places
-
కొత్త జంటలకు ఏకాంతం.. ఆలుమగలకు ప్రశాంతం! ఈ రొమాంటిక్ ప్లేసెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? (ఫొటోలు)
-
పట్నా నాటి ఔన్నత్యానికి దర్పణం
పట్నా టూర్ అనగానే నాకు ‘చాణక్య’ చారిత్రక నవల, టీవీ సీరియల్ ఒకదానితో ఒకటిపోటీ పడుతూ కళ్ల ముందు మెదిలాయి. ‘సున్న’ తో ప్రపంచ గణితాన్ని గాడిలో పెట్టిన ఆర్యభట్ట గుర్తొచ్చాడు. ఖగోళ పరిజ్ఞానంలో మన మేధ ఎంతో పరిణతి చెందినదనే విషయం మరోసారి గుర్తొచ్చింది. అలాగే వర్తమానంలో బిహార్ అనుభవిస్తున్న పేదరికమూ, జంగిల్ రాజ్ అనే వార్తకథనాలు కూడా గుర్తొచ్చాయి. పాటలీపుత్ర నుంచి పట్నా వరకు ఈ నగరం అనుభవించిన ఆటుపోట్లన్నీ కళ్లముందు మెదిలాయి. పట్నాలో అడుగు పెట్టిన తర్వాత దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ గతంలోకి వెళ్లి విశ్లేషించుకుంటూ ముందుకు సాగాను. ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో చూపుడువేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఆర్యభట్ట విగ్రహం ముందు మోకరిల్లాను.బిహార్లో ఆలూపట్నా ప్రజల జీవనశైలి నిరాడంబరంగా కనిపించింది. కూరగాయల బళ్ల మీద బంగాళదుంప రాశి, పక్కనే మరో బస్తా ఉంటాయి. కాయగూరలు నామమాత్రమే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్లో లాలూ ఉంటాడు’ అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు లాలూ లేడు కానీ ఆలూ మాత్రం ఉంది. బిహార్ జీవనశైలిలో ఆకుపచ్చ కూరగాయల కంటే బంగాళదుంపకేప్రాధాన్యం. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో జిలేబీ, భోజనంలో మధ్యమధ్య పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినడం ఈ రెండూ కొత్తగా అనిపిస్తాయి. జీవనశైలి విలాసవంతంగా లేకపోయినప్పటికీ కళల పట్ల ఆరాధన మెండుగా ఉంది. సంగీతకార్యక్రమాలు, వేడుకల్లో నాట్య ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఊరేగింపులో వాహనాల మీద జరిగే నాట్యప్రదర్శనల్లో నర్తకి రక్షణ కోసం గ్రిల్ ఉంటుంది. బాలికల చదువు, రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్తో ప్రచారం బాగున్నాయనిపించింది.ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలుపట్నా నగరం పర్యావరణానికిప్రాధాన్యం ఇస్తోంది. ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. వాహనాల విషయంలో పర్యావరణ స్పృహ మెండుగానే ఉంది. ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏమీ లేక΄ోవడంతో సామాన్యుల్లో ఆ ధ్యాస కనిపించదు. గంగాతీరంలో పూజలు చేసి పూలు, అగరవత్తులు తీసుకెళ్లిన పాలిథిన్ కవర్లను అక్కడే పడేస్తున్నారు. తీరమంతా ΄్లాస్టిక్ వ్యర్థాల తోరణంగా కనిపించింది. గంగానది నీరు స్వచ్ఛంగా ఉన్నాయి, నదిలో పడవ విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో నది విహారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.గోల్ఘర్పట్నాలో తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్ఘర్ ఒకటి. ఇది మగధరాజ్య ధాన్యాగారం. ఈ ధాన్యాగారం ఇనుప నిర్మాణం. రాజ్యంలో రైతులు పండించిన ధాన్యంలో వారి అవసరాలకు పోగా మిగిలిన వాటిని సేకరించి ఇందులో భద్రపరిచేవారు. ఒక ఏడాది కరువు, వరదలు వచ్చినా సరే రాజ్యంలో ఆకలి లేకుండా తిండి గింజలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ ఏర్పాటు. ΄ాలనలో ఇంతటి ముందు చూపుకు చాణుక్యుని అర్థశాస్త్రమే మూలం. ప్రాచీన కాలంలో ఇక్కడ పర్యటించిన ఫాహియాన్, మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు పట్నా నగరాన్ని ప్రపంచానికి మోడల్గా చూపించారు. మెగస్తనీస్ అయితే ఏకంగా ‘గ్రేటెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్’ అని రాశాడు. అంతటి చైతన్యవంతమైన, ఉచ్ఛస్థితిని చూసిన నగరం పట్నా. సామాన్యులతో మాటలు కలిపితే ఆ మూలాల ప్రభావం ఇప్పటికీ ఉందనిపిస్తుంది. వారిని చూస్తే పేదరికంతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ మాటల్లో వారిలో సమృద్ధిగా ఉన్న రాజకీయ చైతన్యం వ్యక్తమవుతుంది. ప్రాచీన కాలంలోకి ఎంట్రీపట్నా నగరం ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి జనజీవనం కొనసాగుతూ వస్తున్న ప్రదేశం. ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు, సిక్కుల గురువు గురుగోవింద్సింగ్ వంటి మేధావులు పుట్టిన నేల. నంద, మౌర్య, గుప్త రాజవంశాల రాజధాని. ఇన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నేల మీద నడిచేటప్పుడు మనకు తెలియకుండానే నేటి నుంచి అక్షరాలలో చూసిన నాటికి వెళ్లిపోతాం. ఇక్కడ పర్యటించడం రియల్లీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియెన్స్. పరిణిత శిల్పకళ ప్రాచీన పట్నా జీవనశైలిని చూడాలంటే బిహార్ మ్యూజియంలో అడుగుపెట్టాలి. మొదటగా ఆకర్షించేది యక్షిణి శిల్పం. గంగానది తీరాన దిదర్గంజ్ గ్రామం నుంచి సేకరించిన ఈ శిల్పం శిల్పం అద్దంలా మెరుస్తుంటుంది. శిల్పచాతుర్యాన్ని ఫొటోలో చూడాల్సిందే తప్ప వర్ణించడం అసాధ్యం. రీజనల్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనాలు మధుబని ఆర్ట్లో కృష్ణుడు, గోపికల ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పటంలో ఒక గ్రంథం ఇమిడి ఉంటుంది. బొమ్మలు వేయడానికి చిత్రకారులు వాడిన బేసిక్ కలర్స్ నుంచి సెకండరీ కలర్స్ వాడకం వరకు చిత్రవర్ణాల పరిణామ క్రమం అర్థమవుతుంది. చిత్రాలను, శిల్పాలను పరిశీలించినప్పుడు అప్పటి కాలంలో చిత్రకళ కంటే శిల్పకళ ఉచ్ఛస్థితిలో పరిణతి చెందినట్లు అనిపించింది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
న్యూఢిల్లీ: దీపావళిని 'దీపాల పండుగ' అని కూడా అంటారు. దీపావళి నాడు దేశంలోని ప్రతి ఇంటా దీపాలు వెలిగిస్తారు. బాణసంచా కాలుస్తారు. ఇరుగుపొరుగువారికి స్వీట్లు పంచుతారు. దీపావళిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పటికీ, కొన్ని నగరాల్లో జరిగే దీపావళి వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అటువంటి ఐదు నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయోధ్య (ఉత్తరప్రదేశ్)శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య దీపావళి ప్రత్యేక వేడుకలకు కేంద్రంగా మారింది. ఇక్కడ దీపోత్సవ్ పేరుతో దీపావళిని జరుపుకుంటారు. సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ప్రేక్షకులను ఇవి మంత్ర ముగ్ధులను చేస్తాయి.వారణాసి (ఉత్తరప్రదేశ్)వారణాసిలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. లక్షల దీపాలతో అలంకృతమైన గంగా ఘాట్లపై హారతి నిర్వహిస్తారు. వారణాసిలోని అన్ని ఘాట్లు, దేవాలయాలు కాంతులతో నిండిపోతాయి. బాణాసంచా వెలుగులు అందరినీ అలరింపజేస్తాయి.కోల్కతా (పశ్చిమ బెంగాల్)కోల్కతాలో దీపావళితో పాటు కాళీ పూజలను కూడా నిర్వహిస్తారు. కాళీ పూజల కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పందిళ్లను వేస్తారు. వీధులు, ఇళ్లు, దేవాలయాలను దీపాలతో అలంకరిస్తారు. కోల్కతాలో జరిగే దీపావళి వేడుకల్లో ఆధ్యాత్మికత కూడా కనిపిస్తుంది.గోవాగోవాలో దీపావళిని ప్రత్యేక శైలిలో జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని పురస్కరించుకుని నరకాసురుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఇందు కోసం ముందుగా భారీ దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. వీటిని దీపావళి రాత్రి వేళ దహనం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో సాంప్రదాయ సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాణసంచా వెలిగిస్తారు.ముంబై (మహారాష్ట్ర)ముంబైలో దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మెరైన్ డ్రైవ్లో దీపాల వెలుగులు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆకాశంలోకి పేలుతున్న పటాకులు చూపరుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ముంబైలో ఆధునిక జీవనశైలికి అనుగుణంగా దీపావళి వేడుకలు జరగడం విశేషం. ఇది కూడా చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం! -
ఎకో ఊటీ.. నీలగిరి సౌందర్యం
ఊటీకి టూరెళ్దామా? అంటే ఎగిరి గంతేసిన బాల్యం వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. మధ్యతరం ఊటీలో ఏముంది అవే టీ తోటలు, అదే దొడబెట్ట, అదే టాయ్ ట్రైన్, బొటానికల్ గార్డెన్, పాటలు చిత్రీకరించిన కూనూరు... అని పెదవి విరిచేశాయి. డెబ్బై, ఎనభైల దక్షిణాది సినిమాల్లో చూసిందే కదా ఊటీ అని తేల్చేయడమూ కరెక్టే. అయితే ఊటీ అంటే సినిమాల్లో చూసిన ఊటీ మాత్రమే కాదు. ఇంకా చూడాల్సిన ఊటీ చాలానే ఉంది. ముఖ్యంగా ఎకో టూరిజమ్లో ఊటీకి పాతిక కిలోమీటర్ల దూరాన నీలగిరుల్లో విస్తరించిన అవలాంచే సరస్సు వైపు అడుగులు వేద్దాం.మెల్లగా సాగే ప్రయాణం... ఊటీ ఎకో టూరిజమ్ అవలాంచె చెక్పోస్ట్ నుంచి మొదలవుతుంది. ఇరవై కిలోమీటర్ల ప్రయాణం మధ్యలో మూడు వ్యూ పాయింట్లు ఉంటాయి. షోలా ఫారెస్ట్ వ్యూ పాయింట్. మరికొంత దూరంలో భవానీ ఆలయం, లక్కడి. ఈ మూడు పాయింట్లను కలుపుతూ రౌండ్ ట్రిప్ ఇది. ప్రయాణం వేగంగా గమ్యానికి చేరాలన్నట్లు ఉండదు. ప్రదేశాన్ని ఆసాంతం కళ్లారా చూడడానికి రెండు గంటల సేపు సాగుతుంది. తిరిగి అవలాంచె చెక్పోస్టు దగ్గర దింపుతారు.పశ్చిమం నుంచి తూర్పుకు ప్రయాణం... అవలాంచె సరస్సు చేరడానికి సన్నటి రోడ్డు మీద సాగే ప్రయాణం. ప్రకృతి సౌందర్యంతో΄ాటు కొండ శిఖరాలను చూడవచ్చు. భవానీ ఆలయం నుంచి అరకిలోమీటరు దూరం నడిస్తే అందమైన జల΄ాతం, అప్పర్ భవానీ డ్యామ్ బ్యాక్ వాటర్స్ కనువిందు చేస్తాయి. భవానీ నది కేరళలోని పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ తమిళనాడుకి వచ్చి కావేరినదిలో కలుస్తుంది. గిరి జనపథం... ఊటీ ఎకో టూరిజమ్ జోన్లోకి ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. పర్యాటకుల వాహనాలు అవలాంచె చెక్పోస్ట్ దగ్గర ఆగిపోవాలి. అక్కడి నుంచి టూరిజమ్ డిపార్ట్మెంట్ వాహనంలోకి మారాలి. విడిగా ట్రిప్ కావాలనుకుంటే ఎనిమిది మందికి ఒక జీపు ఏర్పాటు చేస్తారు. ఈ టూర్లో నీలగిరుల్లో టోడా గిరిజన తెగ నివసించే ప్రదేశాలను కూడా చూడవచ్చు. వారి ఇళ్ల నిర్మాణం, దుస్తుల మీద వారు చేసే ఎంబ్రాయిడరీ ప్రత్యేకమైనవి. ఒక చేతిరుమాలైనా కొనుక్కుంటే ఆ కళకు ్రపోత్సాహంగానూ, టూర్కి గుర్తుగానూ ఉంటుంది.∙ -
