-
పీఆర్సీ చైర్మన్కు వినతి
ఎదులాపురం: రాష్ట్ర వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎస్.శివశంకర్ను పీఆర్టీయూ(తెలంగాణ) నాయకులు హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిశారు. పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అన్ని యాజమాన్య విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉపాధ్యాయులు, బోధనేత సిబ్బంది, పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణ, ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందులో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూర్సింగ్, నవీన్యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాశ్, రాథోడ్ రవీందర్ ఉన్నారు. -
కోడ్ ఉల్లంఘించారని కలెక్టర్కు ఫిర్యాదు
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల రోజున కోడ్కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి కస్తూరి శోభారాణి, కారోబార్లు, ఆ గ్రామంలో విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బందిపై కలెక్టర్ రాజర్షి షాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున పంచాయతీ కార్యదర్శి బీఆర్ఎస్ నాయకులతో భోజనాలు ఏర్పాటు చేయించారన్నారు. అలాగే ఆ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల, పంచాయతీ సిబ్బంది భోజనం చేశారని తెలిపారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసేలా పోలింగ్ బూత్లోనే భోజనాలు చేయించిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో నవీన్ కుమార్, శ్యామల, మంజూష, సాయి, సురేశ్, శ్రీనివాస్,రాకేశ్ తదితరులు ఉన్నారు. -
జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి
బోథ్: ఇటీవల కురిసిన వర్షానికి తడిచిన జొన్నలను షరతులు లేకుండా త్వరగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని బోథ్ మార్కెట్ యార్డును శుక్రవారం ఆయన సందర్శించారు. తడిచిన జొన్నలను పరిశీలించారు. అధైర్యపడవద్దని రైతులకు సూచించారు. ఆరు కాంటాలు ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోలు చే యాలని అధికారులను ఆదేశించారు. అలాగే యా ర్డులో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నా రు. ఆయన వెంట మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి మనోహర్, సెంటర్ ఇన్చార్జి స్వామి, నేరడిగొండ ఎంపీపీ సజన్, నానక్ సింగ్, నారాయణరెడ్డి, సురేందర్ యాదవ్, తదితరులున్నారు. అన్నదాతకు అండగా బీఆర్ఎస్ఇచ్చోడ: రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెచ్చారు. వెంటనే ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. యార్డులో కావాల్సిన రెండు షెడ్లకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
జూన్ 10లోపు పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ రాజర్షి షా ● అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష కై లాస్నగర్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులను జూన్ 10లోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల ప్రగతిపై విద్య, పంచాయతీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంపిక చేసిన 678 ప్రభుత్వ పాఠశాలలకు గాను 668 పాఠశాలల్లో ఆయా కమిటీల బ్యాంకు ఖాతాలు తెరిచామన్నా రు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్, మైనర్ మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో పనులు చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత వాటి ఫొటోలను తీసి పంపించాలన్నా రు. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో త్వరితగతిన ప్రారంభించాలన్నారు. బడులు పునఃప్రారంభం అయ్యేలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాన్ మాల్వీయా, డీఈవో ప్రణీత, పీఆర్, ఆర్అండ్బీ ఈఈలు నర్సయ్య, వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్, డీపీవో శ్రీలత, డీఎల్పీఓ ఫణీందర్రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు. -
అత్యధికం 94.. అత్యల్పం 48
● జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం తీరు ● ఆదివాసీ గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం ● ఆసక్తి చూపని పట్టణ ఓటర్లు కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇటీవల ముగిసింది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా పోలింగ్ శాతం నమోదుపైనే చర్చ సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు బూత్ల వారీగా తమకు అనుకూలంగా ఉండే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో పోలింగ్ అత్యధికంగా 94.61శాతం నమోదు కాగా అత్యల్పంగా 48.51శాతం నమోదైంది. పట్టణ వాసులతో పోల్చితే పల్లెల్లో ఓటర్లు చైతన్యం చాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివాసీ గ్రామాలు అదుర్స్ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం పరిశీలిస్తే ఆదివాసీ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెండు నియోజకవర్గాల పరిధిలోని ఏ ఆదివాసీ గ్రామంలో చూసినా 80కి పైగా పోలింగ్ శాతం నమోదు కావడం ఓటు హక్కు వినియోగానికి వారు ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నారనేది స్పష్టం చేస్తోంది. కొన్ని గ్రామాల్లోనైతే 92 నుంచి 94శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం మెరుగ్గానే నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఒకటి రెండు కేంద్రాలు మినహాయిస్తే మిగతా చోట్ల 75కు పైగా పోలింగ్ శాతం నమోదు కాకపోవడం గమనార్హం. గతంలో తక్కువగా నమోదైన కేంద్రాలపై శ్రద్ధ వహించి అవగాహన కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆయా కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మండలాల వారీగా అత్యధిక, అత్యల్ప పోలింగ్ శాతం నమోదైన గ్రామాల వివరాలుమండలం అత్యధిక పోలింగ్ శాతం అత్యల్ప పోలింగ్ శాతం నమోదైన గ్రామం నమోదైన గ్రామం జైనథ్ ఆకుర్ల(92.56) గిమ్మ(కె) (73.68) బేల శంషాబాద్(93.14) తోయగూడ(70.18) ఆదిలాబాద్రూరల్ చిట్యాల్బోరి(94.61) ఖానాపూర్ (68.94) మావల మావల (పీఎస్.140) (83.33) బట్టిసావర్గాం(పీఎస్.136)(65.52) ఆదిలాబాద్అర్బన్ జైజవాన్నగర్(82.12) టీచర్స్ కాలనీ (48.51) బోథ్ కేశవ్గూడ(88.96) బోథ్–బిలో (66.12) నేరడిగొండ గాజిలి(91.25) వెంకటాపూర్ (61.56) బజార్హత్నూర్ గేర్జాయి(84.36) డెడ్రా (62.12) ఇచ్చోడ అడెగామ–బి(93.36) ఇచ్చోడ (పీఎస్.131)(58.33) తాంసి అంబుగావ్(90.30) నిపాని(77.88) భీంపూర్ కామటివాడ(87.39) అర్లి–టి(74.41) తలమడుగు కోసాయి(92.54) ఖోడద్(75.88) సిరికొండ నేరడిగొండ(88.94) సుంకిడి(79.8) గుడిహత్నూర్ బెల్లూరి(89.6) గుడిహత్నూర్(67.84) -
న్యూస్రీల్
‘ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు తగదు’ ఆదిలాబాద్: ఎమ్మెల్యే పాయల్ శంకర్పై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కంది జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పై భూకబ్జాలు చేస్తున్నారంటూ అసత్య ఆరోపణలు చేయ డం తగదన్నారు. ఇందులో నాయకులు దినేశ్ మటోలియా, క్రాంతికుమార్, మోహన్ అగర్వాల్, సురేందర్, రవి, రాజు తదితరులున్నా రు.రేపు జిల్లాస్థాయి నెట్బాల్ ఎంపిక పోటీలు ఆదిలాబాద్: ఈనెల 19న నెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అజ య్, గౌతమ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఆది వారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఎస్ఆర్ డీజీ పాఠశాలలో ఉమెన్స్, మెన్స్ జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రూపేశ్కు రిపోర్ట్ చేయాలని సూచించారు.దరఖాస్తుల ఆహ్వానం ఎదులాపురం: జిల్లా ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ (ఐటీఐ)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ సుజాత ప్రకటనలో తెలిపారు. 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులై, 1 ఆగస్టు 2024 నాటికి 14 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16 నుంచి జూన్ 10లోగాhttps:// iti. telangana. gov. in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 94935 35378 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
గుండేగాం కష్టం తీరేదెప్పుడో!
