అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టండి | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టండి

Published Tue, Apr 23 2024 8:40 AM

వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్న బి.విజయభాస్కర్‌  - Sakshi

అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో అక్రమ మద్యం పంపిణీ నిర్మూలనకు దిగువస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎడిషనల్‌ ఎస్పీ, జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ డైరెక్టర్‌ బి.విజయభాస్కర్‌ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ శాఖ, జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడికక్కడ మద్యం పంపిణీని అరికట్టడానికి అధికారులతో పాటు దిగువ స్థాయి సిబ్బంది తనిఖీలను నిర్వహించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై దృష్టి సారించాలని, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే మద్యం డిపో నుంచి ప్రభుత్వ బార్‌లకు సరఫరా అయ్యే మద్యం నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు.

Advertisement
Advertisement