కృష్ణమోహన్రావు, నేరెళ్ల శారద, వి.జగపతిరావు, జి.మహేందర్రావు, బి.శ్రీరాంచక్రవర్తి, రాజనాల శ్రీహరి చొప్పదండి: సుద్దాల దేవయ్య, గజ్జల కాంతం, నాగి శేఖర్, ఎం.సత్యం, జి.రాంచందర్, రవీంద్రనాథ్, భీంరావు, కె.రామకృష్ణ వేములవాడ: ఎ.మనోహర్రెడ్డి, నాగం కుమార్, ఆది శ్రీనివాస్, పాపారావు, రవీందర్గౌడ్, కె.రవీందర్రావు, ఎ.రమేశ్, జలందర్ సిరిసిల్ల: కె.రవీందర్రావు, జి.మంజుల, కటకం మృత్యుంజయం, కె.కె.మహేందర్రెడ్డి, జి.జ్యోతికిరణ్, రేగులపాటి పాపారావు, కె.రేఖ,కె. సత్యనారాయణగౌడ్ మానకొండూరు: ఆరేపల్లి మోహన్(సిట్టింగ్) హుజురాబాద్: కె. సుదర్శన్రెడ్డి, సత్యనారాయణ గౌడ్, కౌశిక్రెడ్డి, సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పి.రవీందర్రెడ్డి, వి.కృష్ణమోహనరావు, ఈ.భీమారావు హుస్నాబాద్: ఎ.ప్రవీణ్రెడ్డి(సిట్టింగ్), బొమ్మ వెంకటేశ్వర్లు. మెదక్ జిల్లా: సిద్దిపేట: జి.మహేందర్రావు, గొడుగు రఘు, టి.శ్రీనివాస్గౌడ్, ఎస్.వి.రవీంద్రనాథ్, గూడూరి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్ మెదక్: పి.శశిధర్రెడ్డి, సుప్రభాత్, ఎస్.జె.శ్రీనివాస్రావు, పి.రాంచందర్గౌడ్, ఎల్.ప్రభాకర్వర్మ నారాయణఖేడ్: పి.కిష్టారెడ్డి ఆందోల్: దామోదర రాజనర్సింహ (సిట్టింగ్) నర్సాపూర్: వి.సునీతాలక్ష్మారెడ్డి జహీరాబాద్: జె.గీతారెడ్డి (సిట్టింగ్) కె.శామ్యూల్ సంగారెడ్డి: టి.జయప్రకాశ్రెడ్డి(సిట్టింగ్), బి.రాజేశ్వర్దేశ్పాండే, పి.మమతాగౌడ్, సాజిద్పాషా, ఎ.రాంగౌడ్ పటాన్చెరు: టి.న ందీశ్వర్గౌడ్(సిట్టింగ్), వి.భూపాల్రెడ్డి, ఎం.శంకర్యాదవ్, బి.పుష్పానగేశ్, కె.బాల్రెడ్డి, సాజిద్ పాషా దుబ్బాక: సి.హెచ్.ముత్యంరెడ్డి(సిట్టింగ్), గాల్రెడ్డి, సోమేశ్వర్రెడ్డి, ఉమాదేవి, బండి నర్సాగౌడ్, బి.మనోహర్రావు, జి.కృష్ణారెడ్డి గజ్వేల్: కె.లింగం, టి.నర్సారెడ్డి(సిట్టింగ్). రంగారెడ్డి జిల్లా: మేడ్చల్: కె.లక్ష్మారెడ్డి(సిట్టింగ్), పి.శ్రీనివాస్రెడ్డి, ఎస్.నవీన్చందర్, పి.నర్సింహారెడ్డి, తలారి యాదగరి యాదవ్ మల్కాజిగిరి: ఎ.రాజేందర్(సిట్టింగ్), శ్రీధర్, జి.సుమతీదేవి, సురేష్యాదవ్, జె.అమరనాథ్గౌడ్, బి.మల్లికార్జున్యాదవ్, ఎన్.శ్రీధర్ కుత్బుల్లాపూర్: కూన శ్రీశైలం గౌడ్(సిట్టింగ్), కె.ఎం.ప్రతాప్, హనుమంతరెడ్డి, ఎన్.ప్రభాకర్గౌడ్, కె.నీరజ రెడ్డి కూకట్పల్లి: కాసాని జ్ఞానేశ్వర్, కాట్రగడ్డ ప్రసూన సహా 25 పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఉప్పల్: రాజిరెడ్డి(సిట్టింగ్), బండ కార్తీక చంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, రాగడి లక్ష్మణ్రెడ్డి, పి.ప్రభాకర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, శివారెడ్డి, ఇబ్రహీంపట్నం: కైమ మల్లేష్, శేఖర్రెడ్డి, సంధ్యారాణి, పి.లక్ష్మీపతిగౌడ్, ఎస్.రజితారెడ్డి, ఎం.రంగారెడ్డి, ఎం.ఎ.అన్సారీ, బండారి మోహన్రెడ్డి, అర్రబోలు లక్ష్మారెడ్డి ఎల్బీనగర్: డి.సుధీర్రెడ్డి(సిట్టింగ్), రాముగౌడ్, సామకృష్ణారెడ్డి మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి(సిట్టింగ్), సామ గణేష్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి, కోదండరెడ్డి, రాజేంద్రనగర్: సబితాఇంద్రారెడ్డి, కార్తీక్రెడ్డి, జ్ఞానేశ్వర్, రణధీర్రెడ్డి, ఎల్లయ్య, వేణుగౌడ్, జనార్దన్రెడ్డి, పుష్వంత్రెడ్డి, కరుణాకర్గౌడ్ శేరిలింగంపల్లి: భిక్షపతియాదవ్(సిట్టింగ్), జగదీశ్వర్గౌడ్, ఎం.విమల్కుమార్, కె.యాదయ్య, ఆర్.సుజాతరెడ్డి, ఆర్.నాగేందర్యాదవ్ చేవెళ్ల: బి.కైలాస్, ఎ.కృష్ణ, వెంకటస్వామి, కె.యాదయ్య, సదాలక్ష్మి, ఎం.విమల్, మైలారం సులోచన, జశ్వంత్ కుమార్, చింతల యాదగిరి, జి.ఎస్.రావు పరిగి: టి.రామ్మోహన్రెడ్డి, కె.రాంరెడ్డి, కె.వెంకటేశం వికారాబాద్: గడ్డం ప్రసాద్రావు(సిట్టింగ్), ఎం.చంద్రశేఖర్ తాండూరు: ఎం.రమేశ్, విశ్వనాథ్గౌడ్, కె.యాదయ్య, ఎ.కృష్ణ, వెంకటస్వామి, నారాయణరావు. హైదరాబాద్ జిల్లా: ముషీరాబాద్: మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కుమారుడు శ్రీనివాస్రెడ్డి, బండ కార్తీకరెడ్డి, అనిల్యాదవ్, ఎం.కోదండరెడ్డి, తదితరులతో పాటు మొత్తం 25 మంది పేర్లు వచ్చాయి. మలక్పేట: కిషన్, అల్తాఫ్ మహ్మద్, ఎం.ఎం.కె.ఖాన్, జి.వెంకటేశ్వర్రెడ్డి అంబర్పేట్: వి.హనుమంతరావు(ఎంపీ రాజ్యసభ), దిడ్డి రాంబాబు, ఎ.ఉదయ్కుమార్, జి.రమేశ్, జి.శ్రీనివాస్గౌడ్, జి.ఇంద్రారావు, మక్బూల్ షరీఫ్, కె.సంజీవ్యాదవ్ ఖైరతాబాద్: డి.