Punjab CM
-
పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్?.. భగవంత్ మాన్ క్లారిటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఓటమి పాలయినప్పటి నుంచి ఆయన భవిష్యత్ కార్యాచరణపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కేజ్రీవాల్ త్వరలోనే పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు.ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్ పంజాబ్ సీఎం కానున్నారనే వార్తలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చెక్ పెట్టారు. ఇవన్నీ ఊహాగానాలేనని, కేవలం నిరాధార వార్తలేనని, వాటిలో ఎటువంటి నిజం లేదని కొట్టిపడేశారు. ఫిబ్రవరి 8న వెల్లడైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 స్థానాలు దక్కించుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఢిల్లీలో 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్తో పాటు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపధ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేత రాజీనామా చేయించి, ఆ రాష్ట్రానికి సీఎం అవుతారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇది కూడా చదవండి: Wi-Fi.. Slow?.. ఈ ట్రిక్తో పరుగు ఖాయం -
డిపోర్టేషన్కు అమృతసర్నే ఎందుకు?: పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: భారతీయ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం కూడా అమృత్సర్లోనే ల్యాండవడంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. శనివారం రాత్రి అమెరికా నుంచి 119 మంది వలసదారులను తీసుకుని ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైమానిక కేంద్రాలు చాలానే ఉన్నాయని, వలసదారుల విమానాలను అక్కడికి కూడా పంపించ వచ్చని పేర్కొన్నారు. ఇక్కడి వారిని వాటికన్ సిటీకి పంపిస్తామంటే అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. మన వాళ్ల కోసం విమానాలను పంపుతామని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెప్పాలని సూచించారు. ఇతన దేశాలు ఇలాగే చేస్తున్నాయన్నారు. -
‘కంగన’కు చెంపదెబ్బపై పంజాబ్ సీఎం కీలక కామెంట్స్
చండీగఢ్: బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్మాన్ స్పందించారు. పంజాబ్ రైతుల పోరాటంపై కంగన చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను కానిస్టేబుల్ కొట్టిందని చెప్పారు.#WATCH | On Kangana Ranaut-CISF constable incident, Punjab CM Bhagwant Mann says, "That was anger. She (Kangana Ranaut) had said things earlier and there was anger for it in the heart of the girl (CISF constable). This should not have happened. But in reply to it, despite being a… pic.twitter.com/cFhWBw5fxb— ANI (@ANI) June 10, 2024‘అది కోపం. కంగన గతంలో మాట్లాడిన మాటలే కానిస్టేబుల్ను ఆగ్రహానికి గురి చేశాయి. ఇది జరగకుండా ఉండాల్సింది. ఆమె అలా మాట్లాడటం తప్పు’భగవంత్మాన్ మీడియాతో చెప్పారు. జూన్6వ తేదీన కంగన చండీగఢ్ ఎయిర్పోర్టులో సెక్యూరిటీ చెక్కు వెళ్లినపుడు అక్కడున్న కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపపై కొట్టింది. రైతుల పోరాటంలో తన తల్లి పాల్గొందని, ఆ పోరాటాన్ని కంగన కించపరిచినందుకే కొట్టానని తెలిపింది. -
మరోసారి కేజ్రీవాల్ను కలవనున్న పంజాబ్ సీఎం
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను ఇప్పటికే ఓ సారి కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' మళ్ళీ కలవనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఏప్రిల్ 30న తీహార్ జైలులో కలవనున్నట్లు సమాచారం.గతంలో ఓ సారి కేజ్రీవాల్ను కలిసిన తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ గతంలో తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. -
మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం.. కుమార్తె ఫోటో షేర్ చేసిన భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య.. డాక్టర్ ''గురుప్రీత్ కౌర్'' గురువారం మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవంత్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా షేర్ చేశారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్. ఈయన 2022 జులైలో గురుప్రీత్ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోయారు. భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్ కౌర్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తన కుమార్తె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb — Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024 -
ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్!
దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్లో లోక్సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్లోని ఒక హోటల్లో రోజంతా గడిపినట్లు తెలిసింది. ‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు. “సీఎం విశ్రాంతి మోడ్లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు. -
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్కరణ్సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్కరణ్ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్
-
Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF — ANI (@ANI) January 2, 2023 చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
సీఎం కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సమావేశయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతోపాటు పంజాబ్ రాష్ట్ర పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్తో భేటీ ముగియడంతో ప్రగతి భవన్ నుంచి పంజాబ్ సీఎం బయలు దేరారు. కాగా తాజ్ కృష్ణలో ఓ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్లో పాల్గొనడానికి భగవంత్ మాన్ హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. 24న పంజాబ్ స్పీకర్ రాక పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్కు రానున్నారు. చదవండి: బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ -
పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. #WATCH | Punjab Police lathi-charged Mazdoor Union people who were marching towards CM Bhagwant Mann's residence in Sangrur regarding their various demands pic.twitter.com/MkpxdNSNQf — ANI (@ANI) November 30, 2022 ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న -
‘ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం?’.. పంజాబ్ సీఎంపై విమర్శలు!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని ఆరోపించాయి. గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఎక్కువ కార్లు తన కాన్వాయ్లో ఉనియోగిస్తున్నట్లు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో గత ముగ్గురు సీఎంలను మించి కార్లు వినియోగిస్తున్నారని, ఇది వీఐపీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నాయి. సామాన్యుడి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా. ఆయన ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘షాకింగ్ విషయం.. 2007-17 వరకు సీఎం బాదల్ 33 వాహనాలను ఉపయోగించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదే కొనసాగించారు. కానీ, ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే.. సీఎం భగవంత్ మాన్ తన కాన్వాయ్లో 42 కార్లు ఉపయోగిస్తున్నారు.’ అని పేర్కొన్నారు పంజాబ్ అసెంబ్లీలో విపక్ష నేత ప్రతాప్ సింగ్. సెప్టెంబర్ 20, 2021 నుంచి మార్చి 16, 2022 వరకు సీఎంగా చేసిన చరణ్ జీత్ సింగ్ చన్నీ కెప్టెన్తో పోలీస్తే మరో ఆరు కార్లు ఎక్కువగా ఉనియోగించినట్లు చెప్పారు. భారీ స్థాయిలో కాన్వాయ్ని ఉపయోగించి పంజాబ్ ప్రజలకు సీఎ మాన్ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల డబ్బును నిర్లక్ష్యంగా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కాన్వాయ్ని ఎలా ఉపయోగిస్తారు? అంటూ దుయ్యబట్టారు. అయితే.. ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆమ్ ఆద్మీ పార్టీ. Shocking revelation- CM Badal had 33 vehicles when he was CM from 2007-17 in his cavalcade & there was no change in number of vehicles when Captain Amarinder S became the CM but it has been revealed through RTI that CM Mann “The so called Aam Aadmi” has 42 cars in his cavalcade. pic.twitter.com/lEFt6Ve3xm — Partap Singh Bajwa (@Partap_Sbajwa) September 28, 2022 ఇదీ చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? -
పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను జర్మనీలోని ఎయిర్పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఏం జరిగింది? జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి? -
అందుకే పంజాబ్ సీఎం ఆస్పత్రి పాలయ్యారా?
ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) కడుపు నొప్పితో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు కూడా. అయితే ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్కు కారణం ఏంటో బయటకు వచ్చింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో కూడిన నీటిని పంజాబ్ ముఖ్యమంత్రి నిరభ్యంతరంగా తాగారని, అందుకే ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఆయనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆ ట్వీట్లో పార్టీ సభ్యుల నినాదాల మధ్య ఆయన గ్లాస్ నీటిని తీసుకుని తాగారు. రాజ్యసభ ఎంపీ, ప్రముఖ పర్యావరణవేత్త బాబా బల్బీర్ సింగ్ సుల్తాన్పూర్ లోధీలో చేపట్టిన కాళి బెన్ శుభ్రత కార్యక్రమంలోనిది ఆ వీడియో. అది జరిగిన వారంలోపే ఆయన ఆస్పత్రి పాలు కావడం విశేషం. అయితే ఆయన ఆస్పత్రి పాలుజేసింది ఆ నీరేనా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਦੀ ਚਰਨ ਛੋਹ ਪ੍ਰਾਪਤ ਧਰਤੀ ਸੁਲਤਾਨਪੁਰ ਲੋਧੀ ਵਿਖੇ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਦਾ ਪਾਣੀ ਪੀਂਦੇ ਹੋਏ CM @BhagwantMann ਜੀ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਨੂੰ ਸਾਫ਼ ਕਰਨ ਦਾ ਬੀੜਾ ਰਾਜ ਸਭਾ ਮੈਂਬਰ ਸੰਤ ਸੀਚੇਵਾਲ ਜੀ ਨੇ ਚੁੱਕਿਆ ਹੋਇਆ ਹੈ pic.twitter.com/4LnU0U66wQ — AAP Punjab (@AAPPunjab) July 17, 2022 -
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం
ఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు పంజాబ్ సీఎం మాన్. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ బుధవారం అమృత్సర్లో జరిగిన ఎన్కౌంటర్లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదీ చదవండి: పంజాబ్ ఎన్కౌంటర్: సిద్ధూ హంతకులకు మట్టుబెట్టారిలా.. -
డాక్టర్ను రెండోపెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం, కేజ్రీవాల్ శుభాకాంక్షలు
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ను ఆయన పరిణయమాడారు. చండీగఢ్లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో ఈ విహహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్ను ధరించి వెలిగిపోయారు పంజాబ్ సీఎం. భగవంత్మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లినవారిలో ఉన్నారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. Chandigarh | Wedding rituals underway of Punjab CM Bhagwant Mann with Dr. Gurpreet Kaur pic.twitter.com/4QjnNsRXtg — ANI (@ANI) July 7, 2022 AAP convenor and Delhi CM Arvind Kejriwal arrives in Mohali ahead of party leader and Punjab CM Bhagwant Mann's wedding which will be held in Chandigarh..."He is embarking on a new journey today, I wish him a happy married life," he says pic.twitter.com/YowaFASB8V — ANI (@ANI) July 7, 2022 అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని చద్దాను ట్విట్టర్లో ఓ జర్నలిస్ట్ అడిగారు. ముందు పెద్దవాళ్ల పెళ్లి జరిగిన తర్వాతే చిన్నవాళ్లు చేసుకుంటారని ఆయన చమత్కరించారు. Waheguru Ji Apne Bacche Utte Aashirwad Banaye Rakheo 🙏🏻 pic.twitter.com/snnmdTi1sw — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 పసందైన విందు భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు. Saade veer da vyah Saanu gode gode chah pic.twitter.com/0c09v6YG4N — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 -
సంక్షేమ స్ఫూర్తి.. పంజాబ్లోనూ ఏపీ తరహా పథకం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తినిస్తున్నాయి. తాజాగా పంజాబ్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇంటి వద్దకే రేషన్ పంపిణి చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు ఉండవని, ఒక్క ఫోన్ కాల్తో రేషన్ సరుకులు లబ్దిదారుల ఇంటి ముందు ఉంటాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. చదవండి: స్టీల్ప్లాంట్పై విజయసాయిరెడ్డి కీలక ప్రసంగం -
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. మాన్ ప్రమాణ స్వీకారానికి ప్రజలు భారీగా తరలి రావడంతో భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కాగా 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం. చదవండి: ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న కాంగ్రెస్ను, శిరోమణి అకాలీదల్ను వెనక్కి నెట్టి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 117 స్థానాల్లో 92 సీట్లు గెలిచి ఏ పార్టీలోపొత్తు అవసరం లేకుండానే అతిపెద్ద పార్టీగా అతరించింది. సంగ్రూర్ జిల్లాలోని ధౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన భగవంత్ మాన్ 60వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈసారి రాజ్ భవన్ నుంచి కాకుండా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖతర్ కలన్లో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో కోలాహలం నెలకొంది. చదవండి: పంజాబ్ రాజకీయాల్లో కొత్త చరిత్ర.. ఫలించిన కేజ్రివాల్ ఎనిమిదేళ్ల కష్టం -
పంజాబ్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఆప్
-
ఎన్నికల్లో భారీ విజయం..! పంజాబ్ సీఎం అభ్యర్థి ఫస్ట్ రియాక్షన్
-
ఈడీ దాడుల కలకలం.. పంజాబ్ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు
చండీగఢ్: ఎన్నికల వేళ పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బంధువుల నివాసంతో పాటు పలు చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం దాడులు జరిపింది. ఇసుక మాఫియా మనీ లాండరింగ్ (హవాలా) వ్యవహారాలపై విచార ణలో భాగంగా అక్రమ మైనింగ్తో సంబంధం ఉన్న పలు కంపెనీలు, వ్యక్తులకు చెందిన ప్రదేశాలపై దాడులు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. చండీగఢ్, మొహాలి, లుధియానా, పఠాన్కోట్ సహా రాష్ట్రవ్యాప్తంగా డజనుకుపైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించామన్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల్లో భాగంగా దాడులు నిర్వహించామని చెప్పారు. దాడుల్లో ఈడీ అధికారులకు సీఆర్పీఎఫ్ బలగాలు తోడుగా ఉన్నాయి. నవాన్షమర్కు చెందిన కుద్రత్ దీప్ సింగ్ చెందిన ఒక కంపెనీకి భూపీందర్ సింగ్ అలియాస్ హనీ డైరెక్టర్గా ఉన్నారు. చరణ్ జిత్ సింగ్ మరదలి కుమారుడైన ఈ హనీకి పంజాబ్ రియల్టర్స్ పేరుతో ఒక కంపెనీ ఉంది. 2018లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 30 ట్రక్కులను పోలీసులు పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే సమయంలో దీప్సింగ్, హనీల కంపెనీలపై పలు ఫిర్యాదులు అనేక స్టేషన్లలో నమోదయ్యాయి. 2018లో నవాన్షహర్ ఎఫ్ఐఆర్తో పాటు పలు కంపెనీలు, వ్యక్తులపై ఇతర స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ ఆరంభించింది. కుద్రత్దీప్ సింగ్తో హనీకి ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. కొన్ని కోట్ల విలువైన ఇసుక మైనింగ్ కాంట్రాక్ట్ను చిన్న కంపెనీ పొందలేదని, కేవలం నల్లధనం పెట్టుబడిగా పెట్టడం వల్లనే హనీ కంపెనీకి కాంట్రాక్ట్ లభించిఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్రమ మైనింగ్పై సీఎం చన్నీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని సమ ర్థించుకున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. చన్నీ, ఆయన కుటుంబం అక్రమ మైనింగ్లో భాగస్వాములని, ఇలాంటి వారి చేతిలో పంజాబ్ భవితవ్యం బాగుపడదని దుయ్యబట్టారు. చదవండి: పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్ ఈ దాడులు పూర్తిగా కక్షపూరితం. బెంగాల్ ఎన్నికల వేళ అక్కడి సీఎం మమతాబెనర్జీ బంధువులపై దాడులు జరిగాయి. పంజాబ్లో కూడా కేంద్రం ఇదే ధోరణి అవలంబిస్తోంది. ఈడీ దాడులతో నాపై, నా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులపై ఒత్తిడి తెచ్చే యత్నాలు చేస్తున్నారు. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు – పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చదవండి: బీజేపీ ఇవ్వనంటోంది! ఇతర పార్టీల నుంచి ఆఫర్లు.. -
కేజ్రీవాల్ వినూత్న ప్రయోగం.. ప్రజలకే సీఎం అభ్యర్థి ఎంపిక ఛాన్స్..
Punjab Assembly Election 2022: ప్రజాభిప్రాయం మేరకే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ప్రకటిస్తానని పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు 24 గంటల తర్వాత, ప్రజలు అభ్యర్థిని ఎంచుకోవడానికి ఓ ఫోన్ నంబర్ను 70748 70748 ప్రారంభించారు. అనంతరం సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం అభ్యర్థి ఎంపికకు పంజాబ్ ప్రజలు తమ ఎంపికను తెలియజేయడానికి కాల్/ మెసేజ్ లేదా వాట్సాప్ చేయాలని అన్నారు. 'పంజాబ్లోని 3 కోట్ల మంది ప్రజల నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాము. జనవరి 17 సాయంత్రం 5 గంటలలోపు ప్రజలు తమ ఎంపికను తెలియజేయాలి. ప్రజల ఓటు ద్వాఆరా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే పద్ధతిని ఉపయోగించడం ఇదే తొలిసారి' అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. చదవండి: (10 సూత్రాలతో 'పంజాబ్ మోడల్'.. ప్లాన్ రెడీ చేసిన అరవింద్ కేజ్రీవాల్) పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్మాన్ను ఎంపిక చేస్తారని వస్తున్న ఊహాగానలపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. 'భగవంత్ మాన్ నాకు అత్యంత ప్రియమైన వ్యక్తి. తలుపులు మూసి నాలుగు గోడల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయవద్దని ఆయనే నాకు సూచించారు. సీఎం ఎంపిక కోసం ప్రజల్లోకి వెళ్లాలన్నది ఆయన ఆలోచనే అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చదవండి: (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2021: దేశంలో పెరిగిన పచ్చదనం..) -
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి
చండీగఢ్: పంజాబ్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల దాకా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలో ఈ పరిధి కేవలం 15 కిలోమీటర్లుగా ఉంది. దీన్ని కేంద్రం తాజాగా 50 కిలోమీటర్లకు పెంచింది. తద్వారా ఈ పరిధిలో నివసించే ఎవరినైనా విచారించే, అరెస్టు చేసే, సోదాలు చేపట్టే అధికారం బీఎస్ఎఫ్కు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని దేశ సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా పంజాబ్ సీఎంæ చన్నీ అభివర్ణించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ పరిధిని పెంచడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరారు. -
ఎన్నికల ప్రేమకథ
దేశంలోనే అత్యధికంగా దళితులున్న రాష్ట్రమది. అక్కడ నూటికి 32 మంది దళితులే. కానీ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్ళు నిండినా, ఇప్పటి దాకా ఒక్క దళితుడైనా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. మరో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలనగా ఇప్పుడయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి తొలి దళిత సీఎంగా కాంగ్రెస్ నేత చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం పదవీ ప్రమాణం చేశారు. ఇన్నేళ్ళకు సాధ్యమైన ఈ పరిణామాన్ని స్వాగతించాల్సిందే. కానీ 5 నెలల్లో ఎన్నికలనగా చూపిన ఈ ప్రేమ, చేసిన ఈ మార్పు దళితుల సాధికారికతకు చిహ్నమా? లేక ఎన్నికల వ్యూహమా అన్నది ప్రశ్న. అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీపై అపరిమిత అధికారం ఉన్న రాహుల్ గాంధీ స్వయంగా ఈ తాజా పదవీ ప్రమాణానికి హాజరయ్యారు. బీజేపీ అధినాయకుడైన ప్రధాన మంత్రి మోదీ విపక్ష దళిత సీఎంపై అభినందనల వర్షం కురిపించారు. ఎన్నికల క్షేత్రంలో దళిత ఓటర్ల ప్రాముఖ్యాన్ని ఏ పార్టీ విస్మరించదలుచుకోలేదని, ఓట్ల వేటలో కులాల వారీ ప్రేమకథ నడుపుతోందనీ అర్థమవుతోంది. 117 స్థానాల అసెంబ్లీలో 80 సీట్లు గెలిపించి, 2017 నుంచి ఇప్పటి దాకా అన్ని ఎన్నికలలోనూ పార్టీని గెలిపించిన చరిత్ర తాజా మాజీ సీఎం అమరిందర్ది. జనంలో పేరున్న నమ్మకస్థుడైన ఈ పార్టీ సైనికుడిని కాదనుకొని, కాంగ్రెస్ అధిష్ఠానం సెల్ఫ్గోల్ చేసుకుంది. రెండు నెలల క్రితం పీసీసీ అధ్యక్షపదవి దక్కించుకున్న సిద్ధూకూ, అమరిందర్కూ మధ్య ఆధిపత్య పోరులో చివరకు సిద్ధూదే పైచేయి అయింది. 2019లో పర్యాటక శాఖ మంత్రిగా రాజీనామా చేసినప్పటి నుంచి విమర్శలు, ప్రతివిమర్శలతో వారి మధ్య పోరు బహిరంగ రహస్యం. ఇప్పుడు మరో అయిదు నెలల్లోనే ఎన్నికలు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి అంతకన్నా తక్కువ టైమే ఉంది. వెరసి, పాలనలో తనదైన ముద్ర వేయడానికి కొత్త సీఎం చన్నీకి నిండా 100 రోజులే. అధికారులపై అతిగా ఆధారపడి, ఎమ్మెల్యేలకైనా అందుబాటులో లేకుండా ఫామ్హౌస్లోనే గడిపారనీ, ఎన్నికల వాగ్దానాలు అనేకం నెరవేర్చలేదనీ అమరిందర్పై విమర్శ. పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలంటే, ఓటర్లలో ఆ వ్యతిరేకతని తగ్గించాలి. క్యాబినెట్లో ఉంటూనే అమరిందర్ను విమర్శించిన చన్నీ సీఎం పదవి చేపట్టగానే గ్రామాలలో నీటి, విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది అందుకే! అయితే, 52 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ, ‘‘అవమాన భారంతో’’ నాటకీయంగా సీఎం కుర్చీ వీడారు 79 ఏళ్ళ అమరిందర్. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాకఢ్ సహా ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలతో పోలిస్తే చన్నీ వయసులో చిన్నవాడు. ఎమ్మెల్యేగా, విధాన సభలో ప్రతిపక్ష నేతగా, నిన్నటి దాకా అమరిందర్ క్యాబినెట్లో మంత్రిగా అనుభవం ఉంది. అదే సమయంలో ఆయనపై కొన్ని వివాదాలూ లేకపోలేదు. అయితే, అమరిందర్ స్వతంత్ర ధోరణి రాహుల్కు కొంతకాలంగా నచ్చట్లేదు. ప్రియాంకా గాంధీ సైతం సిద్ధూకు అనుకూలంగా నిలిచారు. ఈ పరిస్థితుల్లో సీఎం మార్పుపై అధిష్ఠానం కొద్ది నెలలుగా ఊగిసలాడింది. పరిస్థితులు గమనించినా, అమరిందర్ దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. చివరకు అధిష్ఠానం అనేకానేక పేర్లు పరిశీలించి, ఏవేవో పేర్లు లీక్ చేసి, అనూహ్యంగా చన్నీకి ఓటేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెబుతూనే, ఇందిరా గాంధీ నాటి సీల్డు కవర్ సంప్రదాయంలో, దళిత కార్డుపై చన్నీకి పట్టం కట్టింది. దేశంలో మినీ ఎన్నికల పోరాటం మొదలైపోయినట్టు కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల వేడి, దానికి తగ్గట్టే కుల, మత రాజకీయాల జోరు పెరిగాయి. ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్ మొదలు గుజరాత్, పంజాబ్ దాకా అన్ని చోట్లా కుల, మత సమీకరణాలే అన్ని పార్టీల వ్యూహాలనూ శాసిస్తున్నాయి. ఇన్నేళ్ళలో తొలిసారిగా పంజాబ్లో దళితుడు సీఎం అయ్యారంటే దాని చలవే. అయితే, రానున్న పంజాబ్ ఎన్నికలు సిద్ధూ సారథ్యంలోనే జరుగుతాయని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీశ్ రావత్ నోరు జారడంతో, ప్రతిపక్ష అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు విమర్శించడానికి వీలు చిక్కింది. ‘దళిత సీఎం అనేది ఎన్నికల ముందు చేసిన గిమ్మిక్కు’ అంటూ కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నాయి. మరోపక్క రాజకీయ అపరిపక్వత, పదవీకాంక్ష నిండిన సిద్ధూ ‘జాతి వ్యతిరేకి’ అంటూ స్వయంగా అమరిందరే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ విపక్షాలకు అవి అంది వచ్చిన అస్త్రాలు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పొత్తు అకాలీదళ్కు కలిసొచ్చినా రావచ్చు. దేశం మొత్తం మీద మూడే రాష్ట్రాలలో అధికారంలో మిగిలిన కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో తాజా మార్పులతో పెను జూదమే ఆడింది. సీఎం మార్పు అనివార్యమనుకున్నా ఆ మార్పు చేసిన విధానమే అంతా కలగాపులగమైంది. ఇక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలోనూ సీఎంలతో ఉన్న చిక్కుల్ని కాంగ్రెస్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. బీజేపీ జయపతాక మోదీ తమ పార్టీ సీఎంలను మార్చినట్టు, విజయాల ట్రాక్ రికార్డు లేని రాహుల్ అండ్ కో చేద్దామనుకుంటే చిక్కే. ఏమైనా ఆరు నెలల క్రితం ఇట్టే గెలుస్తామనుకున్న పంజాబ్లో ఆ పార్టీ ఇప్పుడు వెనకబడింది. ఆత్మహనన ధోరణి నిర్ణయాలతో ప్రతిపక్షాలకు సందు ఇచ్చింది. అధికారానికి కొత్త అయిన చన్నీ ఇప్పుడు పార్టీలోని అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుంటూనే, పాలనను గాడిలో పెట్టాలి. 2022 ఎన్నికలలో పార్టీని గెలిపించాలి. అందుకు ఆయన దళిత కార్డు ఒక్కటే సరిపోతుందా? సిద్ధూ సారథ్యంలోనే ఎన్నికలన్న వ్యాఖ్యలను బట్టి చూస్తే, చన్నీ తాత్కాలిక ముఖ్యమంత్రేనా? ఒకవేళ రేపు కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే, చన్నీనే సీఎంను చేస్తారా? ఎన్నికల దళిత ప్రేమకథలో ఇప్పటికైతే ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. -
