సీలేరు: గూడెం కొత్తవీధి మండలం సీలేరు పీహెచ్సీలో ఆదివారం వైద్యం అందక రెండు నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై సబ్ కలెక్టరు శౌర్యమన్పటేల్ బుధవారం విచారణ జరిపారు. చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు, పీహెచ్సీ సిబ్బంది, వైద్యాధికారులతో విడివిడిగా మాట్లాడి వాంగ్మూలాన్ని నమో దు చేశారు. తమ రెండు నెలల కుమార్తెకు దగ్గు,ఆయాసం,జ్వరం తీవ్రంగా ఉండడంతో వలసగెడ్డ గ్రామానికి చెందిన తాంబోలు సొమర, పూర్ణిమ దంపతులు సీలేరు పీహెచ్సీకి తీసుకువచ్చారు. వైద్యు లు అందుబాటులో లేకపోవడం,విధుల్లో ఉన్న స్టాఫ్ నర్సు దేవి చిన్నపిల్లల డాక్టర్లు లేరని,చింతపల్లి లేదా చింతూరు తీసుకొని వెళ్లాలని చెప్పారు. కనీసం ఓపీ కూడా రాయకపోవడంతో చాలా సేపు ఆస్పత్రి వద్దే ఉండి గ్రామానికి తీసుకొని వెళ్లామని, అదేరోజు అర్ధరాత్రి పాప మృతి చెందిందని, సకాలంలో స్పందించి ఉంటే పాప బతి కి ఉండే దని తల్లిదండ్రులు తెలిపా రు. సీలేరు పీహెచ్సీ వైద్యాధికారు లు, సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రని సబ్ కలెక్టర్ వద్ద పలువురు ఆరోపించారు. వైద్యాధికారులు ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను పట్టించుకోవడం లేదని తెలిపారు. డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేసినా మార్పురాలేదని తెలిపారు. జీకే వీధి తహసీల్దార్ కుమారస్వామి, సర్పంచ్లు దుర్జో, కుమారి ,ఎంపీటీసీ సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment