breaking news
Saim Ayub
-
ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశలో పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్లలోనూ అతడు డకౌట్ అయ్యాడు. ఒమన్, టీమిండియా, యూఏఈ జట్లతో మ్యాచ్లలో పరుగుల ఖాతా తెరవకుండానే 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వెనుదిరిగాడు.అయితే, బ్యాటర్గా విఫలమైనా.. వికెట్లు తీయడంలో మాత్రం సఫలమయ్యాడు ఈ పార్ట్టైమ్ స్పిన్నర్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. స్పెషలిస్టు బౌలర్ల కంటే అతడే ఓ అడుగు ముందున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్లో పాక్ తీసిన మూడు వికెట్లు అతడి ఖాతాలోనే ఉండటం ఇందుకు నిదర్శనం.ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ (Rashid Latif) సయీమ్ ఆయుబ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. ఓ వ్యక్తి ఒంటెపై కూర్చుని ఉన్నా కుక్కకాటు నుంచి మాత్రం తప్పించుకోలేడు’’ అని లతీఫ్ పేర్కొన్నాడు. మేనేజ్మెంట్ నుంచి మద్దతు దక్కుతున్నా ఆయుబ్ను దురదృష్టం వెంటాడుతూనే ఉందన్న అర్థంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఓ బ్యాటర్ పరుగులు తీయకుండా.. వికెట్లు తీయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు‘‘ప్రతి ఒక్కరి కెరీర్లో గడ్డు దశ అనేది ఒకటి ఉంటుంది. అతడు వైవిధ్యభరితమైన షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు. బ్యాటర్గా కాకుండా.. బౌలింగ్ విభాగంలో రాణిస్తున్నందున అతడికి తుదిజట్టులో చోటు దక్కుతోంది. అయితే, కీలక మ్యాచ్లలో మాత్రం అతడు తప్పక పరుగుల విధ్వంసం సృష్టిస్తాడు’’ అని రషీద్ లతీఫ్ ధీమా వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’లో భాగంగా టీమిండియా చేతిలో ఓడిన పాక్.. యూఏఈ, ఒమన్లపై గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టుతో కలిసి ఈ గ్రూపు నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్- పాక్ జట్ల మధ్య సెప్టెంబరు 21న సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. సూపర్-4 బెర్తు ఖరారుఇక లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్లను చిత్తుగా ఓడించిన సూర్యకుమార్ సేన.. ముందుగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పాక్తో మ్యాచ్ ఆడినప్పటికీ.. ఆ జట్టు ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ విషయంపై నానాయాగీ చేసిన పాక్ క్రికెట్ బోర్డు బాయ్కాట్ పేరిట డ్రామాకు తెరతీసింది. అయితే, తమ పాచికలు పారకపోవడంతో యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడిన పాక్.. 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు చేరుకుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్UAE strike early vs Pakistan 🤯Watch #PAKvUAE LIVE NOW, on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/gVRGeSYoBv— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
అంపైర్పైకి బంతిని విసిరిన పాక్ ఫీల్డర్.. తర్వాత ఏమైందంటే?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు- మ్యాచ్ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్హ్యాండ్’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)తో మ్యాచ్ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్ అంపైర్ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్ ఫీల్డర్ చేసిన పని కారణంగా సదరు అంపైర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ధ్రువ్ పరాశర్ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్ ఆయుబ్ బౌలింగ్ను ఎదుర్కొన్నాడు.అంపైర్పైకి పాక్ ఫీల్డర్ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్ ఐదో బంతిని థర్డ్మ్యాన్ రీజర్ దిశగా తరలించిన పరాశర్.. సింగిల్ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్ ఆయుబ్ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్ ఫిజియో వచ్చి అంపైర్కు కంకషన్ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ (బంగ్లాదేశ్) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిలువరించారని, ఆయనను ఆసియా కప్ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్ ఆడిన మ్యాచ్కు కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్ మేనేజ్మెంట్ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్-ఎ టేబుల్ టాపర్గా టీమిండియా ముందుగానే సూపర్-4కు చేరగా.. పాక్ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా
ఆసియా కప్-2025 (Asia Cup)లో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు. భారత బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ పేస్ ఆల్రౌండర్ తొలి బంతిని వైడ్గా సంధించాడు. అయితే, ఆ తర్వాత వెంటనే వికెట్ తీసి టీమిండియాకు శుభారంభం అందించాడు.హార్దిక్ వేసిన అవుట్స్వింగర్ను తప్పుగా అంచనా వేసిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయుబ్.. బంతిని గాల్లోకి లేపగా జస్ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టాడు. దీంతో ఆయుబ్ డకౌట్ అయ్యాడు. ఫలితంగా పాక్ తొలి వికెట్ కోల్పోగా.. హార్దిక్ ఖాతాలో తొలి వికెట్ చేరింది.పాండ్యా సూపర్ క్యాచ్ఇక ఆ మరుసటి ఓవర్లో హార్దిక్ పాండ్యా మంచి క్యాచ్ అందుకున్నాడు. బుమ్రా బౌలింగ్లో వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్ను పాండ్యా కష్టపడి పట్టాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ను తాకిన బంతి గాల్లోకి లేవగా లాంగ్ లెగ్లో నుంచి పరిగెత్తుకుని వచ్చి మరీ అందుకున్నాడు. ఫలితంగా పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా.. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో భారత ఫీల్డర్గా నిలిచాడు. రోహిత్ శర్మ 65 క్యాచ్లతో అగ్రస్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా.. మహ్మద్ హ్యారిస్ క్యాచ్తో కలిపి 55 క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్- పాక్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పది ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్లురోహిత్ శర్మ- 65హార్దిక్ పాండ్యా- 55*విరాట్ కోహ్లి- 54సూర్యకుమార్ యాదవ్- 51*సురేశ్ రైనా- 42. చదవండి: టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన𝗕𝗢𝗢𝗠! 💥India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతాడన్నారు.. కట్ చేస్తే! తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒమన్తో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన అయూబ్.. ఇప్పుడు దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అదే తీరును కనబరిచాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయూబ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. పాక్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన పాండ్యా.. మొదటి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అయూబ్ ఆఫ్ సైడ్ పాయింట్ దిశగా షాట్ ఆడేందుకు ప్రయత్నిచాడు.అయూబ్ షాట్ అద్బుతంగా కనక్ట్ చేసినప్పటికి బంతి మాత్రం నేరుగా బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా చేతికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా అయూబ్ తెల్లముఖం చేశాడు. చేసేదేమిలేక నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే భారత్ మ్యాచ్కు ముందు అయూబ్ను ఉద్దేశించి పాక్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఇచ్చిన స్టెట్మెంట్ ఇప్పుడు భారత అభిమానులు ప్రస్తావిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు.దీంతో అహ్మద్, అయూబ్ను కలిసి నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. "భారత్పై కనీసం ఒక్క పరుగు చేయలేకపోయావు, నీవా బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతావని" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు.6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా అయూబ్ వెనుదిరగగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మహ్మద్ హరిస్(3) ఔటయ్యాడు. అయితే వీరిద్దరి ఔటయ్యాక ఫఖార్ జమాన్(16), సాహిబ్జాదా ఫర్హాన్(19) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 6 ఓవర్లు ముగిసే సారికి పాక్ రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది.Aapka Mother of all Rivalries mein 𝘏𝘈𝘙𝘋𝘐𝘒 swaagat 😉 Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/AEQE0TLQju— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025చదవండి: IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే Saim Ayub is gone! #Pakistan lose their first wicket. 🏏#PAKvIND #INDvsPAK pic.twitter.com/9p3V2jakgd— Maham Awan (@awanmaham_) September 14, 2025 -
భారత్తో మ్యాచ్ ముఖ్యం కాదు.. మా టార్గెట్ అదే: పాక్ ఓపెనర్
ఆసియాకప్-2025లో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు అన్ని విధాల సిద్దమైంది.ఇప్పటికే ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు శుభారంభం చేశారు. టీమిండియా తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ తమ మొదటి మ్యాచ్లో ఒమన్ను మట్టికర్పించింది. ఈ మల్టీనేషన్ టోర్నమెంట్లలో పాక్పై భారత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. చివరగా ఈ రెండు జట్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాక్ను భారత్ చిత్తు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలలు తర్వాత దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగనుంది. ఈ మ్యాచ్లో కూడా పాక్పై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని భారత్ పట్టుదలతో ఉంది. ఇక ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్కు ముందు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకు టీమిండియాపై గెలవడం ఒక్కటే ముఖ్యం కాదని, టోర్నీ విజేతగా నిలవడమే తమ లక్ష్యమని అయూబ్ చెప్పుకొచ్చాడు."మాకు జ్ఞాపకాలు ముఖ్యం కాదు. మా దృష్టింతా ప్రస్తుతం టోర్నమెంట్పైనే ఉంది. ఆసియాకప్ విజేతగా మేము నిలవాలనుకుంటున్నాము. టీమిండియాతో మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు. ఛాంపియన్షిప్ను గెలిచేందుకు మేము ఆతృతగా ఎదురు చూస్తున్నాము" అని ఒమన్తో మ్యాచ్ అనంతరం అయూబ్ పేర్కొన్నాడు.కాగా ఒమన్తో మ్యాచ్లో అయూబ్ బ్యాట్తో విఫలమైన బంతితో సత్తా చాటాడు. రెండు కీలక వికెట్లు పడగొట్టి పసికూన పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మొహమ్మద్ హ్యారిస్ (43 బంతుల్లో 66) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం లక్ష్య చేధనలో ఒమన్ కేవలం 67 పరుగులకే ఆలౌటైంది.ఫలితంగా 93 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు సాధించారు. వీరితోపాటు షాహిన్ ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్ , మొహమ్మద్ నవాజ్తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా.. -
Asia Cup 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం: పాకిస్తాన్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్లో శుభారంభం అందుకుంది. తొలి మ్యాచ్లో పసికూన ఒమన్ను ఎదుర్కొన్న సల్మాన్ ఆఘా బృందం.. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్.. తొలుత బ్యాటింగ్ చేసింది.ఆయుబ్ డకౌట్.. హ్యారిస్ అర్ధ శతకంఓపెనర్లలో షాహిబ్జాదా ఫర్హాన్ (29) ఫర్వాలేదనిపించగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ అర్ధ శతకం (43 బంతుల్లో 66)తో రాణించడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది.హ్యారిస్తో పాటు ఫఖర్ జమాన్ (16 బంతుల్లో 23 నాటౌట్) రాణించగా.. నవాజ్ 19 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానినకి 160 పరుగులు రాబట్టగలిగింది. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్, ఆమిర్ కలీమ్ మూడేసి వికెట్లు తీయగా.. మొహమ్మద్ నదీమ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 67 పరుగులకే ఆలౌట్ చేసిఇక లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ను పాక్ 67 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. స్పిన్నర్లు సూఫియాన్ ముకీమ్, సయీమ్ ఆయుబ్.. పేసర్ ఫాహిమ్ అష్రాఫ్ రెండేసి వికెట్లు తీయగా.. షాహిన్ ఆఫ్రిది (పేసర్), అబ్రార్ అహ్మద్ (స్పిన్నర్), మొహమ్మద్ నవాజ్ (స్పిన్నర్) తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఒమన్ బ్యాటర్లలో హమావ్ మీర్జా 27 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. ఒమన్పై విజయానంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. బౌలింగ్ విభాగం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ జట్టులో మేటి స్పిన్నర్లు ఉన్నారని.. యూఏఈ వంటి వేదికపై వారి అవసరమే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు.స్పిన్నర్లు కీలకం‘‘బ్యాటింగ్పై మేము మరింత దృష్టి సారించాల్సి ఉంది. అయితే, బౌలింగ్ పరంగా మా వాళ్లు అద్భుతం. మా బౌలర్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. మా జట్టులో ముగ్గురు స్పిన్నర్లు.. తమకు తామే ప్రత్యేకం. వీరికి తోడుగా ఆయుబ్ కూడా ఉన్నాడు.దుబాయ్, అబుదాబి వంటి వేదికల్లో స్పిన్నర్లు కీలకం. మాకు 4-5 స్పిన్ ఆప్షన్లు ఉండటం సానుకూలాంశం. అయితే, మేము ఈ మ్యాచ్లో 180 పరుగులు చేయాల్సింది. కానీ ఒక్కోసారి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతాము. ఆటలో ఇలాంటివి సహజం.ఎలాంటి జట్టునైనా ఓడించగలమునిజానికి ఇక్కడ మేము చాలా రోజులుగా ఆడుతున్నాం. ఈ టోర్నీకి ముందు టీ20 ట్రై సిరీస్ ఆడాము. అలవోకగానే సిరీస్ను సొంతం చేసుకున్నాము. సుదీర్ఘ కాలంలో మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే ఎలాంటి జట్టునైనా ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా ధీమా వ్యక్తం చేశాడు.కాగా యూఏఈ వేదికగా ఆసియా కప్-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, ఒమన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా యూఏఈపై గెలుపొందగా.. పాక్ ఒమన్పై గెలిచింది. అయితే, నెట్ రన్రేటు పరంగా అందనంత ఎత్తులో ఉన్న భారత్ (+10.483) ప్రస్తుతం గ్రూప్-‘ఎ’ టాపర్గా ఉండగా.. పాక్ (+4.650) రెండో స్థానంలో ఉంది.ఆసియా కప్-2025: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉పాకిస్తాన్- 160/7 (20)👉ఒమన్- 67 (16.4)👉ఫలితం: ఒమన్పై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.చదవండి: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు బద్దలు.. తొలి ప్లేయర్గా సాల్ట్ చరిత్ర -
తోపు, తురుము అన్నారు.. కట్ చేస్తే? తొలి బంతికే ఔట్
ఆసియాకప్-2025కు ముందు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్పై భారీ అంచనాలు ఉండేవి. ద్వైపాక్షిక సిరీస్లలో అద్బుతంగా రాణిస్తున్న అయూబ్.. ఈ ఖండాంతర టోర్నీలో కూడా దుమ్ములేపుతాడని అంతా భావించారు. కానీ ఈ యువ ఆటగాడు అందరి అంచనాలను తలకిందలు చేశాడు.ఈ మెగా ఈవెంట్లో భాగంగా దుబాయ్ వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో యూబ్ తీవ్ర నిరాశపరిచాడు. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో అయూబ్ తన ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. పాక్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమన్ పేసర్ షా ఫైజల్.. రెండో బంతిని మిడిల్ స్టంప్ దిశగా ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని అయూబ్ కాస్త బెండ్ అయ్యి లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి బ్యాక్ ప్యాడ్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్ అని వేలు పైకెత్తాడు. ఆ తర్వాత అయూబ్ రివ్యూ తీసుకున్నప్పటికి ఫలితం మాత్రం ఒమన్కు ఫేవర్గానే వచ్చింది. బంతి క్లియర్గా మిడిల్ స్టంప్కు తాకినట్లు తేలింది. దీంతో నిరాశతో అయూబ్ పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి బంతికే ఔటైన అయూబ్ నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఎందుకంటే పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్.. జస్ప్రీత్ బుమ్రాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో అయూబ్ ఆరు సిక్స్లు కొడతాడని అహ్మద్ బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అయూబ్ పసికూన ఒమన్పై ఆడలేకపోయాడు.💥 Golden Duck! Saim Ayub trapped plumb LBW, Pakistan lose review early!#AsiaCup2025 #Pakistan #Oman #starzplay pic.twitter.com/cJ74GBVZ7q— Cricket on STARZPLAY (@starzplaymasala) September 12, 2025 -
బుమ్రా బౌలింగ్లో మా వాడు 6 సిక్స్లు కొడతాడు: పాక్ ప్లేయర్
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. భారత్ ఇప్పటికే తమ తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేయగా.. పాక్ జట్టు వారి మొదటి మ్యాచ్లో శుక్రవారం ఒమన్తో తలపడనుంది.పాకిస్తాన్ కూడా వారి తొలి మ్యాచ్లో సునాయసంగా విజయం సాధించే అవకాశముంది. కానీ అసలు సిసలైన సవాల్ ఆదివారం ఎదురుకానుంది. ఆసియాకప్లో పాక్పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరోసారి దాయాదిపై తమ జోరును కొనసాగించాలని సూర్యకుమార్ సేన ఉవ్విళ్లూరుతోంది.ప్రత్యర్ధి పాక్ సైతం ఎలాగైనా టీమిండియాను ఓడించాలని పట్టుదలతో ఉంది. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ తన్వీర్ అహ్మద్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా సూపర్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో పాక్ యవ ఓపెనర్ సైమ్ అయూబ్ వరుసగా ఆరు సిక్స్లు కొడతాడని తన్వీర్ బిల్డప్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన్వీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దీంతో భారత అభిమానులు తన్వీర్కు కౌంటరిస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో అయూబ్ కనీసం ఫోర్ అయినా కొడతాడా? అని ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. కాగా ప్రపంచ క్రికెట్లో బుమ్రా నెంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు. స్మిత్, రూట్, స్టోక్స్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. అటువంటిది ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు అంటే అది కలలో కూడా జరగదు. అయితే పాక్ జట్టులో అయూబ్ గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. 41 టీ20ల్లో 816 పరుగులు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా అయూబ్ చేయగలడు.చదవండి: మా జట్టుకు మాత్రం.. గిల్ ఇలా ఆడడు: గుజరాత్ టైటాన్స్ కోచ్ -
ఆసియాకప్కు ముందు పాక్ జోరు.. వరుసగా రెండో విజయం
ఆసియాకప్-2025 సన్నాహాకాల్లో యూఏఈ వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో పాకిస్తాన్ అదరగొడుతోంది. ఈ ట్రైసిరిస్లో పాక్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్లో అఫ్గానిస్తాన్ను చిత్తు చేసిన పాకిస్తాన్.. ఇప్పుడు రెండో మ్యాచ్లో యూఈఏపై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.శనివారం షార్జాలో జరిగిన మ్యాచ్లో యూఏఈపై 31 పరుగుల తేడాతో మెన్ ఇన్ గ్రీన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(38 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్స్లతో 69), హసన్ నవాజ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 56) మెరుపు హాఫ్ సెంచరీలతో మెరిశారు. వారితో మహ్మద్ నవాజ్(25), అష్రాఫ్(16) రాణించారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ, సగీర్ ఖాన్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హైదర్ అలీ రెండు వికెట్లు సాధించాడు.అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్ అసిఫ్ ఖాన్(35 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లతో 77) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.అతడితో మహ్మద్ వసీం(33) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లు పడగొట్టగా.. నవాజ్ రెండు, మిర్జా, అయూబ్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IPL 2026: అక్షర్ పటేల్పై వేటు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్!? -
WI Vs PAK: అథనాజ్, రూథర్ఫర్డ్ మెరుపులు వృథా.. మీరు మారరు!
