worlds
-
చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్!
చైనాలో భారీ బంగారు నిక్షేపం బయటపడింది. సుమారు 1,000 మెట్రిక్ టన్నుల అత్యంత నాణ్యమైన ఖనిజం ఉన్నట్లు భావిస్తున్న ఈ బంగారు నిక్షేపాన్ని సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో కనుగొన్నట్లు జియోలాజికల్ బ్యూరో ఆఫ్ హునాన్ ప్రావిన్స్ ధ్రవీకరించింది.చైనీస్ స్టేట్ మీడియా ప్రకారం.. ఈ నిక్షేపంలోని బంగారు అంచనా విలువ 600 బిలియన్ యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 6,91,473 కోట్లు. ఇది దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్లో లభించిన 930 మెట్రిక్ టన్నులను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వగా ఉండవచ్చు.ఈ నిక్షేపం వెలికితీతకు మైనింగ్ కార్మికులు, యంత్రాంగం తీవ్రంగా కష్టపడ్డారు. ప్రాథమిక అన్వేషణలో 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలు సిరలు బయటపడ్డాయి. అధునాతన 3డీ మోడలింగ్ టెక్నాలజీని వినియోగించి మరింత ఎక్కువ లోతుకు వెళ్లి నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.మైనింగ్ టెక్నాలజీ ప్రకారం.. చైనాలో ఈ బంగారు నిక్షేపం బయటపడటానికి ముందు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలు ఇవే..1. సౌత్ డీప్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా 2. గ్రాస్బర్గ్ గోల్డ్ మైన్ - ఇండోనేషియా 3. ఒలింపియాడా గోల్డ్ మైన్ - రష్యా 4. లిహిర్ గోల్డ్ మైన్ - పాపువా న్యూ గినియా 5. నోర్టే అబియర్టో గోల్డ్ మైన్ - చిలీ 6. కార్లిన్ ట్రెండ్ గోల్డ్ మైన్ - యూఎస్ఏ 7. బోడింగ్టన్ గోల్డ్ మైన్ - వెస్ట్రన్ ఆస్ట్రేలియా 8. ఎంపోనెంగ్ గోల్డ్ మైన్ - సౌత్ ఆఫ్రికా 9. ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్ - డొమినికన్ రిపబ్లిక్ 10. కోర్టెజ్ గోల్డ్ మైన్ - యూఎస్ఏ -
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశుడు : అద్బుత విశేషాలివే!
128 feet tall, the World’s Tallest standing Ganesha Murti at Khlong Khuean Ganesh International Park, Thailand. pic.twitter.com/ARzvHQNpEq— Lost Temples™ (@LostTemple7) September 9, 2024వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలు కూడా ప్రారంభ మైనాయి. గణేష్ బప్పా మోరియా అంటూ పూజించిన భక్తులు జై బోలో గణేష్మహారాజ్ కీ అంటూ లంబోదరుడికి వీడ్కోలు పలుకుతున్నారు. మరోవైపు పలు ఆకృతుల్లో కొలువుదీరిని బొజ్జ గణపయ్య విద్యుత్ కాంతుల శోభతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఊరా, వాడా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి ముఖ్యంగా 70 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి, గాజువాకలో 89 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహాలు ప్రత్యేక విగ్రహాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. మరి ప్రపంచంలోనే ఎత్తైన గణపతి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా? మన దేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ ఉంది? ఆ విశేషాలు తెలుసుకుందాం ఈ కథనంలో..! గణపతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా నిర్వహిస్తుంటారు. థాయిలాండ్లో ప్రపంచంలోనే ఎత్తైన గణనాథుడు కొలువై ఉన్నాయి. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్లో విశేషంగా నిలుస్తోంది. విగ్రహం ప్రత్యేకతలుథాయిలాండ్లోని ఖ్లోంగ్ ఖ్యూన్ ప్రాంతంలో ఉన్న గణేశ్ ఇంటర్నేషనల్ పార్కులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ దేశంలోని చాచోయింగ్షావో నగరం సిటీ ఆఫ్ గణేశ్ పేరుతో ప్రసిద్ధి చెందిది. ఈ పెద్ద విగ్రహాన్ని 2012లో స్థాపించారు. కాంస్యంతో ఈ భారీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 2008 నుంచి 2012 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందట దీని తయారీకి. తల భాగంలో కమలం, మధ్యలో ఓం చిహ్నం నాలుగు చేతులు ఉంటడం ఈ భారీ విగ్రహం యొక్క ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. అలాగే ఒక చేతిల్లో పనస, రెండో చేతిలో చెరకు, మూడో చేతిలో అరటిపండు, నాలుగో చేతిలో మామిడ పండు ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మరో మూడు పెద్ద గణేష్ విగ్రహాలు ఉన్నాయి.ఈ విస్మయం కలిగించే విగ్రహం ఆధునిక ఇంజినీరింగ్కు నిదర్శనం మాత్రమే కాదు. అనేక దైవిక, వైజ్ఞానికి అంశాలను కూగా గమనించవచ్చు. ఎగువ కుడిచేతి పనస పండు సమృద్ధి , శ్రేయస్సుకు చిహ్నంగా, ఎగువ ఎడమ చేతిలో చెరకు తీపి,ఆనందం కలయికను, దిగువ కుడి చేయి అరటిపండు పోషణ, జీవనోపాధికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక దిగువ ఎడమ చేతి మామిడి పండు, దైవిక జ్ఞానం, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది.ఎత్తైన గణేశ విగ్రహం కేవలం అద్భుతమైన కళాకృతి మాత్రమే కాదు, గొప్ప ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రదేశం కూడా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేశ విగ్రహం విశ్వాసం, ఐక్యత, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దీని గొప్పతనం మానవ సృజనాత్మకత, భక్తితో సాధించే ఉన్నతితోపాటు, సరిహద్దులు, నమ్మకాలకు అతీతంగా ఉన్న గణేశుని విశ్వవ్యాప్త ఆకర్షణకు, ప్రజలను ఏకం చేసే ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. -
‘మర మేస్త్రీ’.. రెండు రోజుల్లోనే ఇల్లు కట్టేస్తుంది!!
