search operations
-
బిహార్ గ్యాంగ్ పనేనా?
-
పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు
పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్టెక్ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్లైన్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్టెక్ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.ఇదీ చదవండి: హిండెన్బర్గ్ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?తనిఖీలు ఎందుకు..?పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్వర్క్ కింద ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి. -
Ankola Landslide: ఐదు రోజులుగా గాలింపు.. అర్జున్ ఆచూకీ దొరికేనా!
దేశ వ్యాప్తంగా వనలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో వరదలు ముంచెత్తున్నాయి భారీ వర్షాలతో అక్కడక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. భవనాలు కూలుతున్నాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం సైతం వాటిల్లుతోంది. దీంతో పలు రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.తాజాగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో నాలుగు రోజుల క్రితం అంకోలా తాలుకాలోని షిరూర్లో వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. జూలై 16న 500 మీటర్ల ఎత్తు నుంచి ఓ కొండ షిరూర్ జాతీయ రహదారి మీద పడటంతో.. పక్కనే టీ దుకాణం వద్ద ఉన్న దాదాపు 10 మంది గల్లంతయ్యారు. వీరిలో ఏడుగురి మృతదేహాలను గురువారం వెలికి తీయగా... మరో ముగ్గురి ఆచూకి తెలియాల్సి ఉంది.భారీ మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వారిలో కేరళలోని కోజికోడ్కు చెందిన ట్రక్కు డ్రైవర్ అర్జున్ మూలడికుజియిల్ కూడా ఉన్నాడు. కన్నడిక్కల్కు చెందిన అర్జున్ (30) ట్రక్కులో కలపను ఎక్కించుకుని జగల్పేట నుంచి కోజికోడ్కు వెళ్లాడు. షిరూర్లోని ఓ హోటల్లో టీ తాగేందుకు ఆగి ప్రమాదానికి గురయ్యాడు. కొండచరియలు విరిగిపడటంతో అతనితోపాటు ట్రక్కు కనిపించకుండా పోయాయి.విషయం తెలుసుకున్న అర్జున్ కుటుంబం కేరళ సీఎం పినరయి విజయన్ను సంప్రదించడంతో ఆయన స్పందించి.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. అర్జున్ను కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. అర్జున్ ఆచూకీ కోసం గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ లాంటి వ్యవస్థను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కన్నడ జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసేందుకు కోజికోడ్ కలెక్టర్ స్నేహిల్ కుమార్ సింగ్ను నియమించారు.అర్జున్తోపాటు తప్పిపోయిన మరో ఇద్దరి కోసం గత అయిదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రహదారిపై ఉన్న మట్టిని తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక దళం, ఇండియన్ నేవీ కృషి చేస్తున్నాయని ఉత్తర కన్నడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు. అయితే ఎత్తైన భూఘాగం, భారీ వర్షాలు, పరిసర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటం.. సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. శుక్రవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి శనివారం ఉదయం తిరిగి ప్రారంభించారు.తాము చేరుకోలేని ప్రాంతాలలో శిథిలాల మధ్య, జాతీయ రహదారి పక్కనే ఉన్న నదిలో మృతదేహాలను వెతకడానికి హెలికాప్టర్తో సహాయం చేయమని కోస్ట్ గార్డ్కు లేఖ రాసినట్లు ఉత్తర కన్నడ డిప్యూటీ కమిషనర్ లక్ష్మిప్రియా తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ సహాయం అసాధ్యంగా మారిందని చెప్పారు. కొన్ని రోజులుగా అర్జున్ ఆచూకీ తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అర్జున్ నడుపుతున్న లారీ జీపీఎస్ సిగ్నల్ చివరగా కొండచరియలు విరిగిపడిన ప్రదేశం నుంచే అందుతుందని తెలిపారు.అర్జున్ కోసం ఆశగా..మరోవైపు అర్జున్ ప్రాణాలతో తిరిగి వస్తాడని ఆయన భార్య కృష్ణప్రియ, తండ్రి ప్రేమన్, తల్లి షీలాతో పాటు బంధువులంతా ఆశగా ఎదురు చేస్తున్నారు. అధికారులు ఎలాగైనా తన తప్పుడిని కాపాడాలని, ఏదో అద్భుతం జరుగుతందనే నమ్మకం ఉందని అతడి సోదరి అంజు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అర్జున్ లాంగ్ ట్రిప్లకు వెళ్లిన ప్రతిసారీ మాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. నేను జూలై 16న చివరిసారి అతనితో మాట్లాడాను.మరుసటి రోజు నుండి అతనిని సంప్రదించలేకపోయాను.. శుక్రవారం ఉదయం డయల్ చేసినప్పుడు అర్జున్ రెండో మొబైల్ ఫోన్ రింగ్ అయింది’అని ఆయన భార్య కృష్ణప్రియ తెలిపారు.అయితే ప్రస్తుతం అర్జున్ కుటుంబం ప్రమాదంజరిగిన షిరూర్లో ఉంది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరగడం లేదని ఆరోపించారు. పలు వాహనాలు బురదలో కూరుకుపోయినా అధికారులు కేవలం రెండు ఎర్త్ మూవర్లతో మట్టిని తొలగిస్తున్నారని తెలిపారు. కేరళ సీఎం, మంత్రులు, కేరళ-కర్ణాటక అధికారులు జోక్యం చేసుకోవడంతో నాలుగు రోజుల తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారని చెబుతున్నారు.కాగా కోజికోడ్లోని కినాస్సేరిలో అర్జున్ ఎనిమిదేళ్లుగాముక్కాంకు చెందిన ఓ వ్యాపారి వద్ద లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా అంతర్ రాష్ట్ర పర్యటనలకు వెళ్లేవాడు. అతను కలపను లోడ్ చేయడానికి క్రమం తప్పకుండా బెలగావికి వెళ్లేవాడు, రెండు వారాల తర్వాత తిరిగి వచ్చేవాడు. అయిదుగురు సభ్యుల కుటుంబానికి అర్జున్ ఒక్కడే సంపాదకుడు. -
డేంజరస్ భవేరియా గ్యాంగ్.. చైన్ స్నాచింగ్లపై పోలీసులు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస చైన్ స్నాచింగ్లపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన భవేరియా గ్యాంగ్ ఈ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, భవేరియా గ్యాంగ్ బెంగళూరులో చోరి చేసి వారు హైదరాబాద్కు వచ్చి దొంగతనాలకు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక, వీరిని పట్టుకునేందుకు 30 టీమ్లను ఏర్పాటు చేసినట్టు రాచకొండ, హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కాగా, భవేరియా గ్యాంగ్ సభ్యులు బృందాలుగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, హైదరాబాద్లో చోరిల అనంతరం.. భవేరియా గ్యాంగ్ రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్: కడ్తాల్లోని చికోటి ఫార్మ్హౌస్లో ఫారెస్ట్ అధికారుల తనిఖీలు
-
దివంగత నక్సలైట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదాలు
-
పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..?
మహాముత్తారం: సమాచార వ్యవస్థ విసృతంగా వ్యాపించిన నేపథ్యంలో మావోయిస్టులను టార్గెట్ చేయడం పోలీసులకు సులువుగా మారింది. మావోయిస్టుల్లో అత్యంత ముఖ్యడు గెరిల్లా పోరాటంతోపాటు ఆకస్మిక దాడుల్లో వ్యూహరచన చేసే హిడ్మా కోసం పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల అగ్రనేత ఆర్కే మృతిచెందడం అంత్యక్రియలను తెలంగాణ సరిహద్దులో నిర్వహించినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. హిడ్మా సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఏఓబీ అటవీ ప్రాంతంలో సరైన వైద్య పరీక్షలు లేకపోవడం తెలంగాణ వైపు వచ్చారనే సమాచారం పోలీసులకు అందినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ గోదావరి సరిహద్దు ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తున్నారు. అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరా సహాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మహాముత్తారం పోలీసులు మంగళవారం మండలంలోని నిమ్మగూడెం, పెగడపల్లి, బోర్లగూడెం, కనుకునూర్, రెడ్డిపల్లి ప్రధాన రహాదారుల్లో వాహనాలను తనిఖీ చేపట్టారు. అనంతరం తండాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చివెళ్తున్నారా అనే సమాచారాన్ని నిత్యం సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పోలీసులు మోహరించడం ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ అటవీ గ్రామాల వాసులు భయంభయంగా గడుపుతున్నారు. -
కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. పలువురికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: నంద్నగరిలోని ఓ రెండంతస్తుల భవనం కుప్ప కూలింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని డీఎఫ్ఎస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు. -
