srivari temple
-
శ్రీవారి వాకిలి.. బంగారు లోగిలి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి అంతరాలయం స్వర్ణ శోభితమైంది. స్వామివారి భక్తులకు కనువిందు చేస్తోంది. స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న వాకిలి నుంచి చిన వెంకన్నను దర్శించుకుంటున్న భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. శని, ఆదివారాలు, భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాతల సహకారంతో దేవస్థానం ఇప్పటికే స్వామివారి వాకిలిని దాదాపుగా స్వర్ణ మయం చేశారు.అందులో భాగంగా జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ 2021 లో రూ.98,31,693 వ్యయంతో, 264 గ్రాముల 647 మిల్లీ గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం (ఎలక్ట్రో గోల్డ్ ప్లేటింగ్) చేయించారు. వీటిని అదే సంవత్సరం జనవరి 10న అప్పటి రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు.కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, బొమ్ములూరుకు చెందిన దీపక్ నెక్స్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు రూ.1,64,19,411తో స్వామి అంతరాలయానికి బంగారు తాపడాన్ని చేయించారు. దీన్ని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ఈ ఏడాది అక్టోబర్ 4న ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, దాతలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. త్వరలో స్తంభాలకు బంగారు పూత అంతరాలయం ముందు పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు ఎదురుగా ఉన్న స్తంభాలకు ఇదే తరహాలో గోల్డ్ కోటెడ్ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో ఒక దాత సహాయంతో పనులు ప్రారంభించనున్నారని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే విమాన గోపుర స్వర్ణమయ పథకం ద్వారా భక్తుల నుంచి దేవస్థానం విరాళాలను సేకరిస్తోంది. విమాన గోపురాన్ని సైతం స్వర్ణమయం చేస్తే చినవెంకన్న ఆలయాన్ని చూడడానికి రెండు కనులు చాలవనే చెప్పొచ్చు. -
రేపు శ్రీవారి నడక మార్గం మూసివేత
సాక్షి, తిరుపతి: భారీ వర్షాలు కారణంగా టీటీడీ ముందస్తు చర్యలు చేపట్టింది. రేపు(గురువారం) శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేతకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. తిరుపతిలో రెండు రోజులుగా కురుస్తున్న బారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ మూసివేసింది. పాప వినాశనం, శ్రీవారి పాదాల వద్దకు భక్తులకు అనుమతిని టీటీడీ అధికారులు రద్దు చేశారు.కాగా, అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. కాలువు ఉప్పొంగుతున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందని, రోడ్లు మునిగిపోయాయని పెద్దసంఖ్యలో కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా కొరమేనుగుంట, గొల్లవానికుంట, జీవకోన, కొత్తపల్లె, కట్టకిందూరు. లక్ష్మీపురంతో పాటు కపిలతీర్థం, మాల్వాడీగుండం, పేరూరు నుంచి నగరంలోకి ప్రవేశించి నీటి పోటు అధికంగా ఉన్న ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే లీలా మహల్ సర్కిల్ నుంచి కరకంబాడి వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.ఇదీ చదవండి: నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం -
వైభవంగా శ్రీవారి చక్రస్నానం .. కోనేటిలో భక్తుల స్నానాలు
-
భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్... శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ► ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ► ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
Tirumala: నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం.. అర్జిత సేవలు రద్దు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు. ఇక ఆదివారం 80,964 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 27,657 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు లెక్క తేలింది. నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన నేడు మంగళవారం (జనవరి 16న) అత్యంత ఘనంగా జరగనుంది. ఇదే రోజు గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు. ఆనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఆర్జితసేవలు రద్దు : ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
28న శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయాన్ని పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న(శనివారం) మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉండగా.. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. -
తిరుమలలో నేడు గరుడ వాహన సేవ
-
తిరుమల ఉద్యానవనాల నుంచి శ్రీవారి కైంకర్య పుష్పాలు
-
మార్చిలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల: మార్చి 3 నుంచి 7 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. 3న శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో 3 చుట్లు తిరిగి భక్తులను కటాక్షిస్తారు. 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో 3 సార్లు విహరిస్తారు. 5న శ్రీభూ సమేతంగా స్వామివారు 3 సార్లు, 6న 5 సార్లు, 7న 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు. ఈ కారణంగా ఆయా తేదీల్లో జరగనున్న ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది. కాగా, తిరుమలలో మార్చిలో జరిగే విశేష ఉత్సవాలను టీటీడీ ఆదివారం ప్రకటించింది. 3న శ్రీకులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 7న కుమారధార తీర్థ ముక్కోటి, 18న శ్రీఅన్నమాచార్య వర్ధంతి, 22న ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, 30న శ్రీరామనవమి ఆస్థానం, 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. సర్వ దర్శనానికి 24 గంటలు తిరుమలలోని క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 76,736 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.3.63 కోట్లు వేశారు. టైం స్లాట్ టోకెన్లు ఉన్నవారికి సకాలంలో, దర్శన టికెట్లు లేనివారికి 24 గంటల్లో, ఎస్ఈడీ టికెట్లు ఉన్నవారికి 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
నూతన పరకామణి భవనంలో లెక్కింపు ప్రారంభం
తిరుమల: శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. నూతన పరకామణి భవనంలో ఆయన పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ సహకారంతో నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుమల పెద్దజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఆదివారం ఉదయం 5.30 గంటలకు శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్ సహాయంతో లారీలో తరలించినట్లు చెప్పారు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరుకుంటాయన్నారు. త్వరలో ఆలయంలోని పరకామణి మండపాన్ని భక్తులు కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దుతామన్నారు. -
శ్రీవారికి రికార్డు స్థాయిలో కానుకలు
తిరుమల: శ్రీవారికి గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి. జనవరి 1న రూ.7.68 కోట్లు కానుకల ద్వారా లభించినట్లు టీటీడీ తెలిపింది. జనవరి 1న భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం రాత్రి వరకు లెక్కించారు. శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 5 నుంచి 6 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవాన్ని చేపట్టారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. త్వరితగతిన శ్రీవారి దర్శనం తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నా నిర్ణీత సమయంలో కేటాయించిన టైమ్ స్లాట్ టికెట్లు పొందిన భక్తులకు త్వరితగతిన దర్శనం లభిస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకొని అన్ని సిఫార్సు లేఖలపై జారీచేసే దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, శ్రీవారిని మంగళవారం టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నాయకుడు దేవినేని అవినాష్ దర్శించుకున్నారు. -
శ్రీవారికి తిరుప్పావై నివేదన
తిరుమల/తిరుపతి కల్చరల్: ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు. జనవరి 14వ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది. పవిత్ర ధనుర్మాసం సందర్భంగా పెద్దజీయర్ మఠంలో తిరుప్పావై పారాయణం ప్రారంభమైంది. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి పాల్గొన్నారు. వేదాల సారమే తిరుప్పావై వేదాల సారమే తిరుప్పావై అని తిరుమల చిన్నజీయర్స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం ప్రవచన కర్త చక్రవర్తి రంగనాథన్స్వామి ధనుర్మాసం గురించి వివరించారు. శ్వేత డైరెక్టర్ ప్రశాంతి, హెచ్డీపీపీ ఏఈవో సత్యనారాయణ, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రోగ్రాం అధికారి పురుషోత్తం పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు ఒకటి నిండింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 48,928 మంది స్వామి వారిని దర్శించుకోగా, 23,322 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. శ్రీవారి దర్శన టోకెన్లు లేని భక్తులకు 14 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. -
8న 11 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: చంద్ర గ్రహణం కారణంగా నవంబర్ 8న ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా 8న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో 7న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా 8న శ్రీవాణి,రూ.300 దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి సర్వదర్శనానికి అనుమతిస్తారు. భక్తజనరంజకంగా ‘బాలకాండ’ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం 13వ విడత బాలకాండ అఖండ పారాయణం జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల సమక్షంలో బాలకాండలోని 61 నుంచి 65 సర్గల వరకు ఉన్న 137 శ్లోకాలను, యోగవాసిష్టం– ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలనూ పారాయణం చేశారు. వేద పండితులు అఖండ పారాయణం చేయగా పలువురు భక్తులు వారిని అనుసరించి శ్లోక పారాయణం చేశారు. సర్వ దర్శనానికి 38 గంటలు తిరుమలలో 31 క్యూ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. సర్వదర్శనానికి 38 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 82,604 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 37,025 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.57 కోట్లు వేశారు. శ్రీవారి సేవలో ప్రముఖులు శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వరరావు, తెలంగాణ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఏపీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సతీమణి లక్ష్మి రవి దర్శించుకున్నారు. -
తిరుమల లో పెరిగిన భక్తుల రద్దీ
-
స్వర్ణరథం పై భక్తులకు దర్శనమిస్తున్న స్వామి వారు
-
Tirumala: ఆనంద నిలయ విమాన విశిష్టత
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువుండే నెలవు ఆనంద నిలయం. తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి ఉన్న ప్రదేశమే ఆనంద నిలయం. గర్భాలయమైన ఆనంద నిలయంపై నిర్మించిన బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానంగా పేరుపొందింది. ఈ విమాన నిర్మాణానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి బంగారు గోపురం మూడంతస్తులుగా ఉంటుంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలోను, మూడోది వర్తులాకారంలోను ఉంటాయి. ఏకశిలపై నిర్మితమైన ఆనంద నిలయ గోపురం ఎత్తు ముప్పయ్యేడు అడుగుల ఎనిమిది అంగుళాలు. గోపురం కింద ఉండే ప్రాకారం ఎత్తు ఇరవయ్యేడు అడుగుల నాలుగు అంగుళాలు. నేలపై నుంచి బంగారు కలశం వరకు ఆనంద నిలయ విమానం ఎత్తు అరవై ఐదు అడుగుల రెండంగుళాలు. మొదటి అంతస్తు పదిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి బొమ్మలూ ఉండవు. ఇందులో లతలు, మకర తోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఉంటాయి. రెండో అంతస్తు ఎత్తు పదడుగుల తొమ్మిది అంగుళాలు. ఇందులో నలభై బొమ్మలు ఉంటాయి. మకర తోరణంతో పాటు వరాహస్వామి, నరసింహస్వామి, వైకుంఠనాథుడు తదితర విష్ణు రూపాలు, జయవిజయులు, గరుడ, విష్వక్సేన, అనంత, ఆంజనేయ, మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. ఇందులో ఉత్తరంవైపు శ్రీవేంకటేశ్వరుడు విమాన వేంకటేశ్వరుడిగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలం విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా లభిస్తుందని భక్తుల విశ్వాసం. (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) గోపురం చివర వర్తులాకారంలో ఉండే అంతస్తు పదహారడుగుల మూడంగుళాల ఎత్తులో ఉంటుంది. ఇందులో మహాపద్మంతో పాటు ఇరవై బొమ్మలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లోను, నాలుగు మూలల్లోను ఎనిమిది సింహాలు ఉంటాయి. గోపుర కలశానికి ఆనుకుని ఉండే మహాపద్మంలో చిలుకలు, లతలు, హంసలు వంటి చిత్రాలు కనువిందు చేస్తాయి. శ్రీవారి గర్భగుడి నుంచి మలయప్పస్వామి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు విమాన ప్రదక్షిణ చేస్తూ బయటకు వెళతారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించే ఏ పూజాద్రవ్యమైనా, తోమాలసేవలో సమర్పించే పుష్పాలనైనా, అభిషేకానికి సమర్పించే ఆకాశగంగ తీర్థాన్నైనా విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళతారు. (క్లిక్ చేయండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
-
శోభాయమానంగా వసంతోత్సవాలు
తిరుమల: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వేడుకల కోసం మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా మండపం కనువిందు చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత భక్తులకు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం లభించింది. వసంతోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామిని మాడ వీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి తోడ్కొని వచ్చారు. ఉదయం ఆస్థానం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జీయర్ స్వాములు, ఏఈవో ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. నేడు స్వర్ణరథోత్సవం వసంతోత్సవాల్లో నేడు ఉదయం మలయప్పస్వామి స్వర్ణరథంపై మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. -
మార్చిలో 14 లక్షల దర్శన టికెట్లు
తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్: కోవిడ్ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఆంక్షల నడుమ దర్శనాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయడం, వైరస్ తగ్గుముఖం పట్టడంతో టీటీడీ మరింతమంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి నెలలో దాదాపు 14 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) కల్పించేందుకు టికెట్లు జారీచేయనుంది. మార్చిలో రోజుకు 25 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు (బుధవారం) ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్లైన్ పద్ధతిలో కేటాయించనుంది. రేపటి నుంచి ఈనెల 28 వరకు అదనపు కోటా ఈనెల 24 (గురువారం) నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం ఆన్లైన్లో ఉంచనుంది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు ఐదువేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లోని కౌంటర్ల వద్ద ఇవ్వనుంది. మార్చి 10న విదేశీ నాణేల ఈ–వేలం తిరుమల శ్రీవారికి భక్తులు కానుకగా సమర్పించిన యూఎస్ఏ, మలేసియా దేశాలకు చెందిన నాణేలను మార్చి 10వ తేదీన ఈ–వేలం వేయనున్నట్లు టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా మలేసియా నాణేలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, యూఎస్ఏ నాణేలను మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ–వేలం వేయనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ (వేలం) కార్యాలయాన్ని 0877–2264429 నంబరులో సంప్రదించాలని, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కేఓఎన్యూజీఓఎల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్ / డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏ.ఓఆర్జీ వెబ్సైట్లలో చూడాలని కోరింది. -
15 తర్వాత ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు
తిరుమల: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్లైన్లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు అనుమతి మేరకు ఈ నెల 15వ తేదీ తర్వాత ఆఫ్లైన్లో రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆన్లైన్లోనూ రోజుకు 10 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవల అనుమతికి సంబంధించి ఈ నెల 17న జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ల జారీకి సంబంధించి వెబ్ పోర్టల్ సిద్ధమైందన్నారు. టీటీడీ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళం అందించిన దాతలకు ప్రివిలేజ్ కింద శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్లను జారీ చేస్తామన్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం 9.30 నుంచి భక్తులు టీటీడీ వెబ్సైట్ నుంచి శ్రీవారి ఉదయాస్తమాన సేవాటికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్వీబీసీలో ప్రచారం చేస్తున్నామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
-
శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుమల/తిరుపతి ఎడ్యుకేషన్: శ్రీవారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ అంకురార్పణ జరిగింది. అర్చకులకు బాధ్యతల కేటాయింపు చేసే ప్రక్రియలో భాగంగా ఉదయం శ్రీవారి మూలవిరాట్ ఎదుట ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానివ్వకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీవ్రతం, కృష్ణాష్టమి వేడుకలు శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రావణ పౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి వేడుకలను టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల సమన్వయ సహకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో మంగళవారం అన్ని ప్రాజెక్టుల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కో–ఆర్డినేటర్ల శిక్షణకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్డీపీపీ) అధికారులను ధర్మారెడ్డి ఆదేశించారు. సప్తగిరి మాస పత్రికలో చక్కటి కంటెంట్, శీర్షికలు ప్రచురించాలని సూచించారు. రెండేళ్లలో 1,000 అన్నమాచార్య సంకీర్తనలను స్వరపరచి ప్రజలకు అందించాలని, దీనికోసం స్వరకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సూచించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా కన్నడ భాషలో సంకీర్తనలు స్వరపరచడానికి స్వరకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
తిరుమల : ఘనంగా చక్రస్నాన మహోత్సవం
-
నేడు తిరుమలలో పున్నమి గరుడ సేవ
సాక్షి, తిరుమల: తిరుమలలో ప్రతినెలా జరిగే పున్నమి గరుడసేవ గురువారం సాయంత్రం జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలో కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా ఈ నెలలో స్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా గురువారం, అక్టోబరు 31న, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడసేవ నిర్వహిస్తారు. -
నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 2.5 లక్షలు
తిరుమల: లాక్డౌన్ సడలించిన అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభమైన జూన్ 11వ తేదీ నుంచి జూలై 10 వరకు 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 4 శ్రీవారి దర్శనం కోసం జూన్ 11 నుంచి జూలై 10 మధ్య ఆన్లైన్Œ ద్వారా 2,02,346 మంది భక్తులు టికెట్లు బుక్ చేసుకోగా 1,64,742 మంది స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని కౌంటర్ల ద్వారా 97,216 మంది భక్తులు దర్శన టోకెన్లు తీసుకోగా అందులో 85,434 మంది దర్శనానికి వచ్చారు. 4 నెల రోజుల్లో హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు లభించింది. 13.36 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 4 మొత్తం 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 4 జూలై 10వ తేదీ వరకు తిరుమలలో 1,865 మంది టీటీడీ ఉద్యోగులకు, అలిపిరి వద్ద 1,704 మంది టీటీడీ ఉద్యోగులకు, 631 మంది భక్తులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. టీటీడీ ఉద్యోగుల్లో 91 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. -
తిరుమలలో ఘనంగా శ్రీవారి తెప్పోత్సవం
-
సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం
తిరుమల /కాంచీపురం: సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం పేర్కొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 వీఐపీ బ్రేక్ దర్శనం విధానాన్ని రద్దుచేసేందుకు ఈఓ, జేఈఓలతో కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసి వీలైతే వెంటనే వీఐపీ బ్రేక్లను రద్దుచేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి పూర్తిస్థాయిలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తామన్నారు. సామాన్య భక్తులకు దివ్యదర్శనం త్వరగా అందేలా ప్రొటోకాల్ దర్శనం, వీఐపీ దర్శనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అర్చన అనంతరం దర్శనం (ఏఏడీ) మళ్లీ అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు హైదరాబాద్ రాజధాని కాబట్టి అప్పట్లో టీటీడీకి సంబంధించిన కార్యాలయం ఉందన్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి కాబట్టిæ అక్కడ నూతన కార్యాలయం ఏర్పాటు చేస్తే ఏవైనా సమస్యలు ఉంటే అక్కడ ఉన్న అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి సులభంగా తీసుకురావొచ్చన్నారు. తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన చైర్మన్ కార్యాలయం నిర్మాణంపై చర్చిస్తామన్నారు. అత్తివరదర్ సేవలో టీటీడీ చైర్మన్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో మంగళవారం కాంచీపురంలోని అత్తివరదర్ను దర్శించుకున్నారు. టీటీడీ ఆలయం తరఫున తీసుకొచ్చిన సారెను అత్తివరదర్కు అలంకరించి పూజలు చేశారు. అర్చకులు చైర్మన్కు ప్రసాదాలను అందజేశారు. తర్వాత ఆయన కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన వెంట టీటీడీ స్థానిక సలహా మండలి మాజీ సభ్యులు ‘ప్రభాకార్స్’ ప్రభాకర్రెడ్డి ఉన్నారు. బ్రేక్ దర్శనం వివరాలు ఎల్–1 : భక్తులకు మూలమూర్తి దగ్గర హారతి, తీర్థం, శఠారి ఇస్తారు ఎల్–2 : స్వామివారిని దగ్గరగా దర్శించుకోవచ్చు. అయితే హారతి, తీర్థం, శఠారి ఉండవు ఎల్–3 : కాస్త దూరం నుంచి స్వామిని దర్శించుకోవచ్చు. హారతి, తీర్థం, శఠారి ఉండవు. టికెట్ ధర : అన్నింటికి రూ.500లు -
అంతు చిక్కని ‘బంగారం’ గుట్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,381 కిలోల బంగారం వ్యవహారంలో అనేక గుట్టుమట్లు దాగి ఉన్నాయన్న అనుమానాలు బలపడుతు న్నాయి. మామూలుగా అయితే నిర్ణీత పరిమాణం దాటిన ఏ వస్తువునైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే వేబిల్లు తప్పనిసరి. ఇది లేకుండా రవాణా జరిగేవన్నీ దొంగ సరుకు కిందే లెక్కగడతారు. అయితే, ఈ 1,381 కిలోల బంగారం తరలింపులో ‘ఈ–వేబిల్లు’ జాడ ఎక్కడా కనిపిం చడం లేదు. వాస్తవానికి బంగారం గోల్డ్ డిపాజిట్ స్కీం కింద పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాచిన శ్రీవారి బంగారానికి వడ్డీతో కలిపి 1,381 కిలోల బంగారాన్ని బ్యాంకు (పీఎన్బీ) టీటీడీకి అప్పగించాల్సి ఉంది. ఇదే సమయంలో పీఎన్బీ 1,381 కిలోల బంగారాన్ని స్విట్జర్లాండ్లో కొనుగోలు చేసినట్లు కొన్ని డాక్యుమెంట్లను టీటీడీ అధికారులు బయటపెడుతున్నారు. బంగారం కడ్డీలను 56 బాక్సుల్లో జ్యురిచ్ ఎయిర్పోర్టు నుంచి ఈనెల 12న విమానం మార్గంలో చెన్నైకు చేరవేసేలా ఒక కార్గో సంస్థతో ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించి జ్యురిచ్ ఎయిర్పోర్టు నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు బంగారం తరలించే ఎయిర్ వే బిల్లులను టీటీడీ అధికారులు చూపుతున్నారు కానీ.. చెన్నై నుంచి టీటీడీకి ఆ బంగారాన్ని తరలించడానికి సంబంధించిన ఈ–వేబిల్లు గురించి టీటీడీ ఉన్నతాధికారులను అడిగితే.. పీఎన్బీ అధికారులు ఆ వేబిల్లు తమకివ్వలేదని చెబుతున్నారు. వారం రోజుల ముందు తేదీలతో ఇన్వాయిస్ కాగా, గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి టీటీడీకి అప్పగించడానికే బ్యాంకు అధికారులు 1,381 కిలోల బంగారాన్ని స్విట్జర్లాండ్లో కొనుగోలు చేశారని టీటీడీ అధికారులు చెబుతుంటే.. ఎయిర్ వే మార్గంలో దేశానికి తరలించిన బంగారానికి సంబంధించిన కమర్షియల్ ఇన్వాయిస్ (బంగారం ఎవరిదన్నది తేల్చే పత్రాలు)లో కనీసం టీటీడీ అన్న పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అంతేకాక.. ఆ కమర్షియల్ ఇన్వాయిస్లో తిరుపతిలోని ‘జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థ’కు అని పేర్కొన్నారు. దీనికితోడు 12వ తేదీన విమాన మార్గంలో చెన్నై వచ్చిన బంగారానికి తిరుపతిలో డెలివరీ చేయడానికి 11వ తేదీనే కమర్షియల్ ఇన్వాయిస్ తీసుకోవడం మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి.. టీటీడీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఏప్రిల్ 18వ తేదీతో బ్యాంకులో స్వామివారి బంగారం డిపాజిట్ గడువు ముగుస్తుంది. కానీ, తిరుపతిలోని జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థకు బంగారాన్ని అప్పగించడానికి ఏప్రిల్ 11వ తేదీన ఇన్వాయిస్ తీసుకున్నారు. తమిళనాడులో బంగారం పట్టుబడి, తర్వాత టీటీడీ ఖజనాకు అది చేరాక ఇప్పుడు ఆ బంగారం, ఈ బంగారం ఒక్కటేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గతంలోనూ అనేక ఆరోపణలు కాగా, స్వామి వారి అతి పురాతనమైన ఆభరణాలు విదేశాలకు తరలి వెళ్తున్నాయని గత కొన్నేళ్లుగా అనేక ఆరోపణలొచ్చాయి. తిరుమల ఆలయ ప్రధానార్చకులుగా పనిచేసిన రమణదీక్షితులు సైతం ఇలాంటి అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుబడ్డ బంగారం వ్యవహారంతో.. తిరుమల శ్రీవారి బంగారం పేరుతో అక్రమ లావాదేవీలు ఏమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబేది? – బంగారం పట్టుబడిన సమయంలో అది తమదేనని టీటీడీ అధికారులు ఎవ్వరూ వివరణ ఇవ్వలేదంటున్న ఈవో సింఘాల్.. ఐటీ శాఖ వివరాలు అడిగితే ఆ బంగారంతో తమకు సంబంధంలేదని చెప్పకుండా పీఎన్బీలో డిపాజిట్ చేసిన వివరాలను ఎందుకిచ్చారు? – బంగారం తరలింపునకు సంబంధించి రెండు కాగితాలను ఇచ్చిన టీటీడీ అధికారులు.. కీలకమైన ఈ–వేబిల్లుల వివరాలు ఎందుకు దాచిపెట్టారు? – ఏప్రిల్ 18న డిపాజిట్ల గడువు ముగిశాక తరలించే బంగారం కోసం వారం రోజుల ముందుగానే అంటే ఏప్రిల్ 11నే ఇన్వాయిస్ తీయడం.. ఈ ఇన్వాయిస్లో ఎక్కడా టీటీడీ పేరు లేకపోవడం ఏమిటి? – ఈ ఇన్వాయిస్లో చెన్నై మింట్ రోడ్డులోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తిరుపతిలోని జీ4ఎస్ ఇంటర్నేషనల్ సంస్థకు పంపుతున్నట్లు మాత్రమే ఎందుకు ఉంది? – స్విట్జర్లాండ్లోని బ్రిటీష్ ఎయిర్వేస్లో ఏప్రిల్ 12న బంగారాన్ని కొరియర్ చేసినట్లు రికార్డులు స్పష్టంచేస్తుంటే దానికంటే ఒకరోజు ముందే ఏప్రిల్ 11నే ఇన్వాయిస్ ఎందుకు తీసారు? కాగా, ఇంత భారీ విలువ కలిగిన బంగారాన్ని చెన్నై నుంచి తిరుపతి ట్రెజరీకి పంపుతుంటే దానికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని సింఘాల్ చెప్పడం అనుమానాలను మరింత పెంచుతున్నాయి. -
తిరుమల శ్రీవారి సేవా టికెట్లలో మరో కుంభకోణం
-
ముక్కోటి దేవతలకు ఆహ్వానమే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు... తిరుమల సప్తగిరులపై వెలసి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న కలియుగ దైవం వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే ధ్వజారోహణ ప్రక్రియ పవిత్రమైనది, విశిష్టమైనది, విశేషమైనది. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉత్సవ ఆరంభంలో అంకురార్పణ జరుగుతుంది. ఆ మరుసటిరోజున సాయంకాల శుభ ముహూర్తాన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణ వైభవాన్ని శ్రీవైఖానస భగవత్ శాస్త్ర పురాణాలలో విపులంగా వివరించారు. ధ్వజారోహణం ఎందుకు చేస్తారంటే... ‘‘జయం కరోతి దేవానం ధ్వం సయిత్యా సురానా ధ్వం సనాశ్చ జయౖశ్చైవ «ధ్వజమిత్యభిధీయతే’’సకల దేవతలకు జయం కలిగించి అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలందరినీ ఆహ్వానించే నేపథ్యంలో కార్పాసం (నూలు)తో చేసి, 14, 15, 16 హస్తాల పొడవు, 3, 4, 5 జానల వెడల్పుతో లేదా స్వామివారి పాదాలు, గర్భాలయ ద్వారానికి సమంగా 5, 3 హస్తాల వెడల్పుతో ఉండేటట్లు ఒక వస్త్రాన్ని తీసుకుని నీటితో శుభ్రం చేస్తారు. ఈ వస్త్రంలో గరుత్మంతుడు ఆకాశానికి ఎగురుతున్నట్లు చిత్రిస్తారు. అనంతరం అగ్నిగుండం ముందు వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణ ఆచరిస్తారు. అంగ హోమం చేసి పంచద్రవ్యం, క్షీరం, జలంతో ప్రోక్షణ చేసి గరుత్మంతుడున్న వస్త్రధ్వజాన్ని మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు. స్వామివారికి, అమ్మవార్లకు వస్త్రంపై లిఖించిన గరుత్మంతునికి కంకణధారణ గావించి గరుడ, విష్వక్సేన చక్రాలను అర్చిస్తారు. ఆ తరువాత డోలు వాద్యకారుని భేరీపూజతో భేరీ తాడనం చేయిస్తారు. స్వామివారిని ఉభయ దేవేరులతో నవసంధి బలిప్రకరణం కోసం ఉత్సవం చేసేందుకు తిరుచ్చిపై ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేన, చక్రసహితంగా గరుడ పటాన్ని ఊరేగింపునకు స్వామివారికి, అభిముఖంగా ఉండేలా ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆచార్యులు, రుత్వికులు బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక పాత్రలో బలిని(అన్నమును) సంగ్రహించి స్వామివారి గర్భాలయం మొదలుకొని మొదటి సంపంగి ప్రాకరణం, రెండవ ప్రాకరణలలో బలిహరణ గావిస్తారు.మహా ద్వారం నుండి బయటకు వచ్చి ప్రాకరణములలో ఉన్న బ్రహ్మాది అష్ట దిక్పాలకులను గద్య, పద్య, వాద్య, తాళ, గీతాలతో ఆవాహన గావించి బలిహరణ సమర్పిస్తారు. తర్వాత కొలతలు ధ్వజస్తంభానికి రెండింతలు ఉండేలా నూలు పగ్గాన్ని తీసుకుని వస్త్రంపై లిఖించిన గరుడ పటాన్ని స్వామివారి శేషమాలతో బంధిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి దగ్గరగా ధ్వజ పటాన్ని ఉంచుతారు. ముందుగా ధ్వజస్తంభాన్ని జయ, అత్యుచ్ఛ్రిత, ధన్య, ధ్వజ అనే నాలుగు నామాలతో ఆవాహన చేసి అర్చిస్తారు. తదనంతరం పటలిఖిత గరుత్మంతునిలో ‘గరుడ పక్షిరాజ సువర్ణపక్ష ఖగాధిప’ అనే నాలుగు నామాలతో మంత్రోచ్చారణ మధ్య అర్చిస్తారు. ముద్గాన్నం (కట్టె పొంగలి) నివేదన చేసి యజమానిచే సంకల్పం ఆచరించి ఆచార్యులు యాత్రాదానం స్వీకరిస్తారు. ఆ సుముహూర్తాన స్వామివారి బ్రహ్మోత్సవ సంబరాలకు ముక్కోటి దేవతలందరినీ ఆహ్వానించేందుకు జయజయధ్వానాలు, మంగళవాద్య, వేదఘోషలు పఠిస్తూ గరుత్మంతుని ధ్వజస్తంభం పైకి ఎగురవేస్తారు. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు. ధ్వజారోహణ దర్శనం సంతానప్రాప్తికి మార్గం సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతాన యోగం కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమై తొమ్మిదవ రోజు చేపట్టే ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అనేక వాహనాల్లో స్వామివారు విహరిస్తూ భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరగా చక్రస్నానం ఆచరిస్తారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఎవరైతే వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని వీక్షిస్తారో వారికి పునర్జన్మ ఉండదని వైఖానస ఆగమ శాస్త్రాలలో చెప్పబడింది. ‘‘వైఖానసార్య దివ్యాజ్ఞావర్థతా మభివర్థతాం’’ – డాక్టర్ తూమాటి బ్రహ్మాచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం -
నామాల స్వామి నడయాడిన దివ్యమార్గం
శ్రీవారి మెట్టు మార్గం... శ్రీపద్మావతీ దేవి, వేంకటేశ్వరస్వామి నడయాడిన దివ్యమార్గంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల క్షేత్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలారవాలతో ప్రతిధ్వనిస్తూ వింత సోయగాలతో మైమరపించే ప్రకృతి రమణీయత ఉట్టిపడే దివ్యధామంగా విరాజిల్లుతుంది ఈ మార్గం. జగత్కల్యాణ మూర్తులైన శ్రీపద్మావతీ, శ్రీనివాసులు చెట్ట్టపట్టాలేసుకుని నడిచిన ఈ శ్రీవారిమెట్టు మార్గం గుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అడుగడుగు దండాలసామిని స్మరిస్తూ గోవింద నామ స్మరణతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. అయితే ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాల క్రితం స్వర్ణముఖి, కల్యాణి నదుల ఉద్ధృతమైన వరదల తాకిడికి గురైంది. ఈ వరదల వల్ల ఇతర గ్రామాలతోపాటు శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరాలయం కూడా శిథిలమైంది. అప్పటి నుంచి భక్తుల రాకపోకలు సన్నగిల్లాయి. కానీ చంద్రగిరి, మంగాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే తిరుమలకు వెళ్లి భక్తులకు అవసరమైన కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని అమ్ముకునేవారు. రమణాచారి సంకల్పంతో... సాక్షాత్తు తిరుమలేశుడు నడయాడిన ఈ దివ్యమార్గాన్ని పునరుద్ధరించేందుకు నాటి టీటీడీ ఈవో కేవీ రమణాచారి సంకల్పించారు. ఆయన పట్టుదలతో సడలని దీక్షతో శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరింపబడింది. రాళ్లురప్పలతో కూడి దుర్గమంగా తయారైన ఈ మార్గాన్ని రూ.6 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రానైటు రాళ్లతో 2,388 మెట్లను ఎండ తగలకుండా, వానకు తడవకుండా ఆ మెట్లపై చక్కని షెడ్లను నిర్మించారు. దారి వెంబడి నడిచే భక్తుల కోసం మంచినీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, భద్రత వంటి విస్తృత సౌకర్యాలతో శ్రీవారి మెట్టు మార్గాన్ని పునర్నిర్మించారు. రూ.38 లక్షలతో మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాల మండపం ఆలయాన్ని ప్రతిష్ఠించారు. సౌకర్యాలు పెరగడంతో శ్రీవారి మెట్టు నుంచి స్వామి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. మామూలు రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు వెళితే, పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయాల్లో 20 వేల వరకు వెళ్తుంటారు. తిరుపతి ‘శ్రీనివాసం’ నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. -
కొండపై దళారుల సేవలో!
సాక్షి, తిరుపతి: శ్రీవారి ఆలయంలో తమకు కల్పించిన విశేష సేవల భాగ్యాన్ని కొందరు పాలక మండలి సభ్యులు వ్యాపార మార్గంగా మార్చుకుంటున్నారు. రోజూవారీగా తమకు కేటాయించిన ప్రత్యేక దర్శనాలు, సేవా టిక్కెట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన టీటీడీ పాలక మండలిలో ఇద్దరు సభ్యులు నెలవారీగా తమకు కేటాయించిన సేవలను గంపగుత్తగా విక్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. వీరిలో ఒకరు హోల్సేల్గా రూ.10 లక్షలకు అమ్ముకుంటే మరో సభ్యుడు రూ.14 లక్షలకు విక్రయించినట్లు తెలిసింది. సభ్యులు తమ కోటా పూర్తిగా అమ్ముకున్నా వారి కుటుంబ సభ్యులకు మాత్రం యథావిధిగా ప్రత్యేక దర్శనాలు పొందే వీలుంది. విశేష సేవలనూ విక్రయిస్తున్న సభ్యులు ఏడుకొండలపై కొలువైన వెంకన్న దర్శనం కోసం నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొందరు సంపన్నులు స్వామివారి సేవలో పాల్గొనేందుకు ఎంత ఖర్చైనా భరించేందుకు వెనుకాడకపోవటాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ నేతలు, పీఆర్వోలు, బ్రోకర్లు ప్రత్యేక దర్శనాలు, సేవా టికెట్లకు వెల కడుతున్నారు. తమ పరపతితో టికెట్లను దక్కించుకుని బయట విక్రయిస్తున్నారు. కొందరు పాలకమండలి సభ్యులు తమకు కేటాయించిన విశేష సేవలను సైతం విక్రయిస్తుండటం గమనార్హం. ఎల్ – 1 దర్శనాలకు సంబంధించి ఒక్కో లేఖను రూ.30 వేల చొప్పున విక్రయిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో బోర్డు సభ్యులకు కేటాయించే విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన సేవలను రూ.5 వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. పట్టుబట్టి కోటా పెంచుకుని... శ్రీవారి ప్రత్యేక దర్శనాల కోటాను ఇటీవల ఏర్పాటైన టీటీడీ పాలకమండలి సభ్యులు పట్టుబట్టి మరీ పెంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాక ముందు బోర్డులో ఒక్కో సభ్యుడికి బ్రేక్, ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3తోపాటు సుప్రభాతం, అభిషేకం, అర్చన, తోమాల, కళ్యాణోత్సవం, తిరుప్పావడ లాంటి సేవలన్నీ కలిపి రోజుకు 18 చొప్పున కేటాయించేవారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తొలిసారి ఏర్పాటైన పాలకమండలిలో ఒక్కో సభ్యుడికి 28 చొప్పున పెంచుకున్నారు. ఇక ఇటీవల ఏర్పాటైన నూతన పాలకమండలిలో ఒక్కో సభ్యుడికి 30 చొప్పున మరింత పెంచినట్లు తెలిసింది. వాటిలో బ్రేక్ 18, ఎల్ 1 (6), ఎల్ 2 (6), ఎల్ 3 (6)తో పాటు మిగిలిన సేవలు ఒక్కొక్కరికి రెండు చొప్పున కేటాయించారు. టీటీడీ చైర్మన్కు మాత్రం రోజూ సుమారు 100 ప్రత్యేక దర్శనాలు కల్పించే అధికారం ఉన్నట్లు తెలిసింది. పీఆర్వోలు, బ్రోకర్ల ఇష్టారాజ్యం తిరుమలలో పీఆర్వోలు, బ్రోకర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షించే వీరంతా కొందరు అధికారులతో పైరవీలు చేస్తూ సేవా టికెట్లను అమ్ముకుంటున్నారు. కొందరు బ్రోకర్లు మంత్రులు, ఎమ్మెల్యేల లేఖల పేరుతో ఫోర్జరీ సంతకాలు చేసి సేవా టికెట్లను అమ్ముకుంటున్నారు. టీడీపీ నాయకుడైతే చాలు.. సాధారణంగా మంత్రులకు 12, ఎమ్మెల్యేలకు 6, ఎమ్మెల్సీలకు 6 చొప్పున ప్రత్యేక దర్శనాలకు అవకాశం ఉంది. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, టౌన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పంపే సిఫారసు లేఖలపై కూడా అధికారులు ప్రత్యేక దర్శనానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడితోపాటు కిందిస్థాయి నాయకులు పంపే సిఫారసు లేఖలపైనా టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇటీవల తిరుపతికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పంపిన సిఫారసు లేఖను అధికారులు తిరస్కరించటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన ఓ మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆ నాయకుడు పంపే సిఫారసు లేఖలపై ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. తిరుపతి, తిరుమలలో ఉన్న ప్రముఖ హోటళ్ల యాజమాన్యాలు పంపే లేఖలపై కూడా టీటీడీ ప్రత్యేక దర్శనాలు కల్పిస్తుండటం గమనార్హం. -
తిరుమల: అరగంటలో ఆభరణాల పరిశీలన!
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి పలువురు భక్తులు సమర్పించిన వెలకట్టలేని ఆభరణాలు మాయమైనట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం వీటిని పరిశీలించారు. అయితే అసలు ఏడుకొండలవాడికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయనే వివరాలను తెలుసుకోకుండానే ఈ కార్యక్రమాన్ని ఆగమేఘాలపై అరగంటలో ముగించడం గమనార్హం. పాలకమండలి సభ్యులు మంగళవారం తిరుమలలో మరోసారి భేటీ కానున్నారు. రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలు శ్రీవారికి భక్తులు సమర్పించిన అపురూపమైన పలు ఆభరణాలు మాయమయ్యాయని మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తామంటూ సోమవారం ఆలయంలోకి వెళ్లిన టీటీడీ పాలకమండలి సభ్యులు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ముగించారని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారి తిరువాభరణ రిజిస్టర్లో 1200కిపైగా ఆభరణాలున్నాయి. కనీసం రిజిస్టర్లో ఎన్ని ఆభరణాలు ఉన్నాయో కూడా తెలుసుకోకుండానే సభ్యులు పరిశీలన పూర్తి చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలైనవేనా...? తిరువాభరణ రిజిస్టర్లో నమోదు చేసిన ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయా? వజ్రాలు, విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాలెన్ని? అవన్నీ అసలైన ఆభరణాలేనా? అనేది తేలాల్సి ఉంది. రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో ప్రధానమైనది డైమండ్ అదృశ్యం. శ్రీవారి హారంలో వజ్రం ఉండేదని, తరువాత దాన్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని రాములవారి ఆలయంలో అసలు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణం బయట పడటం గతంలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఆభరణాలు అసలైనవేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తెరదించాలంటే తూతూమంత్రంగా కాకుండా ప్రతి ఆభరణంపై నిశితంగా పరిశీలన జరగాలి. ఆభరణాలపై సభ్యుల సంతృప్తి శ్రీవారి ఆభరణాలన్నీ పక్కాగా ఉన్నాయని పరిశీలన అనంతరం పాలక మండలి సభ్యులు పేర్కొన్నారు. అయితే రిజిస్టర్ ప్రకారం అన్నిటినీ పరిశీలించటం సాధ్యం కాలేదని చెప్పారు. మచ్చుకు కొన్ని ఆభరణాలను మాత్రమే పరిశీలించామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని, ఇటీవల మరింత పటిష్టం చేశారని చెప్పారు. నాలుగో, ఐదో ఉన్నాయి.. శ్రీవారికి ఆరు బంగారు కిరీటాలు, ఆరు వజ్ర కిరీటాలతో పాటు చిన్న చిన్న ఆభరణాలు అధికంగా ఉన్నాయని బోర్డు సభ్యుల పరిశీలనలో తేలినట్లు సమాచారం. అయితే బోర్డు సభ్యులు మాత్రం నాలుగో, ఐదో కిరీటాలు ఉన్నాయని... చిన్నవి, పెద్దవి చాలా ఉన్నాయని చెప్పటంపై దేవస్థానం అధికారులు విస్తుపోతున్నారు. చిన్న చిన్న ఆభరణాల సంగతి ఎలా ఉన్నా కనీసం శ్రీవారికి కిరీటాలు ఎన్ని ఉన్నాయో కూడా బోర్డు సభ్యులు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదని దేవస్థాన సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోయిన శ్రీవారి ఆభరణాలు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆభరణాలు ఎప్పుడో ఇతర దేశాలకు తరలిపోయాయని పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ చెన్నారెడ్డి బాంబు పేల్చారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన అనేక ఆభరణాలు, నాణేలు కూడా ఇప్పుడు లేవని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయన్న దానిపై పురావస్తు శాఖ గతంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ సభ్యులు నెల రోజులపాటు పరిశీలించి చాలా ఆభరణాలు, నాణేలు లేనట్టు గుర్తించారని చెప్పారు. చాలా ఆభరణాలు, నాణేలను కరగబెట్టినట్టు కమిటీ సభ్యులు తేల్చారని వివరించారు. ‘పాత మిరాశీదారీ వ్యవస్థ సమయంలోనో.. అంతకుముందో చాలా నాణేలు కరగబెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సతీసమేతంగా తిరుమల పర్యటనకు వచ్చి ఎన్నో ఆభరణాలు, నాణేలు స్వామివారికి కానుకగా ఇచ్చారు. విచారణ చేస్తే వాటికి సరైన రికార్డులు కూడా లేవని తేలింది’అని తెలిపారు. వివిధ శాసనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి సమర్పించిన ఆభరణాల గురించి పురావస్తు శాఖ ‘గిఫ్ట్స్ అండ్ గ్రాంట్స్ డొనేట్ బై కృష్ణదేవరాయల్ టూ ఆంధ్రా టెంపుల్స్’పేరుతో ఒక పుస్తకం ప్రచురించినట్టు చెప్పారు. రాయల వారు ఏ సమయంలో పర్యటించారు? ఏ కానుకలు సమర్పించారన్నది శాసనాల్లో స్పష్టంగా పేర్కొన్నారని.. వాటి వివరాలతో పుస్తకం ప్రచురించినట్టు వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎంతో విలువైన నాణేలు, వజ్రవైడూర్యాలు సమర్పించారని వీటిలో కొన్ని పర్షియన్ దేశాలకు, మరికొన్ని అరబ్ దేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో ముత్యాలను ఇంగ్లండ్కు తరలించుకుపోయిందని, అవన్నీ అక్కడ భద్రంగా ఉన్నాయన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయినప్పుడు ఎన్నో ఆభరణాలు ఆ ప్రాంతంలో ఉండిపోయాయని, వాటిని అక్కడ నుంచి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగలేదని చెప్పారు. రోమన్, శాతవాహన కాలం నాటి కొన్ని నాణేలు ఇప్పటికీ టీటీడీ మ్యూజియంలో ఉన్నాయని వెల్లడించారు. -
31న శ్రీవారి ఆలయం మూత
సాక్షి, తిరుమల: చంద్రగ్రహణం కారణంగా ఈనెల 31వ తేదీన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఆరోజు సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తికానుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితి. గ్రహణం తర్వాత రాత్రి 9.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించనున్నారు. రాత్రి 10.30 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. 31న ఆర్జితసేవలైన సహస్రకలశాభిషేకం, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
దేవుణ్ణి చూడాలన్నా...ఆధార్
సాక్షి, తిరుమల: శ్రీవారి టైంస్లాట్ దర్శనాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆధార్ అనుసంధానం చేశారు. రెండోదశలో పూర్తి స్థాయిలో రూ.300 టికెట్లతోపాటు కాలిబాట దర్శనాలకు ఆధార్కార్డుతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. స్వామివారి దర్శన విధానాల్లో టీటీడీ ఇప్పటికే ఆధార్ కార్డు అమలు చేస్తోంది. దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు భక్తులకు పారదర్శక సేవలు అందుతున్నాయి. అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఆధార్కార్డు అనుసంధానం చేయటం వల్ల డూబ్లికేషన్తోపాటు అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. ఏ దర్శనంలో ఎంత మంది వెళ్లారు? ఎవరు? ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? అన్న సమగ్ర వివరాలు టీటీడీ వద్ద రికార్డు అవుతున్నాయి. దీనివల్ల భద్రతా పరంగా కూడా సంబంధిత భక్తుల వివరాలు సంక్షిప్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఆధార్కార్డు అనుసంధానంపై టీటీడీ నిర్వహించిన సర్వేలో 95 శాతంపైగా భక్తులు మద్దతు తెలిపారు. టైం స్లాట్లలో 95వేల మందికి దర్శనం తిరుమలేశుని దర్శన విధానంలో ఇప్పటి వరకు రద్దీని బట్టి రూ.300 టికెట్లు రోజూ 20 నుండి 25వేలు, కాలిబాట దివ్య దర్శనాలకు రోజూ 20 వేలు టైం స్లాట్ టికెట్లు కేటాయించి, అమలు చేస్తున్నారు. తాజాగా, సోమవారం నుండి ఆరంభమైన సర్వదర్శనంలోనూ రోజూ 20వేలు ఇవ్వాలని నిర్ణయించారు. భక్తుల రద్దీ, పర్వదినాలు బట్టి అయా టైం స్లాట్ దర్శనాల్లో సంఖ్యను పెంచటం, తగ్గించటం వంటి నిర్ణయాలకు వెసులుబాటు కల్పించారు. వాటితోపాటు ఇక వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్లు, వీఐపీ దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ భక్తులు కనిష్టంగా 10 వేలు నుండి గరిష్టంగా 15 వేల వరకు ఉంటారు. అంటే మొత్తం మీద ఒక రోజులో కనిష్టంగా 75వేలు , గరిష్టంగా 90 వేల మందికి మాత్రమే సాఫీగా స్వామి దర్శనం అమలు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అన్నిరకాల టైం స్లాట్ దర్శనాలకు ఆధార్కార్డు తప్పనిసరిచేస్తే డూబ్లికేషన్ అవకాశం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సస్పెన్షన్లు ఎత్తివేత
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దయ్యాయి. ఈ మేరకు ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు శుక్రవారం నిర్ణ యం తీసుకున్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారన్న ఆరోపణలతో ఆలయ ఏఈవో ఎం.దుర్గారావు, సూపరింటెండెంట్ వి.నగేష్, ఎలక్ట్రికల్ ఏఈ టి.సూర్యనారాయణ, ఈవో సీసీ ఎ.శ్రీనివాసరావు, ఈవో డ్రైవర్ వి.శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ ఆలయ పాలకవర్గ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు గురువారం సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత ఉద్యో గులు ఆంధ్రప్రదేశ్ ధార్మిక చట్టం 30/87లో సెక్షన్ 37(3)(ఏ) ప్రకారం ఆలయ శుక్రవారం అప్పీల్ చేశారు. దీనిని పరిశీలించిన చైర్మన్ సుధాకరరావు సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దుచేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఇదిలావుండగా, సస్పెన్షన్ను నిరసిస్తూ మూకుమ్మడి సెలవు పెట్టిన 127 మంది ఉద్యోగులు శుక్రవారం విధులకు హాజరుకాకపోవడంతో ఆలయ కార్యాలయం వెలవెలబోయింది. కాంట్రాక్టు ఉద్యోగులే భక్తులకు సేవలందించారు. రద్దీ పెద్దగా లేకపోవడంతో ఎవరికీ ఇబ్బందులు కలుగలేదు. ఆలయ చైర్మన్ తాజా నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగులంతా శనివారం నుంచి యథావిధిగా విధులకు హాజరుకావాలని నిశ్చయించుకున్నారు. ఈవోకు కాపు సంఘం వినతి ఇదిలావుండగా, ఉద్యోగులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కాపు సంఘ నాయకులు శ్రీవారి ఆలయం వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. రాజకీయ నాయకులు కక్షగట్టి ఉద్యోగులను సస్పెండ్ చేయించడం అన్యాయమని, ఉద్యోగులకు రాజకీయ రంగు పులమడం సరికాదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ గతంలో ఎంతోమంది జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు పనిచేసినా ఎప్పుడూ ఇంత రాద్ధాంతం జరగలేదని, ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతోందో ఆ నాయకులు ఆలోచించుకోవాలని అన్నారు. వందలాది మంది ఉద్యోగులు ఆందోళన చేస్తే.. గిట్టనివారిని ఎంపిక చేసి సస్పెండ్ చేయించడం అన్యాయమన్నారు. అభివృద్ధి పనుల ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన నాయకులు వివాదాలతో ఇలా రచ్చకెక్కడం మంచిది కాదని హితవు పలికారు. అనంతరం ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావును కలసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాపు సంఘం మండల శాఖ అధ్యక్షుడు పుప్పాల మురళీధరరావు, నాయకులు రుద్ర వెంకట శివాజీ, చిలుకూరి చంద్రం, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, చిలుకూరి ధర్ములు, ఉక్కుర్తి వెంకట్రావు, రాజేష్, బాబి, శ్రీను, ఏసు తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ ఖండన నాయకులు తమ ఆధిపత్యం కోసం ఆలయాల్లో రాజకీయాలను చొప్పించడం తగదని సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు. సీఐటీయూ బృందం శుక్రవారం ఇక్కడకు చేరుకుని ఆలయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీసింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు, రైతు సంఘ నాయకుడు కట్టా భాస్కరరావు మాట్లాడుతూ రాజకీయ ఆధిపత్యం కోసం ఆలయ ఉద్యోగులను బలి చేయడం దారుణమన్నారు. ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా ఉంటూ ఇలాంటి ఘటనలను ఎదుర్కోవాలన్నారు. సస్పెన్షన్లను ఎత్తివేయడంపై హర్షం వ్యక్తం చేశారు.