మధుర, బృందావనమే కాదు... ఇక్కడ కూడా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణ జన్మాష్టమి.. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేడుకగా చేసుకునే పండుగ. ఈ ఏడాది ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను చేసుకోనున్నారు. భారతదేశమంతటా ఈ పండుగ వేళ భక్తులలో ఆనందం వెల్లివిరుస్తుంది. జన్మాష్టమి వేడుకలు కేవలం మధుర-బృందావనంలోనే కాకుండా గుజరాత్, ముంబై, కేరళలో కూడా అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. మధుర- బృందావనం (ఉత్తర ప్రదేశ్)బృందావనం శ్రీకృష్ణుని జన్మస్థలం. అందుకే జన్మాష్టమి వేళ ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. బృందావనంలో జన్మాష్టమి వేడుకలు 10 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇక్కడి ఆలయాలను వివిధ రకాల అందమైన పూలతో అలంకరిస్తారు. రోజంతా భక్తులు భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ఇక్కడి వాతావరణమంతా భక్తితో నిండిపోతుంది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో నివసించే వారు జన్మాష్టమి నాడు మధుర, బృందావనాలను సందర్శిస్తుంటారు.ద్వారక (గుజరాత్)గుజరాత్లోని ద్వారకలో శ్రీకృష్ణుని పురాతన ఆలయం ఉంది. మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. గుజరాత్లోని ద్వారకాధీష్ ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే జన్మాష్టమి సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు తరలివస్తుంటారు.పూరి (ఒడిశా)ఒడిశాలోని పూరీలో కూడా మధుర-బృందావనంలో మాదిరిగానే వారం రోజుల ముందుగానే జన్మాష్టమి వేడుకలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుని జీవితం ఆధారంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణునికి ఇచ్చే హారతిని చూసేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ముంబై (మహారాష్ట్ర)జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే దహీ-హండీ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదర్, వర్లీ, థానే, లాల్బాగ్లలో నిర్వహించే దహీ హండీని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి జనం ఇక్కడికి తరలివస్తుంటారు.గురువాయూర్(కేరళ)గురువాయూర్ దేవాలయం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజిస్తారు. ఈ ఆలయాన్ని బృహస్పతి, వాయుదేవుడు నిర్మించారని చెబుతారు. అందుకే ఈ ఆలయానికి గురువాయూర్ దేవాలయం అని పేరు వచ్చిందంటారు. ఇక్కడ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేళ అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి. -
Best Indian Places: భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాలివే..! (ఫోటోలు)
-
శ్రీరామ నవమికి అయోధ్య వెళ్తున్నారా?.. వీటినీ సందర్శించండి!
అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమయ్యాక భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. దేశవిదేశాల నుంచి కూడా భక్తులు శ్రీరాముని జన్మస్థలికి తరలివస్తున్నారు. ఏప్రిల్ 17న అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్యలో నూతన రామాలయంతో పాటు తప్పక సందర్శించాల్సిన మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. హనుమాన్గర్హి అయోధ్యలో పురాతన సిద్ధపీఠం హనుమాన్గర్హి ఆలయం ఉంది. రామాలయాన్ని దర్శించుకునే ముందు భక్తులు హనుమాన్గర్హికి వెళ్లాలని స్థానికులు చెబుతుంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు హనుమాన్గర్హిని సందర్శిస్తారు. 2. కనక్ భవన్ త్రేతా యుగంలో పట్టపు రాణి కైకేయి.. సీతామాతకు ఈ రాజభవనాన్ని కానుకగా ఇచ్చారని చెబుతారు. కనక్భవన్లో శ్రీరామునితో పాటు సీతామాత, శ్రీరాముని నలుగురు సోదరుల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. సీతారాముల దర్శనం, పూజల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కనక్ భవన్కు తరలివస్తుంటారు. 3. దశరథ్ మహల్ దశరథ్ మహల్ కూడా అత్యంత పురాతనమైనది. త్రేతా యుగానికి చెందినదని చెబుతారు. దశరథ మహారాజు ఈ రాజభవనంలో ఉండేవాడట. దరశరథుని కుటుంబమంతా ఈ ప్యాలెస్లో కనిపిస్తుంది. 4. నాగేశ్వర్ నాథ్ ఆలయం శ్రీరాముని కుమారుడైన కుశుడు నిర్మించిన నాగేశ్వర్ నాథ్ ఆలయం రామ్ కి పాడిలో ఉంది. శ్రావణమాసంలోను, శివరాత్రి సందర్భంగానూ లక్షలాది మంది భక్తులు నాగేశ్వర్ నాథ్ ఆలయానికి తరలివస్తుంటారు. 5. బహు బేగం సమాధి బహు బేగం సమాధి కూడా అయోధ్యలోనే ఉంది. పర్యాటకులు కుటుంబ సమేతంగా ఇక్కడి అందమైన పూల తోటకు వచ్చి సేద తీరుతారు. 6. సూర్య కుండ్ త్రేతా యుగంలో శ్రీరాముడు లంకను జయించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, అయోధ్యవాసులతో పాటు దేవతలు ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సూర్యభగవానుడు కూడా ఒక నెలరోజుల పాటు అయోధ్యలో ఉన్నాడట. దీనికి గుర్తుగానే సూర్యకుండ్ నేటికీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది దర్శన్ నగర్లో ఉంది. లేజర్ షో ద్వారా శ్రీరాముని కథను ఇక్కడ ప్రదర్శిస్తారు. 7. రామ్ కి పాడి రామ్ కి పాడిని అయోధ్యకు కేంద్ర బిందువుగా చెబుతారు. ఇక్కడ రామాయణాన్ని లేజర్ షో ద్వారా ప్రదర్శిస్తారు. ఈ ప్రదేశంలో దీపాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రామ్ కి పాడికి తరలివస్తారు. ఇక్కడి సరయూమాతను పూజిస్తారు. 8. సరయూ తీరం పెద్ద సంఖ్యలో భక్తులు సరయూ తీరాన్ని చూసేందుకు తరలి వస్తుంటారు. సరయూ నది ఒడ్డున స్నానం చేయడం ద్వారా పాపాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతుంటారు. 9. గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ కూడా సరయూ నది ఒడ్డున ఉంది. ఈ ఘాట్ మీదుగానే శ్రీ రాముడు తన నివాసానికి వెళ్లేవాడని చెబుతుంటారు. గుప్తర్ ఘాట్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. -
‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం
ఉత్తరప్రదేశ్ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్న యోగి ప్రభుత్వం.. తాజాగా ‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం కల్పించే దిశగానూ ప్రణాళిక సిద్దం చేసింది. యూపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 28 దేశాల్లోని 50 నగరాల్లో యూపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం ఆయా నగరాల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ట్రావెల్ ఫెయిర్లు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. జపాన్, ఇజ్రాయెల్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్, రష్యా , యుఎఈలలో బ్రాండ్ యూపీకి ప్రచారం కల్పించనున్నారు. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభించిన దరిమిలా ప్రతి సంవత్సరం కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులు నగరానికి వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ సంఖ్య స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. అయోధ్యలో ప్రారంభమైన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్, మెరుగైన రహదారులు మొదలైనవన్నీ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి. -
Rajasthan Haunted Places: రాజస్థాన్లోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్.. ఇవే! (ఫోటోలు)
-
ఇండియాలో చూడాల్సిన హాలిడే డెస్టినేషన్స్ ప్రదేశాలు
-
భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలు చూసారా..? (ఫోటోలు)
-
వెకేషన్ కోసం బెస్ట్ ప్లేసులు ఇవే..
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
ఈ విషయాలు మీకు తెలుసా?
-
అహ్మదాబాద్లో పర్యాటకుల రద్దీ
ప్రపంచ కప్- 2023 ఫైనల్ మ్యాచ్ ఈరోజు (నవంబర్ 19, ఆదివారం) గుజరాత్లోని అహ్మదాబాద్లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. భారత్ - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం దేశ, విదేశాల నుంచి క్రికెట్ ప్రేమికులు అహ్మదాబాద్కు తరలివచ్చారు. వీరంతా అహ్మదాబాద్లోని పలు పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. దీంతో ఇక్కడి సబర్మతి ఆశ్రమం, భద్ర కోట, అక్షరధామ్ ఆలయం, గుజరాత్ సైన్స్ సిటీ, నైట్ మార్కెట్ ఆఫ్ లా గార్డెన్, కైట్ మ్యూజియం, అదాలజ్ స్టెప్వెల్ మొదలైనవన్నీ పర్యాటకులతో రద్దీగా మారాయి. ఈ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సబర్మతి ఆశ్రమం అహ్మదాబాద్లో పేరుగాంచిన ప్రముఖ ప్రదేశాలలో సబర్మతి ఆశ్రమం ఒకటి. సబర్మతీ నది ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీకి చెందిన, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అనేక స్ఫూర్తిదాయక, ప్రేరణాత్మక వస్తువులను చూడవచ్చు. కంకారియా సరస్సు అహ్మదాబాద్లో కంకారియా సరస్సు అందమైన పర్యావరణానికి ప్రతీకగా నిలిచింది. కంకారియాలో అరుదైన జంతువుల అభయారణ్యం ఉంది. ఇది పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కిడ్స్ సిటీలో థియేటర్, హిస్టారికల్ సెంటర్, రీసెర్చ్ లాబొరేటరీ, ఐస్ క్రీం ఫ్యాక్టరీ మొదలైనవి ఉన్నాయి. భద్ర కోట అహ్మదాబాద్లోని జామా మసీదు సమీపంలో భద్ర కోట ఉంది. దీనిని 1411లో నిర్మించారు. కోట నుండి అహ్మదాబాద్ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. సాయంత్రం వేళ ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు. లా గార్డెన్ నైట్ మార్కెట్ లా గార్డెన్కు చెందిన నైట్ మార్కెట్ను సందర్శించకపోతే అహ్మదాబాద్ పర్యటన అసంపూర్ణం అవుతుందని అంటారు. ఈ మార్కెట్లో చేతితో తయారు చేసిన గుజరాతీ దుస్తులు, వివిధ వస్తువులు లభ్యమవుతాయి. ఇది కూడా చదవండి: భారత్ విజయం కోరుతూ ట్రాన్స్జెండర్ల ప్రత్యేక పూజలు -
అటు వైపు వెళ్లొద్దు సుమా.. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేసేస్
-
ఉత్తర భారతదేశంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
ప్రపంచంలోని 10 అత్యంత నిశ్శబ్దమైన ప్రదేశాలు
-
భారతదేశంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 ఎత్తైన పర్వత శిఖరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 హాంటెడ్ నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 సాహస ప్రదేశాలు
-
టాప్ 10 ప్రపంచంలోని అత్యంత ఆకర్షించే ఇంజనీరింగ్ సైట్లు
-
ఏపీలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు..