ఇంటి నిర్మాణం అనేది సుదీర్ఘ ప్రక్రియ. శ్రామిక శక్తితో కూడుకున్నది. చాలా మంది కార్మికులు నెలలు, సంవత్సరాల తరబడి పనిచేస్తే కానీ నిర్మాణం పూర్తవ్వదు. కానీ టెక్నాలజీ సాయంతో ఇంటి నిర్మాణం రోజుల్లోనే పూర్తవుతోంది.అన్నింటా ప్రవేశిస్తున్న రోబిటిక్ టెక్నాలజీ భవన నిర్మాణ రంగంలోనూ ప్రవేశించింది. 105 అడుగుల (32 మీటర్లు) టెలిస్కోపిక్ బూమ్ ఆర్మ్ కలిగిన రోబోటిక్ ట్రక్ ఆస్ట్రేలియా నుంచి ఫ్లోరిడాకు వచ్చింది. హాడ్రియన్ ఎక్స్ గా పిలిచే ఈ ట్రక్కును రోబోటిక్స్ కంపెనీ ఎఫ్ బీఆర్ అభివృద్ధి చేసింది. ఆ యంత్రం రెండు రోజుల్లో పూర్తి స్థాయి ఇంటిని పూర్తి చేయగలదు. గత సంవత్సరం ఇది యూఎస్ఏ ఫార్మాట్లో గంటకు 500 ఇటుకలను పేర్చి తన పనితీరు ఏంటో చూపించింది.ఇటుకలతో కూడిన ప్యాలెట్ లను లోడ్ చేశాక ఈ రోబోటిక్ వెహికల్/కన్ స్ట్రక్షన్ ఆర్మ్ తన పనిని మొదలు పెడుతుంది. ప్యాలెట్ నుంచి ఒక్కో ఇటుక ఆర్మ్ కొనకు చేరుకుంటుంది. ఇక్కడ క్విక్ డ్రై నిర్మాణ మిశ్రమం ఉంటుంది. ఇది సిమెంట్ లాగా పనిచేస్తుంది. మిశ్రమం అంటిన ఒక్కొక్క ఇటుకను రోబో ఆర్మ్ చక్కగా పేరుస్తూ నిర్మాణం పూర్తి చేస్తుంది. అధిక పొడవు కారణంగా మూడు అంతస్తుల ఎత్తుతో సైతం ఇది నిర్మాణాలను చేపడుతుంది.అమెరికాలో అతిపెద్ద కాంక్రీట్ బ్లాక్ సరఫరాదారుల్లో ఒకటైన సీఆర్హెచ్ పీఎల్సీ అనుబంధ సంస్థ ఎఫ్బీఆర్, సీఆర్హెచ్ వెంచర్స్ అమెరికాస్ ఇంక్ సంయుక్త భాగస్వామ్యంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ను ఫ్లోరిడాకు తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ బిల్డర్ తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మేయర్స్ లోని ఒక ఫెసిలిటీలో సైట్ అంగీకార పరీక్షను మొదట పూర్తి చేయాల్సి ఉంటుంది. అది సవ్యంగా జరిగితే, ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా హాడ్రియన్ ఎక్స్ ఐదు నుంచి 10 ఏక-అంతస్తుల గృహాలను నిర్మిస్తుంది. -
ప్రపంచంలోనే పటిష్టమైన బీమా బ్రాండ్.. ఎల్ఐసీ
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్తో ఎల్ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్ఆర్ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. -
ధగధగ..సెగసెగ.. అతిపెద్ద స్ఫటికాల గుహ ఎక్కడంటే?
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్ఫటికాల గుహ. బయటి నుంచి లోపలకు చూస్తే, భారీ స్ఫటిక శిలలు ధగధగలాడుతూ కనిపిస్తాయి. గుహ లోలోపలికి వెళుతుంటే మాత్రం తాళలేనంత వేడిసెగలు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ స్ఫటికాల గుహ మెక్సికోలోని చిహువాహువా సమీపంలో ఉంది. నైకా గనితో ఈ గుహను అనుసంధానించారు. ఇందులో జిప్సమ్, క్యాల్షియమ్ ఖనిజాల వల్ల ఏర్పడిన స్ఫటిక శిలలు భారీ పరిమాణంలో కనిపిస్తాయి. ఈ గుహను పూర్తిగా పరిశీలించడం ఎవరికీ సాధ్యం కాదు. లోలోపలకు వెళితే, అక్కడి ఉష్ణోగ్రతలు 58 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. లోపలి గాలిలో తేమ 90–99 శాతం మేరకు ఉంటుంది. గని కార్మికులైన జువాన్, పెడ్రో అనే సోదరులు తవ్వకాలు జరుపుతున్న సమయంలో పాతికేళ్ల కిందట ఈ గుహను గుర్తించారు. గుహలోని నేలకు అడుగు భాగంలో కరిగే స్థితిలో ఉన్న లావా కారణంగానే ఈ గుహలో విపరీతమైన వేడి, ఉక్కపోత వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మెత్తని మిఠాయి..ప్రపంచం మెచ్చిందోయి!
తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్ టాప్–50 స్వీట్లపై సర్వేలో.. ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్జమూన్ 26వ స్థానం సంపాదించాయి. రాజు కోసం వండిన మిఠాయి మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది. మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు. -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్లోని బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్సిన్హ్ ప్రతాప్సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్సింగ్ గైక్వాడ్తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్లోని బనారస్లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. -
ఎగిరే కారుకు ఆమోదం.. ఇక త్వరలో గాల్లోకి..
ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు (Flying Car) ఇప్పుడు ఫ్లైట్ సర్టిఫికెట్ పొందింది. 177 కిలో మీటర్ల రేంజ్తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారు ఎగరడానికి యూఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) నుంచి ప్రత్యేకమైన ఎయిర్వర్తీనెస్ సర్టిఫికేషన్ను పొందినట్లు కార్ కంపెనీ ప్రకటించింది. ఏవియేషన్ న్యాయ సంస్థ ‘ఏరో లా సెంటర్’ ప్రకారం.. ఈ తరహా వాహనం యూఎస్లో ఇలాంటి సర్టిఫికెట్ పొందడం ఇదే మొదటిసారి. ఫాక్స్ న్యూస్ ప్రచురించిన కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా తయారైన ఈ ఫ్లయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. ఒకరు లేదా ఇద్దరు ఇందులో ప్రయాణించవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణించగలదు. దీని ధర సుమారు 3 లక్షల డాలర్లు (రూ. 2.5 కోట్లు) ఉండనుంది. గతేడాది అక్టోబరులో రెండు వర్కింగ్ ఫుల్ సైజ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ కార్లను ఫుల్ సైజ్ స్పోర్ట్స్ కార్తోపాటు కంపెనీ ఆవిష్కరించింది. తమ వాహనాలకు 440కిపైగా వ్యక్తిగత, కార్పొరేట్ కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్ల వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో పేర్కొంది. నివేదికల ప్రకారం.. 2025 చివరి నాటికి కస్టమర్లకు ఎగిరే కార్లను డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం ఇలాంటి కార్లకు రానునన్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అలెఫ్ కంపెనీ సీఈవో జిమ్ దుఖోవ్నీ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అలెఫ్ కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. సాధారణ పట్టణ, గ్రామీణ రోడ్లపై నడపడానికి ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నారు. మామూలు పార్కింగ్ స్థలంలోనే ఈ కారును పార్క్ చేయవచ్చు. ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదు. కానీ వేగంగా వెళ్లాలనుకుంటే కారును గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చు. 【空飛ぶカート】 Alef Aeronautics社の一部制限ありで公道走行も可能な電動LSV「モデルA」がFAAから限定的な特別耐空証明を取得。名実共に「空飛ぶカート」(eVTOL)となった模様。#空飛ぶクルマ 《Weird gimballed-cabin eVTOL “flying car” receives limited FAA approval》https://t.co/8wKi2GTqvC pic.twitter.com/lwPSCMDpyk — Iwahori Toshiki (@iw_toshiki) June 29, 2023 -
ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్తో 'జెల్లీ స్టార్' స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక ప్యానెల్లో పారదర్శక డిజైన్తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్ఈడీ నోటిఫికేషన్ లైట్ను ఇచ్చింది కంపెనీ. ఫోన్ లోపల ఉన్న భాగాలు పారదర్శక బ్యాక్ ప్యానెల్ నుంచి కనిపిస్తాయి. ధర, లభ్యత ఈ బుల్లి స్మార్ట్ ఫోన్ను 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్తో ఒకే వేరియంట్లో కంపెనీ విడుదల చేసింది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డ్ కోసం పోర్ట్ కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్ను హాంకాంగ్లో మాత్రమే విడుదల చేసింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.17 వేలు. అక్టోబర్ నెల నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్పెసిఫికేషన్లు 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్తో 3 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే. MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 48 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా 2000mAH బ్యాటరీ -
ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం..
ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీంతో రైతుల ధాన్యం పాడవకుండా, కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల తప్పించడానికి సులభమవుతుందని ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోదాంల ఏర్పాటుకు పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా గోదాంల ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరగనుందని తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో 700 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని పేర్కొంది. ప్రతి మండలంలో 2 వేల టన్నుల ధాన్యం నిలువచేసుకునేలా గోదాంలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 3,100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు ఠాకూర్ తెలిపారు. కానీ 1,450 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకునే వెసులుబాటు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదాంల ఏర్పాటుతో ధాన్యం నిలువచేసుకునే సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు చేరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ధాన్యం నిలువ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఇదీ చదవండి:Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి! -
వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతి అమ్మాయి
ప్రపంచంలోనే అంత్యంత తెలివైన స్టూడెంట్స్ లిస్ట్లో భారత సంతతి అమ్మాయి స్థానం దక్కించుకుంది. యూఎస్ ఆధారిత జాన్స్ హాప్కిన్స్ సెంటర్ఫర్ టాలెంటెడ్ యూత్(సీటీవై) నిర్వహించిన పరీక్షలో భారతీయ అమెరికన్ నటాషా పెరియనాగం రెండోసారి విజయం సాధించింది. 13 ఏళ్ల పెరియనాగం న్యూజెర్సీలో ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడల్ స్కూల్ విద్యార్థి. ఆమె గతంలో 2021లో గ్రేడ్ 5 విద్యార్థిగా ఉన్నప్పుడూ కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐతే ఆ ఏడాది ఆమె సీటీవై నిర్వహించిన వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో గ్రేడ్ 8 స్థాయిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించి ఆ అత్యున్నత జాబితాలో స్థానం దక్కించుకున్నారు కూడా. మళ్లీ ఈ ఏడాది ఎస్ఏటీ, ఏసీటీ స్కూల్, కాలేజ్ స్థాయిలో అదే విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి మరోసారి ఈ గౌవరవ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ సీటీవై విశిష్ట ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడం కోసం వారి విద్యా నైపుణ్యాలను వెలికితీసేలా ఏటా అత్యున్నత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, పెరియనాగం తల్లిదండ్రులు చైన్నైకి చెందిన వారు. 2021-22 సీటీవై పరీక్షకి 76 దేశాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. సుమారు 15 వేల మంది ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. వారిలో చైన్నైకి చెందిన పెరయనాగం కూడా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఈ తాజా ప్రయత్నంతో పెరియనాగం అభ్యర్థులందరి కంటే అత్యధిక గ్రేడ్ సాధించి వరుసగా రెండుసార్లు ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న అమ్మాయిగా నిలిచినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ మేరకు సీటీవై డైరెక్టర్ డాక్టర్ అమీ షెల్టాన్ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక పరీక్షలో విద్యార్థులు సాధించిన విజయం మాత్రం కాదని, చిన్న వయసులో వారి అభిరుచులను గుర్తించడమే గాక ఆ దిశ తమ ప్రతిభకు మెరుగులు పెట్టుకోవడం ప్రశంసించదగ్గ విషయం. అలాగే వారి మహోన్నతమైన తెలితేటలకు సెల్యూట్. ఈ అనుభవంతో విద్యార్థులు మరిన్ని గొప్ప విజయాలను అందుకోవాలి అని డాక్టర్ అమీ ఆకాంక్షిచారు. (చదవండి: మిస్టరీగా కిమ్ ఆచూకీ.. పీపుల్స్ ఆర్మీ వార్షికోత్సవం హాజరుపై సందిగ్ధం) -
ప్రపంచంలోనే నెంబర్ 2 సంస్థగా రిలయన్స్
సాక్షి, ముంబై : ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ఇండస్ట్రీస్ లిమిటెడ్ సరికొత్త మూలురాయిని చేసుకుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది. రిలయన్స్ టెలికాం విభాగంరిలయన్స్ జియోలోదిగ్గజ సంస్థలపెట్టుబడులతో రిలయన్స్ అధినేతఇప్పటికే ప్రపంచకు బేరులజాబితాలోఇంతింటై వటుడింతై అన్నట్టుగారోజుకో కొత్త శిఖరానికి ఎగబాకుతున్నారు. తాజాగా రిలయన్స్ కూడా మార్కెట్ క్యాప్ పరంగా కొత్త తీరాలకు చేరింది. రిలయన్స్ షేరు ధర ఇటీవల ఆల్టైం హైంకి చేరడంతో ఈ ఘనతను దక్కించుకుంది. ప్రపంచ దిగ్గజం ఎక్సాన్ మొబిల్ కార్పొరేషన్ను అధిగమించి సౌదీ అరామ్కో తరువాత రెండవ స్థానాన్ని సాధించింది. అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్ను నిర్వహిస్తున్న రిలయన్స్ 8 బిలియన్ డాలర్లను కొత్తగా సాధించడంతో మార్కెట్ విలువ 189 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎక్సాన్ మొబిల్ 1 బిలియన్ డాలర్లను నష్టపోయింది. కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభంతో ఇంధన డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రిఫైనర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా ఎక్సాన్ షేర్లు 39 శాతం క్షీణించగా రిలయన్స్ షేర్లు ఈ ఏడాది 43 శాతం పుంజుకోవడం గమనార్హం. మరోవైపు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 1.76 ట్రిలియన్ డాలర్లతో అరాంకో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన సంస్థగా ఉంది. -
మక్కా ఎడారిలో అద్బుత భవంతి
-
అంధులకు అండగా..
అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సాయం లేకుండా తమ పనులు తామే చేసుకునేందుకు సహకరించే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చేతికి ధరించే ఉంగరంలా ఉండే ఈ అతి చిన్న పరికరం 3.5 మీటర్ల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా ఇట్టే గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరాన్ని చేతికి ధరించి ప్రయాణిస్తే నడిచే మార్గంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని సృష్టికర్తలు చెప్తున్నారు. లైవ్ బ్రెయిలీ అధినేత అభినవ్ వర్మ ఇప్పుడు అంధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే అతి చిన్న పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని చేతికి ధరిస్తే మూడు, నాలుగు మీటర్ల ముందుగానే వారికి వచ్చే అడ్డంకులను గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. సెకనులో 50వ వంతు సమయంలో అడ్డంకులను గుర్తించగలిగే ఈ పరికరంతో పాటు, దీనికి అనుసంధానంగా బ్యాటరీతో నడిచే మరో రెండు పరికరాలను కూడ అభినవ్ తయారు చేశారు. ఈ 'మినీ' పరికరం అంధుల సాధారణ అవసరాలకు ఉపయోగపడటంతోపాటు, దీనిద్వారా విద్యార్థులు తమ పుస్తకాలను ఆడియో రూపంలో రికార్డు చేసుకొని వినే సదుపాయం కూడ ఉంది. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభినవ్ తోపాటు అతడి స్నేహితుల బృందం విభిన్న ఆలోచనతోనే ఈ చిన్న పరికరం రూపం దాల్చింది. అంధులు కర్రసాయం లేకుండా నడవలేరా? వారు సాధారణ ప్రజల్లా నడవాలంటే ఏం చేయాలి అన్న కోణంలో ఆలోచించిన విద్యార్థులు ఈ చిన్న గాడ్జెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. మూడేళ్ళ క్రితం వారు విద్యార్థులుగా ఉన్నపుడు అంధులకోసం సృష్టించిన గ్లౌవ్స్ వంటి పరికరం విజయవంతం కావడంతో మరింత ఉపయోగంగా ఉండే అతి చిన్న పరికరాన్ని తయారు చేసేందుకు అభినవ్ చదువు పూర్తయిన తర్వాత సన్నాహాలు ప్రారంభించాడు. తాను స్వయంగా స్థాపించిన ఎంబ్రోస్ కంపెనీలో విభిన్నంగా వస్తువులను రూపొందించే ప్రయత్నం చేశాడు. అనేక ప్రయోగాలు, ప్రయత్నాల అనంతరం అభినవ్.. కేవలం 29 గ్రాములు బరువుండే అతి చిన్న రింగులాంటి లైవ్ బ్రెయిలీ పరికరాన్ని రూపొందించి విజయం సాధించాడు. చేతికి పెట్టుకునే ఉంగరంలా ఉండే ఈ చిన్న రింగు.. అంధులు వాడే కేన్ కు పది రెట్లు తేలిగ్గా ఉండటంతోపాటు... కేవలం 50 సెకన్ల లోపే అడ్డు వచ్చే వస్తువులను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు వస్తువు దూరం, బరువు వంటి విషయాలను బట్టి పరికరం వైబ్రేట్ అవుతుంది. తాము రూపొందించిన ఈ చిన్న పరికరం సహాయంతో దృష్టిలోపం ఉన్నవారు నడవడమే కాదు ఏకంగా పరుగులు కూడా పెట్టొచ్చని అభినవ్ బృందం చెప్తున్నారు. -
67ఏళ్ళ జైలు జీవనాన్ని గడిపి, ప్రాణాలు విడిచింది!