నాగేందర్(సిట్టింగ్), ఎం.డి.జాంగీర్, ఎం.రాజగోపాల్ వినోద్రెడ్డి జూబ్లీహిల్స్: విష్ణువర్దన్రెడ్డి(సిట్టింగ్), ఇందుకూరి నిర్మలాదేవి, ఎం.షరీఫ్, అక్బర్ అయూబ్ సనత్నగర్: ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తన కుమారుడు పురూరవ రెడ్డి పేరుప్రతిపాదించారు. నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్ఖాన్, మెట్టు సాయి, ఎం.అశోక్, కొండల్రావు, కార్వాన్: జె.రవీందర్, పి.శోభారాణి గోషామహల్: ముఖేష్గౌడ్(సిట్టింగ్), ఆయన కుమారుడు విక్రంగౌడ్, ప్రేమ్లాల్ చార్మినార్: పి.లక్ష్మణ్రావు, నాగజ్యోతి, ఆర్.ప్రభాకర్రెడ్డి, మీర్జా అస్కర్ అలీ బేగ్, మూసా ఖాసిం, సత్యనారాయణ చాంద్రాయణగుట్ట: జె.రాజేందర్, ఎం.కృష్ణ తదితర 11 మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. యాకుత్పుర: అరుణ్ప్రసాద్ ఠాకూర్, రేణు, పి.రాజేందర్, అరుణ్ప్రసాద్, రాజేందర్రాజు, ఆర్.మల్లేశం, రంగాశ్రీకాంత్, ఆర్.సత్యనారాయణ బహదూర్పుర: సయ్యద్ అబ్దుల్ సమి, ఎస్.మంజుల, కె.రవిరాజు తదితర 10 పేర్లు వచ్చాయి. సికింద్రాబాద్: జయసుధ(సిట్టింగ్), ఉమాదేవి, బండ కార్తీక చంద్రారెడ్డి, సంతోష్, పి.లక్ష్మణ్గౌడ్, పి.కృష్ణ, కృష్ణకుమార్గౌడ్, మేరీ రవీంద్రనాథ్, అమర్నాథ్గౌడ్, కృష్ణగౌడ్, ఎం.ప్రవీణ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్: డాక్టర్ శంకర్రావు(సిట్టింగ్), సర్వే సత్యనారాయణ(గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సిఫారసు), సుస్మిత, ముప్పిడి గోపాల్. మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్: డి.విఠల్రావు(మాజీ ఎంపీ), గురునాథ్రెడ్డి, ఎస్.కృష్ణ, మల్కిరెడ్డి, ఎం.డి.సలీం, ఎం.కృష్ణ, ఎ.లక్ష్మారెడ్డి నారాయణపేట: డి.రాజేందర్రెడ్డి(డిప్యూటీ తహసీల్దార్), రవీందర్రెడ్డి, పులి అంజనమ్మ, నర్సింహారెడ్డి, సాయిబాబా, కె.వీరారెడ్డి, బి.వెంకట్రామిరెడ్డి, కృష్ణ మహబూబ్నగర్: ఒబేదుల్లా కొత్వాల్, బి.వెంకట్రామిరెడ్డి, ముత్యాల ప్రకాశ్, ఎస్.జగదీశ్వర్రెడ్డి, పులి అంజమ్మ, ఖలీద్హ్రమాన్, టి.రేవతిగౌడ్, కె.విజయ్కుమార్ జడ్చర్ల: మల్లు రవి, రమేశ్రెడ్డి, రాంప్రసాద్, రమేశ్రెడ్డి, సాదు వెంకట్రెడ్డి, టి.రేవతిగౌడ్, ఎం.కె.రహమాన్, ఎల్.కృష్ణయ్య దేవరకద్ర: జి.బాలకిష్టయ్య, బి.పవన్రెడ్డి, విశ్వేశ్వర్, ప్రదీప్గౌడ్, కె.శ్రీనివాసులు, స్వర్ణసుధాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, పొగాకు విశ్వేశ్వర్ మక్తల్: చింతం రామ్మోహన్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, శ్రీహరి, ఎ.సత్యనారాయణ, ఎం.జలంధర్రెడ్డి వనపర్తి: డాక్టర్ జి.చిన్నారెడ్డి గద్వాల: డి.కె.అరుణ ఆలంపూర్: వి.ఎం.అబ్రహం(సిట్టింగ్), ఎస్.సంపత్, ఆంజనేయులు, ఎ.ప్రకాశం నాగర్కర్నూలు: కె.దామోదర్రెడ్డి, దిలీపాచారి, మోహన్గౌడ్, కె.రాజేశ్ అచ్చంపేట: డాక్టర్ వంశీకృష్ణ, కృష్ణయ్య, డాక్టర్ అనురాధ, కె.రామనాథం కల్వకుర్తి: వంశీచందర్రెడ్డి(యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు), ఎస్.రామిరెడ్డి, జె.చిత్తరంజన్దాస్, ఆర్.నార్యానాయక్ షాద్నగర్: ప్రతాప్రెడ్డి(సిట్టింగ్), కె.శంకరయ్య, ఎల్లారెడ్డి, నరేందర్, పి.సుస్మిత, కాడేపల్లి శ్రీనివాస్ కొల్లాపూర్: విష్ణువర్ధన్రెడ్డి, రామ్మూర్తి నాయుడు, హర్షవర్దన్రెడ్డి, జగన్మోహన్దాస్, కమలేశ్వరి, కేతూరి వెంకటేశ్, మేడిపల్లి సురేష్రెడ్డి, టి.రేవతిగౌడ్. నల్లగొండ జిల్లా: దేవరకొండ: ఎ.లక్ష్మీనాయక్, బాలూ నాయక్, స్కైలాబ్నాయక్, జగన్లాల్ నాయక్, రమేశ్నాయక్ నాగార్జునసాగర్: కె.జానారెడ్డి(సిట్టింగ్), ఆయన కుమారుడు రఘువీర్రెడ్డి మిర్యాలగూడ: ఆర్.రమేశ్, టి.దేవేందర్రెడ్డి, రేపాల శ్రీనివాస్, కె.రఘువీర్రెడ్డి, నేతి విద్యాసాగర్, పి.రామలింగయ్యయాదవ్, టి.విజయసింహారెడ్డి, కె.చంద్రశేఖర్రెడ్డి, కె.జ్యోతిరెడ్డి, చింతల సోమన్న హుజూర్నగర్: ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి(సిట్టింగ్) కోదాడ: నల్లమాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట: ఆర్.దామోదర్రెడ్డి(సిట్టింగ్), వై.రాము, వేదాసు వెంకయ్య నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), జి.మోహన్రెడ్డి, హఫీజ్ఖాన్ మునుగోడు: పాల్వాయి స్రవంతి, పున్నా కైలాస్ నేత(ఓయూ జేఏసీ), బి.లింగయ్యయాదవ్, రాపోలు జె.ప్రకాష్, అబ్దుల్ హఫీజ్ఖాన్, సుంకర మల్లేష్గౌడ్, గర్దాసు బాలయ్య, లింగం యాదవ్, చింతల సోమన్న, ఎ.లక్ష్మారెడ్డి భువనగిరి: చింతల వెంకటేశ్వరరెడ్డి, లింగంయాదవ్, పున్నా రామలింగం, కుంబం అనిల్, కల్పన, బి.యాదగిరి, వెంకట శ్రీనివాసరావు, డాక్టర్ వి.ప్రజోత్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్పనా కుమారి, పొత్నాక ప్రమోద్, నకిరేకల్: చిరుమర్తి లింగయ్య(సిట్టింగ్), వే దాసు వెంకయ్య, డి.రాజేశ్వర్, కె.మల్లయ్య, అరున్ సికిలిం, జి.జనార్దన్, పోలేని యాదగిరి, నేతి విద్యాసాగర్, తుంగతుర్తి: కె.పరమేశ్వర్, కరణ్ జయరాజ్(జేఏసీ), ఎన్.ప్రీతమ్, ఎం.అరుణ్. ఆర్.జగన్లాల్, ఎ.ప్రభాకర్, దోసపాటి గోపాల్, జి.నర్సయ్య, ఎ.జ్ఞానసుందర్, నగ రగిరి ప్రీతమ్, బోడ రాములు, పోలేని యాదగిరి ఆలేరు: బి.భిక్షమయ్యగౌడ్(సిట్టింగ్), మూర్తి ఐలయ్య, వి.ప్రజత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, ఎ.సంజీవరెడ్డి, పి.శ్రీనివాస్గౌడ్. వరంగల్ జిల్లా: జనగాం: పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల వైశాలి స్టేషన్ ఘన్పూర్: విజయరామారావు, బి.ఆరోగ్యం, ఇంద్రా, బి.రవీందర్, రాజమౌళి, ఆర్.ప్రతాప్, కీసర దిలీప్రెడ్డి, చెరుపూరి చిరంజీవి పాలకుర్తి: ఆర్.నర్సింహరెడ్డి, అశోక్గౌడ్, డి.శ్రీనివాస్రావు, రఘురాంరెడ్డి, భరత్చంద్రారెడ్డి, బి.శ్రీనివాస్రావు, శ్రీరాంభద్రయ్య, జి.నర్సయ్య డోర్నకల్: డి.ఎస్.రెడ్యానాయక్, రాంలాల్, రజనీకాంత్నాయక్ మహబూబాబాద్: ఎం.కవిత(సిట్టింగ్), డి.పోలమ్మ, జి.సుచిత్ర, ఎ.ర జనీకాంత్నాయక్ నర్సంపేట: డి.మాధవరెడ్డి, బి.యాదగిరి, సత్యనారాయణగౌడ్ పరకాల: రాంభద్రయ్య, సాంబారి సమ్మారావు, మంద రమేశ్, వెంకటరామిరెడ్డి దేశాయ్ వరంగల్ వెస్ట్: రాజేందర్రెడ్డి, స్వర్ణ, పి.వి.రాజేశ్వరరావు, డి.ప్రభాకర్రెడ్డి, విద్యాసాగర్, హరిరమాదేవి, జి.రమాకాంత్రెడ్డి, పి.రామేశ్వర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఆనంద్కుమార్, నరేందర్రెడ్డి, పి.నరోత్తంరెడ్డి, కె.నరేందర్రెడ్డి, జి.ప్రకాశ్రెడ్డి వరంగల్ ఈస్ట్: బసవరాజు సారయ్య(సిట్టింగ్)తో పాటు మరో ఐదు పేర్లు పరిశీలనకు వచ్చాయి వర్ధన్నపేట: బి.దేవయ్య, ఆనంద్, బక్కా జడ్సన్, టి.విజయ, ఎన్.శ్రీనివాస్, టి.సూర్యనారాయణ (ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కె. శ్రీధర్ పేరు ప్రతిపాదించలేదు) భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి(సిట్టింగ్), జి.మల్లేశం ములుగు: పి.వీరయ్య, సి.సత్యం, ఎ.బలరాం, ఎ.రజనీకాంత్నాయక్, జైరాంనాయక్, ప్రీతంకుమార్, మణీశ్వరరావు. ఖమ్మం జిల్లా: పినపాక: జి.సుబ్బారావు, కె.భద్రయ్య, ఇల్లెందు: డాక్టర్ డి.టి.నాయక్, చేపూరి రవి, మంగీలాల్, మిఠియా నాయక్, బాలాజీరావు, వెంకట్రాం, తేజావత్రూపాభాయి, పాపానాయక్, తేజావన్ మదన్సింగ్, కొర్రం కనకయ్య ఖమ్మం: పువ్వాడ అజయ్, యూనస్ సుల్తాన్, రాపర్తి రంగారావు సహా మొత్తం 12 పేర్లు పరిశీలనకు వచ్చాయి. పాలేరు: రాంరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), ఎ.శ్రీరాంయాదవ్, ఆర్.మాధవిరెడ్డి, నాగేశ్వరరావు, బి.హనుమంతురావు, నరేశ్రెడ్డి మధిర: మల్లు భట్టివిక్రమార్క(సిట్టింగ్), ఎన్.కుటుంబరావు వైరా: భూక్యా రాంజీ, బానోతు ఎస్సీ సిట్టింగ లపై కొర్రీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలతోపాటు, ఎమ్మెల్యేలందరికీ దాదాపుగా టిక్కెట్లు ఖరారు చేసినట్టే. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు పంపింది. 23 మంది ఎస్సీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి స్థానాల్లో కొత్త వారిని నిలపాలని టీపీసీసీ ప్రతిపాదించిందించినట్లు తెలిసింది. కొన్ని చోట్ల సిట్టింగ్లతో పాటు ఇతర పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నందున ఆఖరు నిమిషపు మార్పులు చేర్పులకూ అక్కడక్కడ ఆస్కారం లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రాథమికంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కరి పేరు నుంచి పది, పన్నెండు పేర్ల వరకు ప్రతిపాదిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక జాబితాను రూపొందించి ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి సమర్పించింది. టీపీసీసీ పంపిన జాబితాలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను శాసనసభతోపాటు, పార్లమెంట్ అభ్యర్థులుగానూ సిఫారసు చేశారు.అయితే, టీపీసీసీ పంపిన జాబితాలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ (ఎస్సీ) పేరు గల్లంతయింది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు, తెలంగాణ జేఏసీ నాయకుల పేర్లు కూడా ఈ జాబితాలో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీలో లేనివారు, ఇతర పార్టీల్లో ఇంకా కొనసాగుతున్న నాయకుల పేర్లనూ ఈ జాబితాలో చేర్చడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల దరఖాస్తులను కొద్దిరోజులుగా తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు పరిశీలించారు. ఏఐసీసీ, టీపీసీసీ, డీసీసీల ప్రతిపాదనలతోపాటు గాంధీభవన్కు నేరుగా దరఖాస్తు చేసుకున్న నేతల పేర్లనూ కలిపి క్రోడీకరించారు. వాటిలో అభ్యర్థుల బలాబలాలు, గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. శుక్రవారం రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ దామోదర రాజనరసింహలు ప్రత్యేకంగా సమావేశమై షార్ట్లిస్ట్ చేసి కమిటీకి సమర్పించారు.స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శనివారం ఢిల్లీలో వార్రూంలో సమావేశమై రాజ్యసభ, లోక్సభ సభ్యులు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యుల అభిప్రాయాలను సేకరించారు.రాత్రి 11 గంటలకు ఈ సమావేశం ముగిసింది.కాగా ఈ సమావేశానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డీ.శ్రీధర్బాబు,మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిలు హాజరు కాలేదు. దీంతో వారిని రేపు ఉదయం 11గంటలకు జరిగే సమావేశానికి ఆహ్వానించారు.వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాక జాబితాలోని పేర్లను వడబోసి రెండుమూడు రోజుల్లో ఒకే పేరుతో తుది జాబితాను రూపొందించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదానికి పంపుతారు. ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా, సీపీఐ,న్యూడెమోక్రసీ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే ఎలా ఉంటుందని ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఈ ప్రక్రియనంతా నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 23 మంది ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలపాలని టీపీసీసీ నివేదించినట్టు తెలిసింది. పొన్నాల,దామోదర,ఉత్తమ్కుమార్ రెడ్డిలు ఈమేరకు నివేదించినట్టు తెలిసింది. 2009 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించిన అధిష్టానం....ఈసారి తెలంగాణ, సీమాంధ్ర జాబితాలను వేర్వేరుగా రూపొందిస్తోంది. అయితే తొలుత తెలంగాణ జాబితాను సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఒకేసారి 119 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారా? లేక దశల వారీగా వెల్లడిస్తారా? అనేది తేలాల్సి ఉంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేరును నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ స్థానాలకు కూడా సిఫారసు చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పేరును అంబర్పేటకు సూచించగా....సనత్నగర్ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు పురూరవరెడ్డిని ప్రతిపాదించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, పి.సుదర్శన్రెడ్డి పేర్లను పార్లమెంట్ అభ్యర్థులుగానూ సిఫారసు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు వైశాలి పేర్లను జనగాం అసెంబ్లీతోపాటు, భువనగిరి పార్లమెంట్కు ప్రతిపాదించారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ డి.శ్రీధర్బాబు, మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, జానారెడ్డి సహా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒకే ఒక్క పేరును మాత్రమే ప్రతిపాదించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మి, తెలంగాణ రాజకీయ జేఏసీ కో-ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, వేములవాడ ఆది శ్రీనివాస్ తదితర నేతలు ఇంకా కాంగ్రెస్లో చేరనప్పటికీ వారిపేర్లను టీపీసీసీ సిఫారసు చేయడం గమనార్హం. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదరరెడ్డి వంటి ప్రముఖ నాయకులంతా తమతోపాటు కుటుంబ సభ్యుల పేర్లను కూడా టీపీసీసీ జాబితాలో చేర్పించినప్పటికీ కాంగ్రెస్లో సుధీర్ఘకాలం పనిచేసి మరణించిన ఉప్పునూతల పురుషోత్తమ్రెడ్డి(చివరి రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు) కుమారుడు ప్రవీణ్రెడ్డి పేరును మాత్రం విస్మరించారు. భువనగిరి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్న ప్రవీణ్రెడ్డి టీపీసీసీ, ఏఐసీసీల చుట్టూ తిరుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా: సిర్పూర్: పి.