వెస్టిండీస్కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. గత టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా చేతి (WI vs AUS)లో చిత్తుగా ఓడిన విండీస్.. తాజాగా పాకిస్తాన్కు కూడా పొట్టి సిరీస్ (WI vs PAK T20Is)ను సమర్పించుకుంది. ఫ్లోరిడా వేదికగా సోమవారం నాటి మూడో టీ20లో ఓడిపోయి.. 1-2తో పరాజయాన్ని చవిచూసింది.రాణించిన ఓపెనర్లుకాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్వదేశంలో పాకిస్తాన్తో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. మొదటి మ్యాచ్లో పాక్, రెండో మ్యాచ్లో విండీస్ గెలిచాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్ణయాత్మక మూడో టీ20లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (53 బంతుల్లో 74), సయీమ్ ఆయుబ్ (66) అర్ధ శతకాలతో రాణించి శుభారంభం అందించారు. అయితే, వన్డౌన్ బ్యాటర్ హసన్ నవాజ్ (15), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారీస్ (2) మాత్రం విఫలమయ్యారు.ఆఖర్లో ఖుష్ దిల్ (6 బంతుల్లో 11) కాస్త వేగంగా ఆడగా.. ఫాహీమ్ అష్రాఫ్ (3 బంతుల్లో 10) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 189 పరుగులు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసెఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.అథనాజ్, రూథర్ఫర్డ్ మెరుపులు వృథాఇక లక్ష్య ఛేదనలో వెస్టిండీస్కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ జెవెల్ ఆండ్రూ (15 బంతుల్లో 24) రాణించాడు. కానీ వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాయీ హోప్ (7) నిరాశపరచగా.. రోస్టన్ ఛేజ్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో మరో ఓపెనర్ అలిక్ అథనాజ్, నాలుగో నంబర్ బ్యాటర్ షెర్ఫానే రూథర్ఫర్డ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అథనాజ్ 40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు చేయగా.. రూథర్ఫర్డ్ 35 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు.అయితే, మిగతా వారి నుంచి వీరికి సహకారం లభించలేదు. హోల్డర్ డకౌట్ కాగా.. రొమారియో షెఫర్డ్ (4), గుడకేష్ మోటి (10) ఆఖరి వరకు అజేయంగా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసిన వెస్టిండీస్.. విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పర్యాటక పాకిస్తాన్ టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక పాక్ బౌలర్లలో హసన్ అలీ, మొహమ్మద్ నవాజ్, హ్యారీస్ రవూఫ్, సయీమ్ ఆయుబ్, సూఫియాన్ ముకీం ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా గత టీ20 సిరీస్లో విండీస్.. ఆసీస్ చేతిలో సొంతగడ్డపై 5-0తో క్లీన్స్వీప్నకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘మీరు మారరు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా విండీస్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఇంజక్షన్ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్మన్ గిల్ -
అయూబ్ ఆల్రౌండ్ షో.. విండీస్ను చిత్తు చేసిన పాక్
వెస్టిండీస్ పర్యటనను పాకిస్తాన్ ఘనంగా ఆరంభించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్తో జరిగిన తొలి టీ20లో 14 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. హసన్ నవాజ్(24), ఫఖార్ జమాన్(28) రాణించారు. విండీస్ బౌలర్లలో షెమార్ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్, షెఫర్డ్, అకిల్ హోస్సేన్ తలా వికెట్ సాధించారు.టాపర్డర్ ఫెయిల్..అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్కు ఓపెనర్లు జాన్సెన్ చార్లెస్(35), జ్యువెల్ ఆండ్రూ(35) 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే విండీస్ ఒకే ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మహ్మద్ నవాజ్.. ఆండ్రూ, చార్లెస్, మోటీలను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ షాయ్ హోప్(2), రూథర్ ఫర్డ్(11), ఛేజ్(5), షెఫర్డ్(5) వరుస క్రమంలో ఔటయ్యారు. ఆఖరిలో హోల్డర్(30), షమీర్ జోషఫ్(21) మెరుపులు మెరిపించినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లక్ష్య చేధనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగల్గింది.పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్ మూడు, అయూబ్ రెండు, ముఖియమ్ ఓ వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 2న ఫ్లోరిడా వేదికగా జరగనుంది.చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్ -
CT 2025: ఇక్కడ ఓడిపోయాం.. అక్కడ మాత్రం రాణిస్తాం: పాక్ కెప్టెన్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తాము అంచనాలు అందుకోలేకపోయామని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) విచారం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై సత్తా చాటాలని భావిస్తే.. ఊహించని రీతిలో నిష్క్రమించడం నిరాశను కలిగించిందని పేర్కొన్నాడు. యువ ఆటగాడు సయీమ్ ఆయుబ్(Saim Ayub) గాయం కూడా తమ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిందని.. ఏదేమైనా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని తెలిపాడు.ఆతిథ్య జట్టు అట్టడుగునదాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ నిర్వహణ అవకాశం... పెద్ద ఎత్తున హంగామా... డిఫెండింగ్ చాంపియన్గా అంచనాలు... కానీ పాకిస్తాన్ అభిమానులకు స్వదేశంలో కనీసం తమ జట్టు ఆడిన మూడు మ్యాచ్లు కూడా చూసే అవకాశం దక్కలేదు!కరాచీలో న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడి, ఆపై దుబాయ్లో భారత్ చేతిలో పరాజయంతో సెమీఫైనల్కు దూరమైన పాక్ టీమ్కు నామమాత్రపు మ్యాచ్ కూడా కలిసి రాలేదు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దయింది.మూలిగే నక్కమీద తాటిపండుఎడతెరిపి లేకుండా సాగిన వాన కారణంగా టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ కథ ముగిసింది. ఫలితంగా పరువు కోసమైనా తమ ఫ్యాన్స్ కోసం ఈ మ్యాచ్లో బాగా ఆడాలనుకున్న పాక్ జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. రావల్పిండిలో రద్దైన రెండో మ్యాచ్ ఇది. అంతకుముందు మంగళవారం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్లో కూడా ఒక్క బంతి వేసే అవకాశమే రాలేదు.ఇక పాక్- బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు తర్వాత గ్రూప్ ‘ఎ’లో ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్ చేరింది. అయితే పాకిస్తాన్ (–1.087) కంటే మెరుగైన రన్రేట్ ఉన్న బంగ్లాదేశ్ (–0.443) మూడో స్థానంతో ముగించగా, ఆతిథ్య జట్టు అట్టడుగున నిలిచింది!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెత్త ప్రదర్శనతో పరువు తీశారంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ తమ ఓటములకు కారణాలను విశ్లేషించాడు.‘‘మా దేశ ప్రజల కళ్లెదుట గొప్పగా ఆడాలని కోరుకున్నాం. మాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే, మేము అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. పరాజయాలు మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచాయి.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, జింబాబ్వేలతో వన్డే సిరీస్లలో అదరగొట్టిన సయీమ్ ఆయుబ్ గాయం వల్ల ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఫఖర్ జమాన్ కూడా గాయపడటంతో జట్టు కూర్పులో అకస్మాత్తుగా మార్పులు చేయాల్సి వచ్చింది. ఇది జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసింది.అక్కడ మేము గొప్పగా రాణిస్తాంఅయితే, కెప్టెన్గా నేను ఇలాంటి కారణాలు చెప్పకూడదు. ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడినా మేము బాగా ఆడాల్సింది. ఈ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. అన్ని విభాగాల్లోనూ మెరుగుపడాల్సి ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో మేము ఎంతో ప్రొఫెషనల్గా ఆడాము. అయినా ఇంకా ఇంకా రాణించాల్సి ఉంది.ఒక్కోసారి అనవసరపు తప్పిదాల వల్ల మూల్యం చెల్లించాం. తదుపరి మేము న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతున్నాం. అక్కడ మేము గొప్పగా రాణిస్తామని ఆశిస్తున్నా. పాకిస్తాన్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో చేసిన తప్పులు అక్కడ పునరావృతం చేయబోము. కివీస్ గడ్డపై సత్తా చాటుతాం’’ అని 32 ఏళ్ల రిజ్వాన్ పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత 5 వన్డేలు, 3 టీ20ల సిరీస్లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్కు వెళ్లనుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ 3 వన్డేలు, 3 టీ20ల కోసం జింబాబ్వేకు ఆతిథ్యం ఇస్తుంది. చదవండి: Champions Trophy: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేశాడు -
CT 2025: పాకిస్తాన్కు ఎదురుదెబ్బ! ఓవైపు క్రికెట్ పండుగ.. మరోవైపు..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ సయీమ్ అయూబ్(Saim Ayub) గాయం కారణంగా సొంతగడ్డపై ఈనెల 19 నుంచి జరిగే ఈ మెగా వన్డే టోర్నమెంట్కు దూరమయ్యాడు. గత నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. టెస్టు సిరీస్ సందర్భంగా అతడి చీలమండకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో.. అప్పటి నుంచి అతడు ఇంగ్లండ్లోనే పునరావాస శిబిరంలో గడుపుతున్నాడు.అయితే గాయం తీవ్రత దృష్ట్యా కనీసం పది వారాలు విశ్రాంతి తీసుకోవాలని బోర్డు వైద్య సిబ్బంది నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆయూబ్ గైర్హాజరు కానున్నాడు. నిజానికి గాయపడటానికి ముందు ఈ 22 ఏళ్ల ఎడంచేతి వాటం బ్యాటర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనలలో అదరగొట్టాడు.ఆ సిరీస్కూ దూరంముఖ్యంగా సఫారీ జట్టుతో జరిగిన వన్డేల్లో సెంచరీలతో కదంతొక్కిన అయూబ్ జింబాబ్వేతో టీ20లో ‘శత’క్కొట్టాడు. ఇక వచ్చే నెల న్యూజిలాండ్ పర్యటనకు అతడు అందుబాటులో ఉండేది అనుమానమేనని తెలిసింది. మెడికల్ రిపోర్టులు, ఫిట్నెస్ టెస్టులను పరిశీలించాకే కివీస్ పర్యటనకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా న్యూజిలాండ్లో పాకిస్తాన్ ఐదు టీ20లు, మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగుతాయి.క్రికెట్ పండుగఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత క్రికెట్ పండగ జరగబోతోన్న విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం నవీకరించిన స్టేడియాల సామర్థ్యం, ఆ టోర్నీకి ముందు సిద్ధమైన మూడు మేటి జట్ల సత్తా ఏంటో పరీక్షించుకునేందుకు సన్నాహక ముక్కోణపు టోర్నీ శనివారం నుంచి మొదలుకానుంది. లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలపై ఆతిథ్య పాక్ సహా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లు ఈ ముక్కోణపు సిరీస్లో తలపడనున్నాయి.ఇందులో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ల మధ్య లాహోర్లోని గడాఫీ స్టేడియంలో తొలి పోరు జరుగనుంది. 35 వేల సీట్ల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవీకరించింది. వందల సంఖ్యలో రోజుల తరబడి కారి్మకులు శ్రమించి నిర్ణీత సమయానికల్లా మైదానాలకు అందుబాటులోకి తెచ్చారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ కితాబిచ్చారు.ఇటు ఆతిథ్య దేశంతో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు మెగా ఈవెంట్కు సరైన సన్నాహక టోర్నీగా ఈ ముక్కోణపు టోర్నీ మ్యాచ్ల్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. తద్వారా స్థానిక పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ఐసీసీ మెగా టోర్నీకి వేదికలైన స్టేడియాల పిచ్పై కూడా అవగాహన పెంచుకోవచ్చని కివీస్, సఫారీలు భావిస్తున్నాయి. ఇరుజట్లలోని ఆటగాళ్లలో కొందరు మినహా దాదాపు మెగా ఈవెంట్లో పాల్గొనే క్రికెటర్లతోనే ఈ టోర్నీ ఆడేందుకు వచ్చాయి. ఫిబ్రవరి 14న కరాచీలో జరిగే ఫైనల్స్తో ఈ ముక్కోణపు టోర్నీ ముగుస్తుంది. తర్వాత ఐదు రోజుల వ్యవధిలోనే 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
‘చాంపియన్స్ ట్రోఫీలో కచ్చితంగా ఆడతా.. ఈసారి కూడా’
త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తాను పునరాగమనం చేస్తానని వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)లో భాగమమవుతానని తెలిపాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.కేవలం 33 పరుగులేకాగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా పాక్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు ఫఖర్ జమాన్(Fakhar Zaman). అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పూర్తిగా తేలిపోయాడు. నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం 33 పరుగులే చేశాడు. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో అమెరికా చేతిలో ఓడి పాకిస్తాన్ అవమాన భారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.బోర్డుతో విభేదాలుఇక అప్పటి నుంచి ఫఖర్ జమాన్ మరోసారి పాక్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. బాబర్ ఆజం(Babar Azam)నకు మద్దతుగా నిలిచిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్లో సమయంలో బాబర్, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేస్తూ పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్ తప్పుబట్టాడు. ముఖ్యంగా బాబర్ విషయంలో ఇలా చేయడం సరికాదంటూ సెలక్టర్ల తీరును విమర్శించాడు.ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. ఫఖర్ జమాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ను ప్రశ్నించడం వెనుక కారణమేమిటో చెప్పాలంటూ బోర్డు తరఫున షోకాజ్ నోటీస్ జారీ చేశాడు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పీసీబీ.. ఫఖర్ జమాన్ను పక్కనపెట్టిందని.. అందుకే జట్టుకు ఎంపిక చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.అసలు కారణం ఇదీఈ విషయాలపై ఫఖర్ జమాన్ తాజాగా స్పందించాడు. ‘‘చాలా మందికి నేను జట్టుకు ఎందుకు దూరమయ్యానో తెలియదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాను. నేను వందశాతం ఫిట్గా లేకపోవడం వల్లే జట్టుకు ఎంపిక చేయలేదు.అయితే, కచ్చితంగా నేను మళ్లీ పాక్ తరఫున బరిలోకి దిగుతాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. పాకిస్తాన్ తదుపరి ఆడే పరిమిత ఓవర్ల సిరీస్లో పాల్గొంటాను’’ అని ఫఖర్ జమాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీతో తనకు గుర్తింపు వచ్చిందన్న ఈ వెటరన్ ప్లేయర్.. ‘‘పాకిస్తాన్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో పర్యటించింది.ఆ జట్లలో నేను భాగం కాలేకపోయాను. కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం చాంపియన్స్ ట్రోఫీ మీదే ఉంది. 2017లో చాంపియన్స్ ట్రోఫీలో ప్రతిభ చూపినందు వల్లే నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఈసారి కూడా అదే తరహాలో రాణించాలని పట్టుదలగా ఉన్నాను. మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.అందుకు రెడీగానే ఉన్నానుఇక ఇప్పటికే ఓపెనర్గా యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫఖర్ జమాన్ స్పందిస్తూ.. ‘‘అతడు గొప్పగా ఆడుతున్నాడు. వచ్చే నాలుగైదేళ్లలో టాప్ బ్యాటర్గా ఎదుగుతాడు. ఇక మేనేజ్మెంట్ నన్ను నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా రెడీగానే ఉన్నాను. అన్నింటికంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.కాగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా సెంచరీతో చెలరేగి.. పాకిస్తాన్కు టైటిల్ అందించాడు ఫఖర్ జమాన్. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత తొలిసారిగా జరిగే చాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది.చదవండి: VHT: ఇంగ్లండ్తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి విశ్రాంతి! -
