
కరకట్ట గొడవపై కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు రాశాయని డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరకట్టపై గొడవ జరిగితే, మాజీ సీఎం ఇంటిపై దాడి జరిగిందని తప్పుడు కథనాలు రాయడం ఎంత వరకు సమంజసం అని డీఐజీ ప్రశ్నించారు.
సాక్షి, గుంటూరు: కరకట్ట గొడవపై కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు రాశాయని డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరకట్టపై గొడవ జరిగితే, మాజీ సీఎం ఇంటిపై దాడి జరిగిందని తప్పుడు కథనాలు రాయడం ఎంత వరకు సమంజసం అని డీఐజీ ప్రశ్నించారు. మీడియాలో కథనాలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని డీఐజీ హితవు పలికారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరకట్టపై ఎవరు దాడి చేశారో... ఎక్కడ దాడి చేశారో వీడియోలను మీడియాకు డీఐజీ చూపించారు.
చదవండి:
‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్