రాజ్యలక్ష్మి, పి.రవీందర్రావు, కె.సురేఖ, జి.మాలతి, ఇస్మాయిల్ అహ్మద్ జుల్ఫికర్, సుల్తాన్ అహ్మద్, జి.రామయ్య, చెన్నూరు: డి.శ్రీనివాస్, విద్యావర్థిని, ఎం.మల్లయ్య, అజ్మీరా హరినాయక్, పాతి శ్రీనివాస్, సొతుకు సంజీవరావు, మామిడి నారాయణ, పి.సంజీవ్, టి.రాజేశ్కుమార్, బెల్లంపల్లి: చిలుములు శంకర్, సి.దుర్గాభవాని, కె.హేమలత, శ్రీదేవి, రాజేశ్వరరావు, రవికుమార్, డి.నర్సయ్య, మంచిర్యాల: అరవింద్రెడ్డి గడ్డం(సిట్టింగ్), కె.ప్రేంసాగర్రావు, డేగ శ్రీనివాస్, మెండె రాజమౌళి, ఆసిఫాబాద్: ఆత్రం సక్కు(సిట్టింగ్), రమేశ్, ఆడె రమేశ్, ఖానాపూర్: అజ్మీరా హరినాయక్, జాదవ్ మాణిక్రావు నాయక్, ఎల్.భక్షినాయక్, రామకృష్ణనాయక్, భూక్యారమేశ్, సి.హెచ్.భరత్, రామకృష్ణ జాదవ్, భరత్ చౌహన్, ఆదిలాబాద్: జి.సుజాత, భార్గవ్ దేశ్పాండే, సి.రాంచంద్రారెడ్డి, వై.నర్సింగరావు, ఎ.సంజీవ్రెడ్డి, సిరాజ్ అమీనా ఖాన్, బోథ్: జాదవ్ అనిల్, ఎ.మహేందర్, కె.కోటేశ్వర్, నరేశ్జాదవ్, ఆడె పంచపుల, నిర్మల్: ఎ.మహేశ్వర్రెడ్డి(సిట్టింగ్), టి.జగన్మోహన్రెడ్డి, ఎ.రాజేశ్వర్, ముధోల్: జి.విఠల్రెడ్డి, నారాయణరావు పటేల్, జి.మురళీగౌడ్. నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్: కె.ఆర్.సురేశ్రెడ్డి, మహేష్గౌడ్, ఎ.బి.శ్రీనివాస్, బోధన్: పి.సుదర్శన్రెడ్డి(సిట్టింగ్), పాషా మొయినుద్దీన్. జుక్కల్: డి.రాజేశ్వరరావు, జి.గంగాధర్, అరుణతార, ఎస్.గంగారాం. బాన్సువాడ: శ్రీనివాస్గౌడ్, ఆర్.వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, బాల్రాజ్, ఎల్లారెడ్డి: ఆకుల శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, జమునా రాథోడ్, బి.జనార్దన్గౌడ్, టి.సుభాష్. కామారెడ్డి: షబ్బీర్అలీ, ఎడ్ల రాజిరెడ్డి, నిజామాబాద్ అర్బన్: డి.శ్రీనివాస్, తాహెర్బిన్, డి.సంజయ్, మహేశ్ గౌడ్, బి.మోహన్రెడ్డి. నిజామాబాద్ రూరల్ : డి.శ్రీనివాస్, ఆకుల లలిత, డి.సంజయ్, మహేశ్ గౌడ్. బాల్కొండ: ఇ.అనిల్(సిట్టింగ్), కె.ఆర్.సురేష్రెడ్డి, ప్రేమలతా అగర్వాల్. కరీంనగర్ జిల్లా: కోరుట్ల: డాక్టర్ జె.ఎన్.వెంకట్, కొమిరెడ్డి రాములు. జగిత్యాల: టి.జీవన్రెడ్డి, సుద్దాల దేవయ్య (ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే) ధర్మపురి: ఎ.లక్ష్మణ్కుమార్ రామగుండం: గంటా సత్యనారాయణరెడ్డి, జి.వెంకట్రామిరెడ్డి, జి.సత్యనారాయణ, హెచ్.వేణుగోపాల్రావు, సలీంపాషా, కౌశిక్ హరి, కోలేటి దామోదర్, గుర్రం శ్రీనివాస్రెడ్డి మంథని: డి.శ్రీధర్బాబు(సిట్టింగ్) పెద్దపల్లి: జి.ముకుందరెడ్డి, భానుప్రసాద్రావు, డాక్టర్ షెట్టి, బి.రాజమల్లు, ఇ.కొమరయ్య, దానయ్య, అనయ్య గౌడ్, దేవనంది ధర్మయ్య కరీంనగర్: సి.లక్ష్మీనరసింహరావు, బొమ్మ వెంకన్న, వి.జగపతిరావు, వి.కృష్ణమోహన్రావు, నేరెళ్ల శారద, వి.జగపతిరావు, జి.మహేందర్రావు, బి.శ్రీరాంచక్రవర్తి, రాజనాల శ్రీహరి చొప్పదండి: సుద్దాల దేవయ్య, గజ్జల కాంతం, నాగి శేఖర్, ఎం.సత్యం, జి.రాంచందర్, రవీంద్రనాథ్, భీంరావు, కె.రామకృష్ణ వేములవాడ: ఎ.మనోహర్రెడ్డి, నాగం కుమార్, ఆది శ్రీనివాస్, పాపారావు, రవీందర్గౌడ్, కె.రవీందర్రావు, ఎ.రమేశ్, జలందర్ సిరిసిల్ల: కె.రవీందర్రావు, జి.మంజుల, కటకం మృత్యుంజయం, కె.కె.మహేందర్రెడ్డి, జి.జ్యోతికిరణ్, రేగులపాటి పాపారావు, కె.రేఖ,కె. సత్యనారాయణగౌడ్ మానకొండూరు: ఆరేపల్లి మోహన్(సిట్టింగ్) హుజురాబాద్: కె. సుదర్శన్రెడ్డి, సత్యనారాయణ గౌడ్, కౌశిక్రెడ్డి, సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పి.రవీందర్రెడ్డి, వి.కృష్ణమోహనరావు, ఈ.భీమారావు హుస్నాబాద్: ఎ.ప్రవీణ్రెడ్డి(సిట్టింగ్), బొమ్మ వెంకటేశ్వర్లు. మెదక్ జిల్లా: సిద్దిపేట: జి.మహేందర్రావు, గొడుగు రఘు, టి.శ్రీనివాస్గౌడ్, ఎస్.వి.రవీంద్రనాథ్, గూడూరి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్ మెదక్: పి.శశిధర్రెడ్డి, సుప్రభాత్, ఎస్.జె.శ్రీనివాస్రావు, పి.రాంచందర్గౌడ్, ఎల్.ప్రభాకర్వర్మ నారాయణఖేడ్: పి.కిష్టారెడ్డి ఆందోల్: దామోదర రాజనర్సింహ (సిట్టింగ్) నర్సాపూర్: వి.సునీతాలక్ష్మారెడ్డి జహీరాబాద్: జె.గీతారెడ్డి (సిట్టింగ్) కె.శామ్యూల్ సంగారెడ్డి: టి.జయప్రకాశ్రెడ్డి(సిట్టింగ్), బి.రాజేశ్వర్దేశ్పాండే, పి.మమతాగౌడ్, సాజిద్పాషా, ఎ.రాంగౌడ్ పటాన్చెరు: టి.న ందీశ్వర్గౌడ్(సిట్టింగ్), వి.భూపాల్రెడ్డి, ఎం.శంకర్యాదవ్, బి.పుష్పానగేశ్, కె.బాల్రెడ్డి, సాజిద్ పాషా దుబ్బాక: సి.హెచ్.ముత్యంరెడ్డి(సిట్టింగ్), గాల్రెడ్డి, సోమేశ్వర్రెడ్డి, ఉమాదేవి, బండి నర్సాగౌడ్, బి.మనోహర్రావు, జి.కృష్ణారెడ్డి గజ్వేల్: కె.లింగం, టి.నర్సారెడ్డి(సిట్టింగ్). రంగారెడ్డి జిల్లా: మేడ్చల్: కె.లక్ష్మారెడ్డి(సిట్టింగ్), పి.శ్రీనివాస్రెడ్డి, ఎస్.నవీన్చందర్, పి.నర్సింహారెడ్డి, తలారి యాదగరి యాదవ్ మల్కాజిగిరి: ఎ.రాజేందర్(సిట్టింగ్), శ్రీధర్, జి.సుమతీదేవి, సురేష్యాదవ్, జె.అమరనాథ్గౌడ్, బి.మల్లికార్జున్యాదవ్, ఎన్.శ్రీధర్ కుత్బుల్లాపూర్: కూన శ్రీశైలం గౌడ్(సిట్టింగ్), కె.ఎం.ప్రతాప్, హనుమంతరెడ్డి, ఎన్.ప్రభాకర్గౌడ్, కె.నీరజ రెడ్డి కూకట్పల్లి: కాసాని జ్ఞానేశ్వర్, కాట్రగడ్డ ప్రసూన సహా 25 పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఉప్పల్: రాజిరెడ్డి(సిట్టింగ్), బండ కార్తీక చంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, రాగడి లక్ష్మణ్రెడ్డి, పి.ప్రభాకర్రెడ్డి, పరమేశ్వర్రెడ్డి, శివారెడ్డి, ఇబ్రహీంపట్నం: కైమ మల్లేష్, శేఖర్రెడ్డి, సంధ్యారాణి, పి.లక్ష్మీపతిగౌడ్, ఎస్.రజితారెడ్డి, ఎం.రంగారెడ్డి, ఎం.ఎ.అన్సారీ, బండారి మోహన్రెడ్డి, అర్రబోలు లక్ష్మారెడ్డి ఎల్బీనగర్: డి.సుధీర్రెడ్డి(సిట్టింగ్), రాముగౌడ్, సామకృష్ణారెడ్డి మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి(సిట్టింగ్), సామ గణేష్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి, కోదండరెడ్డి, రాజేంద్రనగర్: సబితాఇంద్రారెడ్డి, కార్తీక్రెడ్డి, జ్ఞానేశ్వర్, రణధీర్రెడ్డి, ఎల్లయ్య, వేణుగౌడ్, జనార్దన్రెడ్డి, పుష్వంత్రెడ్డి, కరుణాకర్గౌడ్ శేరిలింగంపల్లి: భిక్షపతియాదవ్(సిట్టింగ్), జగదీశ్వర్గౌడ్, ఎం.విమల్కుమార్, కె.యాదయ్య, ఆర్.సుజాతరెడ్డి, ఆర్.నాగేందర్యాదవ్ చేవెళ్ల: బి.కైలాస్, ఎ.కృష్ణ, వెంకటస్వామి, కె.యాదయ్య, సదాలక్ష్మి, ఎం.విమల్, మైలారం సులోచన, జశ్వంత్ కుమార్, చింతల యాదగిరి, జి.ఎస్.రావు పరిగి: టి.రామ్మోహన్రెడ్డి, కె.రాంరెడ్డి, కె.వెంకటేశం వికారాబాద్: గడ్డం ప్రసాద్రావు(సిట్టింగ్), ఎం.చంద్రశేఖర్ తాండూరు: ఎం.రమేశ్, విశ్వనాథ్గౌడ్, కె.యాదయ్య, ఎ.కృష్ణ, వెంకటస్వామి, నారాయణరావు. హైదరాబాద్ జిల్లా: ముషీరాబాద్: మాజీ ముఖ్యమంత్రి అంజయ్య కుమారుడు శ్రీనివాస్రెడ్డి, బండ కార్తీకరెడ్డి, అనిల్యాదవ్, ఎం.కోదండరెడ్డి, తదితరులతో పాటు మొత్తం 25 మంది పేర్లు వచ్చాయి. మలక్పేట: కిషన్, అల్తాఫ్ మహ్మద్, ఎం.ఎం.కె.ఖాన్, జి.వెంకటేశ్వర్రెడ్డి అంబర్పేట్: వి.హనుమంతరావు(ఎంపీ రాజ్యసభ), దిడ్డి రాంబాబు, ఎ.ఉదయ్కుమార్, జి.రమేశ్, జి.శ్రీనివాస్గౌడ్, జి.ఇంద్రారావు, మక్బూల్ షరీఫ్, కె.సంజీవ్యాదవ్ ఖైరతాబాద్: డి.నాగేందర్(సిట్టింగ్), ఎం.డి.జాంగీర్, ఎం.రాజగోపాల్ వినోద్రెడ్డి జూబ్లీహిల్స్: విష్ణువర్దన్రెడ్డి(సిట్టింగ్), ఇందుకూరి నిర్మలాదేవి, ఎం.షరీఫ్, అక్బర్ అయూబ్ సనత్నగర్: ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి తన కుమారుడు పురూరవ రెడ్డి పేరుప్రతిపాదించారు. నాంపల్లి: మహ్మద్ ఫిరోజ్ఖాన్, మెట్టు సాయి, ఎం.అశోక్, కొండల్రావు, కార్వాన్: జె.రవీందర్, పి.శోభారాణి గోషామహల్: ముఖేష్గౌడ్(సిట్టింగ్), ఆయన కుమారుడు విక్రంగౌడ్, ప్రేమ్లాల్ చార్మినార్: పి.లక్ష్మణ్రావు, నాగజ్యోతి, ఆర్.ప్రభాకర్రెడ్డి, మీర్జా అస్కర్ అలీ బేగ్, మూసా ఖాసిం, సత్యనారాయణ చాంద్రాయణగుట్ట: జె.రాజేందర్, ఎం.కృష్ణ తదితర 11 మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. యాకుత్పుర: అరుణ్ప్రసాద్ ఠాకూర్, రేణు, పి.రాజేందర్, అరుణ్ప్రసాద్, రాజేందర్రాజు, ఆర్.మల్లేశం, రంగాశ్రీకాంత్, ఆర్.సత్యనారాయణ బహదూర్పుర: సయ్యద్ అబ్దుల్ సమి, ఎస్.మంజుల, కె.రవిరాజు తదితర 10 పేర్లు వచ్చాయి. సికింద్రాబాద్: జయసుధ(సిట్టింగ్), ఉమాదేవి, బండ కార్తీక చంద్రారెడ్డి, సంతోష్, పి.లక్ష్మణ్గౌడ్, పి.కృష్ణ, కృష్ణకుమార్గౌడ్, మేరీ రవీంద్రనాథ్, అమర్నాథ్గౌడ్, కృష్ణగౌడ్, ఎం.ప్రవీణ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్: డాక్టర్ శంకర్రావు(సిట్టింగ్), సర్వే సత్యనారాయణ(గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సిఫారసు), సుస్మిత, ముప్పిడి గోపాల్. మహబూబ్నగర్ జిల్లా: కొడంగల్: డి.