● పునరావాసం కోసం ఎదురుచూపులు ● 20 రోజుల్లో వానాకాలం ప్రారంభం ● ఏటా గ్రామస్తులకు తప్పనితిప్పలు ● ఈ ఏడాదైనా ముంపుముప్పు తప్పేనా?సమస్య పరిష్కరిస్తాం గుండేగాం గ్రామంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలా ఆలోచిస్తున్నాం. ఇప్పటికే అసెంబ్లీలో గుండేగాం విషయాన్ని ప్రస్తావించాను. అధికారులతోనూ సమీక్ష నిర్వహించాం. ఈ వానాకాలంలో గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాను. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సమస్య తలెత్తింది. తొమ్మిదేళ్లుగా గత ప్రభుత్వం గుండేగాం గ్రామస్తుల సమస్య పట్టించుకోలేదు. ఈఏడాది సమస్య పరిష్కారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తాం. – పవార్ రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యేగుండేగాం గ్రామం భైంసా/భైంసారూరల్: గుండేగాం ముంపు సమస్యకు పాలకులు ఇప్పటికీ పరిష్కారం చూపడంలేదు. ఏటా వానాకాలం వస్తుందంటే గ్రామస్తులు భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులున్నాయి. ప్రతీ వానాకాలం ఈ గ్రామానికి గండంగా మారుతోంది. వర్షాలు కురియడం.. నీరంతా గ్రామంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. భారీ వర్షాలు కురిస్తే గ్రామస్తులు అదే నీటిలో ఉంటున్నారు. ఈ గ్రామ ముంపు సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. పునరావాసం కల్పిస్తామంటూనే ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వాలు మారినా గుండేగాం రాత మారడంలేదు. పాలకులు ఎవరు వచ్చినా గుండేగాం సమస్య పరిష్కారం కావడంలేదు. అధికారులు పునరావాసం త్వరలోనే అంటూ ప్రకటనలు ఇస్తున్నారే గాని ఆచరణలో చూపడంలేదు. ఈ వేసవిలో అప్పుడప్పుడు కురిసిన వర్షాలకే గుండేగాంవాసులు అల్లాడుతున్నారు. మరో 20 రోజుల్లో వర్షాకాలం ప్రారంభమైతే ఈ గ్రామస్తుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణంతో.. పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రతీ వానాకాలంలో గుండేగాం గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది. గత కొన్నేళ్లుగా గ్రామంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఊరు మునగదని గ్రామస్తులకు భరోసా కల్పించారు. కట్ట నిర్మాణం పూర్తయితే వానాకాలంలో తప్పనిసరిగా నీరువస్తుందని గుండేగాం గ్రామస్తులు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ గుండేగాంను నీటముంచింది. ఫలితంగా గ్రామస్తులంతా ఇబ్బందులు పడ్డారు. వాగు పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్నవారు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఈ ఏడాది పునరావాసం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేర్చలేదు. పునరావాస కేంద్రంలోనే.. గతేడాది వానాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామస్తులు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే కాలం వెల్లదీశారు. ఈ ఏడాది ఎలాగైనా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలోని అప్పటి మంత్రులు జోగు రామన్న, అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి గ్రామానికి వచ్చి పరిస్థితిని చూశారు. అప్పటి ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి గ్రామస్తులు గత ప్రభుత్వంలోని అప్పటి భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు దగ్గరికి వెళ్లారు. గుండేగాం సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. అప్పటి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినప్పటికీ పునరావాసం ఎక్కడ కల్పిస్తారన్న సమస్య అలాగే ఉండిపోయింది. రాష్ట్రంలో ఐదునెలల క్రితం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ గుండేగాం విషయమై అసెంబ్లీలో మాట్లాడారు. అధికారులతో సమీక్షించారు. కానీ.. వానాకాలం సమీపిస్తున్నా గుండేగాం పునరావాసం విషయంలో ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. ఈ ఏడాది కూడా పునరావాసం కల్పిస్తారన్న నమ్మకం కనిపించడంలేదు. గ్రామం : గుండేగాం కుటుంబాలు : 162 పంట భూములు : 364 ఎకరాలుప్రధాన సమస్య: పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్ ఊరిలోకి రావడం, ఏటా గుండేగాం నీటమునగడం పరిష్కారం: భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం ఏర్పాటు చేయడం తాత్కాలికంగా.. గుండేగాం నీట మునగడంతో గ్రామస్తులు తాత్కాలికంగా కమలాపూర్ గుట్ట సమీపంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్నారు. గుండేగాం గ్రామానికి చెందిన 81 కుటుంబాలవారు ఇందులోనే నివసిస్తున్నారు. గుండేగాం సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియక అంతా అయోమయానికి లోనవుతున్నారు. వర్షాలు కురిస్తే మళ్లీ బ్యాక్వాటర్ ఊరిలోకి వచ్చి ఇండ్లు మునుగుతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం, అందుకు తగ్గట్లు స్థలం కేటాయించకపోవడంపై ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వానాకాలంలో నీటమునిగే గుండేగాం గ్రామానికి పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. -