ఆపరేషన్ ‘రాయల్ వశిష్ట పున్నమి’
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం : పదుల సంఖ్యలో నిండు ప్రాణాలను బలిగొన్న రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ బోటు కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని గుర్తించి ఆ ప్రాంతాన్ని కంప్యూటరైజ్డ్ మార్కింగ్ చేశారు. ఉత్తరాఖాండ్కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందంలోని ఒక నిపుణుడిని ఆక్సిజన్ సిలెండర్ల సాయంతో బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రదేశానికి పంపించారు. అయితే 40 అడుగులకు వెళ్లేసరికి గోదావరి ఉధృతిని అధిగమించలేని పరిస్థితుల్లో వెనుదిరిగి బయటకు వచ్చేశారు. 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్టుగా గుర్తించిన సోనార్ కెమెరా సహజంగా ఎన్డీఆర్ఎఫ్ వద్ద 10, 20, 40 అడుగులకు వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సిలెండర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ గోదావరి ఉధృతితో పాటు సుడిగుండాలు ఎదురవుతుండటంతో అంతకు మించి లోతుకు వెళ్లే సాహసం చేయలేకపోతున్నామని రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. తమ కెరీర్లో ఇంతటి చాలెంజింగ్తో కూడుకున్న టాస్క్ను మునుపెన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. ముంబైకి చెందిన మెరైన్ మాస్టర్స్ అనే మల్టీనేషనల్స్ కంపెనీ నుంచి గౌర్ బక్సీ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం వచ్చి కచ్చులూరులో పరిస్థితులను అధ్యయనం చేసి వెళ్లింది. బోటును వెలికితీసేందుకు అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక రూట్మ్యాప్ రూపొందించే పనిలో ఉంది. బక్సీ బృందం ముంబై నుంచి శుక్రవారం కచ్చులూరుకు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. అంబులెన్స్లో తమ వారి మృతదేహం ఉందేమోనని చూస్తున్న కుటుంబ సభ్యులు కీలకంగా ఉత్తరాఖాండ్ నివేదిక.. గోదావరి అడుగున ఉన్న బోటును గుర్తించి సోనార్ స్కానర్ కెమెరా తీసిన చిత్రాలను పరిశీలన కోసం ఉత్తరాఖండ్కు పంపించారు. ఆ నివేదిక సైతం శుక్రవారం చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆ నివేదిక బోటు వెలికితీత ఆపరేషన్లో కీలకంగా కనిపిస్తోంది. రంగంలోకి ధర్మాడి బృందం... లోతైన జలాల్లో సంప్రదాయ పద్ధతుల్లో మునిగిపోయిన బోట్లను వెలికితీయడంలో దిట్ట అయిన కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. ముందుగా బోటు మునిగిపోయినట్టు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్ధారించిన కచ్చులూరు మందం వద్ద భారీ లంగరు వేసింది. అయితే దురదృష్టవశాత్తు లంగరు తెగిపోయింది. దీంతో గురువారం మరోసారి ఇదే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవ్వగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ ప్రాంతంలో వర్షం పడటంతో ఆపరేషన్కు అంతరాయం ఏర్పడింది. ధర్మాడి బృందానికి సేఫ్టీ మెజర్స్పై శుక్రవారం క్లియరెన్స్ లభించనుంది. అవి చేతికి వచ్చాక కాకినాడ పోర్టు అధికారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టనుంది. భారీ ఇనుప గొలుసులు సిద్ధం బోటు బరువు 25 టన్నులు ఉన్నప్పటికీ గోదావరిలో ఉన్న సుడిగుండాలతో బోటు బయటకు తీసుకువచ్చేటప్పుడు దాని బరువు రెట్టింపు అయిపోతుందని చెబుతున్నారు. ఇందు కోసమే ముందస్తుగా 100 టన్నుల బరువును అవలీలగా బయటకు తీయగలిగే సామర్థ్యం ఉన్న భారీ ఇనుప తాళ్లను సిద్ధం చేశారు. అలాగే నాలుగు అంగుళాల మందం కలిగిన నైలాన్ తాడు, 22 మిల్లీ మీటర్ల మందం కలిగిన ఇనుప గొలుసు, కాకినాడ పోర్టులో ఓడల్లో ఎగుమతి, దిగుమతులకు వినియోగించే బలమైన తాళ్లు, యాంకర్లు, డీలింక్లను అక్కడికి చేర్చారు. వెలికి తీసే ప్రక్రియ ఇలా... బోటును వెలికితీసేందుకు రంగంలోకి దిగే ధర్మాడి బృందం తొలుత ఇనుప తాళ్లకు యాంకర్లను కడుతుంది. ఆ తాళ్లను బోటు ఉన్నదని నిర్థారించిన ప్రాంతంలో వలలా గోదావరిలోకి విడిచిపెడతారు. 214 అడుగుల దిగువున ఉన్న బోటుకు యాంకర్లు తగిలిన వెంటనే భారీ క్రేన్ల ద్వారా బోటును బయటకు లాగుతారు. ఇందుకోసం కొంత శ్రమ అయినా కచ్చులూరు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపైకి క్రేన్లను తీసుకువస్తున్నారు. -