విఠల్రావు(మాజీ ఎంపీ), గురునాథ్రెడ్డి, ఎస్.కృష్ణ, మల్కిరెడ్డి, ఎం.డి.సలీం, ఎం.కృష్ణ, ఎ.లక్ష్మారెడ్డి నారాయణపేట: డి.రాజేందర్రెడ్డి(డిప్యూటీ తహసీల్దార్), రవీందర్రెడ్డి, పులి అంజనమ్మ, నర్సింహారెడ్డి, సాయిబాబా, కె.వీరారెడ్డి, బి.వెంకట్రామిరెడ్డి, కృష్ణ మహబూబ్నగర్: ఒబేదుల్లా కొత్వాల్, బి.వెంకట్రామిరెడ్డి, ముత్యాల ప్రకాశ్, ఎస్.జగదీశ్వర్రెడ్డి, పులి అంజమ్మ, ఖలీద్హ్రమాన్, టి.రేవతిగౌడ్, కె.విజయ్కుమార్ జడ్చర్ల: మల్లు రవి, రమేశ్రెడ్డి, రాంప్రసాద్, రమేశ్రెడ్డి, సాదు వెంకట్రెడ్డి, టి.రేవతిగౌడ్, ఎం.కె.రహమాన్, ఎల్.కృష్ణయ్య దేవరకద్ర: జి.బాలకిష్టయ్య, బి.పవన్రెడ్డి, విశ్వేశ్వర్, ప్రదీప్గౌడ్, కె.శ్రీనివాసులు, స్వర్ణసుధాకర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, పొగాకు విశ్వేశ్వర్ మక్తల్: చింతం రామ్మోహన్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, శ్రీహరి, ఎ.సత్యనారాయణ, ఎం.జలంధర్రెడ్డి వనపర్తి: డాక్టర్ జి.చిన్నారెడ్డి గద్వాల: డి.కె.అరుణ ఆలంపూర్: వి.ఎం.అబ్రహం(సిట్టింగ్), ఎస్.సంపత్, ఆంజనేయులు, ఎ.ప్రకాశం నాగర్కర్నూలు: కె.దామోదర్రెడ్డి, దిలీపాచారి, మోహన్గౌడ్, కె.రాజేశ్ అచ్చంపేట: డాక్టర్ వంశీకృష్ణ, కృష్ణయ్య, డాక్టర్ అనురాధ, కె.రామనాథం కల్వకుర్తి: వంశీచందర్రెడ్డి(యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు), ఎస్.రామిరెడ్డి, జె.చిత్తరంజన్దాస్, ఆర్.నార్యానాయక్ షాద్నగర్: ప్రతాప్రెడ్డి(సిట్టింగ్), కె.శంకరయ్య, ఎల్లారెడ్డి, నరేందర్, పి.సుస్మిత, కాడేపల్లి శ్రీనివాస్ కొల్లాపూర్: విష్ణువర్ధన్రెడ్డి, రామ్మూర్తి నాయుడు, హర్షవర్దన్రెడ్డి, జగన్మోహన్దాస్, కమలేశ్వరి, కేతూరి వెంకటేశ్, మేడిపల్లి సురేష్రెడ్డి, టి.రేవతిగౌడ్. నల్లగొండ జిల్లా: దేవరకొండ: ఎ.లక్ష్మీనాయక్, బాలూ నాయక్, స్కైలాబ్నాయక్, జగన్లాల్ నాయక్, రమేశ్నాయక్ నాగార్జునసాగర్: కె.జానారెడ్డి(సిట్టింగ్), ఆయన కుమారుడు రఘువీర్రెడ్డి మిర్యాలగూడ: ఆర్.రమేశ్, టి.దేవేందర్రెడ్డి, రేపాల శ్రీనివాస్, కె.రఘువీర్రెడ్డి, నేతి విద్యాసాగర్, పి.రామలింగయ్యయాదవ్, టి.విజయసింహారెడ్డి, కె.చంద్రశేఖర్రెడ్డి, కె.జ్యోతిరెడ్డి, చింతల సోమన్న హుజూర్నగర్: ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి(సిట్టింగ్) కోదాడ: నల్లమాడ పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట: ఆర్.దామోదర్రెడ్డి(సిట్టింగ్), వై.రాము, వేదాసు వెంకయ్య నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), జి.మోహన్రెడ్డి, హఫీజ్ఖాన్ మునుగోడు: పాల్వాయి స్రవంతి, పున్నా కైలాస్ నేత(ఓయూ జేఏసీ), బి.లింగయ్యయాదవ్, రాపోలు జె.ప్రకాష్, అబ్దుల్ హఫీజ్ఖాన్, సుంకర మల్లేష్గౌడ్, గర్దాసు బాలయ్య, లింగం యాదవ్, చింతల సోమన్న, ఎ.లక్ష్మారెడ్డి భువనగిరి: చింతల వెంకటేశ్వరరెడ్డి, లింగంయాదవ్, పున్నా రామలింగం, కుంబం అనిల్, కల్పన, బి.యాదగిరి, వెంకట శ్రీనివాసరావు, డాక్టర్ వి.ప్రజోత్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్పనా కుమారి, పొత్నాక ప్రమోద్, నకిరేకల్: చిరుమర్తి లింగయ్య(సిట్టింగ్), వే దాసు వెంకయ్య, డి.రాజేశ్వర్, కె.మల్లయ్య, అరున్ సికిలిం, జి.జనార్దన్, పోలేని యాదగిరి, నేతి విద్యాసాగర్, తుంగతుర్తి: కె.పరమేశ్వర్, కరణ్ జయరాజ్(జేఏసీ), ఎన్.ప్రీతమ్, ఎం.అరుణ్. ఆర్.జగన్లాల్, ఎ.ప్రభాకర్, దోసపాటి గోపాల్, జి.నర్సయ్య, ఎ.జ్ఞానసుందర్, నగ రగిరి ప్రీతమ్, బోడ రాములు, పోలేని యాదగిరి ఆలేరు: బి.భిక్షమయ్యగౌడ్(సిట్టింగ్), మూర్తి ఐలయ్య, వి.ప్రజత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, ఎ.సంజీవరెడ్డి, పి.శ్రీనివాస్గౌడ్. వరంగల్ జిల్లా: జనగాం: పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల వైశాలి స్టేషన్ ఘన్పూర్: విజయరామారావు, బి.ఆరోగ్యం, ఇంద్రా, బి.రవీందర్, రాజమౌళి, ఆర్.ప్రతాప్, కీసర దిలీప్రెడ్డి, చెరుపూరి చిరంజీవి పాలకుర్తి: ఆర్.నర్సింహరెడ్డి, అశోక్గౌడ్, డి.శ్రీనివాస్రావు, రఘురాంరెడ్డి, భరత్చంద్రారెడ్డి, బి.శ్రీనివాస్రావు, శ్రీరాంభద్రయ్య, జి.నర్సయ్య డోర్నకల్: డి.ఎస్.రెడ్యానాయక్, రాంలాల్, రజనీకాంత్నాయక్ మహబూబాబాద్: ఎం.కవిత(సిట్టింగ్), డి.పోలమ్మ, జి.సుచిత్ర, ఎ.ర జనీకాంత్నాయక్ నర్సంపేట: డి.మాధవరెడ్డి, బి.