నాణ్యమైన బోధనకు ఆదర్శం
కుంటాల: గ్రామీణ ప్రాంతాల్లోని పేదవిద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శ పాఠశాలలు (మోడల్ స్కూళ్లు) ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 14 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదోతరగతి ఫలితాలు వెలువడ్డాయి. 14 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్లో 2,240 సీట్లున్నాయి. ఇందులో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 25వ తేదీ వరకు ఆయా పాఠశాలలు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఈనెల 26న ఎంపికై న విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తాయి. ఈనెల 27 నుంచి 31వ తేదీ వరకు విద్యార్థుల నిజ ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తారు. ఇంటర్లో ప్రవేశం పొందిన బాలికలకు మాత్రమే హాస్టల్ వసతి కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, బజార్హత్నూర్, గుడిహత్నూర్, జైనథ్, నార్నూర్, సిర్పూర్, ఆసిఫాబాద్, కోటపల్లి, దండేపల్లి, లింగాపూర్, కాసిపేట, మంచిర్యాల, కుంటాలలో మోడల్ స్కూళ్లున్నాయి. వీటిలో ఇంటర్ ఫస్టియర్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో 2,240 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు 3శాతం, ఓసీలకు 36శాతం, ఈడబ్ల్యూఎస్కు10శాతం, బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో 14 పాఠశాలలు ఇంటర్ ఫస్టియర్లో 2,240 సీట్లు ఈ నెల 25వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రవేశాలకు పోటీ పెరిగింది ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులు ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తుండడంతో పోటీ పెరిగింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశం పేద విద్యార్థులకు వరం. సకాలంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. – శ్రీనివాస్ ప్రసాద్, ప్రిన్సిపాల్, కుంటాల -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ఆసిఫాబాద్రూరల్: ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన ఘటన రహపల్లిలో చోటు చేసుకుంది. మృతుడి అన్న ఆనందరావు తెలిపిన వివరాల ప్రకారం.. తన తమ్ముడు చునార్కర్ రవీందర్ (38) భార్య కళావతి గ్రామానికి చెందిన అక్కపెల్లి రవీందర్తో తరచూ ఫోన్లో మాట్లాడేదని ఆనందరావు తెలిపా డు. దీంతో ఇంట్లో గొడవలు పెరిగాయని పేర్కొన్నా డు. గతంలో ఈ విషయమై పంచాయితీ కూడా జరి గినట్లు తెలిపాడు. దీనిపై గురువారం కూడా గొడవ జరిగిందని పేర్కొన్నాడు. ఈక్రమంలో తన తమ్ము డు రవీందర్ను ప్రియుడితో కలిసి కళావతి ఇంట్లో ఉరేసి చంపిందని వివరించాడు. కళావతి, రవీందర్పై ఆనందరావు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు మృతి పెంబి: మండల కేంద్రంలోని సబ్స్టేషన్ మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు మృతి చెందారు. ఖానాపూర్ మండలం అడవి సారంగాపూర్ పరిధిలోని రాజులమడుగు గ్రామానికి చెందిన సీడం సోనేరావు (56) శుక్రవారం పెంబిలో వారసంతకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో సబ్స్టేషన్ ప్రాంతంలోని మూలమలుపు వద్ద ద్విచ క్ర వాహనం అదుపు తప్పి ముఖానికి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాధాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని గోండ్గూడ గ్రామంలో ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రంలోని కొబ్బయ్గూడ గ్రామానికి చెందిన పెందోర్ భీంరావ్, ఇంద్రబాయి దంపతుల కూతురు సుమిత్ర (26) నాలుగు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబీకులు పలు ఆస్పత్రుల్లో చూపించినా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గోండ్గూడ గ్రామంలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వచ్చిన సుమిత్ర కడుపు నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయం ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన బంధువులు సుమిత్ర తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తండ్రి భీంరావ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్లో కౌఠ యువకుడి మృతి బోథ్: మండలంలోని కౌఠ బీ గ్రామానికి చెందిన రత్నాకర్(24) ఆదిలాబాద్లో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. వివరాలు.. రత్నాకర్ ఆదిలాబాద్లోని తన అత్తగారింటి వద్ద ఉంటూ మేసీ్త్రగా పని చేస్తున్నాడు. శుక్రవారం మేసీ్త్ర పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రత్నాకర్ మృతితో అతడి సొంతూరైన కౌఠ బీ గ్రామంలో విషాదం నెలకొంది. -
విద్యుదాఘాతంతో మల్టీపర్పస్ వర్కర్ మృతి