సిద్ధూ బాధ్యతల స్వీకారానికి సీఎం అమరీందర్
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు. సిద్దూతోపాటు రాష్ట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇటీవల నియమితులైన కుల్జీత్ సింగ్ నగ్రా, సంగత్ సింగ్ గిల్జియన్ గురువారం మొహాలీలోని సీఎం ఫాంహౌస్కు వెళ్లి అమరీందర్ను ఆహ్వానించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల తరఫున తమ ఆహ్వానానికి సీఎం అంగీకరించారని చెప్పారు. సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవు తారని వెల్లడించారు. ఇలా ఉండగా, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం అమరీందర్ ఆహ్వానించారని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు ట్విట్టర్లో పేర్కొన్నా రు. ఉదయం 10 గంటలకు పంజాబ్ భవన్లో టీ పార్టీ ఉంటుందనీ, అనంతరం అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్లో జరిగే కొత్త పీసీసీ బృందం బాధ్యతల స్వీకార కార్య క్రమంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. -
పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీఘర్ : పంజాబ్ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శుక్రవారం అధికారులతో వీడియో కార్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి 14 రోజుల హోం క్వారంటైన్ అనే నిబంధనను అక్కడి ప్రభుత్వం మార్చి 29 నుంచి కొనసాగిస్తుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో 14 రోజుల హోం క్వారంటైన్ను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పంజాబ్కు రావాలనుకునే ఇతర రాష్ట్రాల వారు దీని కోసం ఏర్పాటు చేసిన కోవా యాప్లో స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని పూర్తి చేయాలని చెప్పారు. దీంతో ప్రయాణ అనుమతిలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మరోవైపు కరోనా సోకిన వారిని గుర్తించేందుకు వచ్చేవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా పంజాబ్లో ఇప్పటివరకు 5,784 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 152గా ఉంది. (‘మెడికల్ సీట్లలో ఓబీసీ రిజర్వేషన్ల వర్తింపు’) -
‘చిక్కుల్లో కర్తార్పూర్ కారిడార్’
సాక్షి, న్యూఢిల్లీ : కర్తార్పూర్ కారిడార్ పనులను పాకిస్తాన్ నిలిపివేసిందనే వార్తలపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసిన నేపథ్యంలో కర్తార్పూర్ కారిడార్ పనుల్లో పాకిస్తాన్ జాప్యం చేస్తుండటం పట్ల కెప్టెన్ సింగ్ స్పందించారు. మరో మూడు నెలల్లో గురునానక్ 550వ జయంతోత్సవాలు జరగనున్న నేపథ్యంలో పనుల్లో జాప్యంతో ఈ చారిత్రక సందర్భానికి ప్రాజెక్టు పూర్తికాని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నిర్ణయాలు ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రభావం చూపరాదని ఆయన పాక్కు హితవు పలికారు. ఈ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సమావేశాలు నిర్వహించేందుకు పాకిస్తాన్కు భారత అధికారులు సమాచారం పంపారన్న వార్తల నేపథ్యంలో కెప్టెన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్తార్పూర్ కారిడార్ పనులు పూర్తయితే పాక్లోని కర్తార్పూర్ దర్బార్ సాహిబ్ నుంచి పంజాబ్లోని గురుదాస్పూర్లోని డేరాబాబా నానక్ ఆలయానికి సిక్కు యాత్రికులు వీసా రహిత ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య, దౌత్య సంబంధాలను పాకిస్తాన్ తెంచుకోవడంతో కర్తార్పూర్ కారిడార్ పనులు చిక్కుల్లో పడ్డాయి. -
‘రైతుల కష్టాలకు పరిష్కారం ఇదే’
చండీగఢ్ : దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేస్తూ జాతీయ స్ధాయిలో ఈ పథకాన్ని వర్తింప చేయాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రైతుల కష్టాలకు ఇది సరైన పరిష్కారమని ప్రధాని మోదీకి రాసిన లేఖలో అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. పంజాబ్లో తమ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం రైతుల కష్టాలను పూర్తిగా పరిష్కరించలేదని గతంలో అమరీందర్ సింగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ రెండు లక్షల వరకూ రుణాలను మాఫీ చేసిందని, ఇప్పటికే ఐదు లక్షల మంది రైతులు తీసుకున్న రుణాల మాఫీ కోసం రూ 4468 కోట్లు సమకూర్చామని లేఖలో సింగ్ పేర్కొన్నారు. మిగిలిన రైతులకూ త్వరలో ఈ పథకం ద్వారా ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు. జాతీయ స్ధాయిలో రైతు రుణాల మాఫీతో పాటు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనను గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా అవసరమైన మార్పులు చేయాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సింగ్ కోరారు. -
ఆయన చదివింది ఐఐటీలోనేనా?
చండీగఢ్: ఢిల్లీలో వాయు కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పంజాబ్లో పంట వ్యర్థాలను దహనంచేయడం వల్లే కాలుష్యం పెరుగుతోందన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేజ్రీవాల్ ఉపగ్రహ చిత్రాల్ని రుజువుగా చూపడం హాస్యాస్పదమని అన్నారు. అసలు కేజ్రీవాల్ ఐఐటీలోనే చదివారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థికి ఇంత కన్నా మంచి అవగాహన ఉంటుందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్ను నిందించడానికి ముందు కేజ్రీవాల్ వాస్తవాలు గ్రహించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం జరగని రోజుల్లో కూడా ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మెరుగ్గా లేద న్నారు. ఢిల్లీ–ఎన్సీఆర్ మీదుగా వీస్తున్న గాలులు వాయవ్యం నుంచి తూర్పు దిశగా మళ్లాయని, కాబట్టి పంజాబ్, హరియాణాల పంట వ్యర్థాల దహన ప్రభావం ఢిల్లీపై లేదని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. -
కేజ్రీవాల్ విద్యార్హతలపై కెప్టెన్ సందేహం..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శల దాడితో విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతకు పంజాబ్లో పంట వ్యర్ధాలరను తగులబెట్టమే కారణమని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమరీందర్ తప్పుపట్టారు. ఆప్ నేత నిజంగా ఐఐటీ గ్రాడ్యుయేట్యేనా అని సందేహం వ్యక్తం చేశారు. పంజాబ్లో పంట వ్యర్ధాల దగ్ధానికి శాటిలైట్ ఫోటోలే సంకేతమని కేజ్రీవాల్ చెబుతున్న తీరుతో కేజ్రీవాల్ కంటే పాఠశాల విద్యార్ధే నయమని చురకలు వేశారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్ధాలను తగులబెట్టని డిసెంబర్, జనవరి మాసాల్లోనూ ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్ధాయిలో ఉంటోందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిస్తోందని పంజాబ్ సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీ కాలుష్యానికి వాహన ట్రాఫిక్, నిర్మాణ కార్యకలాపాలు, పారిశ్రామిక ప్రక్రియ సహా అక్కడి అంశాలే కారణమని ఈ సూచిక తేటతెల్లం చేస్తోందని వివరించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేజ్రీవాల్ పొరుగు రాష్ట్రాలను తప్పుపట్టడం సరికాదని హితవు పలికారు. -
సీఎంపై డోప్ టెస్ట్ నిర్వహించాలన్న బీజేపీ నేత
చండీగఢ్ : పంజాబ్లో ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్ టెస్ట్లు విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం, ఆయన మంత్రివర్గ సహచరులపైనా ఈ పరీక్షలు నిర్వహించాలని ఓ బీజేపీ నేత కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నుంచి సర్వీసులోని వివిధ దశల్లో వారికి డోప్ టెస్ట్లు నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో డ్రగ్ సమస్యను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యపై బీజేపీ నేత హర్జిత్ సింగ్ గ్రెవాల్ స్పందిస్తూ డోప్టెస్ట్ను కేవలం పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులపై కూడా డోప్ టెస్ట్లు నిర్వహించాలని గ్రెవాల్ కోరారు. డ్రగ్ కళంకిత రాజకీయ నేతలు ప్రభుత్వంలో ఉంటే వారు డ్రగ్ స్మగ్లర్లు, సరఫరాదారులకు సహకరించడం కొనసాగిస్తారని అన్నారు. -
ఫూల్స్ డేను ఇలా జరిపారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఫూల్స్ డేను రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకు వేదికగా చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు ట్వీట్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడగా..పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రజలను మభ్యపెడుతున్నారని గుర్తుచేస్తూ శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) కార్యకర్తలు ఆదివారం ప్రజలకు డమ్మీ స్మార్ట్ ఫోన్లు, నగదు పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తామని అమరీందర్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, హింస, అశ్లీలం, అభ్యంతరకర మెసేజ్లకు చెక్ పెట్టేందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలో నవజోత్ సింగ్ సిద్ధూ వైస్ ఛైర్మన్గా ప్రభుత్వం కల్చరల్ కమిషన్ను ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఎస్ఏడీ వినూత్న నిరసనతో ముందుకురావడం గమనార్హం. ఈ కల్చరల్ కమిషన్కు ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టే అధికారాలు కల్పించారు. Amritsar: Shiromani Akali Dal (SAD) workers distribute dummy smart phones & fake currency in the name of #Punjab govt, say, 'On #AprilFoolsDay, we want to remind Captain Amarinder Singh that he has fooled people.' pic.twitter.com/Mdpqwpx3cM — ANI (@ANI) 1 April 2018 -
ఆ హామీలు నెరవేర్చాలంటే..