రంపచోడవరం(తూర్పుగోదావరి): మనసు దోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే నది సోయగాలు.. ఎటూ చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరుగాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నది తీరంలో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసినా.. తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. పాపికొండలు మధ్య బోట్లో ప్రయాణం.. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగణి పొల్లూరు జలపాతం ప్రకృతి గుడి..సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తైన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని గుడారాల్లో బస చేస్తారు. ఎత్తైన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాది తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజం ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పాములేరు రోప్ బ్రిడ్జి మరపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్పై ప్రయాణం చేసి పాపికొండలకు చేరుకుంటారు. జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. -
ఈ హెరిటేజ్ సైట్స్లోకి వెళ్లలేం.. ఇదొకటే దారి!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు.. మన దేశంలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వ సంపద. కొంతమంది వీటిల్లో కొన్నిటికి వెళ్లి ఉంటారు కూడా.. ఈ హెరిటేజ్ సైట్స్ గురించి మనకు తెలుసు.. మరి.. కేవలం గూగుల్ మ్యాప్లోనే చూడగల సైట్స్ గురించి మీకు తెలుసా? ఎందుకంటే.. ఇక్కడ మనకు నో ఎంట్రీ.. ఈ ఆదివారం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ సందర్భంగా అలాంటి డిఫరెంట్ ప్రదేశాల గురించి కాస్త తెలుసుకుందామా.. స్నేక్ ఐలాండ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. విస్తీర్ణం కేవలం 106 ఎకరాలు. బ్రెజిల్ తీరంలో ఉండే ఈ ప్రదేశం అత్యంత విషపూరితమైన సర్పాలకు నిలయం. చిన్న ద్వీపమే అయినా.. ఇక్కడ 4 వేలకు పైగా విషపూరితమైన పాములు ఉంటాయి. అందుకే.. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను అనుమతించదు. శాస్త్రవేత్తలకు పరిశోధనల నిమిత్తం పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తుంది. సర్ట్ట్సీ ఇదో ద్వీపం.. ఎలా ఏర్పడిందో తెలుసా? 1963లో సముద్రంలో పేలిన ఓ అగ్నిపర్వతం వల్ల.. దాని తాలూకు లావా అవన్నీ సముద్ర ఉపరితలం మీదకు వచ్చి.. కాలక్రమేణా ద్వీపంలా ఏర్పడింది. అప్పటినుంచి దీన్ని ఓ నేచర్ ల్యాబొరేటరీగా పరిరక్షిస్తున్నారు. ఏమీలేని బంజరు భూమిలాంటి దానిపై మళ్లీ జీవం పురుడుపోసుకోవడం.. మొక్కలు తదితర జీవజాతులు ఏర్పడటం వంటిదాన్ని జీవశాస్త్రవేత్తలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. ఈ దీవి ఐస్ల్యాండ్కు దగ్గరగా ఉంది. వాటికన్ రహస్య పత్రాలు.. ఇక్కడ ఎవరు పడితే వారు వెళ్లలేరు.. ఈ రహస్య పత్రాలపై అజమాయిషీ అంతా పోప్దే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పండితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పరిశీలనల అనంతరం అనుమతి ఇస్తారు. ఇక్కడ వెయ్యేళ్ల క్రితం నాటి పత్రాలు ఉన్నాయి. అందులోనూ కొన్నిటిని మాత్రమే చూడటానికే అనుమతి ఇస్తారు.. ఇందులో ప్రఖ్యాత శాస్త్రవేత్త గెలీలియో విచారణకు సంబంధించినవి.. కింగ్ హెన్రీ–8, మార్టిన్ లూథర్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. .. తొలుత అయితే.. సదరు శాస్త్రవేత్త లేదా పండితుల వయసు 75 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన కూడా ఉండేది.. తర్వాతి కాలంలో దీన్ని సడలించారు.. బొహీమియన్ గ్రోవ్.. కాలిఫోర్నియాలో 2700 ఎకరాల పరిధిలో వెయ్యేళ్లనాటి భారీ వృక్షాలతో కూడిన చిన్నపాటి అటవీ ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. అమెరికాలోని రిచ్ అండ్ పవర్ఫుల్ వ్యక్తులకు సంబంధించిన బొహీమియన్ క్లబ్.. దీని ఓనర్. 1872లో ఈ క్లబ్ను స్థాపించారు. ఇందులో అత్యున్నత స్థాయి వ్యక్తులు, అమెరికా మాజీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. మాజీ సైనికులు ఇక్కడ రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఏటా వేసవిలో క్లబ్ సభ్యులు ఇక్కడ కలుసుకుంటారు. స్వాల్బార్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటివాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్తనాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు. ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం. ఏరియా 51 ఇది చాలా ఫేమస్ ప్లేస్.. దీనిపై సినిమా కూడా తీశారు. అమెరికా ఎయిర్ఫోర్స్కు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రదేశం.. నెవడాలో ఉంది. పై నుంచి విమానాలు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఇక మనలాంటోళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఫొటోలే చాలా రేర్గా దొరుకుతాయి. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నడుస్తాయని పైకి చెబుతారు కానీ.. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు. ఉత్తర సెంటినల్ ద్వీపం.. సెంటినలీజ్.. మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా జీవనం సాగించే తెగ ఇది. ఈ ద్వీపానికి వాళ్లు ఎవరినీ రానివ్వరు.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.. వీళ్లతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించిన కొందరిని చంపేశారు కూడా.. ఈ సెంటినల్ ద్వీపం మరెక్కడో లేదు.. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇది కూడా ఒకటి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. కోణార్క్లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్ను పూర్తి చేసిన టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్యాటన్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు. సంబంధిత ఫోటోలను తమ వెబ్సైట్లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు. అంతేకాదు టూరిస్టు గైడ్స్గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు. -
హైదరాబాద్లోని 10 రొమాంటిక్ ప్రదేశాలు ఇవే!
హైదరాబాద్ : సెలవు రోజుల్లో తమ ప్రియమైన వారితో సరదాగా అలా బయట గడపాలనుకునే వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా అప్పుడే ప్రేమలో పడ్డ జంట.. ఓ మంచి ప్రదేశంలో ఊసులాడుకోవాలని తహతహలాడుతుంటుంది. ఏదైనా ప్రత్యేక అకేషన్కు భాగస్వామిని ఓ మంచి ప్రదేశానికి తీసుకెళుదామకుంటారు. కానీ, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆగిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ప్రేమజంటలు విహరించటానికి అనువైన రొమాంటిక్ ప్రదేశాలకు కొదువలేదు. ఈ ప్రదేశాలు సరదాలనే కాదు అద్భుతమైన జ్ఞాపకాలను మీ ప్రేమకు తోడు చేస్తాయి. 1) వాటర్ ఫ్రంట్ హైదరాబాద్లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లలో ఇది ఒకటి. హుస్సెన్ సాగర్కు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ పర్యటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. చక్కటి భోజనంతో పాటు వినసొంపైన సంగీతం వింటూ సాగర్ అందాలను చూస్తూ ఆనందించవచ్చు. 2) నెక్లెస్ రోడ్ రాత్రి వేళ నెక్లెస్ రోడ్ అందాలు చూడటంలో మజానే వేరు. ఇక్కడి రోడ్డు ట్యాంక్బండ్ చుట్టూ నెక్లస్ ఆకారంలో ఒంపు తిరిగి ఉన్న కారణంగా ఈ ప్రదేశానికి నెక్లెస్ రోడ్ అని పేరు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పురాతన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 3) ట్యాంక్ బండ్ ప్రేమపక్షులు నిత్యం సేదతీరే ప్రదేశాలలో ట్యాంక్బండ్ ఒకటి. ట్యాంక్బండ్ అందచందాలు మనల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సాయం సంధ్యలలో ట్యాంక్బండ్ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సాగర్లో బోటింగ్ చేస్తూ నీటి మధ్యలో ఉన్న ఎత్తైన బుద్ధున్ని చూస్తూ సంతోషంగా గడపొచ్చు. 4) లుంబినీ పార్క్ ఈ లుంబినీ పార్క్ హుస్సేన్ సాగర్కు సమీపంలో ఉంది. ఇది సంతవ్సరం పొడవునా పర్యటకులతో రద్దీగా ఉంటుంది. లేజర్ షో, సంగీత ఫౌంటెన్లు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. 5) ఎన్టీఆర్ గార్డెన్ హుస్సేన్ సాగర్కు సమీపంలో ఉన్న మరో అద్భుతం అని చెప్పొచ్చు. 36 ఎకరాల్లో ఉన్న ఈ పార్కు నగరం మధ్యలో బిర్లామందిర్, నెక్లస్ రోడ్డులకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు మ్యూజియం ఓ ప్రత్యేక ఆకర్షణ. 6) గోల్కొండ ఫోర్ట్ వందల ఏళ్లనాటి ఈ కట్టడం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి. దేశం నలువైపుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. చెదిరినప్పటికి కోట అందాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 7) దుర్గం చెరువు ప్రకృతిలో గడపాలనుకునే జంటలకు ఇదో చక్కటి ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ప్రశాంతమైన వాతావరణంలో బోటింగ్ చేస్తూ గడపొచ్చు. లేదా, కొండలు, గుట్టలు మధ్య ఉన్న చెరువును చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి వాటికి అవకాశం ఉంది. 8) లియోనియా రిసార్ట్ ఇది శామీర్ పేటలో ఉన్న ఓ ప్రముఖ రిసార్ట్. ప్రియమైన వారితో వీకెండ్ను ఎంజాయ్ చేయటానికి అనువైన ప్రదేశం. సకల హంగులతో కూడిన హోటళ్ల సముదాయాలు దీని ప్రత్యేకత. మెడి స్పా, సినిమా థియోటర్లు, లైవ్ ఫర్ఫార్మ్మెన్స్, సర్ఫింగ్ రిడ్జ్, వాటర్ పార్క్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. 9) అనంతగిరి హిల్స్ హైదరబాద్లో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. పచ్చదనం పరుచుకున్న ప్రదేశాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 3763 ఎకరాల విస్తిర్ణంలో ఉన్న కొండలు, పచ్చని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి. మూసీ నది జన్మస్థానమైన అనంతగిరి కొండలు సినిమ షూటింగులకు ప్రసిద్ధి. 10) రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ సిటీగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ మీ జంటకు ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుంది. ఓ అధ్బుత లోకంలోకి అడుగుపెట్టినట్లుగా భ్రాంతి కలిగిస్తుంది. సరదాగా గడపాలనుకునే ప్రేమ జంటలకు ఇది అనువైన ప్రదేశం. -
సీతయ్య
మధ్యాన్నమయింది. పొద్దున ముసలమ్మ దగ్గిర నుంచి అడుక్కున్న కానీతో రంగు చూసి మోసపోయి ఆ చక్కెర బిళ్ళలు కొనకపోతే, గుగ్గిళ్ళు కొని తింటే ఇప్పుడింత ఆకలి వెయ్యదుకదా అని పశ్చాత్తాపపడ్డాడు సీతయ్య. మధ్యానం టిఫెన్ కొరకై మామూలు స్థలాలు వెతికాడు. కోమటిరత్నం ఇంటిముందు పుల్లిస్తరాకులు కుక్కలు చప్పగా నాకేశాయి. ఏమీ ఆశలేదు. ఈవాళ దోసకాయలేమీ కుళ్ళినట్లులేవు. దుకాణం దగ్గిర ఒక మేకయినా లేదు. మిఠాయికొట్టు దగ్గిర వచ్చిపోయ్యేవాళ్ళని కనిపెడుతూ ఓ కుక్కపిల్ల కానీ కారప్పూస కొనుక్కున్న కోమటిపిల్ల కాళ్ల చుట్టూ తిరిగింది. పరికిణీ పట్టుకులాగింది. వెంటపరుగెత్తికెళ్ళింది. ఆ కోమటిపిల్ల తంతే దూరానపడి, మళ్ళీ తోకాడించుకుంటూ వెంట పరుగెత్తింది. సందు ములుపులో ఇద్దరూ అదృశ్యమైనారు. ఇదంతా చూశాడు సీతయ్య. తానో కుక్కపిల్లనైనా బాగుండును ఎవరో ఒకరు దయదలచి వుందురు తన మీద. కుయ్యిమని యేడిస్తే తన ఆకలి అబద్ధమనుకోరు. తన మకిలి లాగు పైకి లాక్కుని పట్టుకున్నాడు. బనియను చిల్లుల్లో వేళ్లు పెట్టుకొని రాజకుమారుడి ఠీవితో చూశాడు రోడ్డు వంక. తాను కుక్కనై యే ధనవంతుడి వెంటనో వాడి ఇల్లు చేరుకుంటే వాడు తనని పెంచుకుంటే? ఎవడు పెంచుకుంటాడు? పోనీ తనే ఎవణ్ణో తండ్రిగా పెంచుకుంటే నేం? బస్సు డ్రైవరు ప్రకాశి, తోటి డ్రైవర్లిద్దరూ, కండక్టరు కోటయ్య వెడుతున్నారు. కాఫీ హోటల్ నుంచి, బస్సుస్టాండ్ దగ్గరికి. సీతయ్య వాళ్ళ వెనకనే వెళ్ళి, ప్రకాసి చొక్కా పట్టుకులాగాడు. అతను వెనక్కి తిరిగి, ‘‘ఏం కావాలిరా?’’‘‘నీ కోసమే నాన్నా’’ అందరూ తిరిగి చూశారు. ‘‘నేను కాదురా, మీ నాన్న–బాగా చూడు’’‘‘కాదు. వెళ్ళు, వెళ్ళు’’ అని జేబులోంచి కాని తీసి యిచ్చాడు దయతలచి. అది తీసుకొని వెంటనడిచాడు సీతయ్య, యుముడి వెనకసావిత్రిలాగు.‘‘కానీ యిచ్చానుగా పో’’‘‘ఇప్పుడెక్కడున్నావు నాన్నా’’తక్కిన డ్రైవర్లు అర్థయుక్తంగా కనుగీటులతో ఒకరి మొహాలు ఒకరు చూసి నవ్వుకుంటున్నారు.‘‘నా వెంట రాకు. పో. యేం? తెలుస్తుందా నే చెప్పేది?’’‘‘సరే నాన్నా!’’‘‘నన్ను నాన్నా అనకు’’‘‘ఎందుకు?’’ప్రకాశి స్నేహితులు నవ్వుతో వొంగిపోతున్నారు.‘‘పోతావా? తన్నులు కావాలా?’’‘‘ఎక్కడికి పోను?’’ అన్నాడు చాలా జాలిగా!‘‘ఇంటికి పో’’‘‘ఇంటికే వస్తున్నా మరి’’‘‘వీణ్ణి తప్పించుకొని పారిపో. అది అన్యాయమైన పనేగాని, యేం చేస్తావు మరి!’’ అన్నాడు కండక్టరు కోటయ్య. ‘‘అన్యాయమేమిటి? అన్యాయమంటే యేమిటి నీ ఉద్దేశ్యం?’’ అన్నాడు ప్రకాసి కోపంగా.‘‘నీకే తెలియాలి, పాపం! నాకేం తెలుసు? మరి చేసినపనికి అనుభవించవద్దూ?’’‘‘ఎన్నాళ్ల కిందట చూశావు మీ నాన్నని?’’ అని అడిగాడు ఒక డ్రైవరు.‘‘నాకు జ్ఞాపకంలేదు. చాలా నెలలయింది’’‘‘అప్పటికి యిప్పటికీ మారాడా, మీ నాన్న?’’‘‘ఒక్కరవ్వ మారలేదు’’‘‘ఒరే నువ్వు పోతావా పోవా?’’ అన్నాడు పళ్ళు కొరుకుతో ప్రకాశి–అని త్వరత్వరగా నడిచాడుఎదురుగా చూస్తూ. ‘‘ఇంకా వస్తున్నాడు’’ అన్నాడు డ్రైవరు. ‘‘చాలా పట్టు వుందిరోయి వీడికి!’’ అన్నాడు కోటయ్య.‘‘వాళ్ళ అమ్మపోలిక అయి వుంటుంది’’ అన్నాడు యింకోడు. ప్రకాశి మాట్లాడకుండా నడిచాడు దబదబా బస్సు దగ్గరకి. తన సీటులో ఎక్కి ఒకసారి తిరిగి చూశాడు. ఎన్నడూ లేనిది త్వరగా ‘స్టార్టు’ చెయ్యాలని చూస్తున్నాడు. సీతయ్య వెనక చక్రాన్ని ఆనుకు నుంచున్నాడు. ఆ మోటరు సొంతదారుఆంజనేయులుగారు కుర్రాణ్ణి చూశారు. ‘‘ఏం కావాలి, నీకు?’’ అన్నాడు.‘‘మా నాన్న కావాలి’’‘‘ఎవరు మీ నాన్న’’‘‘డ్రైవరు ప్రకాశం’’‘‘ఏమోయ్ ప్రకాశీ ఇట్టరా’’రాలేదు.‘‘మీ అబ్బాయి వచ్చాడోయ్, నీకోసం’’‘‘మా అబ్బాయి కాదండి’’‘‘కాదూ ఇక్కడ వుంటేనే. వొచ్చిచూడు’’విధిలేక వచ్చాడు. నవ్వుతున్న కోటయ్యని కాల్చేట్టు చూసి, అటు తిరిగాడు. ‘‘పాపం ఎట్లావున్నాడో చూడు? నీ పిల్లల్ని యిట్లా వుపేక్ష చేయ్యడం ఏమీ బాగాలేదు’’‘‘నాకేం సంబంధం వీడి మొహం నేనెరుగను’’‘‘మీ నాన్న అట్లా అంటున్నాడేం, అబ్బాయి. నువ్వుండు ప్రకాశి–మీ అమ్మ ఎక్కడ వుంది?’’‘‘చచ్చిపోయిందండి. నాన్న తప్ప నా కెవరూ లేరు’’ఆంజనేయులుగారి మనసు కరిగిపోయింది. ‘‘మీ నాన్నతో బెజవాడ వస్తావా?’’ సీతయ్య మొహం వికసించింది. ‘‘కోటయ్యా, ఈ కుర్రాణ్ణెక్కించు. మనవాడు, టిక్కెట్టు, గిక్కెట్టు అక్కర్లేదు. మన ప్రకాశి కొడుకయ్యెను’’‘‘మన వాడేమిటి నాకేం తెలవదంటాడోయ్’’‘‘ఎందుకులే, నేనేం అడగనంటూ వుంటే? ఎవరో అంతర బొంతర వాళ్ళని వూరికే ఎక్కిస్తే కోపమొస్తుందిగాని సొంత కొడుకైనప్పుడు నేనేమంటాను? పాపం–ఆకలిగా వున్నట్టుంది ఏమన్నా కొనిపెట్టు. నీ దగ్గిర డబ్బులు లేవు గావును. ఇదిగో అబ్బాయి, పావలా–కాఫీ హోటల్కుపో–తరువాత ఇద్దురుగానిలే ప్రకాశీ’’కుర్రాడు పావలా తీసుకొని ‘‘నేను వచ్చిందాకా పోకండి’’ అని హోటలు వేపుకు దూకాడు. ‘‘ఈ బస్సులవాళ్ళు–వీళ్ళకి ప్రతివూళ్ళో ఒక భార్య’’ ‘‘ఈయన్ది బెజవాడగా’’ ‘‘ఐతేనేం, ఈ వూళ్ళో ఒక భార్య వుంటుంది’’ ‘‘తన కొడుకునే మరచిపోయినాడు?’’ ‘‘బలేవాడు’’ ‘‘మొహాన అట్టా పోలిక కనబడుతుంటే–పైగా బూకరిస్తాడేమిటి?’’ ‘‘తల్లి పనికొచ్చిందిగాని, పిల్ల పనికి రాలేదు’’కుర్రాడు వొచ్చాడు, పొట్టా, జేబులూ నింపుకుని. ప్రతివాళ్ళూ చోటిచ్చి రమ్మనే వాళ్ళే! బస్సు బయలుదేరింది. కొంచెం సేపట్లో ఆంజనేయులు కేకలు వేస్తున్నాడు. ‘‘ఇదిగో. ప్రకాశం. యేమిటి ‘నీ కుర్రాడు–అరే, కిందపడేట్టున్నాడు–వీడికి భయభక్తులులేవే! ఆ మూట కింద తోశాడు. ఆపు–ఆపు’’‘‘ఇంత అల్లరి యెట్లా నేర్పావయ్యా! మా అందరికీ పిల్లులు లేరూ?’’ అన్నాడు ఒకాయన. ‘‘నేనా!’’ అన్నాడు చివరికి ప్రకాశి. ‘‘మొత్తానికి నీ గుణాలే–ఒక్కటొక్కటే బైటికొస్తున్నాయి. చిన్నప్పుడు మనంచదువుకునేప్పుడునువ్వింతే!’’ అన్నాడు కోటయ్య.‘‘అట్లాచూస్తో నుంచుంటావేం? నీ కుర్రాణ్ణి సద్దుకో మా ప్రాణాలు తీస్తున్నాడు’’ అన్నాడు ఇంకో పెద్ద మనిషి. ఏ లోకంలో వున్నాడో కలో మాయో నిశ్చయించుకోలేని చూపుపెట్టి చక్రం ముందు కూచున్నాడు ప్రకాశి, మధ్య ఊళ్ళో బస్సాగింది. మళ్ళీ కాఫీ హోటల్లోకి అందరూ ప్రవేశించారు.‘‘నాన్నా! ఆకలిగా వుంది’’ అని ప్రకాశి వెంట బైల్దేరాడు కుర్రాడు. ‘‘పోరా వెధవా’’ అని తప్పించుకుని గుంపులో ప్రవేశించాడు ప్రకాశి. బస్సు బయలుదేరాలి, డ్రైవరు లేడు. పిలిచారు. వెతికారు. గంటసేపు చూశారు. కనబడలేదు. ‘‘నాన్నా! నాన్నా’’ అంటూ యేడుస్తున్నాడు కుర్రాడు. కోటయ్య మోటరు నడపవలసి వచ్చింది. ‘‘మరి ఈ కుర్రాణ్ణి యేం చేద్దాం?’’ అన్నాడు కోటయ్య. ప్రకాశి యెంత రౌడీ ఐనా ఇంత నిలబడలేని టక్కరివాడనుకోలేదు. తన సొంత కుర్రాణ్ణి ఇట్లా నడివడిలో వొదిలిపోయినాడే! మరీ ఇంత ఘాతుకుడనుకోలేదు’’ అన్నాడు ఆంజనేయులు. ‘‘కుర్రాడు. యేం చేస్తాం? బెజవాడలో ప్రకాశి దగ్గిర వదలి పెడదాం’’ ‘‘వాడిల్లు నాకు సరిగా తెలీదు’’ అన్నాడు కోటయ్య. ‘‘ఏం చేస్తావు సీతయ్యా!’’‘‘ఏం చెయ్యను?’’ అని బాధత్య వాడికే వదిలివేశాడు. కొంచెం యేడుపు మాని జాలి పుట్టించేట్టు అందరి మొహాలు చూసి, ముడుచుకొని ముసిలమ్మ వొళ్ళో తలపెట్టుకొని నిద్రపోయాడు. ఒక అరగంటలో నిద్రపోయి లేచి ప్రక్కనున్న రెడ్డిగారి బోదకాలు తొక్కి, సీటు నుంచి సీటుకి గంతులు వేస్తున్నాడు. బెజవాడ చేరారు. ఒక్కొక్కళ్ళె దిగిపోతున్నారు. దిగిపోయే వాళ్ళందర్ని ‘‘మీ ఇల్లెక్కడ!’’ అని అమాయకంగా ముద్దొచ్చేట్టు అడుగుతున్నాడు కుర్రాడు. ‘‘మరి కుర్రాడో’’ అన్నాడు కోటయ్య.‘‘ఏంచేస్తాం? రాత్రి ఇక్కడ పడుకొని, రేపు మళ్ళీ ఆ వూరే తీసుకుపోయి దిగపెడదాం’’ అన్నాడు కనికరంగల ఆంజనేయులు. కోటయ్యా, ఆంజనేయులూ, బజారువీధి నుంచి నగరప్పేటవేపు పోతున్నారు. తెలిసినవాణ్ణి పిలవడానికని కోటయ్య వెనక్కు తిరిగిచూసి ‘అరే’ అన్నాడు. కొంచెం దూరంలో నెమ్మదిగా బెజవాడ పురజనుల ఔదార్యమూ, పట్టణ సౌందర్యమూ తీరుబడిగా తిలకిస్తో సీతయ్య వొస్తున్నాడు. ఆంజనేయులు, కోటయ్యా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తన మీద వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధను గమనించి, వాడు–‘‘నాన్నా!’’ అన్నాడు. ‘‘నిన్ను పెంచుకున్నాడోయి, కోటయ్య’’ అన్నాడు ఆంజనేయులు.‘‘మిమ్మల్ని’’ అన్నాడు కోటయ్య. అప్పుడు ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద ఆగి చూస్తున్నారు. కోటయ్య, ఆంజనేయులు త్వరత్వరగా నడిచారు. ‘‘నాన్నా, ఆగు త్వరగా వెడుతున్నావు’’ అని అన్నాడు సీతయ్య.‘‘నేనా సందుకు పోతాను. పనివుంది’’ అన్నాడు కోటయ్య.‘‘అరే, ఆ కుర్రాణ్ణి ఏం చేసుకోమంటావు? పొమ్మని కేకెయ్యి’’‘‘మీ కోసం వొస్తున్నాడు. ఎవరి కోసం సీతయ్యా’’ అన్నాడు దయగా.‘‘నాన్న కావాలి’’ అని ఆంజనేయుల్ని చూపించాడు. ‘‘ఎవరు కావాలి?’’ అన్నాడు భయంగా ఆంజనేయులు.‘‘నువ్వే నాన్నా’’ఆంజనేయులు త్వరత్వరగా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు ఇంటికి.‘‘ఏం లేదు. లోపలికి పద’’‘‘ఆ కుర్రాడెవడు?’’‘‘పాపం, ఎవరో వెర్రికుర్రాడు, మా బస్సు ఎక్కాడు’’‘‘నేను వెర్రివాణ్ణా, నాన్నా! కాను’’‘‘పాపం పిచ్చివాడికి. ప్రకాశి కొడుకునన్నాడు పాపం’’‘‘కాదు. నువ్వు నానాన్న’’‘‘అంతేలే, కనబడ్డ ప్రతీవాణ్ణీ నాన్న నాన్న అంటాడ, అదీ వాడి పిచ్చి. కొంతసేపు కోటయ్యని నాన్నా అన్నాడు’’‘‘లేదు. నన్ననలేదు’’‘‘తరువాత ఈ శేషయ్యగార్ని నాన్న అన్నాడు...మిమ్మల్ని కాదేమిటి? ఆ శెట్టిగారిని’’‘‘గావును’’‘‘సరేలెండి. ప్రకాశిని అన్నాడా లేదా?’’‘‘ప్రకాశి ఏడి ఐతే?’’ అంది కాంతమ్మ. ‘‘వాడు పారిపోయినాడు’’ ‘‘ఆహా, తెలుస్తోంది. ఈ పెద్దమనుష్యులందరూ వీడు ప్రకాశి కొడుకని నాతో చెప్పడానికి వొచ్చారా?’’‘‘అవును’’ అన్నారు అందరూ. కాంతమ్మ రోడ్డువంక చూసింది. కన్నీళ్లతో, గద్గద స్వరంతో, ‘‘ఎంతపని చేశారండీ’’ అంది. ‘‘నేనేమీ యెరగను. కోటయ్యని అడుగు’’‘‘అడగడమెందుకులెండి? మీ కండక్టరేమంటాడు, అంతకంటే?’’‘‘ఈ పెద్దమనుష్యులు చూడలేదూ? వాళ్లనడుగు ఈ కుర్రాడెవరి కోసం వచ్చాడో అసలు’’‘‘వాళ్ళు మాత్రం మీ స్నేహితులు కారూ? ఎందుకులెండి. ఎంత అన్యాయం చేశారండి నన్ను! ఎంత నమ్మాను!’’‘‘ఏంరా! వెధవా, పాపం ఆంజనేయులుగారు నిన్ను అంత దయతో చూసినందుకుఆయనకీ కుంపటి తెచ్చిపెట్టావా?’’ అన్నాడు శేషయ్య. ‘‘దయగా చూశారా?’’ అంది కాంతమ్మ మండిపడుతూ.‘‘సొంత కొడుకు కాదు. మేనల్లుడిమల్లె చూసుకున్నాడు. ఎవర్నీలేంది వీణ్ణి టికట్టులేకుండా బస్సులో ఎక్కించాడు. ఫలహారం పెట్టించాడు. మా అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆయన చూపే ప్రేమ చూసేటప్పటికి’’ఇంత గొప్పగా పొగుడుతున్నా ఆంజనేయులు మొహంమాత్రంమండిపోతుంది. కాంతమ్మ ఇంక భరించలేక చప్పున ఇంట్లోకిపోయి తలుపేసుకుంది. గుంపులో మనుషులంతా ఒకరొకరే జారిపోయినారు. అందరూ పోగానే ఆంజనేయులు ఇంట్లోకి వెళ్ళాడు.ఏడుస్తో కాంతమ్మ పక్కమీద పడుకుంది‘‘ఒసే–మాట’’ ‘‘నాతో మాట్లాడకండి. నా మొహం చూడ్డానికి సిగ్గులేదూ’’‘నా మాట విని ముందు...’’ ‘‘నే ననుకుంటూనే వున్నా, యేదో ఇట్టాంటిది రహస్యంగా జరుగుతుందని–బస్సు అనేది, రాత్రులంతా యెక్కడో వుండిపొయ్యేదీ, ఆ డబ్బు అంతా యేమవుతుంది? మొన్న లైసెన్సుకి అడ్డిగ అమ్ముతానని తీసుకెళ్ళారే? ఇదా సంగతి! యెంతమోసంచేశారండీ? ఎప్పుడూ దిగులుగా కూచోడం–అదీ–తెలిసిపోతుంది–అంతా తెలిసింది’’‘‘విను–ముందు’’ ‘‘వినడమే! ఏమిటి వినడం? ఎందుకు వినడం–మీ అబద్ధాలన్నీ! ఇంకా మోసపోతానా? నేనూరుకోను. చూడండి...ఏం చేస్తానో! ఇంతటితో మీకు నాకు సరి’’‘‘విను–కుర్రాడు ప్రతివాణ్ణి అంటాడు నాన్నా అని, ఈపాటికి ఇంకెవణ్ణో పట్టుకుని వుంటాడు’’‘‘నే నూరుకోను–ఇది వూరంతా’’ అటూ వుండగానే, మెల్లిగా తలుపు తెరుచుకొని మొహం లోపలికి పెట్టి చూస్తున్నాడు సీతయ్య. మండిపడుతో కాంతమ్మ వాడి వేపు చూసింది. ఎవరూ మాట్లాడలేదూ రెండు నిమిషాలు. ‘‘అమ్మా’’ అన్నాడు. తలఎత్తి చూసింది. నిర్ఘాంతపోయి కుర్రాడి మొహం చూస్తో పడుకుంది. తలుపు ఇంకొంచెం తెరుచుకొని లోపలికి వచ్చాడు. ఆంజనేయులు భార్య వైపు చూశాడు. నవ్వాపుకోలేక కిటికీ వైపు తిరిగాడు.‘‘అమ్మా యేం అట్లా పడుకున్నావు?’’‘‘ఎంత పనిచేశావే! నన్ను ఇంత మోసం చేశావనుకోలేదు’’‘‘పోండి. వేళాకోళం చేస్తారు!’’‘‘సందేహం లేదు–పోలిక కనపట్టం లేదనుకున్నావా? పగలంతా లైను మీద చస్తాను. ఇంటి దగ్గర నువు చేసే పని ఇదా? యెప్పుడు కన్నావే వీణ్ణి?’’ అంటో నవ్వాపుకోలేక కిటికీకేసి తిరిగాడు. కాంతమ్మ లేచి అతని మెడ గట్టిగా పట్టుకుంది. ‘‘అంటారు! నన్నట్లా అంటారు?’’‘‘ఏమిటా, దిగులుగా ఆలోచిస్తోకూచుంటుంది అనుకున్నాను. ఎంత ఇచ్చినా చాలదంటుంది. ఏమవుతుందా అనుకున్నాను’’కాంతమ్మ అతని నోరు మూసింది. ‘‘ఏంరా, వేధవా! నేను నీకు అమ్మనట్రా?’’‘అవును. అమ్మవేగా?’’ అని నిశ్చయంగా అన్నాడు. హడలిపోయి చూసింది కుర్రాణ్ణి. చప్పున ఆపుకోలేక ఒక పెద్ద నవ్వు నవ్వింది. ఆంజనేయులు ఆపుకున్న నవ్వును అంతా నవ్వేశాడు. ఇద్దరూ సీతయ్యనిలాక్కుని కౌగిలించుకున్నారు. - చలం -
పాత స్థలాల్లో కొత్త నిర్మాణాలు!