ప్రకృతి వనాల మధ్య, పచ్చని చెట్లతో దట్టంగా ఉండే అడవుల్లో గుంపులతోపాటు ఉండాల్సిన ఏనుగు.. తన సుదీర్ఘ జీవనాన్ని కాంక్రీట్ జంగిల్ లో ఒంటరిగా గడిపి, చివరికి ప్రాణాలు విడిచింది. జపాన్ లోని ఇనోకాషిరా పార్క్ జ్యూలో బందీగా 67 ఏళ్ళపాటు ఒంటరి జీవితం గడిపిన హనాకో విముక్తికోసం... అంతర్జాతీయ ప్రచారం జరిగినా లాభం లేకపోయింది. చివరికి 69 ఏళ్ళ వృద్ధాప్యంతోపాటు, తీరని ఒంటరితనం ఆ ఏనుగు ప్రాణాలు తీసింది. 'వరల్డ్స్ లోన్లీయెస్ట్ ఎలిఫెంట్' గా పేరొందిన 69 ఏళ్ళ ఏనుగు 'హనాకో' జపాన్ జ్యూలో మరణించింది. ఏడాది క్రితం ఓ టూరిస్టు తీసిన వీడియోను వీక్షించిన జనం ... దాన్నిబంధనాలనుంచి విముక్తురాలిని చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. వీడియోలో ఎంతో విచార వదనంతో కనిపించిన ఏనుగును ఎలాగైనా రక్షించాలనుకున్నారు. కాంక్రీట్ జైల్లో మగ్గిపోతున్న జంతువును ప్రకృతి వనాల మధ్య విడిచిపెట్టాలంటూ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. హనాకో ఉన్న ఎన్ క్లోజర్ ఓ రాతి జైలులా , అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శించే జ్యూలా ఉందంటూ టూరిస్ట్ ఉలారా నగగావా ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆ ఒంటరి ఏనుగును విశాల ప్రపంచంలోకి వదిలెయ్యాలంటూ అంతర్జాతీయంగా ఓ పిటిషన్ కూడ దాఖలు చేసింది. అయితే జ్యూ సిబ్బంది మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సుదీర్ఘ జీవితం ఒంటరిగానే గడిపిన ఆ ఏనుగును తిరిగి ఇతర గుంపులు తమతో కలుపుకోలేవని, పైగా ఇబ్బందులకు గురి చేస్తాయని తెలిపారు. దాంతో సుమారు 500,000 మంది సంతకాలు చేసి పిటిషన్ వేసినా...ఉపయోగం లేకపోయింది. అప్పటికే హనాకో వయసు కూడ మీరిపోవడంతో చేసేది లేకపోయింది. హనాకో ఉదయం సమయంలో ఓ పక్కకు తిరిగి పడుకోవడం చూశామని, అనుమానం వచ్చి అప్పట్నుంచీ దాని ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఎంతో ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయిందని, మధ్యాహ్నం సమయానికి అది మరణించిందని జ్యూ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండేళ్ళ వయసులో ఒంటరిగా థాయిల్యాండ్ అడవిలో నివసిస్తున్న ఏనుగు పిల్లను (హనాకో) అధికారులు అప్పట్లో జ్యూకి బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచీ సుమారు ఆరు దశాబ్దాలకు పైగానే కొద్దిపాటి పచ్చదనంతో కూడిన కాంక్రీట్ ఎన్ క్లోజర్ లోఒంటరిగానే జీవనం గడిపింది. హనాకో మరణవార్త సోషల్ మీడియాలో సంచలనం రేపింది. విషాద వార్తను చూసిన జనం నివాళులర్పించారు. వందలకొద్దీ షేర్లు చేశారు. ఏనుగును బంధించిన జపాన్ జ్యూ సిబ్బంది తీరుపై ఇబ్బడి ముబ్బడిగా ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ విమర్శలు గుప్పించారు. -
అంతు చిక్కని భూగర్భ అద్భుతాలు
మానవులు తలచుకుంటే సాధించలేనిదే లేదంటారు. అయితే భూగర్భంలో మనకు తెలియని రహస్యాలెన్నో నిక్షిప్తమై ఉన్నా వాటిని కనుగొనేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రనిపుణులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ప్రయోగాలు చేసినా ఇంకా తెలియని రహస్యాలెన్నో భూగర్భంలోనే మిగిలిపోతున్నాయి. మనకు తెలియని అద్భుత ప్రపంచాన్ని కనిపెట్టేందుకు పురాతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు అహర్నిశలూ కృషి చేస్తున్నారు. భూగర్భ ప్రపంచాన్ని సందర్శించేందుకు, ప్రజలకు ప్రాచీన చరరిత్రను పరిచయం చేసేందుకు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ప్రాచీన పురాణాలు, ఇతిహాసాలు, రహస్య స్థావరాలు, ఆలయాలు, కట్టడాలు, సమాధులు వంటి ఎన్నో అద్భుతాలను కనుగొన్న శాస్త్రవేత్తలు, పురాతత్వవేత్తలు ప్రాచీన చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భూగర్భ ప్రపంచంలో అనేక పొరంగాలు, గుహలు, నగరాలు కూడ ఉన్నాయని, వాటి వెనుక ఎంతో చరిత్ర దాగి ఉందని, అయితే వాటిని ఎటువంటి ప్రయోజనాలకోసం, ఏ సందర్భంలో నిర్మించారో పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మనకు లభించిన ఆధారాలను బట్టి కొంత చరిత్ర తెలిసినా, ఇంకా భూగర్భంలో గుర్తించలేని ప్రపంచం ఎంతో ఉందని అంటున్నారు. అయితే చరిత్ర చెప్తున్న 11 అత్యంత రహస్య భూగర్భ ప్రాంతాల్లోని విశేషాలను, వివరాలను శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఇప్పటివరకూ ఇంకా గుర్తించలేకపోయారని, అసలు అవి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయని ఓ ప్రైవేట్ వెబ్ సైట్ వివరించింది. తమకు తెలిసిన ఆధారాలను బట్టి ఆయా భూగర్భ అద్భుతాలకు సంబంధించిన చిత్రాలను వెలువరించింది. ముఖ్యంగా ఈజిప్టు లోని 'లాబ్రినాథ్' భూగర్భ అద్భుతాల్లో ఒకటి. పిరమిడ్లకు ప్రఖ్యాతి చెందిన ఈజిప్టులో లాబ్రినాథ్ గోడలపై చెక్కిన పురాతన లిపి కూడ ఎంతో ప్రాముఖ్యతను పొందింది. అయితే ఆ లిపి ఏమిటి అన్నది మాత్రం నేటికీ శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు. కానీ లాబ్రినాథ్ పై పరిశోధనలు చేపట్టేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికాలోని కాలిఫోర్నియాలో 'డెత్ వ్యాలీ'గా పిలిచే ప్రాంతం 5 వేల ఏళ్ళనాటి అండర్ గ్రౌండ్ పట్టణం. అక్కడ మమ్మీలు, కళాఖండాలు ఉన్నట్లుగా గుర్తించినా... శాస్త్రవేత్తలు వాటిని అక్కడ ఎవరు ఎందుకు ఉంచారో చెప్పలేకపోయారు. అలాగే 'ది గ్రాండ్ కెన్యాన్' లో పురాతన నాగరికతకు చెందిన ప్రజలు నివసిస్తారని పరిశోధనల్లో తేలినా... అది నిజమా కాదా అన్న విషయం తేల్చలేకపోయారు. మరో అద్భుత భూగర్భ నగరం టర్కీలోని డేరిన్ కియు. ఈ అత్యంత ఆధునిక నగరాన్నిఎవరు ఎప్పుడు నిర్మించారో ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పలేకపోగా... మిస్సోరి భూగర్భంలోని పట్టణంలోమనుషుల భారీ అస్తికలను కనుగొన్న నిపుణులు... అవి రాక్షసులవి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక జపాన్ లోని మౌంట్ త్సురుగి డీపెన్స్ ప్రాంతాన్ని కనిపెట్టి, అది అత్యంత ప్రాచీన నగరమని గుర్తించి, అక్కడే మూడేళ్ళపాటు ప్రయోగాలు చేసినా దానికి సంబంధించిన మరే వివరాలను తెలుసుకోలేకపోయారు. రహస్య భూగర్భ స్థావరం 'తకలమకన్ డెజర్ట్' ఎడారి పరిస్థితీ అదే. అక్కడి ఎడారిలో వెళ్ళినవారికి తిరిగి వచ్చేందుకు దారి కనిపించదని, ఇసుకతో నిర్మించిన ఎన్నో దేవాలయాలు అక్కడ ఉన్నాయని నిపుణులు కనుగొన్నారు. అయితే వాటిని ఇసుకతో ఎలా నిర్మించారో మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. రష్యాలోని హైపర్ బోరియా సరస్సును అక్కడివారు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారని తెలుసుకున్నా... దీన్ని ఎవరు నిర్మించారన్న వివరాలు చెప్పలేకపోతున్నారు. అయితే సియాక్స్ ఇండియన్స్ వైట్ హార్స్ భూగర్భ ప్రాంతంలోని, ఓ భూగర్భ గుహ కథనం మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఓ గిరిజన వ్యక్తికి చెందినదిగా వినిపిస్తుంది. ఇటలీలోని భూగర్భ పిరమిడ్ తో పాటు.... త్రీ ఐడ్ లామా వంటి అద్భుతాలెన్నో మనకు తెలియని రహస్యాలుగానే మిగిలిపోయాయి. -
సుందరమైన దృశ్యాలతో స్వాగతం పలికే ఎయిర్ పోర్టులు ఇవే..