ఆదిలాబాద్రూరల్: లింగుగూడ గ్రామపంచాయతీకి చెందిన మల్టీపర్పస్ వర్కర్ పూసం ఉద్ధవ్ (35) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని ధర్లొద్ది గ్రామంలో ఉద్ధవ్ వీధి దీపాలు అమరుస్తున్నాడు. ఈక్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ స్తంభం పైనుంచి కింద పడ్డాడు. గమనించిన స్థానికులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సునీత తెలిపారు. ఉద్ధవ్కు భార్య రుక్మాబాయి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సాయినగర్లో తాపీమేసీ్త్ర.. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని సాయినగర్లో భవన నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై బిక్క రత్నాకర్ (24) అనే మేసీ్త్ర శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినగర్లో భవన నిర్మాణ పనులు చేసే క్రమంలో ఇనుప రాడ్ను సరిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో రత్నాకర్ షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. -
నిలిచి ఉన్న వాహనాన్ని ఢీకొట్టి ఒకరు మృతి
భైంసారూరల్: కుంటాల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ర్యాపాని గణేశ్ (44) నిలిచి ఉన్న వాహనానికి ఢీకొట్టుకుని మృతిచెందాడు. వివరాలు.. గురువారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రెండు ఐచర్వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికీ కల్లూరు గ్రామానికి చెందిన ర్యాపాని గణేశ్ ద్విచక్రవాహనంపై భైంసాకు వెళ్తున్నాడు. నిలిచి ఉన్న ఐచర్వాహనానికి ఢీకొట్టుకుని తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి ఆదిలాబాద్రూరల్: మావల పోలీస్స్టేషన్ పరిధి దేవాపూర్ చెక్పోస్ట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అజీమ్ అహ్మద్ (31) మృతి చెందినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దహెగాం గ్రామానికి చెందిన అజీమ్ అహ్మద్ మహారాష్ట్రలోని గఢ్ చందుర్ నుంచి కిన్వట్కు వయా బోథ్ మీదుగా లారీ తీసుకుని వెళ్తున్నాడు. మార్గంమధ్యలో దేవాపూర్ చెక్పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 44పై లారీ పార్కింగ్ చేసి ఉంది. ఎలాంటి పార్కింగ్ లైట్లు వేయకపోవడంతో ఆయన ఎదురుగా ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అజీమ్ అహ్మద్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు అబ్దుల్ అజీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దాడి చేసిన ముగ్గురిపై కేసు
వాంకిడి: కర్రతో దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కే సు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ తెలిపారు. ఆ యన తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం లెండిగూడ గ్రామానికి చెందిన గుర్నులె సోమ కు ఇద్దరు కుమారులు నాందేవ్, మనోహర్ ఉన్నా రు. సోమ ఏడాది క్రితం మృతి చెందగా అతడి పేరి ట ఉన్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని ఇద్దరు సమంగా సాగు చేసుకుంటున్నారు. అయితే తల్లి బాగోగులు చిన్న కుమారుడు మనోహర్ చూ సుకుంటున్నందున వాటాలో ఐదు మూరలు అధి కంగా తమ్ముడు సాగు చేసుకునేందుకు నాందేవ్ అంగీకరించాడు. ఈ క్రమంలో గురువారం తమ్ము డి ఇంటికి వెళ్లిన నాందేవ్.. తల్లికి జ్వరం వస్తున్నా ఆస్పత్రిలో ఎందుకు చూపించడం లేదని అడిగాడు. దీంతో ఆవేశానికి గురైన మనోహర్ ‘భూమి పంచుకుందాం అంటే పట్టించుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు’ అని బూతులు తిడుతూ కర్రతో అన్న తలపై కొట్టాడు. పక్కనే ఉన్న మనోహర్ భార్య తానుబాయి, కుమారుడు శ్రీకాంత్ కూడా నాందేవ్పై దాడికి పాల్పడ్డారు. గ్రామస్తులు వారిని విడిపించడంతో గొడవ సద్దుమణిగింది. నాందేవ్ తలపై రక్తపు గాయాలు కాగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. శుక్రవారం నాందేవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాలి’
నార్నూర్: ఏజెన్సీలో 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాలని తుడుందెబ్బ డివిజన్ అధ్యక్షుడు కనక ప్రభాకర్ అన్నారు.గురువారం మండల కేంద్రంలోని కుమురంభీం భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న కుమురంభీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ యువకుడిపై మైనార్టీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మె స్రం మానిక్రావు, ఽశ్రీరామ్, పెందూర్ దీపక్, తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల అధికారుల విస్తృత తనిఖీలు