వాయుసేన విమానం గల్లంతు.. ముమ్మరంగా గాలింపు
ఈటానగర్ : 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. అస్సాం లోని జొర్హాత్ నుంచి సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్ప్రదేశ్లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని, ఆర్మీ అధికారులు తెలిపారు. తప్పిపోయిన విమానాన్ని గుర్తించేందుకు ఆర్మీతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలతో సమన్వయంతో గాలింపుచర్యలు చేపట్టినా మంగళవారం ఉదయం వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. 2009 జూన్ నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే అరుణాచల్లో జరిగింది. ఏఎన్–32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్పైన ఆ విమానం కూలిపోయింది. -
వాయుసేన విమానం గల్లంతు
ఈటానగర్/న్యూఢిల్లీ: 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఏఎన్32 రకం విమానం గాలిలోకి ఎగిరిన 33 నిమిషాల అనంతరం గల్లంతైంది. అస్సాం లోని జొర్హాత్ నుంచి మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్ప్రదేశ్లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఐఏఎఫ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘కొన్నిచోట్ల విమానం కూలిపోయి ఉండొచ్చని మాకు సమాచారం రావడంతో అక్కడంతా గాలించాం. కానీ ఏఎన్–32 విమానం కానీ, దాని శకలాలు కానీ ఎక్కడా కనిపించలేదు. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు’ అని తెలిపింది. తప్పిపోయిన విమానాన్ని గుర్తించేందుకు ఆర్మీతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలతో సమన్వయంతో పనిచేస్తున్నామని వాయుసేన వెల్లడించింది. రాత్రంతా గాలింపును కొనసాగిస్తామంది. విమానం గల్లంతైన ఘటనకు సంబంధించి ఐఏఎఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ బహదూరియాతో తాను మాట్లాడినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తెలిపారు. 2009 జూన్ నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే అరుణాచల్లో జరిగింది. ఏఎన్–32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్పైన ఆ విమానం కూలిపోయింది. -
కానరాని చిన్నారుల ఆచూకీ.. రెండవ రోజుకి గాలింపు చర్యలు
సాక్షి, రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రెండు రోజులు కావస్తున్నా గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన ఆ ఆరుగురు బాలికల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకోసం మూడంచెల గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్ ఆపరేషన్లో 15టీములు పాల్గొన్నాయి. ఈ సహాయక చర్యల్లో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు నేవి హెలికాఫ్టర్తో అధికారుల సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు నిన్న రాత్రి గాలింపు చర్యల్లో లభ్యమైన గల్లా నాగమణి మృతదేహాన్ని స్వగ్రామం షేర్లంకకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోంది తూర్పుగోదావరి : గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్కు పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోందని జిలా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఈ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం 15టీములు పాల్గొన్నాయన్నారు. వర్షం లేకపోవటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. -
ప్రాణాలతో చెలగాటం