-
ఆకాశంలో కిలోమీటర్ ఎత్తున టవర్..!
కిలోమీటర్ ఎత్తున.. ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే ప్రపంచంలోనే అతి పెద్ద, పొడవైన నిర్మాణాన్ని సౌదీ ప్రభుత్వం చేపట్టింది. ఈ భారీ కట్టడం నిర్మాణంలో 57 లక్షల చదరపు గజాల కాంక్రీట్, 80 వేల టన్నుల స్టీల్ ను వినియోగించి, దుబాయ్ లోని అతిపెద్ద టవర్, గిన్నిస్ రికార్డులకెక్కిన 'బుర్జ్ ఖలిఫా' ను తలదన్నే రీతిలో నిర్మిస్తున్న ఈ కట్టడం... అనుకున్నలక్ష్యాన్ని చేరితే ప్రపంచ గుర్తింపు తెచ్చుకోగలదని భావిస్తున్నారు. అతిపెద్ద జెద్ టవర్ ప్రాజెక్టు ఆకర్షణీయంగా నిర్మించేందుకు సుమారు ఏడువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. జెడ్ ఎకనమిక్ కంపెనీ, సౌదీ అరేబియాకు చెందిన అలిన్మా ఇన్వెస్ట్ మెంట్ సంస్థలు సంయుక్తంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను వెచ్చించి జెద్ నగరంలో ఈ నిర్మాణం చేపట్టేందుకు ఒప్పందంపై సంతకాలు చేసినట్లు సౌదీ ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 26వ అంతస్తు వరకు పూర్తయిందని, 3 వేల 280 అడుగుల ఎత్తైన ఈ ఆకాశహర్మ్యం 2020 లోగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణంతో స్థానికంగా రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఆధునిక జీవన శైలిని కూడా అందిస్తుందని, అనుకున్న లక్ష్యాన్ని చేరితే ఓ ప్రపంచ స్థాయి పట్టణ కేంద్రంగా ఈ ప్రాంతం రూపు దిద్దుకుంటుందని జెడ్దా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మౌనిబ్ హమ్మౌద్ అంటున్నారు. -
భారీ టెలిస్కోప్ను సిద్ధం చేస్తున్న చైనా
ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలిస్కోపును చైనా సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దీని నిర్మాణానికి మొత్తం 1,244 కోట్ల రూపాయల ఖర్చవుతోంది. 500 మీటర్ల వ్యాసంతో, భారీ యంత్రాలతో గుజ్హౌ రాష్ట్రంలో ఈ నిర్మాణం చేపట్టారు. 'ఫైవ్ హండ్రెడ్ మీటర్ ఎపర్చర్ స్ఫెరికల్ టెలిస్కోప్' (ఫాస్ట్) అనే పేరున్న ఈ టెలిస్కోప్.. దాదాపు 30 ఫుట్బాల్ మైదానాలను కలిపితే ఎంత అవుతుందో.. అంత పరిమాణంలో ఉంటుంది. ఈ అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణానికి చైనా ఐదేళ్ల సమయం తీసుకుంది. 2016 సెప్టెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులోని రిఫ్లెక్టర్ డిష్ ప్రపంచం అంతటి నుంచి సిగ్నల్స్ అందుకుంటుంది. 2003లో తొలిసారిగా దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీని బాడీ 500 మీటర్ల వ్యాసం ఉండటంతో.. దీనిచుట్టూ నడిచేందుకు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ టెలిస్కోపులో మొత్తం 4,500 ప్యానళ్లుండగా.. వాటిలో చాలావరకు త్రికోణాకారంలో ఉంటాయి. సైడ్ ప్యానెల్స్ 11 మీటర్ల పొడవు ఉన్నాయి. ఇప్పటివరకూ టెలిస్కోప్లోని ముఖ్యమైన దశలు పూర్తయ్యాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చీఫ్ సైంటిస్ట్ లీ డి వెల్లడించారు. ఈ టెలిస్కోప్ డిజైన్ అర్థం చేసుకోవడం అంత కష్టం ఏమీ కాదని, ఇది దాదాపు ఓ పెద్ద టీవీ యాంటెనాలాగే ఉంటుందని ఆయన చెప్పారు. సిగ్నళ్లు అందుకునే ప్రాంతం ఎక్కువగాను, మరింత సౌకర్యంగాను ఉండటంతో.. ఇప్పటికే పనిచేస్తున్న 'అరెసిబో' టెలిస్కోప్ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఆకాశాన్ని స్కాన్ చేస్తుందన్నారు. అలాగే సున్నితత్వం కూడా 3-5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీంతో.. పాలపుంతలో ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొత్త నక్షత్రాలను కనుక్కోవడం సాధ్యమవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన లిస్టర్ స్టావెలీ స్మిత్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త తెలిపారు.