18 ఏళ్ల తర్వాత... పాక్లో టెస్టు సిరీస్ ఆడనున్న వెస్టిండీస్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తోంది. చివరిసారిగా 2006లో పాకిస్తాన్లో టెస్టు మ్యాచ్ ఆడిన వెస్టిండీస్... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు సోమవారం ఇస్లామాబాద్లో అడుగు పెట్టింది. ఈ మధ్య కాలంలో కరీబియన్ జట్టు పాకిస్తాన్ గడ్డపై రెండుసార్లు పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ నెల 16 నుంచి కరాచీ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. 24 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ముల్తాన్ ఆతిథ్యమిస్తుంది. అంతకుముందు 10 నుంచి విండీస్ జట్టు పాకిస్తాన్ షాహీన్స్తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023–25లో ఇరు జట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. విండీస్ జట్టుకు క్రెయిగ్ బ్రాత్వైట్ సారథ్యం వహిస్తుండగా... అమీర్ జాంగో తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. పాకిస్తాన్ ఇంకా తమ జట్టును ప్రకటించాల్సి ఉంది.పాక్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ప్రోటీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-0తో పాక్ వైట్వాష్కు గురైంది. ఒకట్రెండు రోజుల్లో పాక్ జట్టు స్వదేశంలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సిరీస్కు పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ దూరమయ్యే అవకాశముంది.దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో అయూబ్ కూడి కాలి పాదానికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. అతడు శస్త్ర చికిత్స కోసం లండన్కు వెళ్లనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫిట్నెస్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే విండీస్తో రెడ్ బాల్ సిరీస్కు అతడు దూరం కానున్నాడు.వెస్టిండీస్ జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, కీసీ కార్టీ, జోషువా డిసిల్వా, జస్టిన్ గ్రేవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అమీర్ జంగూ, మికిల్ లూయిస్, గుడకేశ్ మోతీ, అండర్సన్ ఫిలిప్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, వారికన్.చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్ -
CT 2025: పాకిస్తాన్కు భారీ షాక్!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫామ్లో ఉన్న యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్(Saim Ayub) తీవ్రంగా గాయపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్టు సందర్భంగా అతడు చీలమండ నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో ఫిజియోలు వచ్చి పరీక్షించినా ఫలితం లేకపోయింది.ఫలితంగా ఆయుబ్ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. కాగా 2023లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 22 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. గతేడాది వన్డే, టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు 27 టీ20లలో 498 పరుగులు చేసిన ఆయుబ్.. ఏడు టెస్టుల్లో 364 రన్స్ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు.సౌతాఫ్రికా గడ్డపై పాక్ చరిత్రఅయితే, వన్డేల్లో మాత్రం ఆయుబ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు శతకాల సాయంతో.. 515 పరుగులు సాధించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్లో ఓడిపోయిన పాక్.. వన్డేల్లో మాత్రం 3-0తో క్లీన్స్వీప్ చేసి.. సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఇక ఈ టూర్లో భాగంగా ఆఖరిగా టెస్టు సిరీస్లో తలపడుతున్న పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. కేప్టౌన్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్కు దిగింది.ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయుబ్ఈ క్రమంలో ప్రొటిస్ ఇన్నింగ్స్లో ఏడో ఓవర్ను పాక్ పేసర్ మహ్మద్ అబ్బాస్ వేయగా.. క్రీజులో ఉన్న రియాన్ రెకెల్టన్ షాట్ బాదాడు. బంతి గల్లీ, బ్యాక్వర్డ్ పాయింట్ల మీదుగా దూసుకుపోతుండగా.. ఫీల్డర్లు జమాల్- ఆయుబ్ దానిని ఆపే ప్రయత్నం చేయగా... బంతి జమాల్ చేజిక్కింది. సౌతాఫ్రికాలో వరుస సెంచరీలుఅయితే, ఈ క్రమంలో ఆయుబ్ కుడికాలి మడిమ మెలిక పడింది. తీవ్ర నొప్పితో అతడు మైదానం వీడాడు. అతడి స్థానంలో అబ్దుల్లా షఫీక్ సబ్స్టిట్యూట్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చాడు. కాగా సయీమ్ ఆయుబ్ మడిమ విరిగినట్లు సమాచారం. దీంతో అతడు సొంతగడ్డపై జరిగే ఐసీసీ టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే పాక్కు మాత్రం గట్టి షాక్ తగిలినట్లే. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై పరుగుల వరద పారించడంతో పాటు సౌతాఫ్రికా గడ్డపై కూడా రెండు శతకాలతో చెలరేగాడు. ఇలాంటి ఇన్ ఫామ్ ఓపెనర్ సేవలను కోల్పోతే మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టుకు ఎదురుదెబ్బలు తప్పవు! చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
జోహన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 36 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో పాక్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.94 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్స్లతో 101 పరుగులు చేశాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత ఓవర్లలో పాకిస్తాన్ 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో 271 పరుగులకు ప్రోటీస్ ఆలౌటైంది.కాగా ఈ సిరీస్లో అయూబ్కు రెండో సెంచరీ కావడం గమనార్హం. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా అయూబ్ సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో అయూబ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన అయూబ్..వన్డే క్రికెట్లో దక్షిణాఫ్రికాపై రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా అయూబ్ రికార్డులెక్కాడు. 22 సంవత్సరాల, 207 రోజుల వయస్సులో అయూబ్ ఈ ఫీట్ను నమోదు చేశాడు.ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. కాగా వన్డేల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన అతి వయష్కుడి రికార్డు మాత్రం అయూబ్ సహచరుడు అబ్దుల్లా షఫీక్ పేరిట ఉంది. 22 ఏళ్ల 4 రోజుల వయస్సులో షఫీక్ ఈ ఘనత సాధించాడు.వన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరేవన్డేల్లో సౌతాఫ్రికాపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు వీరేఅబ్దుల్లా షఫీక్(పాకిస్తాన్)- 22 ఏళ్ల, 4 రోజుకేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 22 ఏళ్ల, 167 రోజులుసైమ్ అయూబ్ 22 ఏళ్ల, 207 రోజులుసైమ్ అయూబ్ 22 ఏళ్ల, 212 రోజులు రహ్మానుల్లా గుర్బాజ్ 22 ఏళ్ల 297 రోజులుచదవండి: IND vs AUS: ఆసీస్తో నాలుగో టెస్టు.. ముంబై యువ సంచలనానికి పిలుపు!? -
పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
సౌతాఫ్రికా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్లో ఆతిథ్య ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్స్వీప్ చేసింది. మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సౌతాఫ్రికా 2-0తో నెగ్గింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో జయభేరి మోగించిన పాకిస్తాన్.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించింది. జొహన్నస్బర్గ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది.సయీమ్ అయూబ్ శతకంఇక వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో రిజ్వాన్ బృందం తొమ్మిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయూబ్(94 బంతుల్లో 101) శతకంతో చెలరేగగా.. బాబర్ ఆజం(52), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(53) హాఫ్ సెంచరీలు సాధించారు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(48), తయ్యబ్ తాహిర్(28) రాణించారు. టాపార్డర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్(0)తో పాటు లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. క్లాసెన్ ఒక్కడేఅయితే, లక్ష్య ఛేదనలో మాత్రం సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఓపెనర్లలో టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తెంబా బవుమా 8 పరుగులకే నిష్క్రమించాడు. వన్డౌన్లో వచ్చిన రాసీ వాన్ డెర్ డసెన్ 35 రన్స్తో రాణించగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్(19) నిరాశపరిచాడు.ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్తో ప్రొటిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. అయితే, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో తయ్యబ్ తాహిర్కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ పెవిలియన్ చేరడంతో ప్రొటిస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.36 పరుగుల తేడాతో పాక్ గెలుపుమార్కో జాన్సెన్(26), కార్బిన్ బాష్(40 నాటౌట్) కాసేపు పోరాడగా.. జార్న్ ఫార్చూన్(8), కగిసో రబడ(14), మఫాకా(0) విఫలమయ్యారు. ఫలితంగా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికాపై.. డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీం నాలుగు వికెట్లు కూల్చగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు.. మహ్మద్ హొస్నేన్, సయీమ్ ఆయుబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను వన్డేల్లో వైట్వాష్ చేసిన తొలి జట్టుగాకాగా 1991లో అధికారికంగా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన సౌతాఫ్రికా.. స్వదేశంలో క్లీన్స్వీప్ కావడం ఇదే మొదటిసారి. తద్వారా ప్రొటిస్ గడ్డపై సౌతాఫ్రికాను వైట్వాష్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఫీట్ నమోదు చేసింది.అంతేకాదు.. సౌతాఫ్రికాపై పాకిస్తాన్కు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్ విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టు కూడా పాకిస్తాన్ కావడం విశేషం. ఇక మూడో వన్డేలో సెంచరీ చేసిన సయీమ్ ఆయుబ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.చదవండి: VHT 2024: అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్ను ఊదిపడేసిన కర్ణాటక -
సల్మాన్ ఆల్రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ విజయం
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్రమే చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(97 బంతుల్లో 86 7 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. మార్క్రమ్(35), రికెల్టన్(36), టోనీ డీజోర్జీ(33) రాణించారు. పాక్ బౌలర్లలో పార్ట్టైమ్ స్పిన్నర్ సల్మాన్ ఆఘా 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ ఆర్బర్ ఆహ్మద్ రెండు, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలా వికెట్ సాధించారు.అయూబ్ సూపర్ సెంచరీ..ఇక 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 119 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 10 ఫోర్లు, 3 సిక్స్లతో 109 పరుగులు చేశాడు.మరోవైపు బంతితో మాయ చేసిన సల్మాన్ అలీ అఘా బ్యాట్తో కూడా సత్తాచాటాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, బార్టమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమ్సీ, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న కేప్టౌన్ వేదికగా జరగనుంది. -
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
పాకిస్తాన్తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్తో టీ20 సిరీస్ను 2-0తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్.. సెంచరీ మిస్ఇందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(11) విఫలం కాగా.. సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాడు.మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్ పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్మన్, డయాన్ గాలియెమ్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.రీజా హెండ్రిక్స్ విధ్వంసం.. ‘తొలి’ శతకంపాక్ యువ పేసర్ జహన్బాద్ ఖాన్ ఓపెనర్ రియాన్ రికెల్టన్ను రెండు పరుగుల వద్దే పెవిలియన్కు పంపాడు. వన్డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తలవంచకతప్పలేదు.రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్కు ఇదే తొలి శతకం కావడం విశేషం.సిరీస్ సౌతాఫ్రికా కైవసంఇక రీజాకు తోడుగా రాసీ వన్ డెర్ డసెన్ మెరుపు ఇన్నింగ్స్(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్ బౌలర్లలో జహన్బాద్ ఖాన్కు రెండు, అబ్బాస్ ఆఫ్రిదికి ఒక వికెట్ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్బర్గ్లోని ది వాండరర్స్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాక్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో ఊచకోత
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఓటమికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో వన్డేలో 10 వికెట్లను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షషీక్ ఊదిపడేశారు.కేవలం 18.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా పాక్ లక్ష్యాన్ని చేధించింది. సైమ్ ఆయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ షఫీక్(32 నాటౌట్) రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో నవంబర్ 28న జరగనుంది.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
AUS Vs PAK: ఏడేళ్ల తర్వాత పాక్ సాధించింది..!
ఆసీస్ గడ్డపై పాక్ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. జనవరి 15, 2017లో పాక్ చివరిసారి ఆసీస్ను వారి సొంతగడ్డపై (మెల్బోర్న్) ఓ వన్డేలో ఓడించింది. 2854 రోజుల తర్వాత పాక్ తిరిగి ఆసీస్ను వారి సొంతగడ్డపై ఓడించింది. అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 8) జరిగిన మ్యాచ్లో పాక్ ఆసీస్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్లో హరీస్ రౌఫ్ (8-0-29-5).. ఆతర్వాత బ్యాటింగ్లో సైమ్ అయూబ్ (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరికి తోడు మొహమ్మద్ రిజ్వాన్ వికెట్కీపింగ్లో చెలరేగాడు. రిజ్వాన్ ఈ మ్యాచ్లో ఏకంగా ఆరు క్యాచ్లు పట్టాడు. ఈ మ్యాచ్లో గెలుపుతో పాక్ మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హరీస్ రౌఫ్ (5/29), షాహీన్ అఫ్రిది (3/26), నసీం షా (1/65), మొహమ్మద్ హస్నైన్ (1/27) ధాటికి 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజతీయాలకు చేరింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు ఓ వికెట్ దక్కింది. -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
క్యాప్తో బంతిని ఆపాడు!?.. పాక్కు 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు?
Australia vs Pakistan, 3rd Test- Day 3: అరంగేట్ర టెస్టుతోనే పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, అద్భుత బ్యాటింగ్తో అతడు ట్రెండింగ్లోకి వచ్చాడనుకుంటే పొరపాటేనండోయ్! మరి హాట్టాపిక్లా మారడానికి అంత ‘గొప్ప’గా ఈ యంగ్ క్రికెటర్ ఏం చేశాడు?! ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ నామమాత్రపు ఆఖరి టెస్టులో సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించింది. సిడ్నీ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో అతడు డకౌట్గా వెనుదిరిగి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. అప్పుడు ఈజీ క్యాచ్ వదిలేశాడు అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలతోనూ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ను వదిలేసి సొంతజట్టు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాగా. కేవలం 33 పరుగులకే పరిమితమయ్యాడు 21 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఓపెనర్. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంకా నయం.. గాయపడలేదు ఈ పరిణామాల క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సయీమ్ ఆయుబ్.. తాజాగా మైదానంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. సిడ్నీ అవుట్ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఫీల్డింగ్ చేసే క్రమంలో జర్రున జారి పడ్డాడు ఆయుబ్. అయితే, అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయం కాలేదు. దీంతో పాక్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. క్యాప్తో బంతిని ఆపాడు? అయినా పెనాల్టీ లేదెందుకు? శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో... నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. స్టీవ్ స్మిత్ బాదిన బంతిని ఆపే క్రమంలో జారిపడ్డ ఆయుబ్ క్యాప్ బాల్ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుపడింది. దీంతో నిబంధనల ప్రకారం.. బ్యాటింగ్ చేస్తున్న జట్టు అంటే ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ‘‘ఎవరైతే పెనాల్టీ పరుగుల గురించి అడుగుతున్నారో వారి కోసం ఈ జవాబు: క్యాప్ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయినప్పటికీ.. ఇది యాక్సిడెంటల్గా జరిగిన పరిణామం. ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అందుకే బ్యాటింగ్ జట్టుకు పెనాల్డీ పరుగులు రాలేదు’’ అని ప్రకటన విడుదల చేసింది. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!? For those asking: It's not a five-run penalty for hitting the cap as the contact between ball and hat was accidental, and nor was the cap deliberately left on the field, as helmets tend to be #AUSvPAK https://t.co/BFcgfoKnnT — cricket.com.au (@cricketcomau) January 5, 2024 -
Aus Vs Pak: ఈజీ క్యాచ్ వదిలేశాడు.. తలపట్టుకున్న బాబర్! వీడియో
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్లలో సులువైన క్యాచ్లు వదిలేసి పాక్ భారీ మూల్యం చెల్లించిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్ను పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. అదే విధంగా.. మెల్బోర్న్లో జరిగిన రెండో మ్యాచ్లోనూ డేవిడ్ వార్నర్ క్యాచ్ను వదిలేశాడు. ఇలా కీలక సమయాల్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పెవిలియన్కు పంపే ఛాన్స్ మిస్ చేసుకున్న పాకిస్తాన్.. ఆయా మ్యాచ్లలో 360, 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా సిరీస్ కోల్పోవడమే గాకుండా కంగారూ గడ్డపై వరుసగా 16 టెస్టుల్లో ఓడి తమ చెత్త రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన షాన్ మసూద్ బృందం తొలుత బ్యాటింగ్ చేసి.. 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మొదటిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 6/0తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ను ఆరంభంలోనే దెబ్బకొట్టే ఛాన్స్ పాకిస్తాన్కు వచ్చింది. గురువారం నాటి ఆటలో పద్నాలుగో ఓవర్ రెండో బంతికి ఆమిర్ జమాల్ బౌలింగ్లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను సయీమ్ ఆయుబ్ మిస్ చేశాడు. వార్నర్ బంతిని గాల్లోకి లేపగా ఫస్ట్స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుబ్.. బాల్ను రెండు చేతులతో ఒడిసిపట్టినట్టే పట్టి జారవిడిచేశాడు. దీంతో పక్కనే ఉన్న బాబర్ ఆజం తీవ్ర అసహనానికి గురయ్యాడు. సులువైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన వార్నర్ మరోసారి ప్రమాదకారిగా మారుతాడేమోనన్న భయంతో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాక్ అరంగేట్ర బ్యాటర్ సయీమ్ ఆయుబ్పై సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. బ్యాటర్గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయడం కూడా రాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా సిడ్నీ మ్యాచ్తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆయుబ్.. తొలి ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఆయుబ్ క్యాచ్ చేసే సమయానికి వార్నర్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అయితే, 24.3వ ఓవర్ వద్ద ఆగా సల్మాన్ బౌలింగ్లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్(34) వెనుదిరిగాడు. చదవండి: Ind Vs SA 2nd Test: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం It's happened again! 😲 David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L — cricket.com.au (@cricketcomau) January 4, 2024