రియల్ ఎస్టేట్, లొకేషన్! ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. మరి, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కాబట్టి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు శ్రీకారం చుడుతున్నాయి నిర్మాణ సంస్థలు! దీంతో పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో ప్రధాన నగరం నయా ప్రాజెక్ట్లతో కొనుగోలుదారులను రా.. రమ్మంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: 30–40 ఏళ్ల నాటి పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు చేయాలంటే నివాస సముదాయాలౖకైతే వెయ్యి గజాల వరకు, అంతకంటే ఎక్కువగా.. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, విద్యానగర్, హిమాయత్నగర్, బేగంపేట, అమీర్పేట్, బర్కత్పుర, తార్నాక, మారెడ్పల్లి, పద్మారావ్నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 90 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లే. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్ధిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని బేగంపేట్లో ‘రామ్ ఎన్క్లేవ్’ పేరిట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తున్న ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా పాత స్థలాలను రీ–డెవలప్మెంట్కు ఇచ్చేందుకు మరికొన్ని కారణాలున్నాయి. అవేంటంటే.. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటి ట్రెండ్స్కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ: రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు అగ్నిమాపక, విమానయాన, పర్యావరణ శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) పెద్దగా అవసరం ఉండదు. పైగా పాత స్థలాల టైటిల్స్ క్లియర్గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటర్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్ స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. ఎవరికేం లాభమంటే? రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లతో స్థల యజమానులకు, నిర్మాణ సంస్థలకు, కొనుగోలుదారులకూ అందరికీ ప్రయోజనకరమే! స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలూ త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం తిరిగొస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. -
ప్రాచీన ప్రదేశాలు ఆధునిక నామధేయాలు
మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్ ధాం, నేపాల్. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం, ఆంధ్రప్రదేశ్. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం – గంగోత్రి, ఉత్తరాఖండ్ నిర్యాణానికి ముందు శ్రీ కృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం – ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం – పర్హాం, ఉత్తర్ ప్రదేశ్. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం) – నేపాల్ లోని తిలార్కోట్. కాంభోజ రాజ్యం – ఇరాన్ (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది). రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు) – లాంగకో, టిబెట్, చైనా బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం – బోధ్ గయ, బీహార్. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు – కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు – గోకర్ణ, కర్ణాటక సీతాదేవి భూమిలో లభించిన చోటు – సీతామర్హి, బీహార్ మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) – జనక్ పూర్, నేపాల్ కోసలదేశం – అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం – ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) – ఘాఘర నది. -
వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళం నగరంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి, పాలకొండలో చెరువు గట్టుపై ఓ యువకుడు, ఇచ్ఛాపురంలో రైలు పట్టాలపై ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం రూరల్: నగరంలోని వెంకటేశ్వర ఆలయం వెనుక చెరువు గట్టుపై ఉన్న ఇంట్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిలుగు శాంతి(19) తంర్రి మృతి చెందడంతో కొన్నాళ్లుగా తల్లి, అమ్మమ్మతో కలిసి చెరువు గట్టుపై ఉన్న ఇంట్లో ఉంటోంది. చుట్టుపక్కల వీధుల్లోని చిన్నారులకు ట్యూషన్ చెబుతూ ఇంటిని నెట్టుకొస్తోంది. ఏం జరిగిందో గానీ సోమవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. శాంతి మృతిపై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అనారోగ్యం కారణంగా ఉరివేసుకొందని చెబుతుండగా, మరికొందరు ఇంట్లోకి నీరు తీసుకువెళ్తుండగా మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమై చనిపోయిందని చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందలేదు. రైలుపట్టాలపై వృద్ధుడు.. ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయం సమీపంలో బెల్లుపడ కాలనీ వద్ద ఇచ్ఛాపురం నుంచి బరంపురం వైపు వెళ్లే డౌన్ట్రాక్లో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు మృతిచెందాడు. తెలుపు షర్టు, పంచె ధరించిన ఈ వృద్ధుడి వయసు సుమారు 63 ఏళ్లు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. జీఆర్పీ ఎస్ఐ కె.రవికుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనేటి గట్టుపై యువకుడు... పాలకొండ రూరల్: వడమ గ్రామ సమీపంలోని కళ్యాణి కోనేటి గట్టుపై ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కె.వాసునారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాలకొండ ఇందిరానగర్ కాలనీకి చెందిన కళివరపు రమణ(25) స్థానికంగా వంట పనులు చేస్తుండేవాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో దూరప్రాంతాల్లో వంటలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రమణ కుటుంబీకులకు సమాచారం అందించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదుచేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రాచీన ప్రదేశాలు... ఆధునిక నామధేయాలు
1. మహావిష్ణువు గజేంద్రుణ్ణి మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్ ధాం, నేపాల్. 2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం, ఆంధ్రప్రదేశ్. 3. జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్. 4. మాహిష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) – మహేశ్వర్, మధ్యప్రదేశ్ 5. శమంత పంచకం (పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) దుర్యోధనుని చంపిన చోటు–కురుక్షేత్ర, హర్యానా 6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి, సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర సముద్రతీర ప్రాంతం 7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా 8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా, మధ్యప్రదేశ్ 9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం– ధమౌలి, నేపాల్ 10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు, పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్ 11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు– మన గ్రామం, ఉత్తరాంచల్ 12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) –ఝాన్సీ,అలహాబాద్. 13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)–కురుక్షేత్ర దగ్గర. 14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్. 15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) –మధుర, ఉత్తర్ ప్రదేశ్. 16. వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర. 17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) – గ్వాలియర్. 18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) – పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్. 19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)–డెహ్రాడూన్. 20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) – గురుగావ్, హర్యానా. -
జూదాల్లో జోరుగా దొంగనోట్లు
ఆకివీడు(ఉండి) : జూదాల్లో దొంగనోట్లు జోరుగా చలామణి అయ్యాయి. అయిభీమవరం గామంలోని ఎఫ్సీఐ గిడ్డంగి ప్రాంతంలోని కోడి పందేల బరిలో ఏర్పాటు చేసిన పేకాట కేంద్రంలో సోమవారం నకిలీ రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. కోతాట ఆడుతుండగా కృష్ణా జిల్లా పెదలంక గ్రామానికి చెందిన ఒక యువకుడు రూ.2వేల నోటును పందెంగా కాశాడు. దీనిని దొంగనోటుగా గుర్తించిన తోటì జూదరులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే పేకాట కేంద్రంలో సుమారు రూ.లక్షకుపైగా దొంగనోట్లు చలామణి అయ్యాయని తెలుస్తోంది. దీంతో అందరూ తమకు వచ్చిన నోట్లను చూసుకోగా, చాలామంది వద్ద దొంగనోట్లు కనిపించాయి. వారంతా లబోదిబోమన్నారు. ఇదే అదునుగా పేకాట కేంద్రాన్ని ఒక్కసారిగా ఎత్తివేసి కోతాటలో జూదరులు పందెంగా కాసిన రూ.3 లక్షలను నిర్వాహకులు స్వాహా చేశారు. భీమవరం గ్రామానికి చెందిన ముదుండి గణపతిరాజు మాట్లాడుతూ.. కోతాట కేంద్రాన్ని ఎత్తివేయడంతో తాను రూ.లక్షా50 వేలు నష్టపోయాయని ఆవేదన చెందాడు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన చోడదాసి గంగయ్య కూడా దొంగనోట్లతో నష్టపోయినట్టు చెప్పాడు. పేకాట కేంద్రంలో గత మూడు రోజులుగా సుమారు రూ.10 లక్షల విలువైన దొంగనోట్లు చలామణి అయిపోయాయని సమాచారం. పట్టుబడిన వ్యక్తి ఏమయ్యాడు? దొంగనోటు పందెం కాసి పట్టుబడిన కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తి ఏమయ్యాడో ఎవరికీ తెలియడం లేదు. అతనికి దేహశుద్ధి చేసిన నిర్వాహకులు పంపించివేశారని కొందరు చెబుతుండగా, పోలీసులకు ఫోన్చేసి సమాచారం ఇచ్చామని ఇంకొందరు చెబుతున్నారు. కొంత మంది కష్ణాజిల్లా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా జాద క్రీడ నిర్వాహకుల కన్నుసన్నల్లోనే జరిగిందని జూదరులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉం డగా కోతాటలో ఉండి మండలం పాందు వ్వకు చెందిన వ్యక్తి రూ.వెయ్యి పందెం కాయగా, రూ. 2 వేలు నోటు ఇచ్చారు. అది దొంగనోటని తరువాత తెలిసింది. దీంతో అతను లబోదిబోమంటున్నాడు. దొంగనోటు ఇలా.. పట్టుబడిన దొంగనోటులో తెల్లభాగం వద్ద గాంధీ బొమ్మ వాటర్ మార్క్ లేదు. కాగితం మధ్య భాగంలో మెరిసే థ్రెడ్(ఆర్బీఐ) సిల్కు దారం కూడా లేదు. కాగితం ఫోటోస్టాట్ పేపరుగా ఉంది. -
పచ్చని బతుకుల్లో చిచ్చుపెట్టారు
♦ దుకాణాలు కూల్చిన చోటే స్థలాలు కేటారుుంచాలి ♦ లేదంటే పిల్లలతో సహా ఇక్కడే చస్తాం ♦ ఒంగోలు ఎమ్మెల్యేకి ముస్లిం మహిళల అల్టిమేటం ♦ బండ్లమిట్టలో పర్యటించిన దామచర్లపై స్థానికుల ఆగ్రహం ♦ అధికారులది తొందరపాటు చర్యేనన్న ఎమ్మెల్యే ♦ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని తప్పుకునే యత్నం ♦ కార్పొరేషన్ అధికారులపై చర్యలకు బాధితుల పట్టు ‘పండుగ రోజుల్లో సంతోషం నిండాల్సిన పేదల బతుకుల్లో ఆరని చిచ్చు పెట్టారు. 30 ఏళ్లు కాదు.. 60 ఏళ్లుగా మా కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నారుు. కనీస సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి దుకాణాల్ని, నివాసాల్ని అడ్డగోలుగా కూల్చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. కూల్చిన చోటే మాకు స్థలాలు కేటారుుంచండి. లేదా పిల్లలతో సహా ఇక్కడే ప్రాణాలొదిలేస్తాం’ అంటూ ముస్లిం మహిళలు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు అల్టిమేటం ఇచ్చారు. బండ్లమిట్టలో నగరపాలక సంస్థ అధికారులు కూల్చేసిన ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యేపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒంగోలు: ఒంగోలు నడిబొడ్డున, ఊరచెరువు ఒడ్డున చిరువ్యాపారాలు చేసుకుని జీవిస్తున్న పేదలపై ఈనెల 14వ తేదీన నగర పాలక సంస్థ అధికారులు ప్రతాపం చూపించారు. పొక్లెనర్లతో వచ్చి, పోలీసు బలగాలను అడ్డుపెట్టి బండ్లమిట్టలోని రోడ్డు పక్కనున్న దుకాణాలను కూలగొట్టారు. ఈ ఘటన చిలికిచిలికి గాలివానగా మారుతున్న నేపథ్యంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శుక్రవారం ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సేవ కేంద్రం నుంచి బండ్లమిట్టలోని నాలుగురోడ్ల కూడలి వరకు పరిశీలించిన ఆయన కొద్దిసేపు మసీదు వద్ద ముస్లింలతో మాట్లాడేందుకు యత్నించారు. వారికి నచ్చజెప్పేందుకు యత్నించగా ముస్లిం మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండుగ రోజుల్లో కనీసం పిల్లలకు కాసింత భోజనం పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారని, రోజంతా కష్టపడితేగాని తమకు పొట్ట గడవదని, అలాంటి తమపై ఎందుకు ఇంత కక్షగట్టారంటూ ప్రశ్నించారు. పట్టాలు చూపించి మొరపెట్టుకున్నా కమిషనర్ కనికరించలేదని, నిర్థాక్షిణ్యంగా పోలీసుల అండతో కూల్చివేశారని వాపోయారు. మూడు నెలల క్రితమే నోటీసులు ఇచ్చామని కమిషనర్ చెప్పడం అబద్దం అన్నారు. కేవలం కుట్రపూరితంగా ముస్లింలపై కక్షతోనే ఈ దాడికి యత్నించారని ఆరోపించారు. తాము ఎన్నిసార్లు ఫోన్చేసినా మీ ఫోన్ కలవలేదని పేర్కొన్నారు. న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్యే చెప్పేందుకు యత్నించారు. దుర్మార్గంగా కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ సిబ్బందిని ఉద్దేశించి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలకు వెనుకడుగు.. అధికారులది తొందర పాటు చర్చేనని అంగీకరించిన ఎమ్మెల్యే దామచర్ల వారిపై చర్యలకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. బాధితులు పట్టాలు చూపిస్తున్నా అధికారులు లెక్కచేయకపోవడం, అసలు పట్టాలె లా వచ్చాయనే విషయూన్ని పరిశీలించకపోవడంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. నష్టపోయిన వారిని ఏ విధంగా ఆదుకుంటార నే ప్రశ్నకూ స్పష్టత ఇవ్వలేదు. తమ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి చాలా స్థలాలు ఉన్నాయని, అందుకోసం దుకాణాల్ని కూల్చలేదని మాత్రం బదులిచ్చారు. మాపైనే ఎందుకీ కక్ష.. నివాసస్థలాల కోసం పట్టాలు ఇచ్చామంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. నగరంలో ఎన్నిచోట్ల నివాస స్థలాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నా తమపైనే ఎందుకు యుద్ధకాండను తలపించేలా దాడిచేశారో సమాధానం చెప్పాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేకి సంబంధం లేకపోతే నోటీసులు ఇవ్వకుండా దాడిచేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తొందరపాటు చర్యే.. నగరంలో మెట్లు పడగొట్టాలన్నా ముందు నోటీసులివ్వమని అధికారులకు సూచించా. పండుగ మాసంలో ఉపవాసంలో ఉండగా ముస్లింల కట్టడాలు కూల్చడం బాధాకరం. నగరపాలక సంస్థ అధికారులు తొందరపాటు చర్యే. ఇందులో తనకు ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అధికారులు తీసుకున్న చర్యే. బాధితులకు జరిగిన నష్టంపై ఒకటి రెండు రోజుల్లో అంచనాకు వస్తాం. మసీదుకు సంబంధించి కూడా వారి మతపెద్దలతో మాట్లాడతాం. తదుపరి ఎలా ఆదుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. - దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎమ్మెల్యే -
బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వస్తువులు కాల్చొద్దు..
కొచ్చిః కేరళ హైకోర్టు స్థానిక ప్రజలకు ప్రత్యేక తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్, రబ్బర్ వంటి వస్తువులను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా, పౌర సంబంధిత సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ హెచ్చరించింది. బ్రీత్ ఈజీ కార్యక్రమంలో భాగంగా కేరళ హైకోర్టు ప్రత్యేక నిర్ణయం తీసుకొంది. రబ్బర్, ప్లాస్టిక్ వంటి వస్తువులను తగులబెట్టడం వల్ల వచ్చే పొగతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాక, అనేక శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. అటువంటి పనులను నిషేధిస్తూ నిబంధనలను విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, అటువంటి పనులకు పాల్పడేవారిపై పోలీసులు సైతం సుమోటో కేసులను ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవాలంటూ ఛీఫ్ జస్టిస్ తొట్టత్తిల్ బి. రాధాకృష్ణన్, అను శివరామన్ లతో కూడిన ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడాన్ని నిషేధిస్తూ కోర్టు ఈ కొత్త ఆదేశాలను జారీ చేసింది. -
స్థలం మీదే.. రిజిస్ట్రేషన్ కాదు
ప్రజల సొంత స్థలాలు సైతం అసైన్డ్ ల్యాండ్స్గా నమోదు ఆన్లైన్ చేసిన భూమి రికార్డులు తప్పుల తడక మార్పు చేయని అధికారులు రిజిస్ట్రేషన్లకు తీవ్ర విఘాతం తాడేపల్లిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొర్రా నాగేశ్వరరావుకు కడకట్ల రెవెన్యూ పరిధిలోని మాగంటి కల్యాణ మండపం సమీపంలో సర్వే నంబర్ 252, 253లలో 421 చదరపు గజాల ఖాళీ స్థలం ఉంది. దానికి డెరైక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ (డీటీసీపీ) అనుమతి మంజూరైంది. లే అవుట్ పర్మిషన్ (ఎల్పీ) నంబర్ కూడా ఉంది. ఆ స్థలాన్ని వేరే వ్యక్తులకు బేరం పెట్టిన నాగేశ్వరరావు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే.. రిజి స్ట్రేషన్ చేయడం కుదరదని రిజిస్ట్రార్ చెప్పారు. అదేమని అడిగితే ఈ స్థలం నిషేధిత (ప్రొహిబిటెడ్) జాబితాలో ఉందన్నారు. ఆ స్థలానికి సంబంధించి దస్తావేజులు, ఇతర రికార్డులన్నీ పక్కాగా ఉన్నా.. ఇది అస్సైన్డ్ ల్యాండ్ అని, అలాంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. రెవెన్యూ కార్యాలయానికి వెళితే.. అది అస్సైన్డ్ ల్యాండ్ కానేకాదని.. పక్కా జిరాయితీ భూమి అని స్పష్టం చేస్తున్నారు. ‘ఇది మీ స్థలమే కానీ.. పొరపాటున ప్రొహిబిటెడ్ లిస్ట్లోకి వెళ్లింది. రికార్డుల్ని సరిచేసి ఉన్నతాధికారులకు పంపించాం’ అని చెబుతున్నారు. నాగేశ్వరరావు ఆ స్థలం విషయమై ఆరు నెలలుగా సబ్ రిజిస్ట్రార్, తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి కేసులెన్నో ఈ పరిస్థితి ఒక్క నాగేశ్వరరావుకు మాత్రమే పరిమితం కాలేదు. తాడేపల్లిగూడెంలోని భూపాల్నగర్ ప్రాంతంలో చాలామంది ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ సమస్య ఉంది. ప్రతి పట్టణంలోనూ కనీసం 30శాతం సొంత స్థలాలు అస్సైన్డ్ ల్యాం డ్స్గా ఆన్లైన్ రికార్డుల్లో నమోదయ్యాయి. సొంత స్థలాలను అవసరాల నిమిత్తం అమ్ముకోవడం, ఇంటి ఆడపడుచులకు పసుపు కుంకుమల కింద ఇవ్వడం వంటి సందర్భాల్లో వీటిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్లే వ్యక్తులు రిజిస్ట్రేషన్ కాక ఇబ్బందుల పాలవుతున్నారు. ఉదాహరణకు ఇలా.. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలో తాడేపల్లిగూడెం, కడకట్ల, తాళ్లముదునూరుపాడు, యాగర్లపల్లి పేరిట నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి పూర్వమే రెవెన్యూ సర్వే నంబర్లు కేటాయించారు. ఆ నంబర్లను ఆన్లైన్చేసే సమయంలో పొరపాట్లు దొర్లాయి. కడకట్ల రెవెన్యూ పరిధిలోని భూముల క్రమవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆన్లైన్లో ఆ గ్రామ సర్వే నంబర్ను నమోదు చేస్తే ప్రభుత్వానికి చెందిన భూముల సర్వే నంబర్ కనెక్ట్ అవుతోంది. ఆన్లైన్ రికార్డుల్లో ఆ స్థలం అసైన్డ్ ల్యాండ్గా నమోదై ఉండటంతో రిజిస్ట్రేషన్ జరగడం లేదు. సొంత స్థలాలు, భూములు ప్రభుత్వ ఆస్తులుగా రికార్డులలో పొరపాటుగా నమోదు చేయడంతో వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెంలో 30శాతం సర్వే నంబర్లలోని జిరాయితీ భూములు, లే-అవుట్ స్థలాలు ప్రభుత్వ ఆస్తులుగా నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో పరిష్కారమైనా.. రెవెన్యూ రికార్డులను, సర్వే నంబర్ల వివరాలను ఆన్లైన్ చేసే సందర్భంలో పొరపాట్ల వల్ల ఏపీలోని 13 జిల్లాల్లో ఇదే సమస్య తలెత్తింది. ఒక్క పశ్చిమ గోదావరి మినహా 12 జిల్లాల్లో వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆన్లైన్ రికార్డుల్లో మార్పులు చేయడంతో అక్కడ సమస్య పరిష్కారమైంది. మన జిల్లాలో మాత్రం ఐదేళ్లుగా ఈ సమస్య వేధిస్తూనే ఉంది. ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించే వాటికి ఫారం 22 (ఏ), ఫారం 22(ఈ) ఆధారంగా తప్పులు సరిచే సి కొత్త జాబితాలు తయారు చేయక పోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఫలితంగా సొంత భూమిదారులకు ఐదేళ్లుగా ఇబ్బందులు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ చేయలేం మునిసిపాలిటీల పరిధిలో రెవెన్యూ గ్రామాలకు సంబంధించి సర్వే నంబర్లను నమోదు చేయడంలో పొరపాట్లు జరిగాయి. ఈ కారణంగా ఆయా రెవెన్యూ గ్రామాల్లోని స్థలాలు, పొలాల క్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం వీలు కావడం లేదు. సదరు స్థలాలు, పొలాలు ఆన్లైన్ రికార్డులలో అస్సైన్డ్ ల్యాండ్స్గా ఉన్నాయి. అలా నమోదైన భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. వీటికి రిజిస్ట్రేషన్ చేయాలంటే కలెక్టర్ నుంచి నిరభ్యంతర (నో అబ్జెక్షన్) ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలి. - గునుపూడి రాజు, సబ్ రిజిస్ట్రార్, తాడేపల్లిగూడెం మార్పులు చేసి పంపించాం భూముల రికార్డుల వివరాల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసి ఉన్నతాధికారులకు పంపించాం. అవి అధికారికంగా ఆమోదం పొందాల్సి ఉంది. తాడేపల్లిగూడెం పట్టణంలోని భూపాల్ నగర్ పూర్వం గ్రామకంఠంగా ఉండేది. తర్వాత ఆ భూముల్లో భవనాలు వెలిశాయి. రికార్డులలో సర్వే నంబర్లు మారాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సర్వే నంబర్లలో ఉన్న ఆస్తులు, యజమానుల వివరాలను అధికారులకు పంపించాం. అవి మారి రావాల్సి ఉంది. - పాశం నాగమణి, తహసీల్దార్, తాడేపల్లిగూడెం -
వివాదంగా మారిన పూసలకాలనీ సమస్య
ఇరువర్గాల ఘర్షణ ఉదయగిరి: ఉదయగిరి - కావలి రోడ్డు మార్గంలోని పూసలకాలనీలో ఇళ్ల స్థలాల విషయమై బుధవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో గతంలో ఎస్సీలకు ఇందిర ప్రభుత్వ హయూంలో ఇళ్ల స్థలాల్లో పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చారు. కానీ ఆనాడు గ్రామ శివా రు అయినందున వారు అక్కడ నివాసం ఉండలేదు. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల క్రితం సంచార జాతులకు చెందిన పూసలి వారు ఆ ఇళ్లలోనే కాపురముంటున్నా రు. కాని ప్రస్తుతం ఉదయగిరి పట్టణం విస్తరించడంతో ఆ స్థలాలకు గిరాకీ పెరిగింది. దీంతో ఎస్సీలు తమ ఇళ్లు ఖాళీ చేయాలని పూసలివారిపై ఒత్తిడి తెస్తున్నారు. 9 నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి సర్దుబాటు చేశారు. పూసలకాలనీ వాసులకు ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎస్సీలు తమ స్థలాలకు సంబంధించి సరిహద్దు రాళ్లను నాటే నిమిత్తం బుధవారం పూసల కాలనీకి వెళ్లి పనికి ఉపక్రమించడంతో.. స్థానికులు ప్రతిఘటించారు. దీంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందడంతో సీఐ జె.శ్రీనివాసులు, ఎస్సై విజయకుమార్, పీఎస్సై ప్రతాప్ యాదవ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. దీంతో ఆగ్రహించిన ఎస్సీలు కాలనీ సమీపంలోని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి విరమించారు. ఈ ఘర్షణకు సంబంధించి రెండు వర్గాల వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వల్పంగా గాయపడిన వారు స్థానిక సీహెచ్సీలో చికిత్స చేయించుకున్నారు. ఎస్సై విజయకుమార్ తహశీల్దార్, ఆర్డీఓలకు సమాచారం అందించినట్లు చెప్పారు. పోలీసుపికెట్ ఏర్పాటుచేశారు. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి పూసలకాలనీలో చోటుచేసుకున్న పరిణామాలను నిరసిస్తూ తమకు తక్షణమే రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ ఆ కాలనీకి చెందిన ఎరుకల, యానాది కులాలకు చెందిన వారు బుధవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. -
ఆర్థిక రాజధానిలో ఆ ప్రదేశాలు మీకు తెలుసా?
ముంబైః ఎత్తైన కట్టడాలు, సినీతారల జిలుగువెలుగులు, స్టూడియోలు, ఖరీదైన మార్కెట్లు, గేట్ వే ఆఫ్ ఇండియాను చూస్తూ కనిపించే తాజ్ మహల్ హోటల్... ఒక్క మాటలో చెప్పాలంటే ముంబై కలల నగరం. ప్రపంచానికి అమెరికా దేశం ఓ కలలా ఎలా కనిపిస్తుందో.. భారత దేశానికి ముంబై ఆలాంటిదనే చెప్పాలి. ఏడు ద్వీపాల నగరంగా కూడ ఆ నగరాన్ని పిలుస్తారు. అయితే అక్కడి కొన్ని అద్భుత స్థలాలను గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ విభిన్న ప్రాంతాలను గుర్తించడంలో మెట్రో నగరం... శ్రద్ధ తీసుకోవడం లేదు. ముంబై ప్రజలు.. హాయ్ చెప్పే కన్నా ముందు చాయ్ అంటారనడంలో అతిశయోక్తి లేదు. అందుకు ఉదయం రాత్రి తేడా లేదు. జనసంద్రం నుంచీ దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా ఓ గుక్కెడు టీ తాగేందుకు అక్కడి జనం ఎంతో ఇష్టపడతారు. సముద్ర తీరంలో కూర్చొని ఒక్క సిప్ చాయ్ తాగి, ఒత్తిడినుంచి బయట పడుతుంటారు. ముంబైలోని మిడ్ నైట్ చాయ్, వర్లీ సీ ఫేస్ వంటి ప్రదేశాలు అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. నగరంలో మరో ప్రధానమైన ప్రాంతం.. ధారవి కచ్చర్పట్టి. ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా ప్రసిద్ధి పొందిన ప్రాంతమది. అయితే చాలామంది సందర్శకులకు తెలియనిది అక్కడి ధారవి మార్కెట్. షాపింగ్ చేసేందుకు అదో ప్రధాన కేంద్రంగా చెప్పాలి. లెదర్ జాకెట్స్ నుంచి బ్యాగ్ ల వరకూ, ఫ్యాషన్ ఉపకరణాల నుంచి జ్యువెలరీ వరకూ ఏ వస్తువైనా ధారవిలో దొరికిపోవాల్సిందే. బల్లార్డ్ ఎస్టేట్ లోని బ్రిటానియా కంపెనీ రెస్టారెంట్ దర్శించారంటే ఓ ప్రత్యేక అనుభూతి కలగక మానదు. అక్కడి ఇరానీ కేఫ్ లో 93 ఏళ్ళ వ్యక్తి... పర్షియన్ ఫ్లేవర్ తో రుచికరమైన టీ అందించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఆ వయసులో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అక్కడ సేవలు అందించడం ముంబై నగరానికే వన్నె తెస్తుంది. అలాగే నగరంలోని క్వీన్స్ నెక్లెస్ పై కుంటుంబంతో సుదీర్ఘమైన డైవ్ అనుభవం.. హృదయాంతరాలను హత్తుకు పోతుంది. అక్కడ బ్యాచులర్స్ అందించే ప్రత్యేక సేవలకు తోడు... స్ట్రాబెర్రీ షేక్ తాగితే సందర్శకులు ఫిదా అయిపోవాల్సిందే. ముంబై మానియా భావాల్లో మరింత చైతన్యం నింపాల్సిందే. ముంబై పశ్చిమ శివారు ప్రాంతం.. బాంద్రాలో చెట్ల నీడన నెలవైన విలక్షణ హెర్సెర్ఛ్ బేకరీ కూడ సందర్శకుల మనసును కట్టిపడేస్తుంది. ఆకర్షణీయమైన కుటీరాలతో విభిన్నంగా కనిపిస్తూ...ఆనందతీరాలకు చేరుస్తుంది. చెట్ల నీడన పక్షుల గూళ్ళను తలపించే కాటేజ్ లలో.. సాధారణ బర్గర్లు, ర్యాప్ లు మొదలైన భక్ష్య భోజ్యాలతోపాటు చల్లని నిమ్మరసం.. ఆత్మారాముడి ఆరాటాన్ని తీర్చడంతోపాటు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఈ స్థలాన్ని సల్మాన్ ఖాన్ కూడ తరచుగా సందర్శిస్తుంటాడన్నవార్తలు ఉన్నాయి. ఇంకా ఆలస్యం దేనికి? ముంబై నగరంలో వేసవి విడిదికి సిద్ధమైపొండి మరి! -
గుడివాడ గుర్నాధరావు విగ్రహావిష్కరణ
-
సెల్ఫ్ చెక్
సమ్మర్ ట్రిప్ సరిగా ప్లాన్ చేస్తున్నారా? పిల్లలకు పరీక్షలయ్యాయి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్న ప్రదేశాలను చూడడానికి ఇదే మంచి సమయం. ఇబ్బందులను ఎదుర్కోకుండా ట్రిప్ను ఆద్యంతం ఆస్వాదించాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?- అన్న విషయంలో మీకు ఉన్న అవగాహనను ఒకసారి చెక్ చేసుకోండి. 1. మీతోపాటు మీ పిల్లలు, అమ్మానాన్నలు... ఇలా ఇంటిల్లిపాదీ కలిసే వెళ్లే ప్రదేశాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. అవును కాదు 2. ఇంట్లో అందరికీ నచ్చే ప్రదేశం దాదాపుగా ఏ ఒక్కటీ ఉండదు. కాబట్టి ఆ ట్రిప్లో పిల్లలు ఎంజాయ్ చేయడానికి సాంక్చురీ, మీకు నచ్చే మాన్యుమెంట్స్తోపాటు మీ అమ్మానాన్నలకు నచ్చే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం... ఉండేలా ప్లాన్ చేస్తారు. అవును కాదు 3. చారిత్రక కట్టడాల వంటి పర్యాటక ప్రదేశాల్లో పర్యటించడానికి ఉదయం లేదా సాయంత్రం మంచిదని(ఎండ తక్కువగా ఉండే సమయం) మీకు తెలుసు. అవును కాదు 4. ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటించే ముందే అక్కడి దర్శనానికి అనుమతించే సమయం, పూజలు, సేవల వివరాలను తెలుసుకుని ఆ మేరకు ప్రయాణాన్ని ప్లాన్ చేస్తారు. అవును కాదు 5. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల వంటి ప్రదేశాల్లో పర్యటించే ముందుగా అక్కడ ఏ జంతువులు ఉంటాయి, వాటి ప్రాముఖ్యత వంటి వివరాలు తెలుసుకుని పిల్లలకు ఆసక్తి కలిగేటట్లు వాటిని చెబుతారు. అవును కాదు 6. హిల్స్టేషన్లకు వెళ్లేటప్పుడు అక్కడ నడవటానికి అనువుగా ఉండే పాదరక్షలను తప్పకుండా జాగ్రత్త తీసుకుంటారు. అవును కాదు 7. విలువైన ఆభరణాలు, యాక్సెసరీస్ వంటివి ధరించడం వల్ల వెళ్లిన చోట ఆ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయడం కంటే మన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది - కాబట్టి ధర తక్కువైన సింపుల్ యాక్సెసరీస్ మాత్రమే ధరిస్తారు. అవును కాదు పైవాటిలో ‘అవును’లు ఎక్కువ వస్తే మీకు సమ్మర్ ట్రిప్పై సరైన ప్లానింగ్ వుందని చెప్పవచ్చు. -
గుబులు రేపుతున్న సర్వే..!
ఘట్కేసర్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వే బడా బాబుల్లో గుండెల్లో గుబులు రేపుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటి వరకు దొడ్దిదారిన సంక్షేమ పథకాలను కాజేసిన వారు సర్వే పేరు వింటేనే వణికిపోతున్నారు. అక్రమంగా పొందిన సేవలన్ని సర్వే ద్వారా బహిర్గతమయ్యే అవకాశముండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. వ్యతిరేకిస్తున్న ఉన్నత వర్గం, ఆహ్వానిస్తున్న పేద వర్గం... కోట్ల కొలది ఆస్తులున్న తెల్ల తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ తదితర రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర సౌకర్యాలు పొందుతున్న ఉన్నత వర్గాలు సామాజిక సర్వేను వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు పొందడానికి అన్ని అర్హతలున్నా ప్రభుత్వ రాయితీలను అందుకోలేకపోతున్న పేద వర్గం సర్వేను స్వాగతిస్తోంది. సర్వేలో ఉద్యోగ స్థితి, ఆధార్, స్థిరాస్తి, చరాస్థి, గ్యాస్, ఇంటి, కుటుంబ పరిస్థితి, పశు సంపద, పెన్షన్స్, భూములు, పాన్ కార్డు తదితర వివరాలను సర్వే సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. పాలకుల స్వార్థపూరిత పాలనలో సర్కారు ఉద్యోగమున్న వారు, భూస్వాములు వారి తల్లితండ్రులు నేడు తెలుపు కార్డులు పొంది పెన్షన్స్, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుల ద్వారా రాయితీలు పొందుతున్నారు. వైకల్యం లేకున్న పెన్షన్ పొందడం, ఇల్లు ఉండగానే స్థలాలు, ఇందిరమ్మ పథకాలను తిరిగి వినియోగించుకున్న వారికి ఇప్పుడు సర్వే అంటేనే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. భూములు, ప్లాట్ల విక్రయాలన్ని నేడు ఆన్లైన్లో జరుగుతున్నందున ఎక్కడ తమ అక్రమ ఆస్తుల వివరాలు సర్కారుకు తెలిసిపోతాయోనని బడాబాబులు దడుసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులకు తప్పని తిప్పలు... నూతనంగా ఎన్నికలైన ప్రజా ప్రతినిధులను సర్వే తిప్పలు వదలడం లేదు. ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కినా సర్వే ద్వారా ప్రజల నమ్మకాన్ని కోల్పోయే అవకాశముందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటేసి గెలిపిస్తే ఉన్న సౌకర్యాల్లో కోతల విధిస్తున్నారని, ఇందుకోసమేనే మిమ్మల్ని గెలిపించామా అంటూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. మరి ఈనెల 19న జరిగే సర్వేలో అందరూ అనుకుంటున్నంటు అక్రమాలు బయటపడతాయా లేక ఇది ఓ సాధారణ సర్వేగా మిగిలిపోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. -
10 స్వర్గాలు
-
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు సంఘీభావంగా బంద్
తాడేపల్లిగూడెం, న్యూస్లైన్: హైదరాబాద్లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల బంద్ పాటించారు. జేఏసీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు మూయించారు. ఉదయం నుంచి పట్టణంలో ఆటోలు తిరుగకుండా కట్టడి చేశారు. ముందుగానే బంద్కు సహకరించాల్సిందిగా ఆటో యూనియన్ నాయకులకు చెప్పారు. గూడెం యూనియన్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలను పట్టణంలో ఆపేశారు. గర్భిణులు, రోగులు, వృద్ధులు ఆటోల్లో ఉంటే వాటికి మినహాయింపునిచ్చారు. లోడు లారీలను పట్టణంలోకి రాకుండా వెనక్కి పంపారు. పాలు, నీరు, గ్యాస్ వంటి నిత్యావసరాలతో వెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఆటోలు, బిల్డింగ్ కార్మికుల యూనియన్, మైనార్టీల అసోసియేషన్ తదితర సంఘాలు, విద్యార్థులు బంద్కు సహకరించారు. జేఏసీ నాయకులు బంద్ను పర్యవేక్షించారు. బంద్కు వైసీపీ మద్దతు ప్రకటించింది. గుమ్మలూరులో... గుమ్మలూరు (పోడూరు) : గుమ్మలూరులో శనివారం యూత్ జేఏసీ ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో పాఠశాలలు, పోస్టాఫీసు, బ్యాంకు, దుకాణాలను మూయించివేశారు. గుమ్మలూరు-వల్లూరు ఆర్అండ్బీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. యూత్జేఏసీ నాయకులు విప్పర్తి ప్రభాకరరావు, వర్ధనపు శ్రీనివాస్, వడ్లపాటి సుధాకర్ తదితరులు బంద్ను పర్యవేక్షించారు. భీమవరంలో... భీమవరం : నాన్పొలిటికల్ జేఏసీ పిలుపుమేరకు పట్టణంలో శనివారం బంద్ పాటించి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావం తెలిపారు. వ్యాపార, విద్య, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జేఏసీ నేతలు, విద్యార్థి ఐక్య కారణ సమితి (ఐకాస) నేతలు బంద్ను పర్యవేక్షించారు.