యాదగిరి, సత్యనారాయణగౌడ్ పరకాల: రాంభద్రయ్య, సాంబారి సమ్మారావు, మంద రమేశ్, వెంకటరామిరెడ్డి దేశాయ్ వరంగల్ వెస్ట్: రాజేందర్రెడ్డి, స్వర్ణ, పి.వి.రాజేశ్వరరావు, డి.ప్రభాకర్రెడ్డి, విద్యాసాగర్, హరిరమాదేవి, జి.రమాకాంత్రెడ్డి, పి.రామేశ్వర్రెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఆనంద్కుమార్, నరేందర్రెడ్డి, పి.నరోత్తంరెడ్డి, కె.నరేందర్రెడ్డి, జి.ప్రకాశ్రెడ్డి వరంగల్ ఈస్ట్: బసవరాజు సారయ్య(సిట్టింగ్)తో పాటు మరో ఐదు పేర్లు పరిశీలనకు వచ్చాయి వర్ధన్నపేట: బి.దేవయ్య, ఆనంద్, బక్కా జడ్సన్, టి.విజయ, ఎన్.శ్రీనివాస్, టి.సూర్యనారాయణ (ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కె. శ్రీధర్ పేరు ప్రతిపాదించలేదు) భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి(సిట్టింగ్), జి.మల్లేశం ములుగు: పి.వీరయ్య, సి.సత్యం, ఎ.బలరాం, ఎ.రజనీకాంత్నాయక్, జైరాంనాయక్, ప్రీతంకుమార్, మణీశ్వరరావు. ఖమ్మం జిల్లా: పినపాక: జి.సుబ్బారావు, కె.భద్రయ్య, ఇల్లెందు: డాక్టర్ డి.టి.నాయక్, చేపూరి రవి, మంగీలాల్, మిఠియా నాయక్, బాలాజీరావు, వెంకట్రాం, తేజావత్రూపాభాయి, పాపానాయక్, తేజావన్ మదన్సింగ్, కొర్రం కనకయ్య ఖమ్మం: పువ్వాడ అజయ్, యూనస్ సుల్తాన్, రాపర్తి రంగారావు సహా మొత్తం 12 పేర్లు పరిశీలనకు వచ్చాయి. పాలేరు: రాంరెడ్డి వెంకటరెడ్డి(సిట్టింగ్), ఎ.శ్రీరాంయాదవ్, ఆర్.మాధవిరెడ్డి, నాగేశ్వరరావు, బి.హనుమంతురావు, నరేశ్రెడ్డి మధిర: మల్లు భట్టివిక్రమార్క(సిట్టింగ్), ఎన్.కుటుంబరావు వైరా: భూక్యా రాంజీ, బానోతు చందూనాయక్, రాములు నాయక్. పోరిక లక్ష్మీ భాయి, ఎ.శ్రీమన్నారాయణ, బి.విజయశాంతి, ధన్రాజ్రాథోడ్, మదన్సింగ్, రామ్మూర్తినాయక్, నాగునాయక్ సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, కె.వెంకటేశ్, మమతారావు, గురుమూర్తి, మానవతారాయ్, సోమచంద్రశేఖర్ కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు, గోనెల విజయలక్ష్మి, లక్కినేని సురేందర్, బోయినపల్లి కృష్ణమూర్తి అశ్వరావుపేట: మిత్రసేన(సిట్టింగ్), ఎస్.నాగమణి, భద్రాచలం: కుంజా సత్యవతి(సిట్టింగ్), పి.రామకృష్ణ, పి.జ్యోతిర్మయి. చందూనాయక్, రాములు నాయక్. పోరిక లక్ష్మీ భాయి, ఎ.శ్రీమన్నారాయణ, బి.విజయశాంతి, ధన్రాజ్రాథోడ్, మదన్సింగ్, రామ్మూర్తినాయక్, నాగునాయక్ సత్తుపల్లి: సంభాని చంద్రశేఖర్, కె.వెంకటేశ్, మమతారావు, గురుమూర్తి, మానవతారాయ్, సోమచంద్రశేఖర్ కొత్తగూడెం: వనమా వెంకటేశ్వరరావు, గోనెల విజయలక్ష్మి, లక్కినేని సురేందర్, బోయినపల్లి కృష్ణమూర్తి అశ్వరావుపేట: మిత్రసేన(సిట్టింగ్), ఎస్.నాగమణి, భద్రాచలం: కుంజా సత్యవతి(సిట్టింగ్), పి.రామకృష్ణ, పి.జ్యోతిర్మయి. -
పైకి సమైక్యరాగం...లోన విభజనకు సహకారం
-
ఆవిష్కరణం: వస్తువు విలువ పెరిగిన ప్పుడు పుట్టింది!
‘పర్స్’ విలువైన, ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా దాచుకోవడానికి ఉపయోగించుకొంటున్నాం. మరి ఈ ఉపయోగాన్ని బట్టి మానవ నాగరికతలో ‘వస్తువు’కు విలువ పెరిగిన సమయంలో పర్స్ ప్రస్థానం మొదలైందని అనుకోవాలి. ఎందుకంటే... దీని పుట్టుక తేదీ ఇదీ అని ఎవరూ తేల్చలేదు. ద్రవ్యం లేదా కరెన్సీలు వాడకంలోకి వచ్చాక మాత్రం పర్స్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి అనేక రూపాంతరాలున్నాయి. తొలినాళ్లలో నాణెంలు దాచుకోవడానికి బుల్లిబుల్లి బ్యాగ్లను ఉపయోగించేవారట. పద చరిత్ర ప్రకారం‘బుర్సా’అనే లాటిన్పదమే పర్స్గా పరిణామం చెందింది. ఇప్పుడు పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు అంటూ రకరకాల పర్స్లు అందుబాటులోకి వచ్చాయి కానీ.. 17 వ శతాబ్దం వరకూ పర్స్ అంటే ఒకటే రూపమే, అందరూ ఉపయోగించుకొనేదే. 17 వ శతాబ్దంలో పర్స్లకు ఎంబ్రైడరీ వర్క్ చేయడం మొదలుపెట్టారు మహిళలు. అప్పటి నుంచి పర్స్లలో మహిళలు, పురుషులూ అంటే లింగభేదం మొదలైంది. మహిళల పర్స్లు హ్యాండ్బ్యాగ్లుగా రూపాంతరం చెంది స్టైల్స్తో భుజానికి తగిలించుకొనేవిగా మారితే, పురుషుల పర్స్లు జేబులో ఇమిడిపోయాయి. వీటికి ఒకే రూపం లేకపోవడం వల్ల పేటెంట్ చక్రంలో ఇవి బంధింపబడలేదు. పర్స్ల చరిత్ర విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 3,300 సంవత్సరాల క్రితమే పర్స్లను ఉపయోగించినట్టు దాఖలాలు ఉన్నాయి. అప్పటి వాడైన ఓట్జి అనే వ్యక్తి మమ్మీలో తోలుతో కుట్టిన ఒక పర్స్ కనిపించింది. ప్రస్తుతానికి పర్స్ చరిత్రకు సంబంధించి ఉన్న దాఖలాలు అవే.