కై లాస్నగర్: జిల్లాలోని పలు మండలాల్లోని రేషన్ షాపుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, యూడీఆర్ఐ రవీందర్ ఆదిలాబాద్ పట్టణంలోని పలు షాపులను, బజార్హత్నూర్, ఉట్నూర్, మావల మండలాల్లోని షాపులను డిప్యూటీ తహసీల్దార్లు శ్యాంసుందర్, త్రియంబక్రావు, ప్రేంనివాస్ తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు సమయపాలన పాటిస్తూ కార్డుదారులకు సకాలంలో బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్మకున్నట్లు తెలిస్తే మాత్రం డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులు బియ్యం వండుకుని తినేలా అవగాహన కల్పించాలని సూచించారు. -
డెంగీ నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి
కై లాస్నగర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వడం ద్వారానే డెంగీ వ్యాధి ప్రబలకుండా నియంత్రించవచ్చని, ఆదిశగా సంబంధిత అధికారులు స మన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో గ్రామీణ ప్రాంతాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. హైరిస్క్ ఏరియాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ స్ప్రే మిషిన్లు అందుబాటులో ఉంచాలన్నా రు. మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో ఫాగింగ్ మిషన్ తిరగాలన్నారు. అనంతరం డెంగీ నియంత్రణకు ఉ త్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగుల కు సర్టిఫికెట్స్ అందించి అభినందించారు. అనంత రం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాని మాల్వియా, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, మలేరియా అధికారి శ్రీధర్, మున్సిపల్ కమిషర్ ఖమర్ అహ్మద్, డీఎల్పీవో ఫణీందర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
ఆదిలాబాద్రూరల్: 2024–25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో 1వ తరగతి (డే స్కాలర్), 5వ తరగతి (రెసిడెన్షియల్)లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 1వ తరగతిలో 45 సీట్లు, ఐదో తరగతిలో 47 సీట్లు ఉన్నట్లు తెలి పారు. వార్షిక ఆదాయం గ్రామీణ స్థాయిలో రూ.లక్షా 50వేలు, పట్టణ స్థాయిలో రూ.2 లక్షల ఉండాలన్నారు. అన్ని ధ్రువీకరణ పత్రాలను గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేసి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని, ఇతర వివరాల కోసం 9440628538 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
ఉట్నూర్రూరల్: సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ అన్నారు. గురువారం డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉట్నూర్ మండలంలోని తాండ్రలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటించాలన్నారు. అనారోగ్యం బారిన పడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూడాలన్నారు. దోమల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. -
ఉపాధికోసం వచ్చి తిరిగిరాని లోకాలకు..
● ద్విచక్రవాహనంతో తాటిచెట్టును ఢీకొని బావ మృతి ● గాయాలపాలైన బావమరిది సారంగపూర్: ఉపాధి కోసం అత్తగారి గ్రామానికి వచ్చి జీవనోపాధి పొందుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మండలంలోని కౌట్ల(బీ) గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. కుభీర్ మండలం హాల్ద గ్రామానికి చెందిన శంకర్ (35)కు మండలంలోని కౌట్ల(బీ) గ్రామానికి చెందిన గజ్జవ్వతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూతురు, కుమారుడున్నారు. స్వగ్రామంలో ఉపాధి కరువై శంకర్ తన అత్తగారి గ్రామమైన కౌట్ల(బీ)కి కుటుంబంతో ఐదేళ్ల క్రితం వచ్చాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం కూలీ పనులు ముగించుకుని పని నిమిత్తం సారంగపూర్కు తన బావమరిది కుంటాల నరేశ్ (24)తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా కరుణాకర్రెడ్డి ఫంక్షన్హాల్ సమీపంలో తాటిచెట్టుకు ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. నరేశ్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108లో నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాగా, శంకర్ మృతితో అతడి కుటుంబం వీధినపడింది. నరేశ్ది పేద కుటుంబం కావడంతో మెరుగైన వైద్యం చేయించే స్తోమత వారికి లేదు. శంకర్ మృతదేహాన్ని అతడి స్వగ్రామం కుభీర్ మండలం హాల్దాకు తరలించారు. శంకర్ మృతితో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
పేరు రైతుది.. పంట దళారిది
● జొన్న కొనుగోళ్లలో దళారుల దందా ● మహారాష్ట్రలో జొన్నలు కొనుగోలు ● తెలంగాణలో రైతుల పేరిట మార్క్ఫెడ్కు విక్రయంబోథ్: జిల్లాలోని రైతులు ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో జొన్నపంట సాగు చేశారు. జిల్లాలోని తొమ్మిది కొనుగోలు కేంద్రాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న పంట కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది రూ.3,180తో మద్దతు ధర నిర్ణయించారు. ఇదే అదనుగా భావించిన దళారులు మార్కెట్లోకి రంగప్రవేశం చేశారు. మహారాష్ట్ర నుంచి జొన్నలు కొనుగోలు చేసి తెలంగాణలో రైతుల పేరిట మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నారు. దీంతో అసలు రైతులు నష్టపోతున్నారు. ఆన్లైన్లో ఉంటేనే కొనుగోలు.. వ్యవసాయ శాఖ సిబ్బంది రైతుల పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే పంట కొనుగోలు చేస్తున్నారు. మార్క్ఫెడ్ సంస్థ స్థానిక ప్రాఽథమిక సహాకారం సంఘం సిబ్బంది ద్వారా కొనుగోలు చేయిస్తోంది. ఆన్లైన్లో పంట వివరాలు లేకపోతే కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. అయితే చాలాచోట్ల వ్యవసాయ శాఖ సిబ్బంది పంట క్షేత్రాలకు వెళ్లకుండానే రైతులు చెప్పిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దళారులు, వ్యాపారులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల చేత పంట వివరాలు నమోదు చేయిస్తున్నారు. రైతుల పేరిట విక్రయాలు.. వ్యాపారులు, దళారులు జొన్నపంటను మార్క్ఫెడ్కు యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. దీనికోసం రైతుల పట్టా పాస్బుక్లను వాడుకుంటున్నారు. రైతుల పంట క్షేత్రాలకు వెళ్లకుండానే అధికారులు ఆన్లైన్లో పంట వివరాలు నమోదు చేస్తుండడంతో వ్యాపారులు, దళారులు తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది రైతుల పేరిట జొన్న, మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తున్నట్లు ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. పంటను ప్రభ్వుత్వం కొనుగోలు చేసే సమయంలో సదరు రైతుల పేరు మీద మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది రైతుల వద్ద దళారులు తక్కువ ధరకు పంట కొనుగోలు చేసి అప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తున్నారు. దీంతో రైతులు తమ అవసరాల కోసం పంటను వారికి విక్రయిస్తున్నారు. మరి కొంతమంది దళారులు మహారాష్ట్రలో తక్కువధరకు జొన్నలు కొనుగోలు చేసి తెలంగాణలో రైతుల పేరుమీద విక్రయాలు జరుపుతున్నారు. మార్కెట్కు రాకుండానే గోదాంలకు.. వ్యాపారులు, అధికారుల మధ్య ఒప్పందంతో జొన్నలు అసలు మార్కెట్కు రాకుండానే లారీల్లో మార్క్ఫెడ్ గోదాంలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసిన జొన్నలను గోదాంలలో నిల్వ ఉంచుతున్నారు. వ్యాపారులు నిల్వ ఉంచిన జొన్న పంటకు అధికారులు లాట్ నంబర్ కేటాయించి నేరుగా కాంటా చేసిన తరువాత మార్క్ఫెడ్ గోదాంకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తరలించిన వాటికి వ్యాపారస్తులు తమకు అనుకూలంగా ఉన్న రైతుల పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. పంట కొనుగోళ్లు మార్కెట్కు చెందిన దడ్వాయిల ఆధ్వర్యంలో జరగాల్సి ఉండగా వారు లేకుండానే కొనుగోళ్లు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బోథ్ మార్కెట్ యార్డులో దళారుల ప్రవేశం.. బోథ్ మార్కెట్ పరిధిలో దళారులు జొన్న పంటను మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ దళారి తన వాహనంలో జొన్నపంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన పలువురు వాహనాన్ని ఆపి ఈ పంట ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రైతుల పట్టా పాస్బుక్కులు, ఆన్లైన్లో సాగు వివరాలు తీసుకురావాలని అధికారులు సూచించారు. పంటను కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డులోనే ఉంచారు. ఈ విషయమై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే చాలా మంది దళారులు రైతుల పేరిట జొన్నపంటను విక్రయిస్తున్నారు. విక్రయించే క్రమంలో దళారులు మార్కెట్ యార్డులోనే ఉంటున్నా సంబంధిత రైతులు మాత్రం ఉండటం లేదు. -
బోనస్ చెల్లించే వరకూ పోరాడుతాం
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న కై లాస్నగర్: మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించిన సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. రైతులకు బోనస్ చె ల్లించాలనే డిమాండ్తో ఆ పార్టీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. కై లాస్నగర్లోని పార్టీ కార్యాలయం నుంచి బాబూ జగ్జీవన్రాం చౌక్ వ రకు ర్యాలీ నిర్వహించారు. రహదారిపై వరిధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమేనని మాట మా ర్చడం సరికాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80 శా తం రైతులు దొడ్డురకం వడ్లనే పండిస్తున్నారని, 20 శాతం పండిస్తున్న సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామనడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, నాయకులు అజయ్, నారాయణ, రమేశ్, సలీం, దాసరి రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం సాగుకు సన్నద్ధం కావాలి