సాక్షి, చండీఘర్ : అధికారానికి పదేళ్లు దూరంగా ఉన్న పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పాలనాపగ్గాలు అందుకునేందుకు ఇచ్చిన హామీలు ఇప్పుడు సీఎం అమరీందర్ సింగ్ను చిక్కుల్లో పడేశాయి. రైతులకు రుణ మాఫీ, యువతకు ఉద్యోగాలు, స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటి పలు వరాలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వాటి అమలు దిశగా అడుగులు వేయలేదు. రుణమాఫీ కాకుండానే ఇతర హామీల అమలుకు రూ 10,000 వేల కోట్ల నిధులు అవసరమవుతుండగా, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు రైతుల రుణ బకాయిలు రూ 90,000 కోట్లు పేరుకుపోయాయి. మొత్తంమీద ఎన్నికల హామీలను నెరవేర్చాలంటే అమరీందర్ సర్కార్కు రూ లక్ష కోట్ల నిధులు అందుబాటులో ఉండాలి. నిధుల కొరత వెంటాడుతుండటంతో ఈ హామీల అమలుకు పంజాబ్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చేసేదేమీలేదు. వ్యవసాయ రుణాల మాఫీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించినా అది పలు పరిమితులతో అరకొరగా సాగుతోంది. రానున్న నాలుగేళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామని సర్కార్ నమ్మబలుకుతోంది. మరోవైపు అమరీందర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పంజాబ్లో 360 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విపక్ష నేత సుఖ్పాల్ సింగ్ ఖైరా ఆరోపించారు. వ్యవసాయ రుణాల మాఫీతో పాటు ఇంటికో ఉద్యోగం, డ్రగ్స్ నిర్మూలన, అవినీతికి చరమగీతం, యువతకు స్మార్ట్ఫోన్ల పంపిణీ వంటి పలు హామీలను నెరవేర్చడం పాలక కాంగ్రెస్కు సవాల్లా మారింది. నిధుల కొరతతో ఇటీవల కొన్నినెలల పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి సరైన ఆర్థిక సహకారం లభించకపోవడం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారింది. -
ఓబీసీ కుంభకోణంలో పంజాబ్ సీఎం అల్లుడు
న్యూఢిల్లీ: దాదాపు రూ.109 కోట్ల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ అల్లుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఘజియాబాద్లోని సింభావోలీ షుగర్స్ లిమిటెడ్ చైర్పర్సన్ గుర్మిత్ సింగ్ మన్, సీఎం అల్లుడు, కంపెనీ డిప్యూటీ ఎండీ గుర్పాల్ సింగ్లపై కేసులు పెట్టింది. రైతులకు రుణాలు అందిస్తామంటూ ఓబీసీ నుంచి ఈ సంస్థ 2011లో రూ.148 కోట్ల రుణం పొందింది. దానిని రైతులకు చెల్లించకుండా సంస్థ ఖాతాకు మళ్లించారు. ఈ రుణం చెల్లించటానికి గాను ఓబీసీ నుంచి 2015లో మరో రూ.110 కోట్ల రుణం పొందింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.109 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించిన సీబీఐ ఆదివారం గుర్పాల్పై కేసులు పెట్టి కొన్ని చోట్ల సోదాలు కూడా నిర్వహించింది. -
భారీ కుంభకోణం: సీఎం అల్లుడు బుక్
సాక్షి, లక్నో: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రైవేట్ చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స ఓబీసీకి రూ.109 కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు, శింభోలీ షుగర్స్ డిప్యూటీ డైరెక్టర్ గురుపాల్ సింగ్ కీలక నిందితుడుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థ శింభోలీ షుగర్స్ రుణాల చెల్లింపులో విఫలంకావడంతో ఓబీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పంజాబ్ సీఎం కుమార్తె జై ఇందర్ సింగ్ భర్త, కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్ సింగ్, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్వో సహా,13మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నట్టు తెలుస్తోంది. 20111 లో చక్కెర రైతులు 5700మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్బీఐ పథకంకింద 150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. అలాగే శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్షేరు 15 శాతం కుప్పకూలి నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, హపూర్, నోయిడాలలో కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసు సహా ఎనిమిది ప్రాంగణాలలో సోదాలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసంఅవినీతి నిరోధక చట్టంకింత కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, 97.85 కోట్ల రూపాయల నగదును బ్యాంకు ప్రకటించగా, అసలు రుణం రూ.109.08 కోట్లకు చేరింది. మరోవైపు ఈ రుణాన్ని తీర్చేందుకు జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్ రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు మొత్తం రుణాన్ని రూ.113 కోట్లుగా తేల్చింది. అయితే 2016 నవంబరులో ఎన్పీఏగా ప్రకటించింది. కాగా 2017 నవంబరు 17న బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 22, 2018 న మాత్రమే నమోదు చేయడం గమనార్హం. -
ముఖ్యమంత్రుల మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది. ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా కేజ్రీవాల్, అమరేందర్ సింగ్ పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. పంజాబ్లో పంటలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది, దాన్ని తక్షణం నిలుపుచేయండి.. అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అమరేందర్ సింగ్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఢిల్లీ పరిస్థితులకు ఒకరకంగా మీరే కారణం అంటూ కేజ్రీవాల్ మాటల దాడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆవేదనను నేను అర్థం చేసుకోగలను.. కానీ పరిస్థితులు నా చేతులు దాటి వెళ్లిపోయాయి. కాలుష్య నివారణకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందే.. అంటూ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ట్వీట్ ద్వారానే సమాధానం చెప్పారు. My office continuously trying to take time from CMs of Punjab n Haryana for me to meet the two CMs. Its an emergency — Arvind Kejriwal (@ArvindKejriwal) 8 November 2017 Share your concern over stubble burning and pollution @ArvindKejriwal, Centre alone can solve the problem given its national implications. — Capt.Amarinder Singh (@capt_amarinder) 8 November 2017 I agree sir that Centre shud take lead. But pl grant me time to discuss if together we can present a plan to centre. Del is choking sir https://t.co/qMQJX6Y4It — Arvind Kejriwal (@ArvindKejriwal) 8 November 2017 Situation is serious but Punjab helpless as problem is widespread & state has no money to compensate farmers for stubble management (1/2). — Capt.Amarinder Singh (@capt_amarinder) 8 November 2017 -
నిర్మలపై అమర్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఎల్ఫినోస్టోన్ రైల్వేస్టేషన్లో బ్రిడ్జి నిర్మాణానికి ఆర్మీని రంగంలోకి దింపినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ప్రకటించారు. ఎల్ఫిన్స్టోన్ రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీపై తొక్కిసలాట జరిగి.. 23మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్తోపాటు మరో రెండు రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను కట్టేందుకు ఆర్మీ సహకారం తీసుకుంటున్నట్టు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వచ్చే జనవరి 31నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని ఆయన ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన ఎల్ఫిన్స్టోన్ రైల్వేస్టేషన్ను సందర్శించేందుకు కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ముంబైకి వచ్చిన సందర్భంగా ఫడ్నవిస్ ఈ ప్రకటన చేశారు. అయితే, సీఎం ఫడ్నవిస్ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ మాజీ జవాన్ అయిన పంజాబ్ సీఎం అమరిందర్సింగ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఆర్మీ, నిర్మలా సీతారామన్లను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ.. సివిల్ పనుల కోసం ఆర్మీ వనరులను వాడుకోవడం ఎంతమాత్రం సరికాదని నిర్మలను తప్పుబట్టారు. 'ఆర్మీ కర్తవ్యం యుద్ధం కోసం శిక్షణ పొందడం కానీ, సివిల్ పనుల కోసం ఉపయోగించుకోవడం కాదు నిర్మలాజీ. రక్షణ వనరులను పౌర పనుల కోసం వినియోగించరాదు. 1962 చైనా యుద్ధం సమయంలోనూ జనరల్ కౌల్ ఇదే విధంగా వ్యవహరించారు. ఇలా చేయడం సరైన సంప్రదాయం కాదు. దీనిని నివారించండి ప్లీజ్' అంటూ ఆయన కామెంట్ చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సైతం ఈ విధానాన్ని ట్విట్టర్లో తప్పుబట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీని వాడుకోవడం చూశాం కానీ, ఇప్పుడు రోడ్ల మీద గుంతలు పడినా..ఆర్మీని పిలిచేలా కనిపిస్తోందని మండిపడ్డారు. -
పంజాబ్కు అమరీందర్.. మణిపూర్లో ఉత్కంఠ
చండీగఢ్: ఈ నెల 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రమాణం చేయనున్నారు. కాసేపట్లో ఆయన గవర్నర్ను కలవనున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధుకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించే అవకాశముంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 117 స్థానాలకుగాను 77 చోట్ల జయకేతనం ఎగరేసింది. అధికార అకాలీదళ్ ఓటమి చవిచూడటంతో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఈ రోజు గవర్నర్ ను కలసి రాజీనామా లేఖను సమర్పించారు. మణిపూర్లో ఉత్కంఠ: మణిపూర్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్ మళ్లీ ఎన్నికయ్యారు. సోమవారం ఆయన గవర్నర్తో సమావేశం కానున్నారు. ఆయన 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ 28 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు అవసరం. బీజేపీ 21, ఎన్పీఎఫ్ 4, ఇతరులు 7 సీట్లు గెలిచారు. బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు కీలకంకానుంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. -
ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపొందితే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తాను చేపట్టబోతున్నానని వస్తున్న ఊహాగానాలకు అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా తను బరిలోకి దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. 'నేను ఢిల్లీ సీఎంగానే కొనసాగుతాను. పంజాబ్ నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాం' అని కేజ్రీవాల్ వెల్లడించారు. పటియాలలో బుధవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. కేజ్రీవాల్ను చూసి ఆప్కు ఓటు వేయాలని ఆ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంగళవారం ఓటర్లను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న రాష్ట్రం అయిన ఢిల్లీ పీఠాన్ని వదిలేసి.. పెద్ద రాష్ట్రమైన పంజాబ్ను పాలించేందుకు కేజ్రీవాల్ ఆసక్తి చూపుతున్నారని, పంజాబ్లో ఆప్ గెలిస్తే.. కేజ్రీవాల్ సీఎం అవుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు కేజ్రీవాల్ ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రాజకీయాలను నడిపించాలని చూస్తున్నారని, ఆయన మాటలను నమ్మి మోసపోవద్దని ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, అధికార అకాలీ దళ్ ఓటర్లను కోరుతున్నాయి. -
కాబోయే సీఎం కేజ్రీ అనుకోండి
పంజాబ్ ఎన్నికల ప్రచారంలో సిసోడియా మొహాలీ(పంజాబ్): ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను పంజాబ్ సీఎంగా ఎన్నుకోబోతున్నాం అనుకుని ఓటు వేయాలని ఆ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పంజాబీలను కోరారు. ఆయన మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారు. ‘పంజాబ్ సీఎం ఎవరవుతారని నన్ను జనం అడుగుతున్నారు. కేజ్రీవాల్ సీఎం కాబోతున్నారని నమ్మండి. ఎన్నికల్లో మా పార్టీ ఇచ్చే హామీలను ఆయన అధికారంలోకి వచ్చాక నెరవేరుస్తారు’ అని అన్నారు. సీఎం ఎవరైనా హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేజ్రీవాల్పై ఉందని, దీనికి తాను హామీ ఇస్తానని చెప్పుకొచ్చారు. పంజాబ్లో తమ పార్టీ.. సీఎం అభ్యర్థిని ప్రకటించదని కేజ్రీవాల్ చెబుతూ వస్తున్నారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ఆయన అన్నట్లు తెలుస్తోంది. సిసోడియా ప్రకటనపై ఆప్ వెంటనే స్పందించింది. పంజాబ్లో కేజ్రీ తమ పార్టీ ముఖమని, దీనర్థం తాము గెలిస్తే ఆయన సీఎం అవుతారని కాదని పార్టీ నేత అతిషి మార్లేనా అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు అంకితమై ఉంటారని పేర్కొన్నారు. కాగా, పంజాబ్కు సీఎం కావాలన్న కేజ్రీవాల్ అధికార దాహానికి సిసోడియా ప్రకటన నిదర్శనమని శిరోమణి అకాలీ, కాంగ్రెస్, బీజేపీలు విమర్శించాయి.