కొవ్వూరు: మనిషి ప్రాణాలు నిలబెట్టే ఔషధ విక్రయ కేంద్రాల నిర్వహణలో నిబంధనలకు పాతరేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నడుపుతున్నారు. అద్దె సర్టిఫికెట్స్పై అమ్మకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు. కొన్ని దుకాణాల్లో అడ్డుఅదుపు లేకుండా కాలం చెల్లిన ఔషధాల విక్రయాలు సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. స్టాకు రిజిస్టర్లు లేకుండానే లావాదేవీలు నడుస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నప్పటికీ ఔషధ తనిఖీ అధికారులకు పట్టడం లేదు. అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 వరకు మెడికల్ షాపులున్నాయి. 450 హోల్సేల్ దుకాణాలున్నాయి. 14 బ్లడ్బ్యాంక్లు, మూడు బ్లడ్ స్టోరేజ్ కేంద్రాలు, మూడు మందుల తయారీ కంపెనీలు న్నాయి. ఫార్మసిస్టులు లేకపోవడం మూలంగా ఏ మందులో ఏఏ పదార్థాల మిశ్రమం ఏమిటి అనే దానిలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఏ రోగానికి ఏ మందులు వాడతారు. ఏవిధంగా వినియోగించాలన్నదీ తెలియాలంటే ప్రతి మెడికల్ షాపుల్లోను ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఉండాలి. ఒక ఔషధానికి బదులు మరో ఔషధం ఇస్తే ప్రాణాలకే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఫార్మసిస్టులు లేకుండానే నిత్యం వందల కోట్ల మెడిసిన్స్ వ్యాపారం సాగుతోంది. నెలవారీగా మూమూళ్లు దుకాణదారుల నుంచి నెలవారీ మామూళ్లు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్కో షాపు నుంచి నెలకి రూ.500 చొప్పున ఏడాదికి ఒక్కో షాపు ద్వారా రూ.6 వేలు మామూళ్లు ముట్టజెప్పుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులను ఔషధ తనిఖీ అధికారులు మధ్యవర్తులుగా ఉంచుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి మామూళ్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లావ్యాప్తంగా 2,500 దుకణాలున్నాయి. వీటి ద్వారా ఈ విధంగా లెక్కలు వేస్తే సుమారు నెలకి రూ.12.50 లక్షల వరకు మామూళ్లు ముడుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పంచుకుంటారని చెబుతున్నారు. మొక్కుబడిగా తనిఖీలు ప్రస్తుతం జిల్లాలో మెడికల్ దుకాణాల తనిఖీ అంతా మొక్కుబడి తంతుగానే సాగుతుంది. జిల్లాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు తణుకు, కొవ్వూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఏలూరులో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలున్నాయి. వీరిలో ప్రస్తుతం భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఒక్కో ఇన్స్పెక్టర్ నెలకి నలభై దుకాణాలు తనిఖీలు, ఐదు శాంపిల్స్ సేకరించాల్సి ఉంటుంది. రెండు శాంపిల్స్ ప్రభుత్వ పీహెచ్సీలు, సీహెచ్సీలు, కమ్యూనిటీ ఆసుపత్రుల నుంచి మూడు ట్రేడర్స్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. శాంపిల్స్ నివేదికలు అందిన తర్వాత సంబంధిత కంపెనీలు, వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారు. చాలా చోట్ల మెడికల్ దుకాణాల్లో ఫార్మసిస్టులే ఉండటం లేదు. వాస్తవంగా వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్కి అనుగుణంగా మందులు విక్రయాలు చేయాలి. కొనుగోలుదారులకు బిల్లు ఇవ్వాలి. కొన్ని దుకాణాల్లో నకిలీ మందులు, నాసిరకం మందులు విక్రయాలు సాగిస్తున్నప్పటికీ మొక్కుబడి తంతుగానే తనిఖీ చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం మందులను, ఫిజీషియన్ శాంపిల్స్ను చిల్లర విక్రయాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. మందుల షీట్పై ముద్రించిన తేదీని వాళ్ల వద్ద ఉంచుకుని రెండో వైపు కత్తిరించి ఇవ్వడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇటువంటి సందర్భాలు జిల్లాలో కోకొల్లలు. -
డేరా సోదాలు.. అప్ డేట్స్
సాక్షి, సిర్సా: భారీ భద్రత నడుమ సిర్సా సత్నాం చౌక్లోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆశ్రమంలో సోదాలు ముగిసేదాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. విశ్రాంత న్యాయమూర్తి ఏకేఎస్ పన్వార్ నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వచ్చే వాదన నాటికి ఓ సీల్డ్ కవర్లో పూర్తి నివేదిక సమర్పించాలని పన్వార్ను ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది. ఉదయం 10.45 నుంచి కీలక ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించిన భద్రతా దళాలు అనుమానిత వస్తువులన్నింటిని సీజ్ చేశారు. ఉదయం 11 గంటలకు... గుర్మీత్ నివాస స్థానంగా(గుఫా) చెప్పుకునే గుహాలోని సోదా టీమ్లు పెద్ద ఎత్తున్న ప్రవేశించాయి. రహస్య స్థలంగా పలువురు చెబుతున్న ఇందులోనే గుర్మీత్ అరాచకాలకు పాల్పడినట్లు పలువురు చెబుతున్నారు. డేరా బాబాతోపాటు అతనికి బాగా సానిహిత్యంగా ఉండేవాళ్లకు మాత్రమే ఇందులో ప్రవేశం ఉంటుందంట. 18 ఏళ్ల క్రితం ఇద్దరి మహిళలను ఇందులోనే అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వినిపించాయి. అయితే డేరా ప్రతినిధులు మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ సోదాలు నిర్వహించుకోవాలంటూ ఆహ్వానించింది. ఉదయం 11.20... డిప్యూటీ డైరెక్టర సతీశ్ మెహ్రా డేరా పరిసర ప్రాంతాల్లో కొన్ని కంప్యూటర్లను, హర్డ్ డిస్క్లను , కొంత నగదును స్వాధీనపరుచుకున్నట్లు పకటించారు. అయితే వాటిలో ఎలాంటి సమాచారం ఉందన్న విషయం మాత్రం ఆయన వెల్లడించలేదు. కొన్ని గదులను సీజ్ చేసినట్లు తెలిపిన ఆయన రూకీ నుంచి ఫోరెన్సిక్ టీంలను పిలిపించినట్లు తెలిపారు. ఉదయం 11.30... ఓవైపు సోదాలు కొనసాగుతుండగానే అరెస్ట్ల పై పోలీస్ అధికారి ఒకరు ప్రకటన చేశారు. గుర్మీత్ అరెస్ట్ తర్వాత చెలరేగిన అల్లర్లలో బథిండా, పటియాలా జిల్లాల వ్యాప్తంగా 180 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా కేసులకు సంబంధించి 50 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. ఉదయం 11:40... నామ్చర్చ ఘర్లోకి అధికారులు ప్రవేశించి తనీఖీలు నిర్వహించారు. గతంలో వీటిల్లోనే కొన్ని అనుమానిత వస్తువులను అధికారులు స్వాధీనపరుచుకున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ప్రకటించారు. ఉదయం 12... డేరాలోకి అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అందులోకి అన్ని వైపులా భద్రతా దళాలు లోపలికి ప్రవేశించాయి. ప్రతీ 100 మీటర్లకు ఓ చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలను లోపలికి అనుమతించటం లేదు. ముఖ్యంగా వాహానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి పంపుతున్నారు. వీటిలోపాటు డేరాకు చెందిన పరిశ్రమల వద్ద భారీగా సెక్యూరిటీ మోహరించారు. మధ్యాహ్నాం 12.30... హోంసెక్సువల్స్ను వ్యాధిగా పేర్కుంటూ చికిత్స పేరుతో వారిని ఉంచే స్థలంలో సోదాలు చేస్తున్నారు. అయితే తన భక్తులుగా చేరే వారిని వ్యంధ్యత్వం ప్రసాదించే డేరా బాబా ఇలా హోమోసెక్సువల్స్ను అక్కున్న చేర్చుకోవటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంట... మొబైల్ ఇంటర్నెట్ సర్వీస్లను సెప్టెంబర్ 10 అర్థరాత్రి 12 గంటల దాకా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క వాయల్స్ కాల్స్ను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నాం 1.30 నిమిషాలకు.. డేరాలో బయటపడ్డ గుర్మీత్ ప్లాస్టిక్ కరెన్సీ(కాయిన్లను) మీడియాకు అధికారులు చూపించారు. ప్రస్తుతం తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 2.05 నిమిషాలకు... లేబుల్ లేని మందులు, ఓబీ వ్యాన్, నంబర్ ప్లేట్ లేని ఓ లెక్సస్ కారును బయటపడినట్లు డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మెహ్రా తెలిపారు. -
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
-
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
సాక్షి, సిర్సా: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తుండగా, అతని అక్రమాలకు సంబంధించి రోజుకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందంటూ ఓ పిటిషన్ దాఖలు కావటంతో ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించింది. దీంతో శుక్రవారం సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు చేపడుతున్నాయి. ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుకాగా సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు, నాలుగు ఆర్మీ దళాలు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక స్వాట్ టీం, ఒక డాగ స్క్వాడ్ పాల్గొంటున్నాయి. ఉన్నతాధికారులు నేతృత్వంలో ఓవైపు డేరాను మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతుండగా.. నేటి సోదాలతో చుట్టుపక్కల జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డేరా అనుచరులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్తి పంజరాలు బయటపడ్డాయన్న విషయాన్ని డేరా వర్గాలు కూడా ధృవీకరించటంతో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఫెర్టిలిటీ ఆస్పత్రిపై ఐటీ దాడులు
-
ఉగ్రవేటను నిలిపివేసిన నేవీ
ఉగ్ర అనుమానితుల కోసం నేవీ చేపట్టిన వెతుకులాటను శుక్రవారం సాయంత్రం నిలిపివేసింది. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా నవీ ముంబైలోని ఓ నేవల్ బేస్కు సమీపంలో తిరుగుతుండగా తాము చూశామని కొంతమంది విద్యార్థులు గురువారంచెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్న 91 ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఎన్ఎస్ జీ కమాండోలను కూడా రంగంలోకి దించిన నేవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ ను నిలిపివేశారు. వెతుకులాటను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంపై నేవీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
పంజాబ్లో మళ్లీ కలకలం!
చండీగఢ్: పంజాబ్ లోని ఫిరోజ్పుర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల సంచారం మంగళవారం కలకలం సృష్టించింది. పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ బేసిన్లో ఇటీవలే పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ విషయం అందరికీ విదితమే. మళ్లీ కొన్ని రోజుల్లోనే ఆర్మీ దుస్తువుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు గుర్దాస్పుర్ లోని టిబ్రి ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిరోజ్పుర్ పాకిస్థాన్కు సరిహద్దుగా ఉన్న జిల్లా. గుర్దాస్పుర్ నుంచి ఫిరోజ్పుర్ కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఉగ్రవాద చర్యలు జరగకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని అనుమానాస్పద వ్యక్తులున్న భవనాన్ని చుట్టుముట్టారు. ఫిరోజ్పుర్లో హైఅలర్ట్ పరిస్థితి నెలకొంది. ప్రత్యేక బలగాలను, అదనపు పోలీసు సిబ్బందిని అక్కడికి తరలించినట్లు సమాచారం. ఆర్మీ సిబ్బంది ప్రస్తుతం ఆ భవనం సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిరోజ్పుర్తో పాటు గుర్దాస్పుర్ జిల్లాలోనూ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. చెరకు పంట పొలాల్లో, సమీప గ్రామాల్లో పోలీసులు, ప్రత్యేక బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుర్దాస్పుర్ స్థానికుడు ఇద్దరు ఆర్మీ దుస్తువులు ధరించిన ఇద్దరిని చూసినట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆర్మీ దుస్తువుల్లో వచ్చి పఠాన్కోట్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది మృతిచెందడంతో పాటు 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. -
కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఉగ్రవాద దాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అయితే, ఇంకా ఎక్కడైనా ఉగ్రవాదులు నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో దీనానగర్, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. గురుదాస్పూర్ జిల్లా మొత్తం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం పది గంటల పాటు కొనసాగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 9 మంది మరణించారు. మృతుల్లో పంజాబ్ డిటెక్టివ్ విభాగం ఎస్పీ బల్జీత్ సింగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. కాగా, గురుదాస్పూర్ ఎదురుకాల్పుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సాయంత్రం జాతీయ భద్రతా సలహాదారుతోను, కేంద్ర హోం శాఖ కార్యదర్శితోను సమావేశం కానున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఇక ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం నాడు రాజ్నాథ్ సింగ్ ఓ ప్రకటన చేయనున్నారు. -
'తూర్పు' ఏజెన్సీలో సీఆర్పీఎఫ్ తనిఖీలు
తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చీడిపాలెంలో బుధవారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఘటన జిల్లా సరిహద్దునే చోటుచేసుకోవటంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డతీగల, వై.రామవరం ప్రధాన రహదారిలో చిన్న వంతెనలు, అనుమానాస్పద ప్రదేశాల్లో జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు సరిహద్దు దాటి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
హైదరాబాద్లో మరోసారి కార్డ్ఆన్ సెర్చ్
-
ఎం హెచ్ 370 అన్వేషణ: నీకెంత, నాకెంత?
మలేషియన్ విమానం ఎం హెచ్ 370 సముద్రంలో కుప్పకూలి మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ దాని శకలాలు, అందులోని శవాలను కనుగొనడంలో ప్రపంచ దేశాలు విఫలం అయ్యాయి. ఇప్పటికే మిలియన్ల డాలర్లను సముద్రం పాలు చేసి దేశదేశాలు అన్వేషణ కొనసాగించాయి. ఇంకా కొనసాగాల్సి ఉంది. కాసింత విరామం ఇచ్చినా త్వరలోనే పని మొదలవుతుంది. అయితే దీని ఖర్చులు ఎవరెవరు ఎంతెంత భరించాలన్నదే అన్వేషణలో ఉన్న దేశాల ముందున్న సమస్య. మార్చి ఎనిమిదన 239 మంది ప్రయాణికులతో జాడతెలియకుండా పోయిన విమానం మలేషియాది. కాబట్టి మలేషియా అన్వేషణలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు ఎక్కువగా చైనాదేశస్థులు. కాబట్టి చైనా కూడా అన్వేషణలో చురుకుగా పాల్గొంటోంది. ఇక ప్రమాదం జరిగిన చోటు ఆస్ట్రేలియాకి చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మొత్తం అన్వేషణకు ఆస్ట్రేలియాయే నేతృత్వం వహిస్తోంది. వచ్చే ఏడాది జులై వరకూ అన్వేషణ కొనసాగించేందుకు ఈ దేశాలన్నీ కలిసి ప్రణాళికను రూపొందించాయి. దీనికి మొత్తం 84 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఎవరెలా పంచుకోవాలన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. అన్వేషణ కొనసాగించడంలో వెనుకాడే ప్రసక్తే లేదని, అయితే భారాన్ని ఎవరెలా పంచుకుంటారన్నది కూడా ముఖ్యమని ఆస్ట్రేలియన్ అధికారులు అంటున్నారు. అందుకే లెక్కలు తే్ల్చేందుకు అన్వేషణలో పాలుపంచుకుంటున్న దేశాలు త్వరలో సమావేశం కానున్నాయి. -
ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి. 'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది. -
నెల రోజులు దాటినా.. దొరకని విమానం
మలేషియా విమానం అదృశ్యమై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ దాని ఆచూకీ దొరకట్లేదు. ఎప్పుడో మార్చి 8వ తేదీన కనపడకుండా పోయిన ఈ విమానం కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 11 సైనిక విమానాలు, మూడు పౌర విమానాలు, 14 నౌకలతో మంగళవారం కూడా ఎంహెచ్370 విమానం కోసం గాలిస్తున్నట్లు అంతర్జాతీయ గాలింపు బృందాలతో ఏర్పాటైన జేఏసీసీ తెలిపింది. దాదాపు 77,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గాలింపు సాగుతోంది. ఆస్ట్రేలియన్ నౌక ఓషన్ షీల్డ్ సాయంతో ఉత్తరం వైపు జల గర్భంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, దక్షిణం వైపు చైనాకు చెందిన హైసున్ 01, బ్రిటిష్ నౌక హెచ్ఎంఎస్ ఇకో గాలిస్తున్నాయి. విమానం బ్లాక్ బాక్స్ నుంచి వస్తున్న సిగ్నళ్లను గత వారాంతంలో హౌసున్ 01, ఓషన్ షీల్డ్ నౌకలు గుర్తించాయి. అయితే, ఇవి ఎంహెచ్ 370కి సంబంధించినవేనా, కావా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.