కై లాస్నగర్: వానాకాలం సాగుకు విత్తన, ఎరువుల డీలర్లు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, ఈ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. వానాకాలం సాగు సన్నద్ధతలో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని విత్తన, ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18లోగా విత్తనాల యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని, జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. మండలాల పరిధిలో ప్రతీ మంగళ, శుక్రవారం సమావేశాలు జరపాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని ఆదేశించారు. డీలర్లు దుకాణానికి సంబంధించిన లైసెన్స్లు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. షాపులో ఉన్న స్టాక్ వివరాలను రోజు వారీగా నమోదు చేసి వీటికి సంబంధించిన బిల్ బుక్, రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించవద్దని, అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు అమ్మరాదని, అధికారులు వీటిపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడా కూడా విత్తనాలు, ఎరువుల కొరత ఉండకూడదని, జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాన్ మాల్వియా, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, ఏడీఏ రమేశ్, వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
క్రీడా శిబిరాలు విజయవంతంగా నిర్వహించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉట్నూర్రూరల్: వేసవి క్రీడా శిబిరాలు విజయవంతంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం ఉట్నూర్లోని కేబీ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పీవో మాట్లాడుతూ శిబిరాల ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. గిరిజన విద్యార్థుల్లో సహజసిద్ధంగా నైపుణ్యాలుంటాయని, వాటిని గుర్తించి ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీడీ దిలీప్కుమార్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీఓ క్రాంతికుమార్, ఏఎస్ఓ హేమంత్, తదితరులు పాల్గొన్నారు. -
ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీ
● పలువురికి గాయాలుభైంసారూరల్: మండలంలోని తిమ్మాపూర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు వురికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వి వరాల ప్రకారం.. భైంసా నుంచి మద్యం లోడుతో ఐచర్వాహనం, నిర్మల్ వైపు నుంచి మామిడి కా యల లోడ్తో భైంసా వైపు వస్తున్న మరో ఐచర్ వా హనం తిమ్మాపూర్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో మామిడి కాయల లోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ అమ్జద్ఖాన్, మధ్యంలోడ్తో వెళ్తున్న వాహన డ్రైవర్ శంకర్తోపాటు దీక్షిత్, సందీప్, వంశీకి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వానల్పాడ్ గ్రామంలో ముగ్గురికి..భైంసారూరల్: మండలంలోని వానల్పాడ్ గ్రామ సమీపంలో గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వానల్పాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్, రుక్మా ద్విచక్రవాహనం వెళ్తూ యూటర్న్ తీసుకుని గ్రామంలోకి వెళ్తుండగా కుంటాల మండలం కల్లూరు గ్రామం నుంచి భైంసాకు ద్విచక్రవాహనంపై వస్తున్న వంశీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను భైంసా ఆస్పత్రికి తరలించారు. -
క్లుప్తంగా
కుమారుడిపై తండ్రి ఫిర్యాదు ఎదులాపురం: కుమారుడిపై తండ్రి ఫిర్యాదు చేసిన సంఘటన పట్టణంలోని టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై లాల్సింగ్ కథనం ప్రకారం పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన పవన్ అనుమానంతో భార్యపై చేయి చేసుకున్నాడు. కోడలిని ఎందుకు కొడుతున్నావ్ అని అడ్డుకోబోయిన తల్లిదండ్రులపై సైతం చేయి చేసుకున్నాడు. దీంతో అతని తండ్రి నాగోరావు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భార్యను వేధించిన కేసులో 18 నెలల జైలు కై లాస్నగర్: భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకర్రావు గురువారం తీర్పునిచ్చినట్లు లైజన్ అధికారి ఎం. గంగాసింగ్ తెలిపారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామానికి చెందిన మహిళ, మహారాష్ట్రలోని సరత్ తాలూకా ఘటంజి గ్రామానికి చెందిన సావాపురే దీక్షిత్ భార్యాభర్తలు. నిత్యం భార్యను వేధిస్తుండడంతో దీక్షిత్పై జైనథ్ పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పీసీఆర్ కోర్టులో విచారణ జరుపగా నిందితుడికి 18నెలల జైలు, రూ.2500 జరిమానా విఽధిస్తూ పీసీఆర్ కోర్టు తీర్పునిచ్చింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఈ రాశివారికి నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి
అక్రమ రిజిస్ట్రేషన్పై కలెక్టర్ సీరియస్
‘వాగ్దేవి’ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు
మామిడికి మార్కెట్ కష్టాలు
No Headline
వేసవి దుక్కులు.. లాభాలు దక్కు
వైన్స్ ఘటనలో 8 మంది రిమాండ్
జడ్చర్లలో భారీ వర్షం
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆటో డ్రైవర్ ఆత్మహత్యపై కేసు నమోదు
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement