సచివాలయంలో సంక్రాంతి శోభ  | Sankranti splendor in the secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో సంక్రాంతి శోభ 

Jan 12 2024 5:02 AM | Updated on Jan 12 2024 11:10 AM

Sankranti splendor in the secretariat - Sakshi

ఏపీ సచివాలయ ఆవరణలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కర్రసాము, కత్తి సాము, తప్పెటగుళ్లు, హరిదాసులు, గంగిరెద్దులు, సన్నాయి, మేళతా­ళాలు, ఎడ్లబళ్లు, మహిళా ఉద్యోగినులు వేసిన రంగవల్లు­లు సంక్రాం­తి శోభ తెచ్చాయి.

కూచిపూడి నృత్యకారిణి మల్లిశెట్టి అనూష నాయుడు శిష్య బృందం నృత్యం, భవిరి రవి మిమిక్రీ,  సచివాలయ ఉద్యోగులు ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పద్య నాటకం అలరించాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌­రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్య­క్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఉపాధ్య­క్షురాలు ఎన్‌.సత్య­సులోచన, కార్యదర్శి పి.శ్రీకృష్ణ పాల్గొన్నారు.         – సాక్షి, అమరావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement